రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, అక్టోబర్ 2020, గురువారం

985 : స్క్రీన్ ప్లే సంగతులు

(కొన్ని ఇతర రాత పనుల వల్ల బ్లాగు రాత పని దాని తల రాతగా మారిపోయింది... మన్నించాలి)

        క్రైమ్ థ్రిల్లర్లు ఫ్లాష్ బ్యాక్స్ తో వుంటే ఒకే ఉద్దేశంతో వుంటాయి : దర్యాప్తు అధికారి గోల్, అంటే హత్యా రహస్యాన్ని కనుక్కునే ఉద్దేశం. దీంతో ఆ ఫ్లాష్ బ్యాక్స్ హత్యా రహస్యం తాలూకు క్లూస్ బయటపడే కథనాలతో వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ తో ఏ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు చూసినా ఇదే చట్రంలో వుంటాయి. ఫ్లాష్ బ్యాక్స్ లో బయటపడుతూ పోయే క్లూస్ తీవ్రతలో ఒకదాన్ని మించి ఒకటుంటాయి. పరస్పర విరుద్ధంగానూ వుండొచ్చు. దీంతో దర్యాప్తు క్రమంలో సస్పెన్స్, థ్రిల్ బాగా పెరుగుతాయి. ఇంతేకాదు, గతం (ఫ్లాష్ బ్యాక్స్) జోలికి పోతే దర్యాప్తు అధికారికి చావు తప్పదన్న హెచ్చరిక, దాడులు కూడా వుంటాయి. దీంతో కథకి ప్రధాన పాత్రగా దర్యాప్తు అధికారికి సంఘర్షణ, గోల్, పరిష్కారమనే అర్ధవంతమైన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది స్క్రీన్ ప్లేకి. ఇలా ఫ్లాష్ బ్యాక్స్ స్క్రీన్ ప్లేలో ప్రధాన పాత్ర ప్రయాణానికి తోడ్పడాలి. అంటే, స్క్రీన్ ప్లేలో వుండే మిడిల్ విభాగపు సంఘర్షణతో కూడిన బిజినెస్ ఆధారంగా, కథా విస్తరణకి తోడ్పడాలి. ప్రధాన పాత్ర ఈ ముఖ్యావసరాల్ని తీర్చని ఇంకేవో ఉద్దేశాలతో ఫ్లాష్ బ్యాక్స్ వుంటే, ఫ్లాష్ బ్యాక్స్ సహా పూర్తి కథా విఫలమవుంతుంది. నిశ్శబ్దం లో ఈ ఘోర తప్పిదమే జరిగింది.   


ని
శ్శబ్దం లో ప్రధాన పాత్ర అంజలి పోషించిన పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి పాత్ర. దీనికి అనూష్కా సాక్షి పాత్ర, మహాలక్ష్మి పాత్రకి ప్రతినాయకి పాత్ర. చివరికి రహస్యం విప్పితే ఆమే హత్య చేసి వుంది గనుక. 1981 హిందీ ధువా లో రాఖీ లాగా, 1989 ఖోజ్ లో రిషి కపూర్ లాగా, దీని రీమేక్ తెలుగులో పోలీస్ రిపోర్ట్ లో మోహన్ లాగా; ఇంకా బెంగాలీ, మలయాళ, తమిళంలలో హీరో పాత్రల్లాగా, తాజాగా 2019 లో మలేషియా మిస్టరీ డిలైలా లో హీరో పాత్రలాగా. ఇవన్నీ 1958 బ్రిటిష్ ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో కి అనుసరణలు. ఎండ్ సస్పెన్స్ కథలతో సినిమాలకి జరుగుతున్న నష్టాలకి ఈ బ్రిటిష్ క్రైమ్ థ్రిల్లర్ ఆనాడు పరిష్కారం చెప్పింది. ఈ కోవలో నిర్మించిన పై సినిమాలు మెప్పుపొందాయి. (మల్లాది వెంకటకృష్ణ మూర్తి మాటలు రాసిన పోలీస్ రిపోర్ట్ యూట్యూబ్ లో వుంది. ఇది చూసి ప్రేక్షకులు పెట్టిన కామెంట్లు చూడండి). ఎండ్ సస్పెన్స్ తో వచ్చే నష్టాల గురించి సందర్భం వచ్చిన్నప్పుడల్లా బ్లాగులో రాస్తూనే పోయాం. అయినా కూడా నిశ్శబ్దం లాంటివి పదేపదే వచ్చి పెద్ద శబ్దంతో ధడేలుమని ఫ్లాపవుతున్నాయి. ఇక కాకులెగిరి పోతున్న రెక్కల చప్పుడు. అభినవ హిచ్ కాకులు’. మచ్చుకి కొన్ని ఉదాహరణలు ఈ లింక్ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తూ చూడొచ్చు. 

కథా రూపం 

     నిశ్శబ్దం పూర్తి కథ వీకీపీడీయాలో అప్పుడే ఇచ్చేశారు. దాని ప్రకారమే చూద్దాం. అయితే పూర్వ కథ ఇవ్వలేదు. సినిమాలో ముందుగా చూపించిన పూర్వ కథ చూస్తే, అమెరికాలో ఒక పాడుబడ్డ విల్లాలో ఒక జంట హత్యకి గురవుతారు. ఇలాటి సంఘటనలు జరుగుతూంటాయి. పోలీసులు పరిశోధించి ఈ హత్యల్లో మానవ ప్రమేయం కన్పించక పోవడంతో, విల్లాలో ఆత్మవుందని భావించుకుని కేసులు మూసేస్తారు. ఐతే వచ్చిన వాళ్ళనల్లా చంపుతున్న ఆత్మే వుంటే, అన్నిసార్లు వెళ్తున్న పోలీసుల్ని ఎందుకు చంపడంలేదో స్పష్టత వుండదు. ఆ విల్లాలోకి ఇంకెవరూ వెళ్లకుండా సీలు కూడా చెయ్యరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 47 ఏళ్ల తర్వాత ప్రధాన కథ మొదలవుతుంది. 

ప్రధాన కథ : చెవిటి మూగ అయిన పెయింటర్ సాక్షి (అనూష్కా) మ్యూజిషియన్ ఆంథోనీ గోన్సాల్వెజ్ (మాధవన్) తో ఎంగెజిమెంటు చేసుకుని, ఆ విల్లాలో వున్న పెయింటింగు కోసం అతడితో అక్కడికి వెళ్తుంది. అక్కడ ఆంథోనీ మీద ఆత్మ దాడి చేసి చంపేస్తుంది. సాక్షి పారిపోతుంది. 

ఈ కేసుని పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) ఆమె బాస్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) చేపడతారు. అప్పటికే వీళ్ళు కొందరమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద వుంటారు. ఆంథోనీ హత్యకి సంబంధించి మహాలక్ష్మి సాక్షిని ప్రశ్నిస్తుంది. ఆమె స్టేట్ మెంట్ లో ఆమె ఫ్రెండ్ సోనాలీ కనిపించడం లేదని చెప్తుంది. తన ఎంగేజిమెంటైన రెండురోజుల తర్వాత నుంచి కనిపించడం లేదు. 

          సాక్షితో ఫ్లాష్ బ్యాక్ -1:  సాక్షి సోనాలీతో బాటు అనాధాశ్రయంలో పెరిగింది. ఒకరోజు ఒక సమాచారం వస్తే సియాటిల్ బయల్దేరుతుంది. సోనాలీ డిస్టర్బ్ అయి సాక్షి సియాటిల్లో స్థిరపడగానే తనని పిలిపించుకోవాలని మాట తీసుకుంటుంది. సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీలో చేరుతుంది సాక్షి. అక్కడ వివేక్ (సుబ్బరాజు) అనే అతను పరిచయమవుతాడు. అప్పుడు అక్కడికి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మ్యూజిషియన్ ఆంథోనీ వస్తాడు. సాక్షి వేసిన పెయింటింగ్ కి ఫిదా అయిపోయి మిలియన్ డాలర్లు ఆమె అనాథాశ్రయాని కిచ్చేస్తాడు. తన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తాడు. ప్రోగ్రామ్ అయ్యాక తనకి పెయింటింగ్ నేర్పమం
టాడు. ఆమెకి మ్యూజిక్ నేర్పుతాడు. ఇంతలో సోనాలీ వచ్చేసి సాక్షితో వుంటుంది. ఇక సాక్షీ ఆంథోనీల మధ్య స్నేహం ప్రేమగా మారి ఎంగేజిమెంటుకి దారితీస్తుంది. తర్వాత ఒక రోజు విల్లాలో వున్న జోసఫైన్ పెయింటింగు తెచ్చుకునేందుకు ఆంథోనీని తీసుకుని వెళ్తుంది సాక్షి. అక్కడ ఆత్మ ఆంథోనీని చంపేసింది.     

 ప్రధాన కథ : డిటెక్టివ్ మహాలక్ష్మి దర్యాప్తు కొనసాగిస్తూ సోనాలీ అదృశ్యం గురించి ఆరా తీయడానికి అనాధాశ్రయం వెళ్తుంది. ఆమె అదృశ్యానికీ ఆంథోనీ హత్యకీ సంబంధముందని అనుమానిస్తుంది. సాక్షి తనకే సొంతమన్నట్టుగా సోనాలీ ప్రవర్తన వుండేదని తెలుసుకుంటుంది. ఈ ప్రవర్తనతో సోనాలీ ఒకడ్ని పొడిచిన కేసులో జైలుకెళ్లింది కూడా. తిరిగివచ్చి మహాలక్ష్మి సాక్షి ఇంటికెళ్తే, అక్కడొక ముసుగువ్యక్తి ఎదురయ్యేసరికి వెంటాడి కాలుస్తుంది. తప్పించుకుంటాడు.

పోలీసులు మళ్ళీ విల్లా కెళ్ళి సోనాలీకి సంబంధించిన సాక్ష్యాధారాలకోసం శోధిస్తారు. అక్కడ టామ్ అనే పోలీసుకి ఒక తాళం చెవి దొరుకుతుంది. అది ఆంథోనీది. అది రిచర్డ్ కివ్వడాని వెళ్తాడు. అది తీసుకుని టామ్ ని చంపేస్తాడు రిచర్డ్. టామ్ శవం దగ్గర రిచర్డ్ బ్లేజర్ బటన్ని చూసి రిచర్డ్ ని అనుమానిస్తుంది మహాలక్ష్మి.

రిచర్డ్ రూమ్ లోకి రహస్యంగా వెళ్ళి అక్కడ తాళం చెవిని గమనిస్తుంది. రిచర్డ్ ని ఫాలో అయి ఆంథోనీ ఫామ్ హౌస్ కెళ్తుంది. రిచర్డ్ అక్కడ సీసీ టీవీ హార్డ్ డిస్క్ కోసం వెతికి అది లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు. 

 వివేక్ తో ఫ్లాష్ బ్యాక్ -2  : వివేక్ దృక్కోణంలోకి కథ మారుతుంది. ఆర్ట్ గ్యాలరీలో సాక్షీ వివేక్ లు స్నేహితులయ్యారు. సోనాలీ వచ్చి సాక్షితో వున్నాక సాక్షిని వివేక్ కి దూరంగా వుంచడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకు హర్టయిన వివేక్ కి సోనాలీ డిఫరెంట్ క్యారక్టరని నచ్చజెప్తుంది సాక్షి. ఈ ప్రవర్తనతో గతంలో ఆమె ఒకడిమీద చేసిన హత్యాప్రయత్నం గురించి చెప్తుంది. ఇదెలా జరిగిందో సంఘటన వివరిస్తుంది. వివేక్ సోనాలీని అర్ధం జేసుకుని దగ్గరవుతాడు. ప్రపోజ్ చేస్తాడు. ఇదయ్యాక ఆంథోనీ సాక్షికి ప్రపోజ్ చేస్తే సోనాలీఒప్పుకోదు. ఒక ప్రోగ్రాంలో అభిమానులు ఆంథోనీని చుట్టుముట్టి ముద్దుల్లో ముంచెత్తి ఫోన్ నంబర్లు ఇచ్చేసరికి అతను తిరుగు బోతని చెప్పేస్తుంది సోనాలీ. కావాలంటే రుజువు చేస్తానంటుంది. అతణ్ణి రెచ్చగొడుతూ మెసేజి పెడుతుంది. పట్టించుకోడు. తర్వాత కలుసుకోవడానికి ఒప్పుకుంటాడు. అతడితో ఫామ్ హౌస్ కెళ్తుంది. సాక్షి అనుసరిస్తుంది. వాళ్ళిద్దర్నీ గమనిస్తుంది. వాళ్ళు సన్నిహితంగా వున్నప్పుడు అతను అకస్మాత్తుగా బ్యాట్ తీసుకుని ఆమె తల మీద కొట్టి చంపేస్తాడు. రిచర్డ్ వచ్చేసి ఈ హత్యని గప్ చిప్ చేయడానికి సాయపడతాడు ఆంథోనీకి.

 సాక్షి అక్కడ్నించి పారిపోయి జరిగింది వివేక్ కి చెప్తుంది. ఇద్దరూ ఆంథోనీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. మిస్సయిన ఇతర అమ్మాయిలు ఆంథోనీ ప్రోగ్రాం జరిగినప్పుడల్లా మిస్సయ్యారని తెలుసుకుంటుంది సాక్షి. ఇక ఆంథోనీని చంపే పథకమేస్తారు సాక్షీ వివేక్ లు. పెయింటింగ్ వంకతో ఆంథోనీని పాడుబడ్డ విల్లాకి తీసికెళ్తుంది సాక్షి. అక్కడ సోనాలీ గురించి ఆంథోనీని అడగడం మొదలెడతారు సాక్షీ వివేక్ లు. 

ఆంథోనీతో ఫ్లాష్ బ్యాక్ -3 : ఆంథోనీ చెప్పడం మొదలెడతాడు. అతడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఒకరోజు భార్య పడకమీద అతణ్ణి వేరే పేరుతో పిలిచేస్తుంది. అతను అనుమానిస్తాడు. ఆమె మోసం చేస్తోందని గ్రహిస్తాడు. ఒక హోటల్ కి ఆమెని ఫాలో అయి ఆమె ప్రియుడు సహా పట్టుకుని ఇద్దర్నీచంపేస్తాడు. కెప్టెన్ రిచర్డ్ వచ్చి చూసి ఆంథోనీకి చెప్తాడు. తను కూడా తన భార్యని ఫాలో అయి ఇక్కడికి వచ్చానని, ఆమె ప్రియుడితో వేరే రూంలో వుందనీ అంటాడు. ఆంథోనీ వెళ్ళి రిచర్డ్ భార్యని కూడా చంపేస్తాడు. అప్పట్నుంచీ మోసం చేసే అమ్మాయిల్ని ఆంథోనీ చంపడం మొదలెడితే రిచర్డ్ కవర్ చేస్తూ వచ్చాడు. ఇదంతా విన్న సాక్షి ఆ విల్లాలో ఆంథోనీని చంపేస్తుంది. 

ప్రధాన కథ : సాక్షి వివేక్ లు హార్డ్ డిస్క్ ఆధారంగా రిచర్డ్ నేరాలు ఎఫ్బీఐకి చెప్పాలని ప్రయత్నిస్తూంటే రిచర్డ్ వచ్చేసి దాడి చేస్తాడు. మహాలక్ష్మి వచ్చేసి రిచర్డ్ ని చంపేసి వాళ్ళిద్దర్నీ కాపాడుతుంది. ఆంథోనీ హత్యని అంతుచిక్కని హత్యగా ప్రకటిస్తారు. సాక్షీ వివేక్ లు సోనాలీ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు. 

క్యాన్సిలైన కథ 

      పై రూపంలో వున్న కథలో స్థూలంగా కొన్ని ప్రధాన అడ్డంకులు కన్పిస్తాయి. విల్లాలో ఆత్మ చంపుతోందని గత కేసులతో తేలాక, ఆంథోనీ హత్యా దర్యాప్తుకి అవకాశమెక్కడిది? అది కూడా ఆత్మ చంపిన కేసే అవదా? ఇంకెందుకు దర్యాప్తు చేపట్టాలి? సోనాలీ చంపి వుంటుందని ఏ ఆధారాలతో మొదట అనుమానించి దర్యాప్తుకి ప్రారంభోత్సవం చేశారు. అలా దర్యాప్తు చేస్తూ పోలీసులు విల్లాలో కొస్తూంటే ఆత్మ వాళ్ళ మీద ఎందుకు దాడి చేయడం లేదు? ఆంథోనీని చంపడానికి సాక్షి అలాటి విల్లాలోకి తీసికెళ్ళే ధైర్యమెలా చేసింది? చివరికి ఆంథోనీ హత్య మరో మిస్టరీ వీడని మరణమని చెబుతూ కథ ముగించారు. అంటే ఆత్మ వున్నట్టా? ఆత్మ వుంటే, సాక్షి ఆంథోనీని చంపుతోంటే, సాక్షిని కదా ఆత్మ చంపెయ్యాలి ఆమె కుట్ర పసిగట్టి?

సాక్షీ ఆంథోనీల ప్రేమకి సోనాలీ అడ్డు. సోనాలీనలా వుంచుదాం, అసలు ఒక సెలబ్రిటీ మ్యూజీషియన్ తనకి ప్రపోజ్ చేస్తే సాక్షి ఒకసారి అతడి ప్రొఫైల్ చెక్ చేసుకోవాలిగా? అప్పుడతను పెళ్ళయిన వాడనీ, భార్య ఆత్మహత్య చేసుకుందనీ తెలుసుకుని జాగ్రత్త పడాలిగా? ఆంథోనీ కూడా భార్య మోసం చేసిందని అలాటి అమ్మాయిల్ని చంపే సైకోగా మారినప్పుడు, సాక్షిని ఎందుకు ప్రేమించి ఎంగేజిమెంట్ చేసుకున్నాడు? అతను మారాడా? మారితే తనని పరీక్షించబోయిన సోనాలీ నెందుకు చంపాడు? సవ్యమైన పాత్ర చిత్రణలు అవసరం లేదా? పైపైన రాసేసి పైపైన తీసేయడానికి మసాలా సినిమాలకి కుదిరినట్టు, ప్రేక్షకుల మేధకి పదునుపెట్టే ఇన్వెస్టిగేటివ్ సినిమాలకి కూడా కుదురుతుందా? పై అడ్డంకుల వల్ల ఎక్కడికక్కడ కథే క్యాన్సిల్ అయిపోతూంటే, ఇంకా సినిమాగా తీసే మాటెక్కడిది?

క్రమం – అపక్రమం

     పై కథ అపక్రమ (నాన్ లీనియర్) పద్ధతిలో వుంది. దీన్ని క్రమ (లీనియర్) పద్ధతి లోకి మార్చి  అసలెక్కడ మొదలై ఎలా సాగి ముగిసిందో చూద్దాం. 

సాక్షితో ఫ్లాష్ బ్యాక్ -1:  సాక్షి సోనాలీతో బాటు అనాధాశ్రయంలో పెరిగింది. ఒకరోజు ఒక సమాచారం వస్తే సియాటిల్ బయల్దేరుతుంది. సోనాలీ డిస్టర్బ్ అయి సాక్షి సియాటిల్లో స్థిరపడగానే తనని పిలిపించుకోవాలని మాట తీసుకుంటుంది. సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీలో చేరుతుంది సాక్షి. అక్కడ వివేక్ (సుబ్బరాజు) అనే అతను పరిచయమవుతాడు. అప్పుడు అక్కడికి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మ్యూజిషియన్ ఆంథోనీ వస్తాడు. సాక్షి వేసిన పెయింటింగ్ కి ఫిదా అయిపోయి మిలియన్ డాలర్లు ఆమె అనాథాశ్రయాని కిచ్చేస్తాడు. తన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తాడు. ప్రోగ్రామ్ అయ్యాక తనకి పెయింటింగ్ నేర్పమంటాడు. ఆమెకి మ్యూజిక్ నేర్పుతాడు. ఇంతలో సోనాలీ వచ్చేసి సాక్షితో వుంటుంది...దీని కొనసాగింపు ఫ్లాష్ బ్యాక్ 2 లో వుంది : 

వివేక్ తో ఫ్లాష్ బ్యాక్ -2  :  ఆర్ట్ గ్యాలరీలో సాక్షీ వివేక్ లు స్నేహితులయ్యారు. సోనాలీ వచ్చి సాక్షితో వున్నాక సాక్షిని వివేక్ కి దూరంగా వుంచడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకు హర్టయిన వివేక్ కి సోనాలీ డిఫరెంట్ క్యారక్టరని నచ్చజెప్తుంది సాక్షి. ఈ ప్రవర్తనతో గతంలో ఆమె ఒకడిమీద చేసిన హత్యాప్రయత్నం గురించి చెప్తుంది. ఇదెలా జరిగిందో సంఘటన వివరిస్తుంది. వివేక్ సోనాలీని అర్ధం జేసుకుని దగ్గరవుతాడు. ప్రపోజ్ చేస్తాడు. ఇదయ్యాక ఆంథోనీ సాక్షికి ప్రపోజ్ చేస్తే సోనాలీ ఒప్పుకోదు. ఒక ప్రోగ్రాంలో అభిమానులు ఆంథోనీని చుట్టుముట్టి ముద్దుల్లో ముంచెత్తి ఫోన్ నంబర్లు ఇచ్చేసరికి అతను తిరుగు బోతని చెప్పేస్తుంది సోనాలీ. కావాలంటే రుజువు చేస్తానంటుంది. అతణ్ణి రెచ్చగొడుతూ మెసేజి పెడుతుంది. పట్టించుకోడు. తర్వాత కలుసుకోవడానికి ఒప్పుకుంటాడు. అతడితో ఫామ్ హౌస్ కెళ్తుంది. సాక్షి అనుసరిస్తుంది. వాళ్ళిద్దర్నీ గమనిస్తుంది. వాళ్ళు సన్నిహితంగా వున్నప్పుడు అతను అకస్మాత్తుగా బ్యాట్ తీసుకుని ఆమె తల మీద కొట్టి చంపేస్తాడు. రిచర్డ్ వచ్చేసి ఈ హత్యని గప్ చిప్ చేయడానికి సాయపడతాడు ఆంథోనీకి.

సాక్షి అక్కడ్నించి పారిపోయి జరిగింది వివేక్ కి చెప్తుంది. ఇద్దరూ ఆంథోనీకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. మిస్సయిన ఇతర అమ్మాయిలు ఆంథోనీ ప్రోగ్రాం జరిగినప్పుడల్లా మిస్సయ్యారని తెలుసుకుంటుంది సాక్షి. ఇక ఆంథోనీని చంపే పథకమేస్తారు సాక్షీ వివేక్ లు. పెయింటింగ్ వంకతో ఆంథోనీని పాడుబడ్డ విల్లాకి తీసికెళ్తుంది సాక్షి. అక్కడ సోనాలీ గురించి ఆంథోనీని అడగడం మొదలెడతారు సాక్షీ వివేక్ లు.... దీని కొనసాగింపు ఫ్లాష్ బ్యాక్ 3 లో వుంది :

ఆంథోనీతో ఫ్లాష్ బ్యాక్ -3 : ఆంథోనీ చెప్పడం మొదలెడతాడు. అతడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఒకరోజు భార్య పడకమీద అతణ్ణి వేరే పేరుతో పిలిచేస్తుంది. అతను అనుమానిస్తాడు. ఆమె మోసం చేస్తోందని గ్రహిస్తాడు. ఒక హోటల్ కి ఆమెని ఫాలో అయి ఆమె ప్రియుడు సహా పట్టుకుని ఇద్దర్నీచంపేస్తాడు. కెప్టెన్ రిచర్డ్ వచ్చి చూసి ఆంథోనీకి చెప్తాడు. తను కూడా తన భార్యని ఫాలో అయి ఇక్కడికి వచ్చానని, ఆమె ప్రియుడితో వేరే రూంలో వుందనీ అంటాడు. ఆంథోనీ వెళ్ళి రిచర్డ్ భార్యని కూడా చంపేస్తాడు. అప్పట్నుంచీ మోసం చేసే అమ్మాయిల్ని ఆంథోనీ చంపడం మొదలెడితే రిచర్డ్ కవర్ చేస్తూ వచ్చాడు. ఇదంతా విన్న సాక్షి ఆ విల్లాలో ఆంథోనీని చంపేస్తుంది. 

ఇదీ ప్రధాన కథకి ముందు అసలు జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి ప్రధాన కథ ఇలా మొదలైంది :

మొదటి ప్రధాన కథ : విల్లాలో ఆంథోనీని చంపి పారిపోయిన సాక్షి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆంథోనీని దెయ్యం చంపిందని చెప్తే - పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) ఆమె బాస్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) చేపడతారు. అప్పటికే వీళ్ళు కొందరమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద వుంటారు. ఆంథోనీ హత్యకి సంబంధించి మహాలక్ష్మి సాక్షిని ప్రశ్నిస్తుంది. ఆమె స్టేట్ మెంట్ లో ఆమె ఫ్రెండ్ సోనాలీ కనిపించడం లేదని చెప్తుంది. తన ఎంగేజిమెంటైన రెండురోజుల తర్వాత నుంచి కనిపించడం లేదు... దీని కొనసాగింపు రెండో ప్రధాన కథలో వుంది :       

రెండో ప్రధాన కథ : డిటెక్టివ్ మహాలక్ష్మి దర్యాప్తు కొనసాగిస్తూ సోనాలీ అదృశ్యం గురించి ఆరా తీయడానికి అనాధాశ్రయం వెళ్తుంది. ఆమె అదృశ్యానికీ ఆంథోనీ హత్యకీ సంబంధముందని అనుమానిస్తుంది. సాక్షి తనకే సొంతమన్నట్టుగా సోనాలీ ప్రవర్తన వుండేదని తెలుసుకుంటుంది. ఈ ప్రవర్తనతో సోనాలీ ఒకడ్ని పొడిచిన కేసులో జైలుకెళ్లింది కూడా. తిరిగివచ్చి మహాలక్ష్మి సాక్షి ఇంటికెళ్తే, అక్కడొక ముసుగువ్యక్తి ఎదురయ్యేసరికి వెంటాడి కాలుస్తుంది. తప్పించుకుంటాడు

 పోలీసులు మళ్ళీ విల్లా కెళ్ళి సోనాలీకి సంబంధించిన సాక్ష్యాధారాలకోసం శోధిస్తారు. అక్కడ టామ్ అనే పోలీసుకి ఒక తాళం చెవి దొరుకుతుంది. అది ఆంథోనీది. అది రిచర్డ్ కివ్వడాని వెళ్తాడు. అది తీసుకుని టామ్ ని చంపేస్తాడు రిచర్డ్. టామ్ శవం దగ్గర రిచర్డ్ బ్లేజర్ బటన్ని చూసి రిచర్డ్ ని అనుమానిస్తుంది మహాలక్ష్మి. 

        రిచర్డ్ రూంలోకి రహస్యంగా వెళ్ళి అక్కడ తాళం చెవిని గమనిస్తుంది. రిచర్డ్ ని ఫాలో అయి ఆంథోనీ ఫామ్ హౌస్ కెళ్తుంది. రిచర్డ్ అక్కడ సీసీ టీవీ హార్డ్ డిస్క్ కోసం వెతికి అది లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు...దీని కొనసాగింపు మూడో ప్రధాన కథలో వుంది : 

మూడో ప్రధాన కథ : సాక్షి వివేక్ లు హార్డ్ డిస్క్ ఆధారంగా రిచర్డ్ నేరాలు ఎఫ్బీఐకి చెప్పాలని ప్రయత్నిస్తూంటే రిచర్డ్ వచ్చేసి దాడి చేస్తాడు. మహాలక్ష్మి వచ్చేసి రిచర్డ్ ని చంపేసి వాళ్ళిద్దర్నీ కాపాడుతుంది. ఆంథోనీ హత్యని అంతుచిక్కని హత్యగా ప్రకటిస్తారు. సాక్షీ వివేక్ లు సోనాలీ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు.

ఇలా వుంది  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్

   ప్రధాన కథతోనే  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వుంటుంది. పై ఫ్లాష్ బ్యాకులన్నీ ప్రధాన కథకి  ఉపోద్ఘాతాలే తప్ప ప్రధాన కథ కాదు. ఫ్లాష్ బ్యాకులు (డ్రీమ్ టైమ్) ఎప్పుడూ ప్రధాన కథ (రియల్ టైమ్) కావు. మూడుగా వున్న ప్రధాన కథని చూస్తే, 
      మొదటి ప్రధాన కథలో : విల్లాలో ఆంథోనీని చంపి పారిపోయిన సాక్షి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆంథోనీని దెయ్యం చంపిందని చెప్తే - పోలీస్ డిటెక్టివ్ మహాలక్ష్మి (అంజలి) ఆమె బాస్ రిచర్డ్ డాకిన్స్ (మైకేల్ మాడ్సెన్) చేపడతారు. అప్పటికే వీళ్ళు కొందరమ్మాయిల మిస్సింగ్ కేసుల మీద వుంటారు. ఆంథోనీ హత్యకి సంబంధించి మహాలక్ష్మి సాక్షిని ప్రశ్నిస్తుంది. ఆమె స్టేట్ మెంట్ లో ఆమె ఫ్రెండ్ సోనాలీ కనిపించడం లేదని చెప్తుంది. తన ఎంగేజిమెంటైన రెండురోజుల తర్వాత నుంచి కనిపించడం లేదు...అనేదంతా బిగినింగ్
, అంటే సమస్యా విభాగం. 

రెండో ప్రధాన కథలో : డిటెక్టివ్ మహాలక్ష్మి దర్యాప్తు కొనసాగిస్తూ సోనాలీ అదృశ్యం గురించి ఆరా తీయడానికి అనాధాశ్రయం వెళ్తుంది. ఆమె అదృశ్యానికీ ఆంథోనీ హత్యకీ సంబంధముందని అనుమానిస్తుంది. సాక్షి తనకే సొంతమన్నట్టుగా సోనాలీ ప్రవర్తన వుండేదని తెలుసుకుంటుంది. ఈ ప్రవర్తనతో సోనాలీ ఒకడ్ని పొడిచిన కేసులో జైలుకెళ్లింది కూడా. తిరిగివచ్చి మహాలక్ష్మి సాక్షి ఇంటికెళ్తే, అక్కడొక ముసుగువ్యక్తి ఎదురయ్యేసరికి వెంటాడి కాలుస్తుంది. తప్పించుకుంటాడు. 

పోలీసులు మళ్ళీ విల్లా కెళ్ళి సోనాలీకి సంబంధించిన సాక్ష్యాధారాలకోసం శోధిస్తారు. అక్కడ టామ్ అనే పోలీసుకి ఒక తాళం చెవి దొరుకుతుంది. అది ఆంథోనీది. అది రిచర్డ్ కివ్వడాని వెళ్తాడు. అది తీసుకుని టామ్ ని చంపేస్తాడు రిచర్డ్. టామ్ శవం దగ్గర రిచర్డ్ బ్లేజర్ బటన్ని చూసి రిచర్డ్ ని అనుమానిస్తుంది మహాలక్ష్మి. 

రిచర్డ్ రూంలోకి రహస్యంగా వెళ్ళి అక్కడ తాళం చెవిని గమనిస్తుంది. రిచర్డ్ ని ఫాలో అయి ఆంథోనీ ఫామ్ హౌస్ కెళ్తుంది. రిచర్డ్ అక్కడ సీసీ టీవీ హార్డ్ డిస్క్ కోసం వెతికి అది లేకపోవడంతో కోపంతో వెళ్ళిపోతాడు...అనేదంతా మిడిల్, అంటే సంఘర్షణా విభాగం.

మూడో ప్రధాన కథలో :  సాక్షి వివేక్ లు హార్డ్ డిస్క్ ఆధారంగా రిచర్డ్ నేరాలు ఎఫ్బీఐకి చెప్పాలని ప్రయత్నిస్తూంటే రిచర్డ్ వచ్చేసి దాడి చేస్తాడు. మహాలక్ష్మి వచ్చేసి రిచర్డ్ ని చంపేసి వాళ్ళిద్దర్నీ కాపాడుతుంది. ఆంథోనీ హత్యని అంతుచిక్కని హత్యగా ప్రకటిస్తారు. సాక్షీ వివేక్ లు సోనాలీ సమాధి దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు... అనేదంతా ఎండ్, అంటే పరిష్కార విభాగం. 

ఫ్లాష్ బ్యాకుల పాత్ర

    పై మూడు బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాల్లో ఫ్లాష్ బ్యాకులెలా పాత్ర వహించాయో చూద్దాం. బిగినింగ్ విభాగంలో మహాలక్ష్మి దర్యాప్తు చేపట్టిన ఫలితంగా (కాజ్ అండ్ ఎఫెక్ట్) సాక్షితో ఫ్లాష్ బ్యాక్ -1 లో :  సాక్షి సోనాలీతో బాటు అనాధాశ్రయంలో పెరిగింది. ఒకరోజు ఒక సమాచారం వస్తే సియాటిల్ బయల్దేరుతుంది. సోనాలీ డిస్టర్బ్ అయి సాక్షి సియాటిల్లో స్థిరపడగానే తనని పిలిపించుకోవాలని మాట తీసుకుంటుంది. సియాటిల్లో ఆర్ట్ గ్యాలరీలో చేరుతుంది సాక్షి. అక్కడ వివేక్ (సుబ్బరాజు) అనే అతను పరిచయమవుతాడు. అప్పుడు అక్కడికి ఆర్ట్ ఎగ్జిబిషన్ని ప్రారంభించడానికి మ్యూజిషియన్ ఆంథోనీ వస్తాడు. సాక్షి వేసిన పెయింటింగ్ కి ఫిదా అయిపోయి మిలియన్ డాలర్లు ఆమె అనాథాశ్రయాని కిచ్చేస్తాడు. తన మ్యూజికల్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తాడు. ప్రోగ్రామ్ అయ్యాక తనకి పెయింటింగ్ నేర్పమంటాడు. ఆమెకి మ్యూజిక్ నేర్పుతాడు. ఇంతలో సోనాలీ వచ్చేసి సాక్షితో వుంటుంది...అనే  సమాచారం మహా లక్ష్మికి దొరికింది.

ఇప్పుడు ఆమె మిడిల్ విభాగంతో ఏ ఫ్లాష్ బ్యాక్ కనెక్ట్ అయింది? ఏదీ కాలేదు. వివేక్ తో రెండవ ఫ్లాష్ బ్యాక్ ఆమె సంఘర్షణలో భాగంగా (కాజ్ అండ్ ఎఫెక్ట్) ప్రారంభం కాలేదు. స్క్రీన్ ప్లే తెగి, ఆమె పాయింటాఫ్ వ్యూ నుంచి వివేక్ పాయింటాఫ్ వ్యూకి వేరే ముక్కగా ఫ్లాష్ బ్యాక్ 2 ప్రారంభమయ్యింది. దీంతో మిడిల్ విభాగంలో ఆమెకుండాల్సిన సంఘర్షణ కాస్తా గల్లంతై పోయింది. 

మహా లక్ష్మి ఎండ్ విభాగంలో ఆమెకే బయటపడాల్సిన ఆంథోనీతో మూడో ఫ్లాష్ బ్యాక్ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ తో లేకుండా, ఆమెతో సంబంధం లేకుండా, ఆంథోనీ పాయింటాఫ్ వ్యూలో, సాక్షీ వివేక్ లకి చెప్పే ఫ్లాష్ బ్యాకుగా జొరబడిపోయింది. 

ఈ రెండు ఫ్లాష్ బ్యాకులూ స్ట్రక్చర్ని చెడగొట్టి స్క్రీన్ ప్లేని స్క్రీన్ ప్లే కాకుండా చేశాయి. ఫలితంగా ప్రధాన పాత్రగా, కథానాయికగా, మహాలక్ష్మి కుండాల్సిన కి త్రీయాక్ట్ స్ట్రక్చర్ బలం గుల్లయింది. కేసు తేల్చే దృక్పథంతో వుండాల్సిన ఆమెకి ఒక గోల్ అంటూ లేకుండా పోయింది. 

మరేం చెయ్యాలి?

      ప్రతినాయక పాత్ర లేకపోతే ప్రధాన పాత్రకి గోల్ వుండదు. కథంటేనే నాయక- ప్రతినాయక పాత్రల మధ్య సంఘర్షణ. ఈ కథలో ఆంథోనీని చంపిన సాక్షియే ప్రతినాయిక. కానీ కథలో ప్రతినాయిక పాత్రని గుర్తించక, ఫీలవ్వక, ఏదో తోచినట్టూ రాసుకుంటూ పోయాడు కథకుడు. ఫలితంగా తాడూ బొంగరం లేని కథానాయిక అయింది మహాలక్ష్మి. సిడ్ ఫీల్డ్ మాటల్లో చెప్పాలంటే - the character seems to disappear off  the page’

        ప్రతినాయిక సాక్షి. అంటే అనూష్కా కేంద్ర బిందువుగా వుండాల్సిన నేర కథ. అనూష్కా- వర్సెస్ అంజలి ఇద్దరు హీరోయిన్ల డైనమిక్స్ తో థ్రిల్లర్ వుంటే ఎంత జనరంజకంగా వుంటుంది. మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయించుకుని ఈ కథ ఏమైనా చేశారా?

అనూష్కా పాత్ర ఆటోమేటిగ్గా పైన చెప్పుకున్న ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో చట్రంలో ఒదిగిపోతుంది. పైనే చెప్పుకున్న ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో కి అదే కథతో రీమేకులు. కానీ నిశ్శబ్దం కథ వేరు. ఇందులో అనూష్కా పాత్ర మాత్రమే ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో లో పాత్రకున్న, షేడ్ తో వుంటుంది. అందులో ఆ పాత్ర చుట్టూ అల్లిన కథ వేరు, నిశ్శబ్దం కథ వేరుగా వుంటుంది. ఎక్కడా పోలిక రాదు, కాపీ అని ఎవరూ అనలేరు. 

        హిందీ రీమేక్ ధువా లో రాజమాతగా అప్పటి హీరోయిన్ రాఖీ చేసిన హత్య తాలూకు గుట్టు విప్పే ఘట్టం చివర్లో ఒక క్లాసిక్ చిత్రణ. ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఉన్నట్టుండి నెగెటివ్ గా బండారం బయటపడుతుంది. మిథున్ చక్రవర్తి, అంజాద్ ఖాన్ తదితర సీబీఐ బృందం అండర్ కవర్ ఆపరేషన్ కి అద్భుత, వెంట్రుకలు నిక్కబొడుచుకునే పరాకాష్ట!

సికిందర్