రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, మార్చి 2019, శనివారం



గీతగోవిందంనిర్మాతపై ఐటీ దాడి: వచ్చిందెంత, కట్టిందెంత?
      విజయ్ దేవరకొండ, రశ్మికా మందన హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందంబాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేసింది. స్టార్ హీరోల సినిమాలకు మాత్రం తీసిపోకుండా భారీ వసూళ్లు సాధించి రికార్డ్ లు క్రియేట్ చేసింది. నేపధ్యంలో గీతగోవిందంసినిమా నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టి పడింది. అందుతున్న సమాచారం మేరకు శుక్రవారం సినిమా నిర్మాతల కార్యాలయాలకు వచ్చిన ఐటీ అధికారులు సినిమా కలెక్షన్లు, చెల్లించిన పన్ను వివరాలను పరిశీలించారు.

        హైదరాబాద్, బంజారాహిల్స్లోని జీఏ 2 పిక్చర్స్కార్యాలయానికి వచ్చిన ఐటీ యూనిట్– 14 బృందం, వసూళ్ల రికార్డులను పరిశీలించింది. సినిమా సుమారు రూ. 130 కోట్ల వరకూ వసూలు చేసివుంటుందని భావిస్తున్న అధికారులు, మేరకు పన్నులను చెల్లించారా? లేక ఏమైనా ఎగ్గొట్టారా? అసలు సినిమా వసూళ్లు ఎంత? అన్న వివరాల లెక్కలు తీస్తూ, నిర్మాణ సంస్థ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
        జీఏ 2 పిక్చర్స్గతంలో తీసిన రెండు సినిమాల వివరాలు, వాటి ఆదాయాలను, లెక్కలను కూడా పరిశీలించారు. కార్యాలయ సిబ్బందితో పాటు నిర్మాణ సంస్థ యాజమాన్యాన్ని అధికారులు ప్రశ్నించారు. గీత గోవిందం సినిమాకు చెందిన నిర్మాతలు ఆదాయ పన్ను ఎంత కట్టారు అనే విషయం తెలియాల్సి ఉంది.

 (ఈ ఐటీ అధికారులు పార్టీలకి అమ్ముడుబోయి పార్టీల్ని ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని పట్టుకుని లెక్కలెందుకు అడగరు. ఇరవై కోట్లు, ముప్ఫై కోట్లు పార్టీలు ఇచ్చి కొనుక్కుంటున్నట్టు, వీళ్ళు అమ్ముడుబోతున్నట్టు వార్తలొస్తున్నాయిగా. పశువుల్ని కొన్నట్టు కొనుక్కుంటున్నారని కూడా ఎదుటి పార్టీలు ఆరోపిస్తూనే వున్నాయిగా. ఇంకేం కావాలి. అక్కడికెందు కెళ్ళరు?)