సినిమా డైలాగులు రాయడం లోతుగా
నేర్చుకోవాలంటే
ఈ సూత్రాలు ఉపయోగపడవచ్చు, ట్రై చేయండి!
పాత్రలు కేవలం
మాట్లాడకూడదు;
మాటలతోనే
ఎదుటివారిని మార్చడానికి ప్రయత్నించాలి.
భయపెట్టడం, ప్రేమని వ్యక్తం చేయడం, అవమానించడం, ప్రోత్సహించడం, మోసం చేయడం వగైరా.
సినిమా డైలాగులు రాయడం లోతుగా
నేర్చుకోవాలంటే
ఈ సూత్రాలు ఉపయోగపడవచ్చు, ట్రై చేయండి!
పాత్రలు కేవలం
మాట్లాడకూడదు;
మాటలతోనే
ఎదుటివారిని మార్చడానికి ప్రయత్నించాలి.
భయపెట్టడం, ప్రేమని వ్యక్తం చేయడం, అవమానించడం, ప్రోత్సహించడం, మోసం చేయడం వగైరా.
భార్య రేణుక (దీపా థామస్) ఇంకో గదిలో ఏళ్ళ తరబడీ తలుపు
లేసుకుని వుండి పోతుంది. రాజ భవన
వ్యవహారాల్ని, రామప్ప బాగుగుల్నీ చూసుకుంటూ పెద్ద కొడుకు లవణప్ప వుంటాడు.
వివాదాస్పదుడైన చిన్న కొడుకు కుసుమప్ప (మాస్టర్ కిరణ్) చిన్నప్పుడే నీటమునిగి
చనిపోయాడు. రామప్పని చూసుకుంటూ పని మనిషి అచ్చమ్మ (బాలా పరాశర్) కూడా వుంటుంది. అనుమానం
అనే భూతం పట్టిన రామప్ప, అది పోయే వరకూ తను పోయే ప్రసక్తే లేదని చెబుతూంటాడు.
కానీ ఆలోచిస్తే కథకి, పాత్రకీ ఇవేవీ ముఖ్యం కావు- అతడి
ప్రాణాలకి పట్టుకున్న అనుమానమనే భూతమొక్కటే ముఖ్యం కావాలి. నిజమేంటో తెలుసుకుని
ప్రాణాలు వదలడమే అతడి గోల్. ఈగోల్ చెదిరిపోయేలా ఇతర వ్యాపకాలు పెట్టుకోవడం
వ్యక్తిత్వ వికాస పాఠాలతో చూసినా రాంగ్.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కథ అనుమానం పాయింటుతో రామప్ప క్యారక్టర్
స్టడీ. రామప్ప పాత్ర విశ్లేషణ. అయితే ఇదే శృతి మించి కొంప ముంచింది. ఇదెలాగో చివర
చూద్దాం. నల్లగా పుట్టిన రెండో కొడుకు తనకే పుట్టాడా అనే అనుమానంతో భార్యని దూరం
చేసుకుని, నానా రభస చేసే రామప్ప పాత్ర ముగింపు చూస్తే, 1971 లో బీవీ కారంత్-
గిరీష్ కర్నాడ్ లు దర్శకత్వం వహించిన కన్నడ ఆర్ట్ సినిమా ‘వంశవృక్ష’ లో వెంకటరావు
తలిగెరీ నటించిన ప్రధాన పాత్ర కిచ్చిన ముగింపునే పోలి వుంటుంది -తన జన్మ వృత్తాంతం
తెలిసే షాకింగ్ వాస్తవంతో. తెలుగులో దీన్ని బాపు ‘వంశవృక్షం’ గా రీమేక్ చేశారు జేవీ
సోమయాజులు పాత్రకి అదే ముగింపు నిస్తూ (ప్రస్తుతం ‘పాలపిట్ట’ పత్రిక్కి
‘వంశవృక్షం’ సమీక్ష రాస్తూంటే, ఇందులో రావు బహదూర్ ముగింపుతో పోలికలు బయటపడ్డాయి).
యౌవనంలో జాన్ లెన్నన్ లుక్ తో హిప్పీ సంస్కృతికి దగ్గరగా వుండే
రామప్పనుంచీ , వ్యవస్థ ఒత్తిడి వల్ల ఒక క్రూర, సాంప్రదాయవాదిగా మారే
మెటామార్ఫసిస్ ని ఉన్నతంగా ప్రెజెంట్ చేశాడు.
ఒకవైపు క్యాన్సర్తో చనిపోతున్నా, తన రక్తం
గొప్పదనే అహంకార ప్రదర్శన కూడా ఒకెత్తు. అదే సమయంలో, గతంలోచేసిన
తప్పులు చిత్తభ్రాంతుల రూపంలో బీభత్సంగా వెంటాడే తీరునీ బలంగా ప్రదర్శించాడు. ఇలా ఈ
పాత్రని సృష్టించిన దర్శకుడు కూడా అంతే ప్రశంసార్హుడనాలి.
అలాగే, హీరోయిన్ రేణుక (దీపా
థామస్) పాత్ర ఫస్టాఫ్లో చాలా స్వతంత్రంగా, బలంగా వుంటూ, సెకండాఫ్
కొచ్చేసరికి సరైన కారణాలు లేకుండానే భర్త వేధింపుల్ని భరించే సాధారణ స్త్రీగా
మారిపోతుంది. భర్త అనుమానించిన వెంటనే కొడుకుని తీసుకుని వాకౌట్ చేయడం ఆమె
చేయాల్సిన పని. కొడుకు చనిపోయాక కూడా వెళ్ళిపోకుండా అక్కడే తలుపులేసుకుని వుండి
పోతుంది. తన గురించి పెద్ద కొడుకు కూడా తండ్రిలాగే మాట్లాడు తున్నప్పుడూ వచ్చి
లాగి కొట్టకుండా గదిలోనే వుండి పోతుంది.
డాక్టర్ పాత్రలో వికాస్ ముప్పాల చాలా పరిణతి చెందిన నటనని కనబర్చాడు. రామప్ప
పాత్రతో సంఘర్షణాత్మక సీన్లని సులువుగా
ఎదుర్కొన్నాడు. పాత్రకి ఒక రకమైన గ్రే షేడ్ వున్నా, పాత్రలో వున్న
హూందాతనాన్ని కాపాడుతూ వచ్చాడు.
ఇంకో పాత్ర పనిమనిషి అచ్చమ్మ. ఈ పాత్రలో బాలా పరాశార్ కాస్త
తిక్క, మరికొంత కొంటెతనం ప్రదర్శిస్తూ కథ కెంతో ఉపయోగపడే పాత్రయింది.
సంభాషణలు పదునుగా, లోతైన అర్ధాలతో
సాగుతాయి. కార్తీక్ పర్మార్ ఛాయాగ్రహణంలో ఫ్రేమింగ్స్ చాలా క్లాసీగా, విజువల్స్ మూడ్కి తగ్గట్టుగా వున్నాయి- ఆ పాత
జమీందారీ ఇల్లు కూడా కథలో ఒక పాత్రలా చేస్తూ. స్మరణ్ సాయి అందించిన బ్యాక్గ్రౌండ్
స్కోర్, పాటలు పీరియడ్ కథకి తగ్గట్టు వున్నాయి. రోషన్ సింగ్ కళాదర్శకత్వానికే
బడ్జెట్ ఎక్కువ ఖర్చయినట్టుంది.
ఇక్కడ్నుంచీ మిడిల్ (సెకండ్ యాక్ట్) ప్రారంభమవుతుంది. అంటే
బిగింగ్ లో ఇచ్చిన ఉపోద్ఘాతాన్ని పురస్కరించుకుని కథ ప్రారంభమవుతుంది. కథ
ప్రారంభమయిందని ఎలా తెలుస్తుంది? బిగినింగ్ ని ముగించే ప్లాట్ పాయింట్ – 1 దగ్గర సమస్య, దాన్ని
పరిష్కరించేందుకు పాత్రల మధ్య సంఘర్షణా
ప్రారంభమవుతాయి కాబట్టి. ఈ మిడిల్ అనేది మొత్తం స్క్రీన్ ప్లే నిడివిలో 50 శాతం
ఆక్రమించి వుంటుంది. అంటే ప్లాట్ పాయింట్ -1 నుంచీ ఇంటర్వెల్ వరకూ
25 శాతం, ఇంటర్వెల్ నుంచీ సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్- 2 వరకూ మరో 25 శాతం. ఈ
మొత్తం 50 శాతం గంటకి పైగానే సాగవచ్చు. ఈ మిడిల్ సమస్యకి పరిష్కార మార్గాన్ని
సూచిస్తూ ప్లాట్ పాయింట్ -2 దగ్గర ముగుస్తుంది.
అంటే బిగింగ్ లో పాత్రల పరిచయాలతో, సమస్య ఏర్పాటు తంతుతో
చేసే కథనం కథ కానే కాదన్న మాట. కథకి ఉపోద్ఘాతం మాత్రమే. కానీ ఇది కూడా కథ అనుకుంటూ
ఘోరాలు చేస్తున్నారు. ప్లాట్ పాయింట్-1, ప్లాట్ పాయింట్- 2 ల మధ్య మిడిల్లో
వుండేది మాత్రమే కథ అని ఇప్పటికైనా బాగా గుర్తించాలి!! ఇక మిడిల్ ముగిసి, ప్లాట్
పాయింట్ -2 నుంచీ పరిష్కార మార్గంతో క్లయిమాక్స్ వైపు వెళ్ళే కథనం ఎండ్ విభాగం.
ఇది 25 శాతం వుండొచ్చు. అంటే స్క్రీన్ ప్లేలో ఉపోద్ఘాతంతో 25 శాతం బిగినింగ్ –
కథతో 50 శాతం మిడిల్- ఆతర్వాత ముగింపుతో 25 శాతం ఎండ్ వుంటే అది త్రీ యాక్ట్స్ స్క్రీన్
ప్లే స్ట్రక్చర్ అన్పించుకుంటుందన్న మాట.
4/b జడివాన వెలిసిన వెనుక...
ఈ స్ట్రక్చర్ తెలియకో, లేదా తెలిసినా వద్దనుకునో చేస్తే
ఏమవుతుంది? ఫస్టాఫ్ అంతా ఆక్రమించి, సెకండాఫ్ లో ఇంకో ఇరవై నిమిషాల వరకూ దురాక్రమించి,
రామప్ప పాత్ర పరిచయ తంతే, అంటే ఉపోద్ఘాతమే ప్రేక్షకుల సహన శక్తి మీద దాడి చేస్తూ
పోతుంది. సెకండాఫ్ లోకి ప్రవేశించినా కూడా
కథేమిటో అర్ధం గాకుండా పోతుంది. ఇంకోటేమిటంటే, ఫస్టాఫ్ లో ఈ బిగినింగ్ లోనే ఫ్లాష్
బ్యాక్ ప్రారంభించి హీరోయిన్ తో రోమాన్స్ కొనసాగిం
ఇప్పుడు సెకండాఫ్ ఇరవై నిమిషాలకి కథ ప్రారంభమయ్యాక, క్యారక్టర్
స్టడీ పేరుతో రామప్ప సృష్టించిన గందరగోళమంతా ఆగిపోయి, వాన వెలసినట్టు ప్రశాంతంగా మారుతుంది
సినిమా. అంటే అబ్సర్డ్ థియేటర్ చిత్రీకరణలు అంతమై, రెగ్యులర్ సినిమా కథగా దారి కొస్తుంది.
అయితే- జడివాన వెలిసిన వెనుకా జరిగింది తెలియును లేరా- విరిగేటి చెట్లెన్నో, వొరిగేటి
ఇళ్ళెన్నో- అన్నట్టు, ఇప్పుడు ప్రారంభమైన ఈ కాసింత కథకూడా బాక్సాఫీసుకి అంది రాలేదు.
కారణం, అనుమానమనే పాయింటు మీద ఇప్పటికైనా ఫోకస్ చేయకుండా, సామాజిక
అంశాలపై లెక్చర్ ఇస్తున్నట్టుగా మారుతుంది. ఫస్టాఫ్ లో భ్రమలు, తాగుబోతు వాదనల ద్వారా-
మహాభారతం, మహాత్మా గాంధీ, ఆధునిక భౌగోళిక రాజకీయాలూ, కులం, రంగు, పేద-ధనిక
తేడాల గురించిన బ్యాగేజీనంతా ప్రేక్షకుల మీద పడేసింది గాక.
కేవలం అనుమానమనే భూతం తప్ప ఇంకేం పట్టని మొండి ఘటంలా రామప్పని
చూపిస్తూ, ఇంకా కావాలంటే పైన చెప్పిన బ్యాగేజీలో ఒకట్రెండు అంశాలు తీసుకుని, వేరే పాత్రతో
సబ్ ప్లాట్ నడిపి వుండొచ్చు. గొడవుండదు.
తీరా ఫలితం చూసి, తెలుగు ప్రేక్షకులకి సినిమాలే చూడ్డం రాదనీ
ప్రెస్ మీట్లు పెట్టి నిందించడం దేనికి? ఇలాటి ప్రయోగాలే చేయదల్చుకుంటే, ప్రేక్షకులు
నోరెత్తకుండా ఏం పాట్లు పాట్లు పడతారో పడి, సినిమా తీసి చూపించొచ్చు. తీయరాక ఏదో తీసి
ప్రేక్షకులు నోరెత్తితే, దాని మీద రియాక్ట్ అవుతూ పోతే ఎవరికీ నష్టం? ‘రావు బహదూర్’
కి తేలిన నష్టమెంత సింగిల్ డిజిట్ దాటని కలెక్షన్లతో?
సినిమాలో మంచి డైలాగులు ఎలా రాయాలి?
మంచి సినిమా డైలాగులు అంటే కేవలం తెలివైన మాటలు కాదు. అవి పాత్ర స్వభావాన్ని
చూపాలి, కథని ముందుకు నడపాలి, నటులకి భావోద్వేగాల్ని వ్యక్తపర్చే అవకాశమివ్వాలి.
1. ప్రతి పాత్రకూ ప్రత్యేకమైన మాటతీరు వుండాలి
పాత్ర పేరు తీసివేసినా, ఎవరు మాట్లాడుతున్నారో ప్రేక్షకులు
గుర్తించగలగాలి.
ఉదాహరణ:
డిటెక్టివ్: ‘మనుషులు అబద్ధం చెబుతారు. కానీ సాక్ష్యాలు కాదు’
యువకుడు: ‘అలా కాదు. సాక్ష్యాల్ని కూడా సృష్టించవచ్చు’
2. ప్రతి పాత్రకూ ఒక లక్ష్యం వుండాలి.
ప్రతి సన్నివేశంలో పాత్ర ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నించాలి.
బలహీన డైలాగ్: ‘ఎలా వున్నావు?’
‘బాగున్నాను’
మెరుగైన డైలాగ్ :
‘వాళ్ళకి చెప్పేశావా?”
'చెప్పానని ఎందుకు అనుకుంటున్నావు?’
‘ఎందుకంటే నువ్వు రహస్యాన్ని దాచలేవు’
3. మాటల్లో అంతర్లీన భావం (Subtext) వుండాలి
మనుషులు ఎప్పుడూ
మనసులో వున్న దాన్ని నేరుగా చెప్పరు.
ఉదాహరణ:
‘భోజనం చల్లారిపోయింది’
‘నిన్ను నా కోసం ఎదురుచూడమని నేను చెప్పలేదు’
ఇక్కడ అసలు విషయం భోజనం కాదు; వాళ్ళ సంబంధంలో వున్న సమస్య.
4. డైలాగ్ చిన్నగా, ప్రభావవంతంగా వుండాలి
బలహీనమైనది:
‘వర్షం పడకముందే బయలుదేరితే బాగుంటుందని అనుకుంటున్నాను’
మెరుగైనది:
ఇప్పుడే బయలుదేరుదాం... లేకపోతే ఈత కొట్టాల్సి వస్తుంది!
5. సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) వుండాలి
స్నేహితుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వుండొచ్చు.
ఉదాహరణ:
‘పోలీసులకి ఫోన్ చేద్దాం’
‘శవం గురించి ఏమంటాం?”
‘మరి ఏం చేద్దాం?’
‘పాతిపెడదాం’
6. పాత్ర స్వభావం మాటల్లో కనిపించాలి
ఆత్మవిశ్వాసం వున్న వ్యక్తి:
‘పక్కకు జరుగు’
ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి :
‘క్షమించండి... కొంచెం పక్కకు జరగగలరా?’
7. ప్రేక్షకులకి తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్పకూడదు
బలహీనమైనది:
‘మనం ముప్పై ఏళ్ళుగా అన్నదమ్ములం’
మెరుగైనది:
'చిన్నప్పటి నుంచీ నా బొమ్మలన్నీ నువ్వే దొబ్బే సే వాడివి’
8. మౌనం కూడా ఒక డైలాగే
ఉదాహరణ:
ఆమె ‘నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?’
అతను నిశ్శబ్దంగా తల తిప్పుకున్నాడు.
ఆమెకి అర్ధమైంది.
9. డైలాగుల్ని గట్టిగా చదవాలి
రాసినప్పుడు బాగానే అనిపించిన డైలాగులు, మాట్లాడితే
సహజంగా వినిపించకపోవచ్చు. కాబట్టి వాటిని గట్టిగా చదివి పరీక్షించాలి.
10. ప్రతి సన్నివేశానికీ ఒక ఉద్దేశం వుండాలి
రాయడానికి ముందు ఈ ప్రశ్నలు వేసుకోవాలి:
ఈ పాత్రకి ఏం కావాలి? ప్రారంభంలో ఎవరి చేతిలో కమాండ్ వుంది? చివరికి
ఎవరి చేతిలో వుంటుంది? ఈ సంభాషణ వల్ల ఏం మారింది? ఏమీ మారకపోతే, ఆ సన్నివేశం
అవసరం లేకపోవచ్చు.
ఉదాహరణ :
బలహీనమైనది:
‘నువ్వు నిన్న నాకు అబద్ధం చెప్పావు. ఇక నేను నిన్ను నమ్మలేను’
‘ఎప్పట్నుంచీ?’
‘ఏమిటి?’
‘నువ్వు అబద్ధాలు చెప్పడం’
‘చాలా కాలంగా’
'బైటి కెళ్ళు’
ఈ డైలాగు చిన్నదిగా, భావోద్వేగంతో నిండి వుంది. ప్రేక్షకులు కూడా మిగతా విషయాల్ని వూహించుకునే అవకాశం వుంటుంది.
పాత్రలు రెండూ బయటికీ చూస్తే ఒక చిన్న
విషయంపై వాదిస్తున్నట్టు కనిపించాలి, కానీ వాటి అసలు
గొడవ పూర్తిగా వేరే విషయంపై వుండాలి. దీని
వల్ల డైలాగుల్లో అంతర్లీన భావం (Subtext) సహజంగా వస్తుంది.
(మరికొన్ని మరోసారి)
-సికిందర్
ఇలా కథనం సాంతం కార్యకారణ సంబంధంతో, ఇలాటి
కథల్లో అంచెలంచెలుగా సాగే, పెరిగే సైకలాజికల్ జర్నీని సమగ్రంగా చిత్రించిన త్రీ
యాక్ట్స్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఇది.
-సికిందర్