రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, నవంబర్ 2018, శుక్రవారం

710 : '2.0' ఐడియా ఎనాలిసిస్

   టాలీవుడ్ దర్శకులు ‘సిఎస్’ పంపిన  ‘2.0’ కాన్సెప్ట్ ఎనాలిసిస్ :  Regarding your review of  ‘2.0’  in Telugurajyam.com : That's the point.  Many reviewers  quote it as 'Good vs Evil'.  Who is Good?, who is Evil? If Akshay is Good (in terms of intentions-as per the story) then Rajni is BAD.  That's a fundamental flaw in the plot. Should I empathize with Akshay, a noble man for fighting for a cause (or fought) or with Rajni who wants to Kill the good man! Isn't that confusing! (like u said in the last line..why the hell they kill!). So is it Good (Akshay) vs Bad (Rajni) !!!!


   (Sikander answers : Yes. Even after Rajni gets to know about Akshay's flash back story, which evokes a deep sympathy in the audiences, he  behaves badly with Akshay! And in the end, he preaches what already Akshay has preached! He has no alternate solution to the main problem, whatsoever).


          CS : Audience may connect to corruption issue [brand Shankar], but how can they connect to a topic which talks of 'no mobiles' especially the youth.  It’s anti youth.  If Shankar would have hired me a script consultant, I would have provided a solution to Shankar after doing one minute googling (I just did)... Cell phones emit radio frequency radiation (radio waves) [Google] so the solution is to completely switch to VoIP calls over internet. Jio would have put 90% of budget in the film!

           Just another technical point. If VoiP is used, then the internet received from network may still have some radiation so alternative ways of wifi to be used like we use fibre cable and wifi at home. Anyway the point is, film must propose some alternatives…

      

          2.0 మూవీ కాన్సెప్ట్ :  “ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మని తన చిట్టి రోబో చేత అంతమొందించి పక్షి శాస్త్రజ్ఞుడు చెప్పిన నివారణోపాయాలు చెప్తాడు సైంటిస్టు వశీకరణ్” 

         కాన్సెప్ట్ అన్నా ఐడియా అన్నా ఒకటే. అనుకుంటున్న కథని ఐడియాలో కూర్చినప్పుడే కథ తప్పుగా వుందో ఒప్పుగా వుందో తెలిసిపోయే వీలుంటుంది. రాస్తూ కూర్చునే స్క్రీన్ ప్లే కి స్ట్రక్చర్ ఐడియా దగ్గరే నిర్ణయమవుతుంది. ఈ కామన్ సెన్స్ లేకుండా స్క్రీన్ ప్లే చక్కగా వస్తోందని సింగారించుకుంటూ ఆనందపడిపోతే, అది వెళ్లి మేళ తాళాలతో సింగూరు రిజర్వాయర్ లో సమర్పయామి అవుతుంది. ఐడియా అంటే స్ట్రక్చర్. తట్టిందల్లా ఐడియా ఐపోదు, స్ట్రక్చర్ లో కుదురుకున్నదే ఐడియా. వృక్ష, జంతు, మానవ జాతులు...ఇంకే జాతైనా సరే, పుట్టిన కాణ్ణుంచీ గిట్టే దాకా జీవ క్రియలకి అదే నీరు ఎలా కలిగి వుంటాయో, ఐడియా దగ్గర్నుంచీ సినాప్సిస్, వన్ లైన్ ఆర్డర్, ట్రీట్ మెంట్, డైలాగ్ వెర్షన్, చివరికి మూవీ దాకా, కథా నిర్వహణకి ఒకే  స్ట్రక్చర్ ని కలిగివుంటాయి. ఈ స్ట్రక్చర్ వెళ్లి ప్రేక్షకుల కథల్ని రిసీవ్ చేసుకునే మానసిక రాడార్ నెట్ వర్క్ తో కనెక్ట్ అవుతుంది. అంటే సినిమా కథల స్ట్రక్చర్, కథల్ని రిసీవ్ చేసుకునేప్పుడు ప్రేక్షకుల మెంటల్ స్ట్రక్చర్ ఒకటేనన్న మాట. ఈ కామన్ సెన్సు లేకపోతే నాన్ సెన్స్, ఇంకా న్యూసెన్సు స్క్రిప్టులు తయారవుతాయి. 

          మొట్ట మొదట ఐడియాకి స్ట్రక్చర్ అంటే, బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో కూడిన మర్యాదైన కథనమని (స్క్రీన్ ప్లే అని) తెలిసిందే. కాబట్టి ఐడియా దగ్గరే సకల మర్యాదలతో స్క్రీన్ ప్లేగా చూడగల్గాలి.
          1) ఐడియాలో తగిన బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలున్నాయో లేవో చూసుకోవాలి.
          2) ఈ విభాగాలు  ఆర్గ్యుమెంట్ సహిత కథని ఏర్పరుస్తున్నాయా, లేక స్టేట్ మెంట్ సమేత గాథగా వున్నాయో చూసుకోవాలి. గాథగా వుంటే ఆర్గ్యుమెంట్ సహిత కథగా మార్చుకోవాలి. అలా వచ్చేదాకా ఐడియాతో కుస్తీ పడుతూనే వుండాలి. అయినా కుదరలేదంటే ఆ ఐడియాని వదిలేయాలి.
          3 ) ఆర్గ్యుమెంట్ లో కూడా a) యూత్ అప్పీల్, b) మార్కెట్ యాస్పెక్ట్ వున్నాయో లేవో చూసుకోవాలి. ఉదాహరణకి సామాజిక సమస్యల్ని ఊహాజనిత సైన్స్ ఫిక్షన్ గా పాసివ్ గా చూపించి పరిష్కారాలు చెప్తే ప్రేక్షకులు కన్విన్స్ అయ్యే స్థితిలో వున్నారా, లేక సామాజిక సమస్యల్ని ప్రేక్షకులకి నిత్యానుభవమయ్యే రాజకీయాలతో లైవ్ గా చూపిస్తే ఎక్కువ ఫీలయ్యే పరిస్థితులున్నాయా విశ్లేషించుకోవాలి. దేవుడో, ప్రకృతో శిక్షిస్తాయంటే లైట్ గా తీసుకుంటారు. అదే చట్టం, రాజ్యాంగం శిక్షిస్తాయంటే సీరియస్ గా తీసుకుంటారు. ఈ రెండోదే మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్ అన్పిస్తే, సైన్స్ ఫిక్షన్ జానర్ ని ‘ఆదిత్య 369’ లాంటి ఎంటర్ టైనర్స్ కి పరిమితం చేసేయాలి.
          4) ఐడియాలో సినిమా కథని ఎలా చూడాలి? “ఉపాధి కోసం హీరో ఒక పాత కారు కొనుక్కుంటే అందులో ఆత్మ వుందని తెలిసి దాంతో స్ట్రగుల్ చేసి దాని సమస్యేదో తీర్చి తన సమస్య పరిష్కరించుకున్నాడు”  అనేది  ‘టాక్సీవాలా’  ఐడియాగా చెప్పుకోవచ్చు. ఇందులో బిగినింగ్, మిడిల్, ఎండ్ లు ఎక్కడున్నాయి? “ఉపాధి కోసం హీరో ఒక పాత కారు కొనుక్కుంటే” – అనడం బిగినింగ్, “అందులో ఆత్మ వుందని తెలిసి దాంతో స్ట్రగుల్ చేసి” - అనడం మిడిల్. “దాని సమస్యేదో తీర్చి తన సమస్య పరిష్కరించుకున్నాడు” -  అనడం ఎండ్. ఇలా ఒక లైనుగా చెప్తే అందులో బిగినింగ్ మిడిల్ ఎండ్ లు అర్ధవంతంగా, పరస్పర సంబంధంతో కన్పించడమే ఐడియా. ఇలా కుదిరేవరకూ ఐడియాతో కుస్తీ పట్టడమే. 

      “ఉపాధి కోసం హీరో ఒక పాత కారు కొనుక్కుంటే అందులో ఆత్మ వుందని తెలిసి దాంతో స్ట్రగుల్ చేసి దాని సమస్యేదో తీర్చి తన సమస్య పరిష్కరించుకున్నాడు” 
         
ఇందులో కారులో ఆత్మ వుందని తెలియడం ప్లాట్ పాయింట్ వన్. ఈ ఐడియా ఆడియెన్స్ మెంటల్ నెట్వర్క్ కి కనెక్ట్ అవుతోందా? ఐడియాలో వున్న సమస్యేమిటి? ఆత్మకి ఒక అన్యాయపు కథ వుందని హీరోకి తెలియడం. దీనికి పరిష్కారమేమిటి? ఆ అన్యాయాన్ని హీరో సరిదిద్దడం. ఇందులో ప్రేక్షకులకెలాటి అభ్యంతరం వుండాల్సిన పని లేదు. ఆడియెన్స్ ఫ్రెండ్లీగానే వుంది. ఇలాకాక, న్యాయం కోసం తపిస్తున్న ఆత్మని హీరో తుదముట్టించి తన సమస్య తీర్చుకుంటేనే తీవ్ర అభ్యంతరం. బాక్సాఫీసుకి తాళాలో, పాతాళమో. 

          సైన్స్ ఫిక్షన్ కంటే హార్రర్ సినిమాలంటే  ప్రేక్షకులకి పునర్జన్మల సినిమాలంత ప్రేమ. ఎందుకంటే ఇది అన్ కాన్షస్ గా తమలో అనుభవించే సబ్ కాన్షస్ వరల్డే. సినిమాలో దెయ్యం సబ్ కాన్షస్ వరల్డ్. మనిషిలో వుండే నెగెటివ్ భావాలకి సింబాలిక్ ప్రెజెంటేషన్. మనోవైజ్ఞానికుడు కార్ల్ జంగ్ ప్రకారం, మనిషిగా తనలో మంచితో బాటు చెడు కూడా వుంటుందని తెలుసుకోని మనిషి, ఆ చెడుని విధి రూపంలో బయటి ప్రపంచంలో అనుభవిస్తాడు. మనిషి తన అంతరంగంలో (సబ్ కాన్షస్ లో) మంచీ చెడులతో పడే సంఘర్షణే  వెండితెరమీద కన్పించే ప్లే – స్క్రీన్ ప్లే.

          కొన్ని హర్రర్ సినిమాలు మంచి కోసం మంచి ఆత్మల తపనగా వుంటాయి, కొన్ని హార్రర్ సినిమాలు చెడు కోసం దుష్టాత్మల ప్రకోపంగా వుంటాయి. ‘టాక్సీవాలా’ మంచి ఆత్మ కథ. ‘2.0’ కూడా మంచి ఆత్మ కథ.  

          “ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మని
తన చిట్టి రోబో చేత అంతమొందించి పక్షి శాస్త్రజ్ఞుడు చెప్పిన నివారణోపాయాలు చెప్తాడు సైంటిస్టు వశీకరణ్”
         
పై ‘2.0’ ఐడియాలో స్ట్రక్చర్ ఎలా వుంది?
          బిగినింగ్
ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు   చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మని
         
మిడిల్ తన చిట్టి రోబో చేత అంతమొందించి
          ఎండ్ పక్షి శాస్త్రజ్ఞుడు చెప్పిన నివారణోపాయాలు చెప్తాడు సైంటిస్టు వశీకరణ్

         
ఈ మూడు విభాగాలూ పరస్పర విరుద్ధంగా వున్నాయని ఇట్టే తెలిసిపోతోంది. పక్షిజాతి కోసం తిరగబడిన శాస్త్రజ్ఞుడి ఆత్మని, చిట్టి చేత అంతమొందించి, అదే శాస్త్రజ్ఞుడి నివారణోపాయాలు సైంటిస్టు వశీకరణ్ వల్లె వేశాడు. ఇది కన్విన్సింగ్ గా వుందా? 

        పక్షిజాతి కోసం శాస్త్రజ్ఞుడి ఆత్మ పోరాడ్డం తప్పని చెప్తున్నట్టా? అలాటి ఆత్మని చంపి  ఆ ఆత్మే ఘోషించిన పాఠాలు చెప్పుకోవడం పాఠాలే చెప్పుకోవడం ఒప్పని అంటున్నట్టా? అలాంటప్పుడు శాస్త్రజ్ఞుడి ఆత్మని ఎందుకు చంపడం? పైగా నువ్వు కొందర్ని చంపావని సాకు చూపించి ఆత్మని దోషిగా నిర్ధారించి దాని మీద యుద్ధం ప్రకటించడం. ‘టాక్సీ వాలా’లో కూడా ఆత్మ ఒకరిద్దర్ని చంపేస్తుంది. దానికి హీరో, నువ్వు చంపావ్ కాబట్టి నిన్ను చంపేస్తానని ఆత్మ మీదికి పోయాడా? తనకి అన్యాయం చేసిన వాళ్ళనే మంచి ఆత్మ చంపేసింది. అలాగే ‘2.0’ లో  సెల్ కంపెనీలతో పక్షులకి అన్యాయం చేస్తున్న డీలర్నీ, నెట్వర్క్ ప్రొవైడర్నీ శాస్త్రజ్ఞుడి మంచి ఆత్మ చంపేసింది. ఇందులో తప్పేముంది? 4 కోట్ల 53 లక్షల రేంజిలో ‘టాక్సీవాలా’ లాగా కూడా, 543 కోట్ల మెగా రేంజిలో ‘2.0’  కన్విన్స్ చేయలేకపోతే ఎలా?

          ఎవరు హీరోనో, ఎవరు విలనో ప్రేక్షకులే తేల్చుకోవాలని వదిలేశారా? రజనీ కాంత్ విలన్లా, అక్షయ్ కుమార్ హీరోలా అనుకున్నా ఫర్వాలేదా? మంచిని చెడు చంపెయ్యాలని ఉద్దేశమా? ఇలాటి సినిమాలున్నాయా? 

          అక్షయ్ కుమార్ ది సామాజిక పోరాటం చేసే పాత్ర. సామాజిక పోరాటం చేసే పాత్ర ప్రేక్షకుల దృష్టిలో విలన్ అవదు. నిజ  ప్రపంచంలో కూడా సామాజిక పోరాటం చేసే నాయకుడు ప్రజలకి విలన్ కాదు, పాలకులకే విలన్. ఈ రియల్ లైఫ్ సెటప్ ని కథలో పెడితే అప్పుడు పాలకవర్గ, కార్పొరేట్ వర్గ ఏజెంటుగా రజనీ కాంత్ పాత్రకి అక్షయ్ పాత్ర విలనే. ఈ సెటప్ లేనప్పుడు రజనీ లాంటి సైంటిస్టు పాత్ర, లోకకళ్యాణం కోరుతున్న సాటి సైంటిస్టుని ఎలా చంపేస్తుంది? పాలక పక్ష ఏజెంటుగా రజనీ కాంత్ చంపినా హీరో అవడు, అక్షయ్ కుమారే హీరో అవుతాడు ప్రేక్షకుల దృష్టిలో. 

          ఐడియాలోనే ఇంత కన్ఫ్యూజన్ వుంటే దీన్ని అందంగా సింగారించుకుంటూ పోయారు. అక్షయ్ ని విలన్ అన్నట్టు చూపిస్తూనే, అతడి చర్యల్ని జస్టిఫై చేసే అందమైన ఫ్లాష్ బ్యాకుని కడు దయనీయంగా చూపించారు పాపం అన్పించేలా. ప్రేక్షకులు అతడి పక్షం వహించేలా. 

      దాదాపు మృతశిశువుగా అక్షయ్ పుట్టి కడుపు శోకం మిగుల్చుతూంటే, కిటికీలోంచి ఒక పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి శిశువు ఛాతీ మీద కూర్చుని పొడుస్తూ వుంటుంది. అత్యంత వండర్ఫుల్ క్రియేషన్ ఇది. కళ్ళప్పగించి చూడ్డమే శంకర్ పోయెటిక్ టచ్ కి. ఆ పిచ్చుక పొడుస్తూ వుంటే శిశువులో చలనం వచ్చి క్యారు మంటుంది!
           అదీ జన్మాంతం పిచ్చుకలతో, మొత్తం పక్షిజాతితో అక్షయ్ అత్మీయబంధానికి, వాటికోసం పోరాటానికీ ఒనగూడిన బలమైన మోటివేషన్. పక్షుల రక్షణ కోసం పోరాడీ పోరాడీ – ఫ్రీక్వెన్సీలు తగ్గించుకోమని చెప్పీ చెప్పీ ఓడి - సెల్ టవర్ కే ఉరేసుకుంటే, పక్షులన్నీ చుట్టూ చేరి ఆత్మాహుతి చేసుకున్నాయి. పక్షుల ఆత్మలన్నీ అతడి ఆత్మలో ఐక్యమై మహా పక్షిగా రూపొందాడతను.  పక్షిరాజాగా సెల్  ఫోన్ల మీద దాడులు మొదలెట్టాడు. సర్వ కమ్యూనికేషన్ వ్యవస్థనీ ధ్వంసం చేశాడు. ఇందులో ఏం తప్పుంది? అతను చెప్పింది కేవలం ఫ్రీక్వెన్సీ తగ్గించుకుని పక్షుల్ని రక్షించమనేగా? మొత్తం టెక్నాలజీని మూసెయ్యమన్లేదుగా? కానీ ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించిన ప్రభుత్వమూ సెల్ కంపెనీలూ ఫ్ర్రీక్వెన్సీ తగ్గించుకోక పక్షి జాతికే, పర్యావరణానికే ఎసరు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? 

          విలన్ అనుకున్న పాత్రకి ఇంత ఎలిబీ ఇచ్చేశాక అది హీరో పాత్రే! ఎంత గందరగోళంగా వుందంటే, దీని గురించి ఇంకా రాయాలంటే ఎలా రాయాలో అర్ధంగావడం లేదు! మైండ్ పూర్తిగా  ‘0.0’ ఐపోయేలా వుంది.   

          ఓకే, రజనీ, అక్షయ్ లిద్దర్నీ పాజిటివ్ పాత్రలుగానే వూహిద్దాం. రెండు పాజిటివ్ పాత్రలతో సినిమా కథ వుంటుందా అంటే వుంటుంది. కాకపోతే కథకి హీరో అయిన మొదటి పాత్రకి మొదట వున్న గోల్ తర్వాత వుండదు. మొదట నెగెటివ్ అనుకున్న పాత్రతో పెట్టుకున్న గోల్, తీరా అది పాజిటివేనని తెలుసుకుని, ఇద్దరి ఉమ్మడి గోల్ గా కథ మారిపోతుంది...

        అంటే,  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రజనీకి అక్షయ్ విలన్ గానే కన్పించి పోరాడతాడు. ప్లాట్ పాయింట్ టూలో అక్షయ్ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్నాక అతను హీరోలా కన్పించి చేయి కలుపుతాడు. అతడి గోల్ పూర్తి చేయడానికి అతడితో కలిసి వ్యవస్థతో ఉమ్మడి పోరాటం చేస్తాడు. అంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఔటర్ గోల్ వుంటుంది. కానీ ప్లాట్ పాయింట్ టూ దగ్గర, ఒక రియలైజేషన్ తో, ఆత్మ విమర్శతో ఔటర్ గోల్ తొలగి, ఇన్నర్ గోల్ పుడుతుంది రజనీకి. నిజం తెలియక మొదలెట్టిన ఔటర్ జర్నీ, నిజం తెలిశాక ఇన్నర్ జర్నీగా, తనలోకి తన ప్రయాణంగా మారుతుంది. ఇప్పుడు విలన్ ఎవరంటే, తను నమ్మి మొదట్లో పోరాటం మొదలెట్టిన వ్యవస్థే. 

          ఇలా హీరో గోల్ మారిపోయే స్టార్ వార్స్, కెప్టెన్ అమెరికా, ది వింటర్ సోల్జర్ వంటి సినిమాలున్నాయి. అంటే, అంతిమంగా అక్షయ్ ఆత్మకి దాని గోల్ ని పూర్తిచేసి, శాంతిని చేకూర్చి, రజనీ వీడ్కోలు చెప్పడమే – ‘ఈటీ’ లో అందమైన ముగింపు లాగా. అప్పుడు కథా ప్రయోజనం, సామాజిక ప్రయోజనం అన్నీ నెరవేరతాయి. మొదట రజనీకి విలన్ గా ప్రేక్షకులకి కన్పిస్తున్న అక్షయ్ పాత్ర,  తర్వాత ఇద్దరి మిలాఖత్ తో  ‘కో – లెడ్’ పాత్రగా మారుతుంది. 

          ఇప్పుడు సుమారుగా ఐడియా ఇలా వుండొచ్చు -  “ఫ్రీక్వెన్సీ పెంచేసిన మొబైల్ నెట్ వర్క్ ల రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని ఎదురు తిరిగి విధ్వంసం సృష్టిస్తున్న పక్షి జాతి శాస్త్రజ్ఞుడి ఆత్మతో
తన చిట్టి రోబోని కలిపి అవినీతి వ్యవస్థని అంతమొందించి  ఆ ఆత్మకి శాంతిని చేకూరుస్తాడు  సైంటిస్టు వశీకరణ్”

          సమస్యకి దర్శకుడు సిఎస్ గారు సూచించిన ప్రత్యాన్మాయాలు కూడా రిజల్యూషన్ గా ఇవ్వొచ్చు. ఈ రోజుల్లో గూగుల్ చేస్తే అర క్షణంలో తెలిసిపోనిదంటూ ఏమీ లేదు. ప్రేక్షకుల్ని మభ్యపెట్టడం కష్టం. 
         (సిఎస్ స్పందన : I read your who is hero article. That's exactly what i thought as a solution to the plot point. Any good script consultant would have told Shankar that...After knowing flash back of Akshay, Rajni joins hands with Akshay and declare a war on techno goons ending with dialogues on  alternative methods. Akshay atma slowly disappearing into clouds with a satisfied smile is the last shot)
         
సికిందర్
         
         

27, నవంబర్ 2018, మంగళవారం

709 : స్క్రీన్ ప్లే సంగతులు


    సినిమాల్ని దెబ్బతీసే ఇతర వినోద సాధనాలెప్పుడూ పుట్టుకొస్తూనే వుంటాయి. 1990 ద్వితీయార్ధంలో టీవీ సీరియల్స్ అనే కొత్త వినోద సాధనం కుటుంబ కథల సినిమాలకి చెల్లు చెప్పింది. తర్వాత కుటుంబ కథలు ఫ్యాక్షన్ యాక్షన్, మాఫియా యాక్షన్లు జోడించుకుని కోలుకున్నా, వీటికీ కాలం తీరి ఒక శూన్యం ఏర్పడింది. ఈ శూన్యంలోంచి ఎన్నారై కుటుంబాల కథలు వచ్చాయి. ఇవి ’80 ల నాటి ఉమ్మడి కుటుంబ కథల టెంప్లెట్ మూసలోనే  పడి ఆచరణ సాధ్యంకాని తిరోగమనాన్ని ప్రకటించాయి. గ్లోబల్ యుగంలో అవకాశాలు పెరిగి వలస వెళ్ళిన కుటుంబ సభ్యులు మళ్ళీ కలిసి వుండాలనే మొండి భా వజలాన్ని ప్రదర్శించాయి. కుటుంబ కథ అనగానే ఇంకా ఉమ్మడి కుటుంబాల్నే ఎత్తుకోవడం, పెళ్లి కథ అనగానే బోలెడు కుటుంబాల్నే చూపించడం –అనే ఆడియెన్స్ కనెక్ట్ లేని, మార్కెట్ యాస్పెక్ట్ లేని, సమకాలీనం కాని పాత టెంప్లెట్లతో కృత్రిమ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటి కుటుంబాలకి ప్రతీకగా ఒక చిన్న కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని, నేటి పరిస్థితుల్లో దాని సాధక బాధకాల్ని వాస్తవికంగా చూపించే వైవిధ్యానికి దూరంగా వుండిపోతున్నాయి. కుటుంబ కథలకి హింసాత్మకంగా యాక్షన్ జోడిస్తే తప్ప ప్రేక్షకులు చూడరనే దురభిప్రాయంతో కూడా ఇవి వుంటున్నాయి.

        కానీ ఇవ్వాళ యూట్యూబ్ లో పాత తెలుగు సినిమాలు -  బ్లాక్ అండ్ వైట్ సహా - చూసి యూత్ పెడుతున్నకామెంట్లు చూస్తే, ఇప్పుడొస్తున్న సినిమాల పట్ల వాళ్ళకెంత విరక్తి వుందో తెలిసిపోతుంది. పాత సినిమాల్లోని కథలు, నటనలు, విలువలు, డ్రామా – పాటలు సహా- చూసి వాళ్ళు ఫిదా అయిపోతున్నారు. ఇవన్నీ యూత్ ఇప్పటి సినిమాల్లో  మిస్సవుతున్నారు. ఈ రోజుల్లో బాగా ఎబ్యూజ్ అవుతున్న పదం ఎమోషన్. ఎవరి నోట విన్నాఎమోషన్ అన్న మాటతో ఫ్యాషనబుల్ గా, ట్రెండీగా కన్పించాలన్న ఆదుర్దాయే.  ఏంటా ఎమోషన్? అదెలా పుడుతుంది? నూటికి వంద శాతం సినిమాల్లో ఇంతేసి ఎమోషన్ని ఉత్పత్తి చేస్తూంటే కూడా, 90 శాతానికి పైగా సినిమాలెందుకు అట్టర్ ఫ్లాపవుతున్నాయి? ఈ ఎమోషన్లకి మొహం చాటేసి, యూత్ యూట్యూబ్ లో పాత సినిమాలెందుకు చూసుకుని ఎంజాయ్ చేస్తున్నారు? ఎమోషన్లంటే ఏమిటి? గురుదత్ ‘ప్యాసా’ లో నటీనటులు ఏం ఎమోషన్స్ ప్రదర్శిస్తారని? దాసరి నారాయణ రావు ‘మేఘ సందేశంలో’? కెవి రెడ్డి  ‘దొంగరాముడు’ లో?  చిత్రీకరణలో ‘మ్యాటరాఫ్ ఫ్యాక్ట్’ శైలి అనేదొకటుంది. ఇందులో సిట్యుయేషన్సే ఎమోషన్స్ పలుకుతాయి, నటీనటులు సున్నిత భావప్రదర్శన చేస్తారు, అంతే. ఒకటి రెండు సెకన్ల సున్నిత భావప్రకటనతో కట్ అయిపోతుంది సీను. ఇది ఉత్తమ దర్శకత్వం. గత రాత్రి ‘పల్టడచో మునిస్’ (వంతెన అవతల మనిషి) అనే కొంకణి వాస్తవిక సినిమా చూస్తే, అది అడవిలో ఒక ఫారెస్ట్ ఉద్యోగికి ఓ పిచ్చిదానితో ప్రేమ కథ. అంతర్జాతీయ అవార్డులు పొందిన ఇందులో వున్నది మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ శైలి చిత్రీకరణే. సిట్యుయేషన్స్ సృష్టిలో కథాపరమైన సరైన భావోద్వేగాలుండాలే గానీ, ఇది వదిలేసి పేలవమైన సన్నివేశాల్లో నటీనటులు ఎమోషన్స్ తో ఎంత ఊదరగొట్టుకున్నా ఒరిగేదేమిటి. 

       సినిమాల్ని దెబ్బతీసే ఇతర వినోద సాధనాలెప్పుడూ పుట్టుకొస్తూనే వుంటాయి. యూత్ ఇక క్వాలిటీ వినోదం కోసం నయా వినోద సాధనం యూట్యూబ్ వైపు మళ్లిపోతే, కుటుంబ సినిమాలే కాదు, యాక్షన్ సినిమాలూ ప్రమాదంలో పడతాయి. యూట్యూబ్ లో పాత సినిమాలు చూస్తున్న  యూత్  ఏమని కామెంట్లు పెడుతున్నారో ఒకసారి చూద్దాం: 

        I am 24 and I love to watch only old films. There is something in them.
        The lines speak. In this generation ru intersted really great nd inspirin. I 2 like 2 watch old -sorry - gold films. By the way i am 24 yrs.”
            జీవితంలో చచ్చిపోతున్నాం ఇప్పుడొచ్చే సినిమాలు చూడలేక. ఏవో ఒకటో రెండో తప్ప.”
            Almost old movies are meaning ful  and we learn new things from those films.”
            “ఇలా వుండాలి సినిమాలు అంటే...అందరి యాక్షన్స్, ఎక్స్ ప్రెషన్స్ ఒరిజినల్ గా వున్నాయి”
            “అప్పట్లోనే ఆడపిల్లల్ని ఏం తక్కువ కాకుండా చూశారు. ఇప్పుడు అసలు కనడమే బాధ పడుతున్నారు.
            “అప్పట్లోనే బాగా ప్రోగ్రెసివ్ గా వుండేవారు, ఇప్పుడు రిగ్రెసివ్ గా వుంటున్నారు.
             Old is gold - sorry old is diamond.”
           Now a days we are missing soul in movies which is there here, not in present movies.”
           
“By seeing this movie, a person knows what life is.”

          ఇదీ పరిస్థితి. 2000 నుంచి యూత్ సినిమాలంటూ ప్రారంభమైన నయా ట్రెండ్ తో మధ్య వయస్కులు సినిమాలు చూడ్డం మానేశారనీ, సినిమాలకిక యువ ప్రేక్షకులే మిగిలారనీ బ్రాండింగ్ ఒకటి ఏర్పడింది. ఇది అప్పట్లో నిజం కూడా. ఇప్పుడిది మిథ్య అనుకోవాలి. యూత్ ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఏ సినిమాల్లోనూ ఏమీ వుండడం లేదని యూత్ కే అర్ధమైపోయి  ప్రత్యాన్మాయాలు వెతుక్కుంటున్నారు. యూట్యూబే కాక ఇంకే మాధ్యమాల్లో తమకి కావాల్సిన పాత సినిమాలు వెతుక్కుంటున్నారో. యూట్యూబ్ లో పాత సినిమాలకి లక్షల్లో వ్యూస్ వుంటున్నాయి. ఈ లక్షల మంది యూతే అని కాదు, నడి  వయస్కులు, సీనియర్ సిటిజన్లు అందరూ వుండొచ్చు. కానీ కామెంట్ల వెల్లువ మాత్రం యూత్ దే. ఐదు లక్షల వ్యూస్ తో వున్న ‘మాంగల్య బలం’ కి ఒక యూత్ పది సార్లు చూశానని కామెంట్ పెట్టాడు. ఎందుకిన్ని సార్లు చూస్తున్నాడతను? 

       ఇప్పుడు తీస్తున్న సినిమాలతో సినిమాలంటే ఇవే, ఎమోషన్స్ అంటే ఇవే అని యూత్ ని మభ్య పెట్టడం ఇక కష్టం. ‘దొంగ రాముడు’ చూసిన ఒక యూత్, ఇప్పటి దర్శకులు దీన్ని వంద సార్లు చూసి సినిమాలెలా తీయాలో నేర్చుకోవాలని కామెంట్ పెట్టాడు. ఎందుకిలా అన్నాడు? 

          సినిమాలు తీసి క్యూబ్ ద్వారా విడుదల చేయాలనుకున్నప్పుడు, అవతల యూట్యూబ్ మోగిస్తున్న ప్రమాద ఘంటికలు కూడా వినాలి. లేకపోతే యూట్యూబు గాలితీసిన ట్యూబు చేసేస్తుంది బాక్సాఫీసుల్ని. యూత్ తల్చుకుంటే ఏమైనా చేసి పడెయ్యగలరు.

          తీస్తే కథలే తీయాలి, తీయకపోతే గాథలే తీయాలి. రెండూ కలిపి అదీ ఇదీ కాని ఇంకేదో చేస్తే, దీంతో ఎమోషన్ బాగా వచ్చేసిందనుకుంటే, వీటి బండారం యూట్యూబ్ లో తెలిసిపోయిన యూత్, టెస్ట్ ట్యూబుల్లో పరీక్షించి చూసి -  బీకరులో పడేసి యాసిడ్ పోసే స్తారు.

          కథంటే ఏమిటో తెలియకుండానే సినిమాలు తీసేస్తున్నారు. కనీసం కథని గాథలా తీయకుండా వుండేందుకు గాథంటే ఏమిటో, ఎలా వుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పనిలోపనిగా, ఎమోషన్లే గాథల్ని ఎలా నిలబెడతాయో తెలుసుకునేందుకు ఆసక్తి చూపాలి. సినిమాలకి లాజిక్ ఏమిటని అనుకుంటారు. ప్రేక్షకులకి నిత్యానుభవం కాని కథలతో లాజిక్ అవసరం లేకపోవచ్చు. ఒక పోలీస్ అధికారి లాజిక్ లేకుండా అడ్డదిడ్డంగా కేసు పరిశోధించి నమ్మించవచ్చు. వ్యవస్థల పనితీరు తాలూకు పరిజ్ఞానం వుండని ప్రేక్షకులు ఇది చూసేస్తారు. పరిజ్ఞానమున్న ప్రేక్షకులు కొద్ది మందే వున్నా నవ్విపోతారు, నష్టం లేదు. కానీ వ్యక్తిగత జీవితాల్లో నిత్యానుభవమయ్యే మానవ సంబంధాల్ని లాజిక్ లేకుండా చూపిస్తే అందరు ప్రేక్షకులూ ఛీ పొమ్మంటారు. కుటుంబ కథల్లో కుటుంబ సంబంధాల్ని, నిత్య వ్యవహారాల్నిలాజికల్ గా చూపించకపోతే ఒప్పుకోరు. పదహారేళ్ళ కూతుర్ని చదివించకుండా పెళ్లి చేస్తే లాజిక్కే అడ్డొస్తుంది చూసే ప్రేక్షకులకి. ‘24 కిసెస్’ లో 24 ముద్దులు పెట్టుకుంటే ఆ ప్రేమ బలంగా వుండిపోతుందని నమ్మిన హీరోయిన్, మధ్యలో సెక్స్ కి పాల్పడితే, లాజిక్కే లాగి కొడుతుంది ప్రేక్షకులకి. కళా హృదయముంటే దానికి లాజికల్ మెదడు పహారా కూడా అవసరం. మెదడు లేని హృదయం సోది. 

          యూట్యూబ్ లో యువప్రేక్షకులు ఓటేస్తున్న ఈ లాజిక్కులు, ఎమోషన్లు, విలువలూ... వీటిని ఒక గాథగా ‘పెదరాయుడు’ ఎలా మేళవించి విజయం సాధించిందో చూద్దాం...
***
      కార్పొరేట్ దిగ్గజాలు అంబానీ సోదరులు విడిపోవాల్సి వచ్చినప్పుడు, విధిలేక అన్న మీద కోర్టుకెక్కిన తమ్ముడు అనిల్ అంబానీ,  ఒకచోట ఇలా ఫిలాసఫీ రాసుకున్నాడు –‘నమ్మకం లేకపోతే ఏదీ లేదు. అవసరమొస్తే ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. ఆ త్యాగం మనకి అనుకూలంగా వుండకూడదు. పరోపకారం దృష్టితో నిజమైన పరిత్యాగం కావాలి. రఘుకుల్ కీ రీతీ సదా చలీ ఆయీ... ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే’ అని.  

          కనీసం సినిమాల్లో చూపించే ఫ్యూడల్ వ్యవస్థకో నీతి వుంటుంది. సినిమా దొరలు బయట ఏం తీర్పులు చెప్తారో, తడుముకోకుండా ఇంట్లో అలాటి తీర్పులే చెప్పేస్తారు. “తీర్పులు చెప్పే వాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం” అంటూ ప్రాణం విడుస్తాడు ‘పెదరాయుడు’ లో రజనీ కాంత్. బావ చేతిలో వెన్నుపోటుకి గురైన పెద్ద జమీందారు రజనీకాంత్. ఇదే రజనీ కాంత్ బాధ్యతలు చేపట్టిన కొడుకు మోహన్ బాబు, తమ్ముడి మీద తను చెప్పిన తీర్పు తప్పని తేలడంతో, గుండె ఆగి మరణిస్తాడు. జీవితంలో అనిల్ అంబానీ అయినా, సినిమాలో రజనీకాంత్ అయినా, మోహన్ బాబు అయినా, ఇంటా బయటా తమ సామ్రాజ్యాలలో మాటకు ప్రాణాలిస్తారు. త్యాగంలో పరసుఖం చూస్తారు. 

          ‘పెదరాయుడు’లో ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఛాయలు కన్పిస్తాయి. కథాంశాలే వేరు. పాత్రలు అవే, హీరోల ద్విపాత్రాభినయాలూ అవే. అన్నల పొరపాటు తీర్పులు, తమ్ముళ్ళ అన్యాయపు బహిష్కరణలు. అన్నల భార్యల వేదనలు, వాళ్ళ మీదా వెలి వేటు, లేదా హెచ్చరికలు. అన్నల మీద ఎదుటి జమీందార్ల కుట్రలు కుహకాలూ, పూర్వీకుల బలిదానాలూ వైగైరా వగైరా. 

          అన్న మాటకోసం తమ్ముడి త్యాగమే కాదు, తమ్ముడికి తన వల్ల నష్టం జరిగితే ప్రాయశ్చిత్తం చేసుకుని వెళ్ళిపోవాల్సి వుంటుంది కూడా అన్న. మాట, విలువలు, చేత అనే ముక్కోణాన్ని సృష్టించుకుని అందులో తామే అమరులైపోతారు. 

          తమ్ముడు మోహన్ బాబుకి అన్న మాటే వేదం. అందుకే, “నువ్వే పాపం చేయలేదని అన్నకెందుకు చెప్పవు?” అని భార్య సౌందర్య అడిగినప్పుడు –ఆయన అడగలేదు కాబట్టి చెప్పలేదంటాడు. ఆయన అడగంది ఏదీ తను చెప్పలేదు, ఆయన చెప్పంది ఏదీ తను చేయలేదంటాడు. “ఆ రోజు రాముడు నేను అడవులకెందు కెళ్లాలని ప్రశ్నించి వుంటే, రామాయణం జరిగుండేది కాదు. తండ్రి  మాటని గౌరవించి రాముడు అడవుల కెళ్ళాడు. తండ్రి కంటే గొప్పవాడైన అన్న మాటని గౌరవించి నేనిక్కడి కొచ్చాను” అంటాడు. 

           ‘పెదరాయుడు’ రామాయణమే. చూస్తే  రామాయణంలో రఘు వంశమంతా పాసివ్ పాత్రల మయమే, ఒక్క కైకేయి తప్ప. ఆమె ఒక యాక్టివ్ పాత్రగా లక్ష్య దృష్టితో దశరథుడి మీద కోర్కెల బాణం విసరకపోతే రామాయణమే లేదు. కథనాల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యక పోతే పాసివ్ పాత్రలకి ఇలాటి గాథల్లేవు, ట్రాజడీల్లేవు. గొప్పతనం లేదు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లో కృష్ణంరాజు రెండు పాత్రలకీ లక్ష్యం లేదు, విలన్ రావుగోపాల రావుకే వుంది. ‘పెదరాయుడు’ లోనూ మోహన్ బాబు పాత్రలు రెండూ డిటో. టార్గెట్ వున్న పాత్ర విలన్ అనంత్ రాజే. 

          ఈ అనంత్ రాజ్ మేనమామ రజనీకాంత్ హయాంలో ఓ మానభంగం చేసి, తీరా మానభంగం చేసిన అమ్మాయినే చేసుకోవాల్సి వస్తే, ఇలా తీర్పిచ్చిన మేనమామని ఇతడి తండ్రి చలపతి రావు కాల్చేస్తాడు. చనిపోతూ రజనీకాంత్ ఈ ధిక్కారానికి ఇంకో తీర్పు ఇస్తాడు - ఈ తన బావ చలపతి రావు కుటుంబానికి పద్దెనిమిదేళ్ళూ సాంఘిక  బహిష్కారమని. దీంతో ఆ పద్దెనిమిదేళ్ళూ అతి హీనంగా బతికిన అనంత రాజ్, ఇక రజనీ కాంత్ కొడుకు మోహన్ బాబు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చేస్తాడు. 

     ఈ తమిళ రీమేక్ ని దర్శకుడు రవిరాజా పినిశెట్టి సమర్ధవంతంగా తెరకెక్కించారు. ఎక్కడా క్వాలిటీ స్పృహ కోల్పోకుండా ఉన్నత విలువలతో మనోజ్ఞంగా ప్రెజంట్ చేశారు. రజనీకాంత్, మోహన్ బాబు సహా ఇతర నటీ నటులందరూ వాళ్ళ పాత్రల్లో చాలా ఆత్మీయంగా ఇమిడిపోయారు. అంతే ఆత్మీయంగా ఈ గాథంతా వచ్చేసి రవిరాజా గుప్పెట్లో ఒదిగిపోయింది. సన్నివేశాల కల్పనల్లో కృత్రిమత్వమే లేకపోగా, వాటిలో ఎక్కడ ఏ రస పోషణ జరిగినా, అంతర్వాహినిగా ఒకే నిశ్శబ్ద మెలోడీ అనుభవమవుతుంది. అది కథాత్మ. బలీయమైన అన్నదమ్ముల అనుబంధం వల్ల ఏర్పడిన సోల్. 

          నాటి దర్శకుడు డాన్ లివింగ్ స్టన్, ‘ఫిలిం అండ్ ది డైరెక్టర్’ అని రాసిన పుస్తకంలో, మూవ్ మెంట్ అన్న విభాగంలో ఇలా పేర్కొంటాడు – ‘కెమెరా మూవ్ మెంట్ ని ఇంటలిజెంట్ గా నిర్వహించడం దర్శకుడి విజువల్ టెక్నిక్స్ లో ప్రథమ స్థానం వహించాలి. అప్పుడే అతను ప్రేక్షకుల్ని ఎంతో ఈజ్ తో సినిమాలో లీనమయేట్టు చేయగలడు. పాత్రల వ్యక్తిత్వాల చిత్రణ సులువుగా అర్ధమయ్యేట్టు చేయగలడు. అంతేకాదు, ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూడ్ లోకి తీసికెళ్ళి కట్టిపడవేయనూ గలడు...’ అని. రవిరాజా సాధించిందిదే. గాథ నడకలో స్లో మూవ్ మెంట్స్ తో ఒక లయని స్థాపించి, కథాత్మని పోషించుకుంటూ వెళ్ళడం. 

          ఈ గాథంతా సౌభాతృత్వం గురించి, కుటుంబం గురించి, కుటుంబంలో అన్ని భావోద్వేగాల గురించీ. దీని స్క్రీన్ ప్లే వివరాల్లోకి రేపట్నుంచి వెళదాం...

సికిందర్
         

25, నవంబర్ 2018, ఆదివారం

708 : స్క్రీన్ ప్లే సంగతులు



           మీరు కథ వేరు, గాథ వేరు అని చాలా సార్లు రివ్యూలలో రాస్తున్నారు. అంటే ఏమిటి? వాటినెలా గుర్తించాలి ? గాథలు ఎందుకు సినిమాలకి పనికిరావు?
           
వి. సూత్య కాంత్, స్ట్రగ్లింగ్ రచయిత, Q&A నుంచి
         
సినాప్సిస్  రాసుకోకపోవడం వల్ల చాలా సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. సినాప్సిస్ ఐడియా నుంచి పుడుతుంది. ఐడియా ఒక స్టోరీ లైన్ లోకి ఒదగలేదంటే, సినాప్సిస్ (4 పేజీల కథాసంగ్రహం) కూడా కుదరదు. జక్కన్నలో  చిన్నప్పుడు విలన్ చేసిన సాయానికి జక్కన్న ప్రతిసాయం చేయాలనుకోవడం మాత్రమే కథకి  ఐడియా అవుతుందా? ఇది అర్ధవంతంగా వుందా? ఇందులో కథ కన్పిస్తోందా? స్ట్రక్చర్ కన్పిస్తోందా?  బిగినింగ్  -మిడిల్- ఎండ్ విభాగాలు కన్పిస్తున్నాయా? ఇవేవీ కన్పించనప్పుడు కోట్ల రూపాయలతో సినిమా తీయడానికి ఎలా సాహసించినట్టన్నది జక్కన్నే చెప్పాలి.  
‘జక్కన్న’ స్క్రీన్ ప్లే సంగతులు లోంచి
         
ఒక్క నాల్గు పేజీల సినాప్సిస్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్  సహితంగా రాసుకుంటే తప్పులన్నీ  తెలిసిపోతాయి. వాటిని సరిదిద్దుకోవడం ఇక్కడే ఈజీ, సవ్యమైన సినాప్సిస్ వచ్చేదాకా. సినాప్సిస్ నస పెడుతోందంటే సినిమా ఎన్ని  ఆటలేసినా కష్టపెట్టకుండా వుండదు. ఆటలు పడే కొద్దీ  తప్పులన్నీ ఒకటొకటే తొలగిపోయి, సినిమా తేటపడే టెక్నాలజీ ఏమీ ఇంకా రాలేదు.  
‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ స్క్రీన్ ప్లే సంగతులులోంచి 

      స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. దాంతో సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. దృశ్యపరంగా చూసేందుకు కథలే బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై దాంతో మొదలయ్యే సంఘర్షణ తప్పొప్పుల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర జడ్జ్ మెంట్ నిస్తుంది.  గాథ లో సమస్య వున్నా పాత్ర దాంతో సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంట్ ఇవ్వక- కేవలం ఫలానా సమస్యతో  మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యామోచ్ అనేసి స్టేట్ మెంట్ పారేసి తన దారిన తను దులుపుకుని వెళ్ళిపోతుంది.
ఓకే బంగారం’ స్క్రీన్ ప్లే సంగతులు లోంచి 

      ‘మొగుడు’  నిజంగానే హిందూ వివాహ వ్యవస్థ మీద తీసిన ఉదాత్త సినిమాయేనా? పెళ్లి వ్యవస్థ మీద సినిమా తీస్తున్నామని భావించుకుంటూ వేరే బాట పట్టిపోయిన క్రియేషనే ఇది ... వరకట్నంవిడాకులువేరుకాపురాలూ  లాంటి సమస్యల్లాగే పెట్టిపోతల దగ్గరకుటుంబ ఆచారాల దగ్గరాపెళ్లి తంతులోనూ వచ్చేతేడాలుంటాయి. ఇలాటి ఒక తేడా గురించి తీసిన సినిమా మాత్రమే మొగుడు’. దీనికి పెళ్లి వ్యవస్థతో ఎలాటి సంబంధమూ లేదు...రెండు కుటుంబాల మధ్య ఆచార వ్యవహారాల గురించి సైద్ధాంతిక విభేదాలు తలెత్తినప్పుడు- ఏది తప్పు ఏది ఒప్పు అన్న బలమైన ఆర్గ్యుమెంట్ ని ప్రేక్షకుల  పరిశీలనార్ధం కృష్ణ వంశీ  ఎక్కు పెట్టినట్టేఇదే ఆర్గ్యుమెంట్ ని పట్టుకుని ముందుకు సాగిపోయి వుంటేఇదొక ఆలోచనాత్మక కథగా ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేసి వుండేదిఇలా కాకుండా ఆర్గ్యుమెంట్ ని (సైద్ధాంతిక విభేదాల్నిహింసాత్మక చర్యలకి దారితీయించినానా బీభత్సం సృష్టించడంతోదీన్నాపే మరో చర్యగా చివరాఖరికి గోపీచంద్ భోరున ఏడుస్తూ చెప్పుకునే గాథలా తయారయ్యింది సినిమా. కథ’  అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, గాథనిస్సహాయంగా ఇదిగో పరిస్థితి ఇలా తయారయ్యిందీ అనేసి ఉత్త స్టేట్ మెంట్ మాత్రంగా ఇచ్చేసి వదిలేస్తుంది తేడా గుర్తించడం అవసరం. ఆర్గ్యుమెంట్ సహిత కథలేసినిమాలకి పనికోస్తాయే గానీస్టేట్ మెంట్ తో సరిపుచ్చేసే గాథలుకాదు.
’పైసా’ స్క్రీన్ ప్లే సంగతులు లోంచి  

       అసలు సినిమాకి కథ చేశారా, గాథ చేశారాని పెద్ద సందేహం,  కథే చేసివుంటే ప్లాట్ పాయింట్స్ కన్పించాలి. మొదటి ప్లాట్ పాయింట్లో సంఘర్షణ పుట్టి మిడిల్ లో పడాలి కథ. మిడిల్లో పడి మరింత సంఘర్షణాత్మకం అవాలి కథ. రెండో ప్లాట్ పాయింట్లో సంఘర్షణకి సమాధానం దొరికి ఎండ్ లో పడాలి కథ. చాలా సింపుల్...ఇదంతా చూస్తూంటే స్ట్రక్చర్ వుండని గాథలా వుంటుంది. కమర్షియల్ సినిమాకి పనికి రాని ప్రక్రియ గాథ. కమర్షియల్ సినిమాలకి కథలే వుండాలని గతంలో ఎన్నో సార్లు చెప్పుకున్నాం. కథంటే ఆర్గ్యుమెంట్. హీరోకీ విలన్ కీ మధ్య వాళ్ళ వాళ్ళ వాదాలు చెలరేగుతాయి.  ఎవరికి  వాళ్ళు తమ వాదాన్ని గెలిపించుకోవడానికి పోరాటం మొదలెడతారు. చివరికి ఎవరి వాదం కరెక్టో జడ్జిమెంట్ ఇస్తుంది కథ.  గాథ ఇలాకాదు. ఇది స్టేట్ మెంట్ మాత్రంగా వుంటుంది. నేనిలా చేస్తే, నాకిలా జరిగి, ఇలా ముగిసిందీ  నా కథా అని స్టేట్ మెంట్ మాత్రమేఇచ్చుకునేదిగా వుంటుంది. కథ ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుందిగాథ స్టేట్ మెంట్ నిస్తుందిఅనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగిందిహాస్పిటల్లో చేరాడుకాలు ఫ్రాక్చరైందని తేల్చారుతిరిగి నడవాలంటే కొన్ని నెలలుపడుతుందని చెప్పారుకొన్ని నెలల తర్వాత తిరిగి ఎప్పటిలా నడవసాగాడుఇది గాథఇది ఇలా  స్టేట్ మెంట్ మాత్రంగానే వుండిపోతుంది
ఇలాగే వుంటుందిఈ మూడోసర్కార్  కథనంఅనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగిందిహాస్పిటల్లో చేరాడు వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందేనని  పట్టుబట్టాడుకోర్టులో కేసు వేశారుఅనిల్ కుమార్ కేసు పోరాడి గెలిచాడువాహనదారుడిదే తప్పని తేలిందిఅనిల్ కుమార్ కి నష్ట పరిహారం లభించిందిఇది కథ . ఇది  ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తోందిఇలావుండదు మూడో సర్కార్ కథనం.పైనచెప్పుకున్న స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోయిన  గాథ ఎంత  చప్పగా వుందోఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తున్న కథఅంత  ఆసక్తి కరంగా వుందని తేలుతోందిఇందుకే సినిమాలకి పనికొచ్చేది కథలే గానీగాథలు కాదుఇంకోటి గమనిస్తే గాథకిస్ట్రక్చర్  వుండదుకథకే వుంటుందిసినిమాకి స్ట్రక్చరే ముఖ్యం.  గాథలో బిగినింగ్ మాత్రమే వుండిసాగి సాగి  బిగినింగ్ తోనేముగుస్తుంది
         ఈ మూడో సర్కార్ ఇలాగే వుంటుంది. అందుకని సినిమాకి పనికి రాదుకథ కి బిగినింగ్ తో బాటు మిడిల్ఎండ్ కూడావుండి  సంతృప్తికరంగా ముగుస్తుందిగాథకి ప్లాట్ పాయింట్స్ వుండవు- మూడో సర్కార్ కీ లేవు. కథకి వుంటాయిగాథకి క్యారక్టర్ఆర్క్ వుండదుఎలా వున్న పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుందిమూడో సర్కార్ ఇంతే. కథకి క్యారెక్టర్ ఆర్క్ తో పాత్రఉద్విగ్నభరితంగా వుంటుందిగాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుండదుకథనం నేలబారుగా సాగుతూ వుంటుందిదీన్ని మూడో సర్కార్ లో గమనించవచ్చు. కథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుంటుందికథనం ఉత్థాన పతనాలతో కట్టి పడేస్తుందిగాథలో ఇవి వుండవు- మూడో సర్కారే ఉదాహరణ.
          గాథలో సంఘర్షణ వుండదు- మూడో సర్కార్ లోనూ లేదు. సంఘర్షణ లేనిది కథ వుండదుగాథకి ప్రతినాయక పాత్రవుండదు- మూడో సర్కార్లో వున్నా లేనట్టే వున్నారు. కథకి ప్రతినాయక పాత్ర కీలకంగాథలు ఆర్ట్ సినిమాలకి బావుంటాయి- ఆర్ట్ సినిమా లాంటిదే  మూడోసర్కార్గాథ.  కథలు కమర్షియల్ సినిమాలకి బావుంటాయి.  గాథతో జరిగే మోసమేమిటంటేఅది గాథ అని చాలాసేపటి వరకూ తెలీదుఇంకా ప్లాట్ పాయింట్ వన్ వస్తుందనే ఎదురు చూస్తూంటాంఎంతకీ రాదువిశ్రాంతి వచ్చేస్తుంది.అది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదని తేలడంతో అప్పుడుతెలుస్తుంది మోసంమోసపోయామే అని లేచిపోవడమో, లేక ఏంచేస్తాం ఖర్మ అనుకుని మిగతాదంతా చూడడమో చేస్తాంసర్కార్ తోనూ ఇదే అనుభవం. కాకపోతే ప్రారంభంలో చూపించింది ప్లాట్ పాయింట్ వన్ అని మోసపోయాం.

         
చేస్తున్నది కథలనుకుని  గాథలు రాసుకుంటూ తీసినవన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి- కృష్ణ వంశీ మొగుడు’, ‘పైసా’; శర్వానంద్ రాజాధిరాజా’, మహేష్ బాబు బ్రహ్మోత్సవం’, సునీల్ జక్కన్న’  సుధీర్ బాబు కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, విజయ్ దేవరకొండ ద్వారక’ ...చెప్పుకుంటూపోతే చాలా వున్నాయి.
‘సర్కార్ -3’ స్క్రీన్ ప్లే సంగతులు నుంచి

         కమర్షియల్ సినిమా కథంటే సమస్యల్ని పరిష్కరించేదే. సమస్యని పరిష్కరిస్తేనే కథ, లేకపోతే ప్రేక్షకులకి వ్యధ. కమర్షియల్ సినిమా కథంటే ఆర్గ్యుమెంట్ కాబట్టి సమస్యల్ని పరిష్కరించాల్సిందే. ఆర్గ్యుమెంట్ లేకుంటే అవి కథలు కావు, గాథ లవుతాయి. సమస్య వల్ల ఆర్గ్యుమెంట్ పుడుతుంది. ఆర్గ్యుమెంట్ సమస్యని పరిష్కరిస్తుంది. అందుకే కమర్షియల్ సినిమా కథలు సమస్యల్ని పరిష్కరించే దృష్టితో వుంటాయి. సమస్య ఆర్గ్యుమెంట్ పరిష్కారం ఇదీ కమర్షియల్ సినిమా కథల  లక్షణం. ఆర్గ్యుమెంట్ అంటే రెండు పాత్రలు, లేదా రెండు వర్గాలు సంఘర్షించుకోవడమే.  అందుకే సమస్య సంఘర్షణ పరిష్కారం అని మౌలికంగా నిర్వచిస్తారు కమర్షియల్ సినిమాల కథల్ని. ఎటొచ్చీ ఒక సమస్యని  లేవనెత్తి దాన్ని పరిష్కరించేందుకే వుంటాయి కమర్షియల్ సినిమాల  కథలు. లేకపోతే వాటికి కమర్షియల్ సినిమాల్లో పనిలేదు, దగ్గర్లోని   చెత్తకుండీలో ఇంత  చోటు చూసుకుని హాయిగా విశ్రమించడం తప్ప. ఇక్కడ సినిమా కథంటే  సరిపోతుందిగా, కమర్షియల్ సినిమా కథంటూ పదేపదే నొక్కి చెప్పడ మెందుకని సందేహం రావచ్చు.  అసలు సమస్యంతా ఇక్కడే వుంది.  కథకి ఆర్గ్యుమెంట్ సంగతే పట్టకుండా రాసేసి తీసేస్తే అదికూడా సినిమానే అవుతుందని అనుకుంటున్నారు, ఆర్టు సినిమా అవుతుందని తెలీక.   బ్లాగులోనే చాలా సార్లు కొన్ని సినిమాల రివ్యూల్లో  చెప్పుకున్నాం స్టార్ సినిమాలనేవి కమర్షియల్ సినిమాల  ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే అని!  ప్పుడు కూడా కావాలంటే ఈవారం, గతవారం విడుదలైన రెండు పెద్ద సినిమాలు చూడొచ్చు.  కాకపోతే కొన్నిసార్లివి బిగ్ నేమ్స్ వల్ల ఆడేస్తాయి.



          ఆర్గ్యుమెంట్ లేని కథలు ఆర్ట్ సినిమా గాథలు... కథకీ గాథకీ తేడా ఏమిటంటే, కథ సమస్యని పరిష్కరించే ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తే, గాథ సమస్యని ఏకరువు పెట్టి వాపోతుంది (స్టేట్ మెంట్).  అంటే గాథలు సమస్య గురించి వాపోతూ స్టేట్ మెంట్ ఇచ్చే మాత్రంగా వుంటే, కథలు సమస్య అంతు తేల్చి జడ్జిమెంటు ఇచ్చేవిగా వుంటాయి.  ఇందుకే గాథలు చప్పగా వుంటే, కథలు హాట్ హాట్ గా వుంటాయి. సినిమా ప్రేక్షకులకి జడ్జి మెంటు నిచ్చే హాట్ హాట్ సంఘర్షణాత్మక కథలే కావాలి, సంఘర్షణా జడ్జిమెంటూ వుండని చప్పటి గాథలుకాదు. కథల్లో యాక్టివ్ పాత్రలుంటాయి, అందుకే సమస్యకి ఆర్గ్యుమెంట్ పుడుతుంది. గాథల్లో పాసివ్ పాత్రలుంటాయి, అందుకే ఆర్గ్యుమెంట్ పుట్టదు. కమర్షియల్ సినిమాలు యాక్టివ్ పాత్రల వల్ల జనసామాన్యంలో ఆడతాయి. ఆర్ట్ సినిమాలు పాసివ్ పాత్రలతో మేధావి వర్గాల మెప్పు కోసం వుంటాయి. వాటితో ఎవరికీ ప్రయోజనమూ వుండదు. పాత్రల్ని చూసి అయ్యో పాపమని అవసరం లేని బాధ పడ్డం తప్ప. తేడా తెలుసుకోకుండా కథా రచన చేపడుతున్నారు కాబట్టి సినిమాల్లో  కమర్షియల్ సినిమాలు వేరయా అని పాట పాడాల్సివస్తోంది. ఎంత పాడినా కమర్షియల్ సినిమాలు మాత్రం పదుల కోట్ల రూపాయలతో అజ్ఞానపు వ్యాపారంగానే, బిగ్ నేమ్స్ ని ఆసరా చేసుకుని, ప్రేక్షకుల్ని మభ్య పెడుతూనే వుంటాయి. ప్రేక్షకులు అసలీ నోట్లిచ్చుకుని నకిలీ సినిమాలు ఏంచక్కా  చూస్తూనే వుంటారు. 
 
’ప్లాట్ పాయింటా? ఫ్లాప్ పాయింటా?’ నుంచి 

       రాజుగారి గదితీసిన దర్శకుడు  ఓంకార్ మలయాళ రీమేక్ ని  విషయంతో సంబంధం లేకుండా రాజుగారి గది -2టైటిల్ తో విడుదల చేశారు. పైన చెప్పుకున్నట్టు భావోద్వేగాల చింతనే తప్ప చివరికి ఏం  తేల్చామనే విషయం పట్టించుకోలేదు. ఇందుకే దీనికో స్క్రీన్ ప్లే లేకుండా పోయింది. గాథలకి స్ట్రక్చర్ వుండదు. అందుకనే ఫస్టాఫ్ లో గాథ మొదలవలేదు. కథయితే మొదలై వుండేదేమో. ఫస్టాఫ్ దెయ్యం కామెడీలతో గడిపేశారు. 40 నిమిషంలో నాగార్జున పాత్ర వచ్చినా దాని పరిచయ ఎపిసోడ్ ఒకటి సాగి, ఇంటర్వెల్ లో సమంతా ఆత్మకి  ఎదురుకావడంతో అర్ధోక్తిలో ఆగుతుంది.

         
సెకండాఫ్ ఇరవయ్యో నిమిషం లో అసలు గాథే మిటో తెలుస్తుంది సమంతా పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో.  ఇక గాథ మొదలవుతుంది. ఇదే కథ అయి ఇప్పుడు ప్రారంభమై వుంటే,  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయ్యేది. గాథ కావడం వల్ల సంఘర్షణ లేదు. సంఘర్షణ లేకపోతే కథ అవదు. ఇక్కడ గాథతో ఇంకోటేం జరిగిందంటే, ఎండ్ సస్పెన్స్ బారిన పడింది. ఫ్లాష్ బ్యాక్ తర్వాత దాదాపు ముగింపు వరకూ వీడియో ఎవరు తీశారనే దర్యాప్తు తోనే సాగుతుంది. వీడియో తీసిన పాత్ర చిట్టచివర్లో తెలిసి పాత్ర కూడా డిఫెన్స్ లో పడడంతో సంఘర్షణకి తావే లేకుండా పోయింది. ఇక నాగార్జున కౌన్సెలింగ్ మొదలవుతుంది.

         
మహేష్ భట్ రాజ్’  కోవలో కథ చేసి ఓంకార్ దీన్ని పవర్ఫుల్ గా నిలబెట్టాల్సింది. అప్పుడు థ్రిల్, హార్రర్, సస్పెన్స్, అన్ని ఎమోషన్సూ కలగలిసి సమస్యతో సంఘర్షణతో, ఆర్గ్యుమెంట్ తో ఒక సమగ్ర కథ ఆవిష్కరణయేది. 
‘రాజుగారి గది’ రివ్యూ నుంచి  

     గాథ కాబట్టి, పాత్రలే తప్ప ప్రధాన పాత్ర వుండదు కాబట్టిస్ట్రక్చర్ ని ఆశించకూడదు. దాదాపు ప్రతీ రెండో తెలుగు సినిమా ఇంకా చాదస్తంగానే చిన్నప్పట్నుంచీ కథనెత్తుకుని అచ్చిబుచ్చి కబుర్లతో స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాయి. ఇప్పటి ట్రెండ్ కి చిన్నప్పటి కథలు ఎవరికి ఆసక్తికరం. తీరుబడిగా కూర్చుని సినిమాలు చూసే రోజులా? నేరుగా హీరోలనే చూపించేసి, వాళ్ళెంత గాఢమైనస్నేహితులో రెండు ముక్కల్లో చెప్పేస్తే అయిపోతుంది.  ఇక్కడ చూపించిన చిన్నప్పటి సీన్లు మరీ సిల్లీగా వున్నాయి. ఇదంతా స్క్రీన్ టైంని వృధా చేయడమే. మాట కొస్తే హీరోలు పెద్దయ్యాక కూడా అరగంట వరకూ పాయింటే వుండదు గాథ నడిచేందుకు. హీరోయిన్ వచ్చాక వుంటుందనుకుంటే, ఆమెతో కూడా ఒకదానితో ఒకటి సంబంధంలేని అతుకుల బొంత సీన్లు.  కేవలం ఇంటర్వెల్ దగ్గర కాస్త గాథ పెట్టుకుని ముగించేసే తేలిక పనితో సీన్ల పేర్పుడు కార్యక్రమం పెట్టుకున్నట్టుంది.  తెలుగు సినిమా తీయడం ఇంత ఈజీ అయిపోయిందా చిన్న పిల్లాడు కూడా తీసేయగలడు కదూ?

          ఇక ఇంటర్వెల్ ముందు పది నిమిషాల్లో నాల్గు మలుపు లొస్తాయి.  మలుపువచ్చినప్పుడల్లా ఇదే ఇంటర్వెల్ అనుకుంటాం.  గంటన్నర గడుస్తున్నా ఇంటర్వెల్లే రాదు. డిటో సెకండాఫ్ ముగింపు వరకూ. మళ్ళీ ముగింపులో, సడెన్ గావచ్చే  ముగింపుకి పనికొచ్చే నాల్గు సీన్లు  తప్ప,  మిగతావి సహనపరీక్ష పెట్టే  అతుకుల బొంత సీన్లే. అసలేం మ్యాటర్చూస్తున్నామో అర్ధం గానట్టు వుంటాయి. 

         
కొన్ని సిట్టింగ్స్ లో,  ప్రేమిస్తోందో లేదో తెలీని హీరోయిన్ కి హీరో తన ప్రేమ ఎలా వెల్లడించాలన్న దాని మీద హోరాహోరీ పోరాటాలు జరుగుతున్నాయి. నిజంగానే అది చాలా కష్టమైన పని పాత్రల్ని సరైన తీరులో దృష్టిలో పెట్టుకుంటే. కానీ గాథలో ఒకరు కాదు ఇద్దరు హీరోలు వచ్చేసి,  హీరోయిన్ కి తమ ప్రేమల్ని చెప్పేస్తారు కాఫీ ఇప్పించినంత ఈజీగా ఆమె మనసేమిటో తెలుసుకోకుండానే!
ఉన్నది ఒక్కటే జిందగీ’ స్క్రీన్ ప్లే సంగతులు నుంచి 

         సమాంతర సినిమాలకి కథా లక్షణాలుండవు.  కమర్షియల్ సినిమాలకి చాలా కథా లక్షణాలుంటాయని ఎందుకు తెలుసుకోరో రూపాంతరం చెందాలనుకునే సమాంతర వాసులు. దీంతో సూపర్ స్టార్ల అభిమానుల ప్రాణాల మీదికొస్తోంది సినిమాలు చూడలేక.  స్టార్లు పర్మిషనిస్తే సమాంతరం కమర్షియల్ గా రూపాంతరం చెందిపోదు.  ఎందుకంటే దర్శకులకి ఎంత తెలుసో స్టార్స్ కీ, సూపర్ స్టార్స్ కీ అంతే తెలుసు. అన్ని కథలూ కమర్షియల్ కథల్లాగే కన్పిస్తాయి, అన్ని పాత్రలూ కమర్షియల్ పాత్రల్లాగే అన్పిస్తాయి. లెక్కన కొంత కాలం పోయాక షార్ట్ ఫిలిం చూసి టీనేజర్ ని కూడా దర్శకుడిగా పెట్టుకుని కబాలీని మించిన కబాలీ, రయీస్ ని మించిన రయీస్ తీస్తారు. 

         
కమర్షియల్ గా కథయినా ఒక పాయింటు చుట్టే వుంటుంది, కమర్షియల్ గా బయోపిక్ తీసినా ఒక పాయింటు చుట్టే వుంటుంది. గౌతమీ పుత్ర శాతకర్ణిగణరాజ్యాల్ని  ఏకం చేసే పాయింటు చుట్టే వుంటుంది. ఒక పాయింటూ, దాంతో సంఘర్షణా అంటూ వుండనిది సమాంతర సినిమా కథలకే. రయీస్కథ కూడా ఇలాటిదే, సరీగ్గా చెప్పుకోవాలంటే ఇది కథ కాదు గాథ.  గాథ కమర్షియల్ జాతి కాదు, సమాంతర జాతి. 
‘రయీస్’ రివ్యూ నుంచి 

       కొన్ని ఛానెల్స్ లో అకస్మాత్తుగా అరుపులు వినిపిస్తూంటాయి.  ఏమిటా అనిచూస్తే చర్చావేదికలో కొందరు రాజకీయ నాయకుల్ని కూర్చో  బెట్టుకున్న యాంకర్ వాళ్ళ మధ్య పచ్చ గడ్డి వేస్తూంటాడు. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ వుంటారు. ఏదో యుద్ధం జరుగుతున్నట్టు  కార్యక్రమం సాగుతూంటుంది. ఇంకొన్ని ఛానెల్స్ లో యాంకర్ ముందు రాజకీయ నాయకులు బుద్ధిగా కూర్చుని ఒకరి తర్వాత ఒకరు మాత్రమే అభిప్రాయాలు వెలిబుచ్చుకుంటూ వుంటారు. ఎవరైనా అడ్డు తగిలితే ఒకరు మాట్లాడిన తర్వాతే ఇంకొకరు మాట్లాడాలని యాంకర్ కంట్రోలు చేస్తూంటాడు.  కార్యక్రమాలు చప్పగా సాగుతూంటాయి. ఆర్గ్యూ చేసుకునే ఛానల్స్ కి రేటింగ్ ఎక్కువ వుంటే, అభిప్రాయాలు చెప్పుకునే ఛానెల్స్ కి అంతగా ప్రేక్షకులు వుండరు. 

         
కథకీ-  గాథకీ తేడా ఇదే. ఛానెల్సే సాక్షి.  ఛానెల్స్ కి లాగే సినిమాలకి పనికొచ్చేది కథలే గానీ  ‘గాథలు కాదు. స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానోగాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే కమర్షియల్ సినిమాకి పనికి రాదు.  సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. 

         
దాంతో సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది.  దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది.  గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ దృశ్య మాధ్యమంగా చూడాలంటే  కథలు మాత్రమే  బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటైదాంతో మొదలయ్యే పాత్రల మధ్య సంఘర్షణ  అనేది తప్పొప్పుల – లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసిచిట్ట చివర జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో పాత్రలు సంఘర్షించకఆర్గ్యుమెంట్ ఎత్తుకోకజడ్జ్ మెంటూ  ఇవ్వక-  కేవలం ఫలానా సమస్య వల్ల  మాకిలా జరిగిచివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ మాత్రమే ఇచ్చి అవతల పారేసి తమ  దారిన తాము వెళ్ళిపోతాయి. 

          ఇంకోటి గమనిస్తే గాథకి స్ట్రక్చర్ వుండదు.  అది కథయితేనే వుంటుంది. కమర్షియల్ సినిమాకి కథ వల్ల  సమకూరే స్ట్రక్చరే ప్రాణం. గాథ అనే దానికి  బిగినింగ్ మాత్రమే వుండిఅదే సాగి సాగి   బిగినింగ్ తోనే ముగుస్తుంది. అందుకని కమర్షియల్ సినిమాలకి బిగినింగ్ ని మాత్రమే కలిగి వుండే గాథలు పనికి రావు. కథతో అలా కాదు, కథలకి బిగినింగ్ తో బాటు మిడిల్ఎండ్ లనే మూడంకాలుండి, ఆదిమధ్యంతాల సృష్టి స్థితి లయలతో విషయ విపులీకరణ చేస్తాయి.  

         
ఇంకా చెప్పుకుంటే,  గాథకి ప్లాట్ పాయింట్స్ కూడా వుండవు. కథకి వుంటాయి.  గాథకి పాత్ర ఎదుగుదలకి సంబంధించిన క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) కూడా వుండదు. ఎలా మొదలైన పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. కథకి అలాకాదు, పాత్ర ఎదుగుదలతో కూడిన క్యారక్టర్ ఆర్క్ అడుగడుగునా ఉద్విగ్నభరితంగా తయారవుతూ పోతూంటుంది.  ఇంకా గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ (కాలం- వొత్తిడి బిందు రేఖ) కూడా ఏర్పడదు. అంటే తెర మీద సినిమా నడిచే కాలం గడిచే కొద్దీ టెన్షన్ కూడా పెరగడం వుండదన్న మాట.  ఎలా మొదలయిన సినిమా అలా నేలబారు కథనంతో నడుస్తూంటుంది. కథకి అలాకాదు, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ పాలన జరగడంతో బాటు, ఉత్థాన పతనాల కథనంతో కట్టి  పడేస్తూ పోతుంది.

         
గాథలో సంఘర్షణ కూడా వుండదు, కానీ సంఘర్షణ లేని కథ వుండదు.గాథకి విలన్ కూడా వుండడు, వుంటే సరిగా వుండడు.  కథకి విలన్ ఒక కీలక కక్షి దారు. వీడు లేకపోతే మనమీద కక్ష గట్టినట్టు వుంటుంది కథ. 

         
గాథలు ఆర్ట్ సినిమాలు చూసుకునే వ్యవహారం. కథలు కమర్షియల్ సినిమాలు చూసుకోవాల్సిన వ్యాపారం (తెలుగు సినిమాలు కమర్షియల్ సినిమాల  ముసుగేసుకున్న  ఉత్త ఆర్ట్ సినిమాలే నని పదేపదే చెప్పుకున్నాం).

         
మరింకా చెప్పుకుంటే, ‘కథ’ అనే దాంట్లో విధి అనే ఎలిమెంట్ కి స్థానం లేదు. హీరో ఏదో అనుకుంటూంటే దైవం కల్పించుకుని ఇంకేదో చేసి -   తానొకటి తలిస్తే దైవమొకటి తలచును -  అన్నట్టు అమాంతం పిడుగో  పడి చావడంతో ముగియదు.  గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో  ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో  భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే వుంటుంది.  దైవిక పరిష్కారాలు - ఫాటలిజం - కమర్షియల్ సినిమా హంగు కాదుఅది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్ కావొచ్చు.. పలాయనం చిత్తగించేదే గాథల్లో  కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే అది తలరాత అన్నట్టుగాపరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి వూరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలంటూ లభిస్తూంటాయి.

         
ఇక చివరిగా, ప్రేక్షకుల విషయానికి వస్తే, గాథల్ని పాసివ్ గా చూస్తారు; అదే కథల్ని యాక్టివ్ గా చూస్తారు.

         
 పైన గాథలుగా వచ్చాయని చెప్పుకున్న  బ్రహ్మోత్సవం, కబాలీ, ఓకే బంగారం, మొగుడు, పైసా, చక్కిలిగింత, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, రాజాధిరాజా మొదలైన సినిమాలతో- జనతా గ్యారేజ్ ని కూడా కలుపుకుని,  మరొక్క సారి వీటన్నిటినీ  పరిశీలనాత్మకంగా చూసినట్లయితే- పై పేరాల్లో చెప్పుకున్న కథకుండే లక్షణాల్లో ఒక్కటీ వీటికి లేదనీ, అన్నీ  గాథకి చెప్పుకున్న లక్షణాలే తుచ తప్పకుండా వున్నాయనీ గుర్తించ వచ్చు.
జనతా గ్యారేజ్’ స్క్రీన్ ప్లే సంగతులు నుంచి

                            Story versus Tale
     A story seeks to make an argument, a tale does not. A tale describes a problem and the attempt to solve it, ultimately leading to success or failure in the attempt. In contrast, a story makes the argument that out of all the approaches that might be tried, the Main Character's approach uniquely leads to success or failure. In a success scenario, the story acts as a message promoting the approach exclusively; in the failure scenario, the story acts as a message exclusively against that specific approach. Tales are useful in showing that a particular approach is or is not a good one. Stories are useful in promoting that a particular approach is the only good one or the only bad one. As a result of these differences, tales are frequently not as complex as stories and tend to be more straightforward with fewer subplots and thematic expansions. Both tales and stories are valid and useful structures, depending upon the intent of the author to either illustrate how a problem was solved with a tale or to argue how to solve a specific kind of problem with a story.

‘డ్రమెటికా – ది న్యూ థియరీ ఆఫ్ స్టోరీ’ నుంచి


       పైవన్నీ చూశాక,  కథ - గాథ ఈ రెండిటితో చాలా గందరగోళం చేసి పడేస్తున్నారని అర్ధమైపోయే వుంటుంది. సినిమాలుగా తీస్తున్నవన్నీ కథలే అనుకుని, తీరా గాథలు తీస్తున్నామని తెలీకపోవడంతో ఈ గందరగోళం, దీని తాలూకు అందమైన అట్టర్ ఫ్లాపులు. చాలా మందికి గాథ అన్న పదమే తెలీదు. ఈ ప్రపంచంలో కథ అనే పదార్ధమొక్కటే వుంటుందనుకుంటారు. ఆ కథా లక్షణాలేమిటో కూడా తెలీవు. ఇలా కూడా అట్టర్ ఫ్లాపులు  తీస్తున్నారు. మొత్తం సీను ఇలాగే భయానకంగా ఏళ్ల కేళ్ళు  కొనసాగుతూ వస్తోంది. దీన్ని సరిదిద్దాలంటే ముందుగా ఏ బ్యానర్ కా బ్యానర్ వచ్చే కథలకి రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (‘రా’) లాంటిది ఏర్పాటుచేసుకుని,  కాకమ్మ కథల్ని కమర్షియల్ కథలుగా మార్చిపారేసే  గూఢచారుల్ని నియమించుకోవాలి. కానీ దీన్నీ అడ్డుకునే చేతులొచ్చి పడతాయి- ‘నా స్క్రిప్ట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వెవరు?’ అని రక్కినా రక్కేస్తాయి. కళా ప్రపంచమంటేనే ఇగో సెంట్రిక్. ఈ సినిమాలెలా పోతే మనకెందుకని వూరుకోవడమే. కానీ ఈ బ్లాగు నింపడానికి ఏదోవొక టాపిక్ వెతుక్కోవాలి. బ్లాగు నింపడానికే రాయడం తప్ప దేన్నో ఉద్ధరించడానికి కాదు. 

       కథంటే ఏమిటో తెలీదు, గాథంటే  ఏమిటో తెలీదు. కథ అనుకుంటూ గాథ తీసేస్తారు. సినిమాని సినిమా లాగే చూడాలన్న పనికి రాని డిఫెన్స్ ఒకటుంటుంది. ముందు కథని కథలాగా తీయవయ్యా బాబూ, కథలాగా తీయ్  – అని మొట్టికాయేసే ఆర్డినెన్స్ రావాలి. కథలు గాథలై పోతున్నాయి. చూసింది కథో గాథో అర్ధంగాని వింత స్క్రీన్ ప్లేలు కల్లు ముంతల్లా తయారవుతున్నాయి. కథో గాథో ఏదో ఒక్కటే తీయాలి. ముందు కథంటే ఏమిటో, గాథంటే ఏమిటో కనువిప్పయితే కథల్నే వాటి లక్షణాలతో తీస్తారేమో. మరి గాథలు పనికిరావా? ఖచ్చితంగా పనికిరావు. ఒకప్పుడు పనికొచ్చేవి. ఎండ్ సస్పన్స్ తో కూడిన కథలెలా ఒకప్పుడు పనికొచ్చేవో గాథలూ పనికొచ్చేవి. వాటి కాలం తీరిపోయింది. కళలు ఏవీ పర్మనెంట్ కావు. ఒకప్పటి నటనలూ సంభాషణలూ ఇప్పుడు లేవు. కాలాన్నిబట్టి మారిపోతూ వచ్చాయి. కాలం కాదని గాథలూ  ఆగిపోయాయి. గత రెండు దశాబ్దాలుగా యాక్టివ్ – పాసివ్ పాత్రల తేడాలే తెలీక, పాసివ్ పాత్రల్లో హీరోల్ని పదేపదే చూపిస్తూ తీస్తున్న కథలే అట్టర్ ఫ్లాపవుతున్నాయి, ఇక పాసివ్ పాత్రలే వుండే గాథల్నేం తీసి హిట్ చేస్తారు. 

          ఈ కథ - గాథ అనే గజిబిజి నుంచి గాథని విడదీసి చూస్తే, కమర్షియల్ సినిమాలకి గాథలూ ఒకప్పుడు ఎందుకు పనికొచ్చేవో తెలుస్తుంది. గాథంటే ఉదాత్త విలువల జీవన సౌందర్యం. ఆత్మికంగా మనుషులు విలువల్ని ప్రేమించేవారే. బయట ఈ విలువలు కానరాక అర్రులు చాచే వారే. ఈ ఆత్మిక దాహాన్ని తీర్చేవే గాథలు. అంతేగానీ ఒక కుటుంబ సినిమా అనో, ఇంకేదో మహోజ్వల చిత్రరాజమనో అర్ధంపర్ధంలేని, రుచీ పచీ లేని  కృత్రిమ అనుబంధాలు, సెంటిమెంట్లు కలిపి కుట్టి పారేస్తే గాథలైపోవు. ఆత్మిక దాహాన్ని తీర్చవు సరికదా, ఆత్మల్ని కుళ్ళబొడిచి వదుల్తాయి. 

        ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవచ్చు. విడిపోయి న్యూక్లియర్ కుటుంబాలై పోవచ్చు. వలసపోయి ఎన్నారై కుటుంబాలై పోవచ్చు. కానీ కుటుంబాలనేవి వున్నాయి. వాటి విలువలు? విలువల్ని మళ్ళీ ఉమ్మడి కుటుంబాల నుంచే నేర్చుకోవాలి. కొనసాగించాలి. ఉమ్మడి కుటుంబాలు నాటి జమీందారీలే కావొచ్చు. నేటి పారిశ్రామిక కుటుంబాలే కావొచ్చు. జిఎంఆర్ గ్రూపు అధినేత గ్రంథి మాధవరావు లండన్లో కుటుంబ రాజ్యాంగం రాయించుకొచ్చారు. కుటుంబంలో ఆ రాజ్యాంగమే అమలవుతోంది. కుటుంబాలు కులాంతర, మతాంతర వివాహాలతో సంకరం కావొచ్చు. అయినా కలిసే వుండాలి. ఆ జంటల్ని వెళ్ళ గొడితే, ప్రాణాలు తీసేస్తే కుటుంబాలు పితృ దోషం బారిని పడతాయి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడమంటే వంశంలో ప్రవహించే డీఎన్ఏ ని విచ్ఛిన్నం చేసు కోవడమే. దీని ఫలితాల్ని పిల్లలు సహా అందరూ అనుభవిస్తూ పోతారు. కుటుంబంలో విచ్ఛిన్నమైన డీఎన్ఏ తిరిగి దాని ఐక్యత కోసం తల్లడిల్లుతూ వుంటుంది. ఇదే పితృ దోషం.   ఇలా డీఎన్ఏ విచ్ఛిన్నం కాకూడదనే విలువ ఒక్కటే ఉమ్మడి కుటుంబాలకి ఆధారం. ఈ విలువ కోసం త్యాగాలే చేయాలి తప్ప తెగనరుక్కోవడం కాదు. 

          ‘పెదరాయుడు’ ఈ విలువల్ని ఎత్తి చూపే ఉదాత్త కుటుంబ గాథ. ఇదెలా గాథ అయిందో వచ్చే వ్యాసంలో చూద్దాం...

సికిందర్