రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, జనవరి 2023, బుధవారం

1287 : రివ్యూ!


  కొన్ని విజాతి జానర్లని కలిపి జానర్ బ్లెండర్ గా సినిమాలు తెలుగులో వస్తూంటాయి. అవి చాలా వరకూ క్రాఫ్టు కుదరక విఫలమవుతూ వుంటాయి. కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ అని ఒకటి రాబోతోంది. దీని గురించి చెబుతూ- కాన్సెప్ట్ తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయి, క్రైమ్ నుంచి సస్పెన్స్ నుంచి సాగే ఒక ఇంటెన్స్ డ్రామా అనుకోవచ్చు - అని పబ్లిసిటీ ఇచ్చారు. ఇలా చాంతాడంత గందరగోళంగా చెబితే సినిమా ఇంకెంత గందరగోళంగా వుంటుందో అర్ధం జేసుకోవచ్చు. నవరసాల్లో ఏది ఎందుకు మిక్స్ చేస్తున్నారో స్పష్టత లేక ఫ్లాపయిన సినిమాలున్నాయి. పూర్వం హవా అనే హిందీలో తల్లి కథగా నడుస్తున్న హార్రర్ కథనం (బీభత్స రసం) కాస్తా, ఆమె కూతురి కథగా మారిపోయి సైకో థ్రిల్లర్ గా (అద్భుత రసం) ముగుస్తుంది. ఇలా విజాతి జానర్ల కలబోత అతుకులేసినట్టు వుంటే సినిమా ఎటూ గాకుండా పోతుంది. కలబోత అంటే జానర్ల మద్య కార్యకారణ సంబంధం.
ట్రైలర్

         నేపథ్యంలో వచ్చిందే విజాతి జానర్ల స్వ- ఎ సౌండ్ ఆఫ్ సోల్ అనే హార్రర్-రోమాంటిక్ - సస్పెన్స్ థ్రిల్లర్. కొత్త వాళ్ళు చేసిన ప్రయోగం. రచన -దర్శకత్వం మను పీవీ. జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ బ్యానర్‌పై జిఎం సురేష్ నిర్మాణం. మహేష్ యడ్లపల్లి, స్వాతీ భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సిద్ధార్థ్ గొల్లపూడి నటీనటులు. సంగీతం కరణం శ్రీ రాఘవేంద్ర, ఛాయాగ్రహణం దేవేంద్ర సూరి, కూర్పు శ్రీ వర్కల.

భ్రాంతితో దిగ్భ్రాంతులు

అభిషేక్ ఒక ఆర్టిటెక్ట్. నాయనమ్మ చనిపోతే వస్తాడు. మంచం మీద వున్న చనిపోయిన నానమ్మ లేచి మంచి నీళ్ళు తాగి పడుకోవడం చూసి కలవరపతాడు. అంత్యక్రియల తర్వాత కూడా నాయనమ్మ సజీవంగానే కన్పిస్తూ వుంటే దిగ్భ్రాంతి చెందుతాడు. తనది లాజికల్ మైండ్. తనకి కన్పిస్తున్నవి నిజం కాదు, భ్రాంతి అని నమ్ముతాడు. ఈ భ్రాంతితో వుండగానే ఇంకో భ్రాంతికి లోనవుతాడు. తను ప్రేమించిన చనిపోయిన స్వప్న వచ్చి తను నిజం అంటుంది, అబద్ధమంటాడు. ఈ సంఘర్షణతో వుండగానే ఆమె చావు వెనుక రహస్యముందని అనుమానిస్తాడు. ఈ అనుమానంతో ఛేదించుకుంటూ వెళ్తూంటే వూహించని విషయాలు బయటపడుతూంటాయి. ఇదంతా నిజమా? అబద్దమా? అసలు తనకి ఏం జరుగుతోంది? దీన్నుంచి ఎలా బయటపడాలి? కొలీగ్ భాస్కర్, డాక్టర్ జయప్రకాష్, పోలీస్ ఇన్స్ పెక్టర్, మినిస్టర్...వీళ్ళందరికీ వున్న సంబంధమేమిటి? తెలుసుకుంటూంటే అభిషేక్ కి మతి పోతూంటుంది...

బలమైన కథ- బిగువైన మలుపులు

నాయనమ్మ మరణంతో హార్రర్ గా ప్రారంభమై, స్వప్న రాకతో ఫ్లాష్ బ్యాక్ లో రోమాన్స్ లోకి తిరగబెట్టి, ఆమె మరణంతో సస్పెన్స్ థ్రిల్లర్లోకి మలుపు తీసుకునే మల్టీపుల్ జానర్స్ కథ. ఈ మూడు జానర్స్ కార్యకారణ సంబంధం (కాజ్ అండ్ ఎఫెక్ట్) తో పరస్పరం కనెక్ట్ అయివుంటాయి. నాయనమ్మ మరణం అభిషేక్ సబ్ కాన్షస్స్ మైండ్ లో ట్రిగర్ పాయింట్ గా పనిచేస్తే, దీంతో చనిపోయిన స్వప్న మైండ్లోకి తిరిగొచ్చింది. తిరిగొచ్చిన స్వప్న ఆమె మరణం వెనుక రహస్యం తెలుసుకునేందుకు దారితీసింది. వీటన్నిటికీ మూలకారణం షిజోఫ్రేనియాతో బాధపడే అభిషేక్ మానసిక స్థితి. విజాతి జానర్లతో కాన్సెప్ట్ పకడ్బందీగా వుంది.    
        
దీని కథనం కామెడీలతో, ఎంటర్టైన్ మెంట్ తో పక్కదారులు పట్టకుండా జానర్స్ మర్యాదలతో సూటిగా, స్పష్టంగా వుంది. సెకండాఫ్ కథనంలో మలుపులు కావాల్సినంత సస్పెన్స్ నీ, థ్రిల్స్ నీ సృష్టిస్తాయి.
        
దర్శకుడు మనూ ప్రొఫెషనల్ గా కనిపిస్తాడు కథ విషయంలో- సెకండాఫ్ లో  లాజికల్ గా కొన్ని లోపాలున్నప్పటికీ. ముగింపు ముగిసిపోయిన కథకి పొడిగింపులా వుంటుంది. 1983 లో హిందీ ధువా లో (హాలీవుడ్ టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’- 1958 కి అనుసరణ) క్యారక్టర్లు ఒకటొకటే నిజస్వరూపాలు బయటపెట్టుకుని, ఎంతో దయామయురాలిగా కన్పించే రాజమాతని హంతకురాలిగా రివీల్ చేసే షాకింగ్ ముగింపులాంటిది వుండాల్సింది అభిషేక్ పాత్రతో. అభిషేక్ పాత్ర ఏ మానసిక సమస్యతో మొదలైందో అదే మానసిక సమస్యతో క్యారక్టర్ ఆర్క్, ట్విస్టు వంటివి లేకుండా ముగిసి పోవడం డైనమిక్స్ లేమిని సూచిస్తుంది.
        
పోతే, అభిషేక్ పాత్రలో మానసిక సంఘర్షణతో వుండే నటనని మహేష్ యడవల్లి మంచి టెంపో తో పోషించాడు. కొత్త వాడులా అన్పించడు. దాదాపు ప్రతీ సీనులో తను వుంటూ కథని బాగా క్యారీ చేశాడు. స్వప్న పాత్రలో స్వాతీ భీమిరెడ్డి సంఘర్షణ కూడా బలంగా పోషించింది. నెగెటివ్ గా కన్పించే భాస్కర్ గా యశ్వంత్ పెండ్యాల యాక్షన్ తో కథ ముందుకు సాగడానికి తోడ్పడ్డాడు. డాక్టర్ గా శ్రీనివాస్ భోగిరెడ్డి, మరో డాక్టర్ గా సిద్ధార్థ్ గొల్లపూడి డ్రామాని పకడ్బందీగా పోషించారు. ఇన్స్ పాత్రలో మాణిక్ రెడ్డి ప్రత్యేక దృష్టినాకర్షిస్తాడు.
        
సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు మొదలైన విభాగాలు నిర్వహించిన సాంకేతికులు కథతో పోటీపడ్డారు. దర్శకుడు మానూ పీవీ చిన్న సినిమాకి బలమైన కంటెంట్ ముఖ్యమని, దానికి బలమైన టాలెంట్ కూడా అవసరమని ఈ జానర్ బ్లెండర్ తో తేల్చి చెప్పాడు. దీన్ని clasc యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని ఉచితంగా చూడొచ్చు.

—సికిందర్

1286 : ప్రాంతీయ సినిమా!


 

   హిందీ ఆర్ట్ సినిమాలైనా కమర్షియల్ సినిమా ప్రేక్షకుల్ని ఆకర్షించక పోవడానికి కారణం ఒకటే కన్పిస్తుంది : అవి శిలా సదృశంగా ఒకే ధోరణిలో సీరియస్ స్వభావంతో వుంటూ,  సగటు ప్రేక్షకులకి దూరంగాప్రధాన స్రవంతిలో లేకపోవడమే. మారిన కాలానికి వుంటున్న తీరులో హిందీ ఆర్ట్ సినిమాలకిక ప్రేక్షకుల్లేరని గుర్తించిన శ్యామ్ బెనెగళ్ఒక కొత్త ఒరవడికి తెర లేపారు. 2000 నుంచి హిందీ ఆర్ట్ సినిమాలని ప్రధాన స్రవంతి బాలీవుడ్ స్టార్స్ తో తీయడం మొదలెట్టారు. దాంతో అవి ప్రధాన స్రవంతి లోకొచ్చేసికొత్త తరం ప్రేక్షకుల అండదండలతో వాణిజ్య పరంగానూ విజయాలు సాధించడం 
 మొదలెట్టాయి.
ట్రైలర్ 
        క ఇతర ప్రాంతీయ భాషల సినిమాల వైపు చూస్తే అవి ఇంకా అవే కాలం చెల్లిన ఆర్ట్ సినిమాల ధోరణుల్లోనే వుంటూప్రాంతీయంగానే ప్రేక్షకుల్లేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలతో సరిపెట్టుకో సాగాయి. ఈ సినిమా లెక్కడున్నాయో చూడడానికి వెతికి పట్టుకోవడం కూడా కష్టమే. ఈ పూర్వ రంగంలో కన్నడ నుంచి ఒక కొత్త దర్శకుడు రాంరెడ్డిప్రాంతీయ క్రాసోవర్ సినిమాలని ఎలా తీసి ప్రాంతీయ- జాతీయ- అంతర్జాతీయ ప్రేక్షకుల వరకూ అలరించ వచ్చోఅలాగే రికార్డు స్థాయిలో 20 దాకా జాతీయఅంతర్జాతీయ అవార్డులు సైతం ఎలా పొందవచ్చో తనదైన ప్రధాన స్రవంతి మోడల్ నిచ్చాడు. అది 2015 లో ‘తిథి’ రూపంలో తెర దాల్చింది.

శ్యామ్ బెనెగళ్ హిందీ ఆర్ట్ సినిమా తీరు తెన్నుల్ని మార్చి స్టార్స్ తో ఆధునీకరిస్తే
రాంరెడ్డి తిరిగి అదే పాత రోజుల్లో కెళ్లి అక్కడున్న పాతతోనేస్టార్స్ అవసరం లేకుండానే సాహసం చేశాడు. స్థానిక ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి స్టార్స్ అవసరం లేని సాహసం. ఆర్ట్ సినిమా కథల్లో ఏదైనా సమస్యని సీరియస్ గానే చర్చించనవసరం లేదనీవినోద భరితంగానూ ముచ్చటించుకో వచ్చనీ ఒక ప్రయోగం చేసి చూపించాడు. ఇలా ఇది ఆర్ట్ సినిమా కథని పూర్తి వినోదాత్మకంగా మార్చిన ఇంకో నూతన కల్పన అయింది. ఇదెలా వుందో ఓసారి చూద్దాం...

సెంచురీ గౌడ @ 101

కర్ణాటక మాండ్యా జిల్లా నోడెకొప్పలు అనే పల్లెటూరు. రైలు కట్ట వారగా వూరు. ఆ రైలు కట్ట నానుకుని మంచి ధర పలికే అయిదెకరాల మాగాణి. దాని ఆసామి బడుగు జీవికాటికి కాళ్ళు జాపుకున్ననిండు 101 సంవత్సరాల సెంచురీ గౌడ అనే బూతుల  వీరుడు. పనేం వుండదు. దారి పక్కన కూర్చునివచ్చే పోయేవాళ్ళని బండ బూతులు తిట్టడమే పని. అమ్మనా బూతులు కూడా తిడతాడు. తిట్టించుకుంటున్న వాళ్ళకి అది నిత్య కార్యక్రమమే కాబట్టిజీవితంలో విడదీయలేని భాగంగా చేసుకుని సాగి పోతూంటారు. సెంచురీ గౌడని పోలీసులు వచ్చి పట్టుకోవడానికి అవి సోషల్ మీడియాలో తిట్లు కావుసొసైటీలో లైవ్ గా తేట తేనియల తిట్లు. ఇక్కడ అందరికీ ముద్దొస్తున్నాయి.

ఇలాటి సెంచురీ గౌడకి ఒకానొక డెబ్బయి ఏళ్ళ కొడుకు గడ్డప్ప. ఇతను గడ్డాలూ మీసాలు పెరిగిపోయి నడుచుకుంటూ వెళ్ళి పోతూంటాడు. ఎక్కడికి వెళ్ళి పోతూంటాడో అతడికే తెలీదు. నడకే అతడి నినాదం. ఎక్కడో ఆగి
క్వార్టర్ బాటిల్ తీసి ఒక గుక్క లిక్కర్ పట్టిస్తాడు. ఇంకెక్కడో చెట్టు కింద కూర్చుని పులి జూదం ఆడతాడు. ఇతడికి తమ్మన్న అని కొడుకు. ఇతను తండ్రిని వెతికి పట్టుకొచ్చి అన్నం పెడతాడు. ఇతడికో కొడుకు అభి. వీడికి కావేరీ అని గొర్రెల పెంపకం అమ్మాయికి వల వేయడం పని. ఇతడికో తల్లి. ఈ మగ మేధావులకి వండి పెట్టడం ఈమె పని.

ఇలా నాల్గు తరాల నిండు కుటుంబం వూరిని సముచితంగా ఉద్ధరిస్తున్న వేళ
ఓ రోజు సెంచురీ గౌడ తిట్లతో విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి పోతాడు. పోతూ దారిలో మూత్రం పోయడానికి కూర్చుంటాడు. కూర్చుని అలా వొరిగి పోయి తనువు చాలిస్తాడు.

విషాదం అలుముకుంటుంది. అయితే పెద్ద కర్మలోగా కొన్ని వింతలు చోటు చేసుకుంటాయి. సెంచురీ గౌడ కొడుకు
మనవడుముని మనవడు ముగ్గురూ పాల్పడే వింతలు. కుటుంబంలో ఒక మరణంతో ఒక స్వేచ్ఛఇంకో స్వార్ధం మనుషుల్లో పుట్టుకు రావొచ్చు. ఒక మరణం ఒక మంచో చెడో పుట్టుకకి కారణమవుతుంది. అదే సమయంలో ఇంకో గాయాన్ని మాన్పలేని వైఫల్యం కూడా మరణానికుంటుంది. కొన్ని గాయాల్ని మరణాలు మాన్పలేవు. ఏమిటా గాయంఎవరా జీవితకాల క్షత గాత్రుడుదీని గురించే మిగతా కథ.

వూళ్ళో కనుగొన్న కథ


ఇదే నోడెకొప్పలు గ్రామంలో దర్శకుడు రాంరెడ్డి కనుగొన్న కథ ఇది. ఇది రచయిత ఎరెగౌడ స్వగ్రామం. ఒకసారి ఎరెగౌడని కలవడానికి రాంరెడ్డి వచ్చినప్పుడుఇదొక కొత్త ప్రపంచంలా అన్పించింది. గ్రామం తీరుతెన్నులుమనుషుల ధోరణి చూస్తే వెంటనే ఈ గ్రామాన్ని పాత్రగా చేసి సినిమా తీయాలన్పించింది. దీంతో జెకెస్లోవేకియా వెళ్ళి ఫ్రాగ్ ఫిలిమ్ స్కూల్లో ఏడాది పాటు దర్శకత్వంరచనల్లో శిక్షణ పొందాడు. అక్కడ పరిచయైన డొరోన్ టెంపర్ట్ ని ఛాయాగ్రాహకుడిగా నియమించకున్నాడు. ఎరెగౌడతో కలిసి కథ రాసుకుని సినిమా తీయడం మొదలెట్టాడు.

ఇది పూర్తిగా హాస్య ప్రధాన కథ. ఈ కథలో ప్రతిఫలించే అంశాలు మరణం
పేదరికంలో పుట్టే స్వార్ధందాంతో మోసంకుటుంబ సంబంధాల లేమి మొదలైన సీరియస్  విషయాలు. వీటిని నెగెటివ్ ప్రవర్తనలతో నవ్వొచ్చేట్టు చూపిస్తాడు. నవ్వించుకుంటూ వెళ్ళి వెళ్ళి చివర్లో విషాదాంతం చేస్తాడు. కఠిన వాస్తవాలతో కళ్ళు తెరిపిస్తాడు. ఇలా ఇదొక ఆధునిక హాస్య విషాదంలా వుంటుంది.
        
ఈ వాస్తవిక సినిమాలోని హాస్య కథ నిండు 101 ఏళ్ళ సెంచురీ గౌడ మరణాన్ని కూడా హాస్యం పట్టిస్తుంది. పల్లెలో భేషజాలుండవు, పచ్చి వాస్తవా లాధారంగా జీవితాలుంటాయి. ఎంత అట్టడుగు వర్గాల జీవితాలుంటే అంత నగ్నసత్యాల నాట్యముంటుంది. తమ్మన్న తండ్రి గడ్డప్పని వెతుక్కుంటూ వెళ్ళి- తాత చచ్చిపోయాడుకార్యక్రమాలున్నాయి రమ్మంటేచచ్చి పోయినవాడికి కార్యక్రమాలు తెలుస్తాయారానంటాడు గడ్డప్ప.

ఇంకోసారి నువ్వు ఇంట్లో కూర్చోక ఎందుకిలా తిరుగుతావంటే
కూర్చుని చచ్చే కన్నా తిరిగి చావడం మిన్న అంటాడు గడ్డప్ప. నిజానికి తిరుగుతున్నవి అతడి కాళ్ళు కాదుమనసులోనే ఏదో సుళ్ళు తిగుగుతోంది. ఆ పోటుకి కూర్చుని వుంటే చచ్చిపోతాడు. అందుకని ఇలా నిత్య సంచారి. మనసులో ఏమిటా పోటు అనేది సస్పెన్స్. పైకి చెప్పుకోలేడు. ఈ చీకటి కోణమే కథకి బలమైన వెన్నెముక.

లిక్కర్ తాగడం మరుపు కోసం
పులిజూదం ఆడడం మనస్సుని గెలవాలన్న ఆరాటంతో. ఒకవైపు మర్చిపోవాలనిఇంకో వైపు గెలవాలని. క్షమిస్తే మనస్సుని గెలవగలడు. కానీ తండ్రి సెంచురీ గౌడ తనతో చేసింది క్షమించరానిది. అది పైకి కూడా చెప్పుకోలేనిది>

వంద దాటిన సెంచురీ గౌడ మరణం వూళ్ళో కూడా ఎవరికీ పట్టదు. చాలా పాత సరుకని ముని మనవడు అభి కూడా పట్టించుకోడు. పెద్ద కర్మకి సరుకులు తేవడానికి వెళ్ళి ప్రేమిస్తున్న కావేరీ కనపడగానే ఆమె వెంటపడి వెళ్ళిపోతాడు. ఇటు తండ్రి తమ్మన్న కూడా పెద్ద కర్మని పట్టించుకోకుండా
వేరే అర్జెంటు పని మీద వుంటాడు. ముందు తండ్రి గడ్డప్పని ఓ మాట అడుగుతాడు- నీ అయ్య వంద దాటి బతికాడునువ్వెప్పుడు చస్తావో ఏమోఈలోగా నీ తమ్ముళ్ళు పొలం పంచమని వచ్చేస్తారుఅందుకని అయ్యనుంచి నీకొచ్చిన అయిదెకరాలు నాకు రాసేయ్- అని వెంటపడతాడు. గడ్డప్ప ఒకటే మాటంటాడు - నేను చచ్చాకేనీ కొచ్చేది అని.

సెంచురీ గౌడ చితాభస్మం సేకరించబోయి అక్కడ కెలుకుతూ- ప్రక్కటెకముకలు మిగిలేవున్నాయివీడు మామూలోడు కాదనుకుంటారు. అందుకే వూళ్ళో ప్లే బాయ్ లా వెలిగి అలాటి పన్లు చేశాడని అనుకుంటారు. ఇలా సెంచురీ గౌడ గురించి కొత్త విషయం మనకి తెలుస్తుంది. బూతుల వీరుడెందుకయ్యాడో పాత్ర అర్ధమవుతుంది.

పొలం రాయడానికి తండ్రి నిరాకరించడంతో తమ్మన్న టౌను కెళ్ళిపోయి
టింబర్ డిపో ఆసామికి పొలం బేరం పెట్టేస్తాడు. ఇరవై లక్షలకి బేరం కుదురుతుంది. ఆసామీ పత్రాలు పరిశీలించి గడ్డప్ప పేరు మీద వున్నాయే అంటేతన తండ్రి గడ్డప్ప చచ్చిపోయాడని తమ్మన్న అనేస్తాడు. అయితే డెత్ సర్టిఫికేట్ పట్రమ్మంటాడు ఆసామీ. తమ్మన్న రెవిన్యూ అధికారికి లంచమిచ్చి డెత్ సర్టిఫికేట్ సంపాదిస్తాడు. ఇక నీ తండ్రి గడ్డప్ప ఈ చుట్టుపక్కల కనిపించకూడదని రెవిన్యూ అధికారి హెచ్చరిస్తాడు.

తమ్మన్న తిరిగి వచ్చి
ఒక వడ్డీల రౌడీ రాణి దగ్గర తెగించి భారీ వడ్డీకి రెండు లక్షలు అప్పు తీసుకుంటాడు. ఆ డబ్బు గడ్డప్ప కిచ్చినీకు తిరగడం అలవాటు కదాఇక అలా ఓసారి దేశాటన చేసి ఆర్నెల్ల తర్వాత రమ్మని బస్సెక్కించి పంపించేస్తాడు. ఇక చట్టం దృష్టిలో గడ్డప్ప చచ్చిపోయాడు! తాత పెద్దకర్మ లోగా తండ్రి మాయంఅస్తమయం!      

అయితే తాత చితి దగ్గర మిగిలిన కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ జనం మధ్య గడ్డప్ప ప్రత్యక్షమై పోతాడు. బస్సెక్కించి పంపించేస్తే ఎలా వచ్చాడు
? ఎందుకొచ్చాడు? నిజం తెలిసిపోయిందా?  కొడుకు తమ్మన్నకి  పీక్కోలేని కక్కలేని పరిస్థితి!

ఇక్కడ్నించీ గడ్డప్ప అటు తండ్రే నీచుడు అనుకుంటే ఇప్పుడు కొడుకు విశ్వాస ఘాతుకానికీ మతిచలించిన వాడవుతాడు. అయినా చేతికొచ్చిన పొలం డబ్బులు పోతున్నాయన్న కసి తమ్మన్నకి... రక్తసంబంధాలు రిక్త హస్తాల్ని మిగిల్చాయన్న ఆక్రోశంతో తండ్రిని దూషించడాలు. అటు తండ్రి
ఇటు కొడుకూ  గుండెల్లో గునపాలు దింపిన వాళ్ళైపోతేగడ్డప్పకి ఏ దిక్కూ తోచని స్థితి.

చీకట్లో చలిమంటేసుకుంటున్న గడ్డప్ప క్లోజింగ్ ఇమేజితో కదిలించే విధంగా  ముగింపు. ఈ సహజ కథ కథ నడిపిన తమ్మన్నది కాదనీ
కథకి కారకుడైన మౌన బాధితుడు గడ్డప్ప దనీ చిట్ట చివర్లో తేలి గడ్డప్ప చాలా గొప్పగా కన్పిస్తాడు. పాత్ర చిత్రణంటే ఇదీ కదా అన్పించేలా. ఆ రెండు లక్షలు పట్టుకెళ్ళిన గడ్డప్ప తాగితందానా లాడెయ్యడుపరోపకారానికి వాడేస్తాడు. కాస్త కుదురుగా అతను గడిపేది గొర్రెల పెంపకం వాళ్లతోనే. ఈ గడ్డప్ప విషాదానికి హాస్యంతో ఇచ్చిన షుగర్ కోటింగే జీవం పోసింది. ఈ హాస్యం వూరికే హాస్యం కోసం అన్నట్టు లేదువివిధ ఆచారాలూప్రవర్తనా లోపాలపైన ఆలోచనాత్మక వ్యంగ్యాస్త్రాలివి.

స్థానిక పాత్రలకి స్థానికులే నటులు

  సెంచురీ గౌడగడ్డప్పతమ్మన్న పాత్రల్లో సింగ్రి గౌడచన్నే గౌడతమ్మే గౌడ వృత్తి నటులు కారు. నటన తెలీని ఆ వూరి సగటు మనుషులే. అభికావేరీ యువ పాత్రల్లో అభిషేక్పూజ సైతం స్థానికులే. ఇంకా అన్ని సహాయ పాత్రలూమిగతా అందరూ స్థానిక ప్రజలే. వీళ్ళకి 80 రోజుల పాటు శిక్షణ నిచ్చాడు దర్శకుడు. ఆ వూరి ఆత్మని అక్కడే వుంటూ రాసుకుంటూతీసుకుంటూ ఆవాహన చేసుకుని ఒక యజ్ఞంలా పూర్తి చేశాడు.         

ముఖ్య పాత్రల్లో సింగ్రి గౌడచన్నే గౌడతమ్మే గౌడ వృత్తి నటులే అన్నంత సహజ మెథడ్ యాక్టింగ్ చేసి బలమైన ముద్ర వేస్తారు. పాత్రల్ని మర్చిపోలేని విధంగా ప్రేక్షకుల మనో ఫలకాల మీద ముద్రించి వదుల్తారు. ఎక్కడా కమర్షియల్ యాక్టింగ్ వుండదు.      

ఈ తరం దర్శకుడు రాంరెడ్డిరచయిత ఎరెగౌడ జీవితం పట్ల లోతైన అవగాహన గల వాళ్ళుగా అన్పిస్తారు. హైలైట్ చేయాల్సిన ముఖ్య విషయమేమిటంటేఆర్ట్ సినిమాకి నూతన కల్పన చేస్తూ కథా నిర్మాణం వుండని పాసివ్ పాత్రల ఆర్ట్ సినిమా తీయలేదు. సగటు ప్రేక్షకుల అనుభవంలోకి కూడా ఆర్ట్ సినిమాని తీసుకొస్తూప్రధాన స్రవంతి సినిమా తరహా మూడంకాల (త్రీయాక్ట్ స్ట్రక్చర్) నిర్మాణం చేశారు. కథ స్ట్రక్చర్ లో వుందంటే పాసివ్ పాత్రలుండవు. దృశ్య మాధ్యమమైన సినిమాకి కావాల్సిందిదే. అయితే ఈ సినిమాని వివిధ దేశ భాషల్లో డబ్బింగ్ చేసి ఓటీటీలో వుంచాల్సింది. జాతీయంగాఅంతర్జాతీయంగా రికార్డు స్థాయిలో ఇరవై అవార్డులు పొందిన ఈ సృజనాత్మకత వివిధ భాషల్లోకి వెళ్ళాలి.
        
ఇంతకీ కొడుకు గడ్డప్ప పట్ల తండ్రి సెంచురీ గౌడ పాల్పడిన చెప్పుకోలేని నీచ కార్య మేమిటిఇదిక్కడ చెప్పేకన్నా నెట్ ఫ్లిక్స్ లో చూస్తేనే బావుంటుంది.

—సికిందర్