రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

మోసగాళ్ళకు మోసగాడు ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
మోసగాళ్ళకు మోసగాడు ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

24, జూన్ 2015, బుధవారం

కథా? గాథా?


రచన, దర్శకత్వం: ఆర్‌. చంద్రు
తారాగణం: సుధీర్‌బాబు, నందిత, చైతన్య కృష్ణ, పోసాని కృష్ణమురళి, గిరిబాబు,
 పవిత్ర, రఘుబాబు, సప్తగిరి తదితరులు
సంగీతం: హరి, కూర్పు: రమేష్‌ కొల్లూరి, ఛాయాగ్రహణం: కె.ఎస్‌. చంద్రశేఖర్‌
బ్యానర్‌: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌, నిర్మాతలు: శిరీష-శ్రీధర్‌
విడుదల : జూన్‌ 19, 2015
*
All drama is conflict; without conflict there is no character; without character there is no action; without action there is no story. And without story there is no screenplay
 
Syd Field

ట్రెండ్ సెట్టింగ్ ప్రేమకథ లొస్తాయన్న ఆశ ప్రేక్షకుల కెలాగూ లేదు, కనీసం ట్రెండ్ లో వున్న ప్రేమకథలైనా చూడాలని ఆశపడడ్డం కూడా అత్యాశే అయిపోతే నష్టం ప్రేక్షకులకి కాదు- అలాటి తెలుగు ప్రేమ సినిమాలకే! ప్రేమ సినిమాలకి థియేటర్లు ఓపెనింగ్స్ కూడా లేక వెలవెలబోతూ,  రోమాంటిక్ థ్రిల్లర్లూ, హార్రర్ కామెడీలూ వస్తే హౌస్ ఫుల్సూ నడుస్తున్న ప్రస్తుత ట్రెండ్ లో ఇంకా  పసలేని ప్రేమ సినిమాలు – అందునా కనీసం రోమాంటిక్ కామెడీ కూడా కాని విషాద ప్రేమకథలకి మార్కెట్ ఉంటుందా?

          ఎందుకు ప్రేమసినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి? వీటిని చూసే నేటి యువప్రేక్షకులు  ప్రేమల విషయంలో చాలా ముందున్నారు. సినిమాల్లో చూపిస్తున్న ప్రేమల్లాగా మడిగట్టుకు లేరు. వాళ్ళ దృష్టిలో సినిమాల్లో చూపిస్తున్నది తమ తరం సమస్యలతో కూడిన ప్రేమలు కావు, వెనకటి తరం మూస ఫార్ములా ప్రేమల దగ్గరే సినిమాలు ఆగిపోయాయి. స్టార్ సినిమాలు ఎంత పాత మూసగా వున్నా ఉన్మాదంతో ఊగిపోయి హిట్ చేయగలరు గానీ, అదే మూసగా ప్రేమ సినిమాలోస్తే భరించే స్థితిలో లేరు నేటి యువ ప్రేక్షకులు. ప్రేమ సినిమాల విషయానికొచ్చేసరికి వాటిని తమతో పర్సనల్ గా పోల్చి చూసుకుంటున్నారు. తమ psyche తో కనెక్ట్ కాని పాత మూస ప్రేమలన్నిటినీ తిప్పికొడుతున్నారు. ఇలా టార్గెట్ ఆడియెన్స్ తో కనెక్ట్ కోల్పోయామని కూడా తెలుసుకోకుండా దర్శకులు పనిగట్టుకుని కాలం తీరిన ప్రేమల్నే, ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో చూపించి నట్టుగా కాలం కాటేసిన విషాదంతపు ప్రేమల్ని సైతం తీసుకుంటూ పోతున్నారు. వాళ్ళ మార్కెట్ స్పృహకి హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ మధ్యే ‘వారధి’ అనే వొక విషాద ప్రేమ సినిమా ఫలితాలు ఎలావున్నాయో చూశాక, మళ్ళీ ఇంకో ట్రాజిక్ లవ్ స్టోరీతో  ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ అంటూ వచ్చేసింది. కొసమెరుపేమిటంటే, ఇలాటి ప్రేమ కథతో ఇది కృష్ణమ్మ పరువే తీసింది! తాను ఏం చెప్తున్నాడో తనకే తెలీకుండా ఈ ప్రేమకి కృష్ణమ్మ పరువు తీసే ముగింపునే ఇచ్చాడన్నమాట ఈ దర్శకుడు! 

          ఇది దశాబ్దాలు గడుస్తున్నా కొలిక్కి రాని కృష్ణ అనే ప్రేమికుడి బాధామయ ప్రేమగాధ. ‘గాథ’ అని అనడమెందుకంటే, ఇది ‘కథ’ కాదు కాబట్టి. ‘కథ’కీ- ‘గాథ’ కీ తేడాల గురించీ, గాథలు సినిమాలకి ఎందుకు పనికిరావో మర్మం గురించీ, గత కొన్ని ఇలాటి సినిమాల రివ్యూల్లోనే  చెప్పుకున్నాం. మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతం ఈ గాథే మిటో చూద్దాం!

రాధాకృష్ణులు వీళ్ళు!  
       వూళ్ళో చదువుకంటే పశువులు తోలుకోవడమే బెటర్ అనుకునే కృష్ణ (సుధీర్ బాబు)  అనే పిల్లాడికి ఏడో క్లాసు తప్పినా స్ట్రెంత్ లేదని ఎనిమిదో క్లాసులో పడేస్తే కొత్తగా వచ్చి జాయి నవుతుంది రాధ ( నందిత) అనే పిల్ల. ఈమెని చూసి వెంటనే ఎట్రాక్ట్ అయిపోయి, ఈమె మెప్పుకోసం బాగా చదువుకుంటూ ప్రతిగా ఆమె ప్రేమని ఆశిస్తాడు, కానీ తానుగా  చెప్పుకోలేడు. ఆ స్కూల్లో ప్రేమ ఇంటర్మీడియేట్ కి చేరినా ఇదే పరిస్థితి. అప్పుడొక ప్రేమలేఖ రాస్తే ఆమె తల్లి ( ప్రగతి) చేతిలోపడి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తుంది. ప్రిన్సిపాల్ ( పోసాని) కృష్ణనీ, రాధనీ విడివిడిగా విచారిస్తాడు. రాధ తనకి చనిపోయిన తండ్రి ప్రేమ తప్ప మరో ప్రేమ తెలీదనీ, తనకు తల్లే సర్వస్వమనీ  చెప్పేస్తుంది ప్రిన్సిపాల్ కి. ఇది విన్న కృష్ణ డీలా పడిపోతాడు.

          ఎంసెట్ పాసయి ఇంజనీరింగ్ లో చేరతాడు. ఆ నగరంలోనే వేరే కాలేజీలో బీకాం చదువుతున్న రాధ మళ్ళీ తారస పడుతుంది. అతణ్ణి ఫ్రెండ్ లాగానే చూస్తుంది. ఇంజనీరింగ్ పాసయి జాబ్ లో కూడా చేరాక కృష్ణకి అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది. అప్పుడు వూళ్ళో రాధని ని కలవడానికి వెళ్తే,  ఆమె తల్లి చెప్తుంది : భర్త పెన్షన్ మీద ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తను రాధ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాననీ, పెళ్లి పేరుతో ఆమెని తననుంచి విడదీస్తే చిన్నకూతురుతో బాటు ఆత్మహత్య చేసుకుంటాననీ బెదిరిస్తుంది.  చేసేది లేక అమెరికా వెళ్ళిపోతాడు కృష్ణ. 

          చాలా ఏళ్ళు గడిచిపోయాక, వూళ్ళో అప్పట్లో  కృష్ణతో కలిసి స్కూల్లో చదువుకుని మానే సిన కొందరు డ్రాపౌట్స్ తమ పూర్వ విద్యార్థుల్ని  కలుసుకోవాలని ఒక కార్యక్రమం పెట్టుకుంటారు. అప్పుడు కృష్ణ అమెరికా నుంచి వస్తాడు. ఈ సారైనా రాధని పొందగలనా, ఎక్కడుందామె, పెళ్లయిపోయిందా-  అన్న సందేహాలతో.

          తీరా వచ్చి  ఆమెని వెతుక్కుంటూ వెళ్లి చూస్తే, కాలు పోగొట్టుకుని వికలాంగురాలిలా వుంటుంది. (
spoiler alert ఇక్కడ అప్రస్తుతం, ఈ తరహా గాథ ముగింపు వెల్లడించకుండా స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడం సాధ్యం కాదు కాబట్టి)

          ఇదీ విషయం. ఈ ఏకపక్ష ప్రేమలో ఎవరెలా చేశారో ఈ కింద  చూద్దాం. 

సాత్విక విషాదాలు!
          హీరోగా సుధీర్ బాబు పూర్తిగా రాముడు మంచి బాలుడు లాంటి పాసివ్ పాత్ర పోషించడంతో, అందుకు తగ్గట్టుగానే సాత్వికంగానే వుంది నటన. ‘మోసగాళ్ళకు మోసగాడు’ కంటే నటనలో బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. కానీ తన ప్రతిభని బయట పెట్టుకోవాలంటే ఇలాంటి బాక్సాఫీసు వ్యతిరేక పాసివ్ పాత్రలు పోషించడం కాదు. ముందు వచ్చే ఆఫర్స్ లో పాసివ్ పాత్రలుంటే వాటిని పసిగట్టి తిప్పికొట్టే నైపుణ్యం సంపాదించుకోవాలి. ప్రేమకథల్లో నటించాలనుకుంటే అవి ట్రెండీగా ఉండేట్టు చూసుకోవాలి. కనీసం గత దశాబ్దంన్నర  కాలంగా వెండితెర మీద ఏ తెలుగు హీరో కూడా పాత్రపరంగా భోరుమని ఏడ్చే సన్నివేశాలతో ఇబ్బంది పెట్టలేదు. అలాటిది తను ఎందుకు ఏడుస్తున్నాడో తెలీకుండా ఒక సన్నివేశంలో కుళ్ళి- కుళ్ళి- కుళ్ళి- కరువుదీరా  ఏడ్వడం వల్ల ప్రయోజనమేమిటో తెలుసుకోవాలి. ఈరోజుల్లో తను శోక రసంలో కూడా మేటి అన్పించుకుంటే వొరిగేదేమిటి? 

          సుధీర్ బాబుదే పాసివ్/ సాత్విక  పాత్ర అనుకుంటే, హీరోయిన్ నందితది మరీ విషాదంతో కూడిన పాసివ్ పాత్ర!  పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూడ్డం తప్ప ఈమె చేసిందేమీ లేదు. మాటలు కూడా అప్పుడప్పుడు మాత్రమే. ఈమె నుంచి ప్రేక్షకులాశించే రోమాంటిక్ ఎలిమెంట్ ఏ కోశానా కన్పించకుండా చాలా చాలా జాగ్రత్త తీసుకున్నాడు కన్నడ నేటివిటీ దర్శకుడు! 

          పాటలు ఎక్కువైపోయాయి. ఛాయాగ్రహణం లో పెద్దగా ప్రత్యేకత లేదు. సినిమా నిడివి కూడా ఎక్కువే.

స్క్రీన్ ప్లే సంగతులు
       రెండు లోపాలు  ఈ ప్రేమ సినిమాని బలహీన పర్చాయి- మొదటిది ట్రెండ్ లో లేని ప్రేమ, రెండోది ఆ ప్రేమని కూడా ఒక కథలా గాక గాథగా చెప్పడం!
తెలుగు సినిమాలకి పాసివ్ పాత్రలు, ఎండ్ సస్పెన్స్ కథనాలు మాత్రమే శాపాలనుకున్నాం- ఇప్పుడు కథలు గాక గాథ లు చెప్పడంతో ఇంకో శాపం కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు!
          ఎప్పుడో పూర్వకాలంలో బాగా ప్రూవైన ఈ బాపతు ‘ప్రేమ త్రెడ్’ ఇప్పుడూ వర్కౌట్ అవుతుందనుకున్నారో ఏమో, ఇప్పటి ట్రెండ్ ని పట్టించుకోలేదు. ఈ  త్రెడ్ కూడా ఓ గాథ లాగా వుందని కూడా గమనించినట్టు లేదు. ‘గాథ’ అనేది ఒక స్టేట్ మెంట్ మాత్రమే. నేనిలా అనుకుంటే నాకిలా జరిగి ఇలా ముగిసింది - అని విధికి తలవంచిన పాత్ర పరాజితుడిగా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇలాకాక ‘కథ’ అనేది ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. నేనకున్న లక్ష్యాన్ని ఫలానా ఈఈ శక్తులతో ఈ విధంగా సంఘర్షించి సాధించుకున్నాను- అని పాత్ర విజేతగా ప్రకటిస్తుంది.

          ‘కథ’ అనే దాంట్లో విధి అనే ఎలిమెంట్ తో  పనుండదు. హీరో ఏదో అనుకుంటూంటే దైవం కల్పించికుని ఇంకేదో చేసి- - తానొకటి తలిస్తే దైవమొకటి తలచును -  అన్నట్టు అమాంతం పిడుగు పడి చావడంతో ముగియదు. గాథ ల్లోనే ఇలాటి మౌఢ్యాలుంటాయి. ఇలాకాక కథల్లో  ప్రత్యక్షంగా అడ్డు పడే ప్రత్యర్ధులతో  భౌతికంగానో మానసికంగానో పోరాడి సాధించుకోవడమే వుంటుంది.  

          “
 స్క్రీన్ ప్లే ద్వారా ఒక విషయం చెప్పదల్చుకుంటే కథ (story) గానో, గాథ (tale) గానో ఏదో ఒకరకంగా చెప్పవచ్చని ఇదివరకు ఒక సినిమా రివ్యూలో చెప్పుకున్నాం. కాకపోతే గాథగా చెప్తే సినిమాకి పనికి రాదు. సినిమాకి కథే వుండాలి. ఎందుకంటే కథలో ఆర్గ్యుమెంట్ వుంటుంది. దాంతో సంఘర్షణ పుడుతుంది.  గాథలో స్టేట్ మెంట్ మాత్రమే వుంటుంది. దీంతో సంఘర్షణ పుట్టదు. సంఘర్షణ  లేని స్క్రీన్ ప్లే చప్పగా వుంటుంది. గాథలు చదువుకోవడానికి నీతి కథలుగా బావుంటాయి. కానీ దృశ్యపరంగా చూసేందుకు కథలు మాత్రమే  బావుంటాయి. కథలో ఒక సమస్య ఏర్పాటై,  దాంతో మొదలయ్యే సంఘర్షణ తప్పొప్పుల – లేదా న్యాయాన్యాయాల ఆర్గ్యుమెంట్ కి దారి తీసి, చిట్ట చివర ఓ జడ్జ్ మెంట్ నిస్తుంది. గాథ లో సమస్య వున్నా దాంతో సంఘర్షించక, ఆర్గ్యుమెంట్ ఎత్తుకోక, జడ్జ్ మెంట్ ఇవ్వక- కేవలం ఈ ఫలానా సమస్య వల్ల  మాకిలా జరిగి, చివరికి మేమిలా తయారయ్యా మయ్యోచ్ అనేసి స్టేట్ మెంట్ ఇవతల పారేసి తన దారిన తను దులుపుకుని వెళ్ళిపోతుంది”

          ఇదీ మణిరత్నం తీసిన ‘ఓకే బంగారం’  స్క్రీన్ ప్లేసంగతుల్లో చెప్పుకున్న విషయం. ఇలా సరీగ్గా ‘ఓకే బంగారం’ లాంటి గాథ చట్రంలోనే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ కూడా ఇరుక్కుంది. ఈ రివ్యూ మొట్టమొదట్లో పైన పేర్కొన్న సిడ్ ఫీల్డ్  కొటేషన్ ప్రకారం చూస్తే, దీన్నొక స్క్రీన్ ప్లే అనుకోవడం ఎలా అనేదే ప్రశ్న! గాథ తో మణిరత్నం ఆల్రెడీ చేసిన తప్పునే మళ్ళీ చేయాలా! 

         సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ తో ఈ గాథ చెప్పుకొచ్చారు. పూర్వ విద్యార్ధుల సమావేశ ప్రతిపాదన, దాంతో అమెరికా నుంచి హీరో తరలివస్తూ రాధగురించి జ్ఞాపకాల్లో వెళ్ళడమనే దృశ్యాలతో ఈ  ‘గాథ’  ని ఎత్తుకున్నారు. దాన్నక్కడ ఆపి - ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించారు. ఈ ఫ్లాష్ బ్యాక్ అన్ని పరిమితుల్నీఅతిక్రమించి క్లైమాక్స్ దాకా సాగింది. ఎత్తుకున్న గాథ( అమెరికానుంచి వస్తున్న హీరోకి హీరోయిన్ తో ఏం జరుగుతుందన్న ప్రధాన గాథ)  క్లయిమాక్స్ దాకా ఆగిపోయింది.  ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ ప్రధాన గాథ అవదు.  ప్రధాన గాథకి సందర్భవశాత్తూ అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే ఫ్లాష్ బ్యాక్ అని ఇదివరకు చెప్పుకున్నాం.

          అయితే ఇంత సుదీర్ఘ మైన ఫ్లాష్ బ్యాక్ ఓ ‘కథ’ లో ఉపయోగపడినట్టుగా ఏ  ‘గాథ’లోనూ  ఉపయోగపడదు. కథల్లో  3-1-2 అనే నాన్ లీనియర్ పద్ధతిలో ఉపయోగపడుతుంది. అంటే ఎండ్- బిగినింగ్- మిడిల్ అన్న వరసలో. చిరంజీవినటించిన ‘ఖైదీ’ సుదీర్ఘ ఫ్లాష్ బ్యాక్ కథనమే వుంటుంది. అది క్లైమాక్స్ తో ప్రారంభమై, అసలేం జరిగిందో చెప్పడానికి బిగినింగ్ ని ఎత్తుకుని, మిడిల్ లో ఆ బిగినింగ్ తాలూకు సంఘర్షణ సృష్టించుకుని, తిరిగి క్లయిమాక్స్ కొచ్చి,  ఆ సంఘర్షణని పరిష్కరించుకుంటుంది. ఇది ‘కథ’ కాబట్టి ఫ్లాష్ బ్యాక్ లో సమస్య- సంఘర్షణ వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ముగిశాక పరిష్కారం వుంటుంది. 

          ఇదే ఫ్లాష్ బ్యాక్ ‘గాథ’ లో వుంటే అది కేవలం సమాచారాన్ని అందించే వనరుగా మాత్రమే  పనిచేస్తుంది తప్ప, ఓ సమస్యా దానితో సంఘర్షణా ఆసక్తికర కథనం వుండదు. ఈ సినిమాలో చూపినట్టు కేవలం అనుభవాల పేర్పు మాత్రంగానే వుంటుంది. ఎన్ని అనుభవాలని చూస్తాం! 


          అందుకని ఈ సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ అంతా అసలు కొసరు ‘గాథ’ కి కేవలం ఉపోద్ఘతంలాగా ఉండిపోయింది. కనుక కథల్లో  పనికొచ్చినట్టుగా ఫ్లాష్ బ్యాక్ ( నాన్ లీనియర్ ) కథనం గాథల్లో  పనికి రాదనీ అర్ధం జేసుకోవాలి.   

          ఉంటే ప్రేక్షకుల ఆసక్తి ప్రధాన గాథ మీదే ఉండొచ్చు తప్ప ఫ్లాష్ బ్యాక్ మీద కాదు. ప్రధాన గాథ ని ఎంత ఎక్కువ సేపు ఆపితే అంత ఆసక్తి ఆవిరైపోతుంది. 

     ఇలావుండగా, ఇది గాథ అవడంతో దీనికో స్ట్రక్చర్ కూడా లేకుండా పోయింది. స్ట్రక్చర్ సమస్య వున్నప్పుడు, దాంతో సంఘర్షణ వున్నప్పుడూ మాత్రమే  వుంటుంది. పైన చెప్పుకున్నట్టు ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ప్రధాన గాథ కి  అవసరమైన సమాచారాన్ని అందించే వనరు మాత్రమే  కావడం వల్ల, సహజంగానే ఇందులో  సంఘర్షణ అనేది కూడా లేకుండా పోయింది. గాథల్లో  ఫ్లాష్ బ్యాక్ పెడితే  దాంట్లో ఎప్పుడూ సంఘర్షణ అనేది వుండదు, ఇది గుర్తు పెట్టుకోవాలి. ‘సమస్య ( బిగినింగ్) – సంఘర్షణ (మిడిల్) – పరిష్కారం (ఎండ్)’  అనే త్రిలోకాలు కథలకి  మాత్రమే దఖలు పడిన కథాంగాలు. గాథల్లో, వాటి ఫ్లాష్ బ్యాకుల్లో సెర్చి లైట్ వేసి గాలించినా ఇవి కన్పించవు. 

          కనుక ఈ విధంగానే కేవలం హీరో వివిధ దశల ప్రేమ సమాచారాన్ని మాత్రమే  ఇస్తూ క్లయిమాక్స్ దాకా సాగింది ఫ్లాష్ బ్యాక్! ఒక గాథని  చెప్పడానికి ఇన్నేసి గంటల సమాచారం అవసరమా! సమాచారమే ( ఫ్లాష్ బ్యాకే) ఇంత తినేస్తే  ఇక మొదట్లో ఎత్తుకున్న ప్రధాన గాథ కి ఏం సమయం మిగులుతుంది? 

          ఈ సినిమాలో ప్రధాన  గాథ ఎలా మిగిలిందంటే, రాథని చూడ్డానికి అమెరికానుంచి వచ్చిన వాడు, చివర్లో ఎప్పుడో  చూశాడు- కలుసుకుని సుఖాంతం - పోనీ దుఃఖాంతం చేసుకున్నాడు! అమెరికానుంచి రావడానికీ, చివర్లో ఎప్పుడో  కలుసుకోవడానికీ మధ్య అంతా తన ఫ్లాష్ బ్యాక్ వేసుకుని కాలక్షేపం చేశాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ లో దమ్ములేదు, పిసరంత మిగిలిన ప్రథాన గాథ లోనూ దమ్ములేనట్టే. 

          ఈ గాథలో కూడా సమస్య పుట్టడానికి తావిచ్చిన ఘట్టాలు లేకపోలేదు, అవి రెండున్నాయి- ఫస్టాఫ్ లో ఒకటి, సెకండాఫ్ లో ఇంకోటి. ఫస్టాఫ్ లో హీరో ప్రేమ లేఖతో ప్రిన్సిపాల్  సీన్లో హీరోయిన్ తనకి హీరో మీద ప్రేమ లేదన్నట్టు పరోక్షంగా చెప్పినప్పుడు హీరోకి సమస్య పుట్టినట్టే.  అయితే ఇది గాథ గాబట్టి,  సరేలెమ్మని ఈ సమస్య తాలూకు బాధని దిగమింగుకుని వెళ్ళిపోయాడు. ఇదే కథ అయ్యుంటే ఈ సమస్యని సాధించడానికి పాటుపడేవాడు. సంఘర్షణ మొదలయ్యేది. 

          దీనితర్వాత సెకండాఫ్ లో- హీరోయిన్ తల్లి- నా కూతురితో పెళ్ళన్నావంటే ఉరేసుకు చస్తానని బెదిరించినప్పుడూ హీరో చక్కగా ‘గాథ’ లక్షణాలకి న్యాయం చేస్తూ సరేలెమ్మని ఈ సారి అమెరికాకే వెళ్ళిపోయాడు. ఇదే కథ అయ్యుంటే, ఆ తల్లికీ ఆమె చిన్న కూతురి భవిష్యత్తుకీ తగిన హామీ ఇచ్చి ఒప్పించుకునే వాడు!

          పలాయనం చిత్తగించేదే గాథ ల్లో కన్పించే పాసివ్ పాత్ర. గాథల్లో పాసివ్ పాత్రలు అతి పెద్ద ఫాటలిస్టులు. సమస్య వస్తే అది తలరాత అన్నట్టుగా, పరిష్కారం విధి చేతుల్లో పెట్టేసి ఊరుకుంటాయి. వీటికి దైవిక పరిష్కారాలు లభిస్తూంటాయి.

          దైవిక పరిష్కారాలు - ఫాటలిజం - కమర్షియల్ సినిమా హంగు కాదు, అది గాథల్ని చక్కగా చెప్పే ఆర్ట్ సినిమా ఎండింగ్ కావొచ్చు.

పాత్రోచితానుచితాలు 
       ఇలాటి గాథల్లో పాత్రచిత్రణల గురించి చెప్పుకోవడానికి ఏమీ వుండదు. ఎందుకంటే, ఇవి గాథల్లో వుండే లక్షణాలతోనే  తుచా తప్పకుండా ప్రవర్తిస్తాయి. కథల్లో ఇలాటి పాసివ్ పాత్రలుంటే చెప్పుకోవడానికి చాలావుంటుంది. కనుక ఈ గాథలో గాథ లక్షణాల్ని ప్రస్ఫుటం జేస్తూ,  హీరో ఎప్పుడూ పాసివ్ గానే, కార్య విహీనుడిగానే ఉంటాడు. ప్రేమకోసం కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు గానీ, కాలుకదిపి ఓ చిన్న ప్రయత్నం చెయ్యడు. తను చదువుకుని, పెద్ద ఉద్యోగంలో చేరడానికి కాసేపు ఉపాధ్యాయులు కారణమనీ, మరికాసేపు అబ్దుల్ కలాం ఆజాద్ అనీ, ఇంకాస్సేపు హీరోయిన్ స్ఫూర్తి నిచ్చిందనీ, ఆ పూర్వ విద్యార్థుల మీటింగ్ లో ఒకే ఉపన్యాసంలో పరస్పర విరుద్ధంగా కూడా మాట్లాడతాడు.

          హీరోయిన్ కీ తుచా తప్పకుండా ఓ దృక్పథం లేదు. కాసేపు సీఏ చదువుతానని చెప్పి, బీకాం లో చేరుతుంది, మళ్ళీ సీఏ చేస్తున్నానని అంటుంది. పైగా వయసుకి మించిన హూందా తనంతో వుంటుంది. ఆత్మరక్షణ కోసం ప్రకృతి స్త్రీకి ఓ సహజాతాన్ని ( ఇన్ స్టింక్ట్) ఏర్పాటుచేసింది. దాంతో తనతో మెలుగుతున్న ఓ మగాడు ఏంటో ఇట్టే పసిగట్టేయగలదు. అప్పడా  మగాణ్ణి బట్టి జాగ్రత్తపడాలో, ప్రొసీడవచ్చో చర్య తీసుకోగలదు. కానీ ఇక్కడ ఏళ్ల తరబడీ తనతోపాటు చదువుతూ సన్నిహితంగా మెలుగుతున్న, ప్రేమని వెల్లడించలేని అర్భకుణ్ణి  చదవలేని ఆడతనం-  పోనీ జడత్వం ఈమెది! పెద్దపెద్ద కళ్ళేసుకుని చూడ్డం తప్ప ఆ కళ్ళయినా చెప్పే భాషేమీ వుండదు. తండ్రి ప్రేమ తప్ప మరో ప్రేమే  తెలియదట, తల్లే సర్వస్వ మట. మరి ఈ సినిమాలో ఎందుకున్నట్టు. సినిమాల్లో హీరోయిన్ వుండేది ఇందుకేనా? 

          చివరికి తల్లి యాక్సిడెంట్ లో చనిపోయి, అదే యాక్సిడెంట్లో  తను కాలూ పోగొట్టుకుని ( దర్శకుడి ఈజీ సొల్యూషన్ –ఈ దైవిక ఘటన! ) కడు దయనీయంగా దర్శన మిచ్చింది వచ్చిన హీరోకి! 

          అక్కడి కృష్ణా నదిలో బండ రాయిమీద ఏది రాస్తే అదే జరుగుతుందని అక్కడి వాళ్ళ నమ్మకమని ముందెప్పుడో చెప్పిస్తాడు దర్శకుడు. అప్పుడు ఆ బండ రాయిమీద ఆమెకి తెలియకుండా ఐ లవ్యూ అని రాస్తాడు హీరో. చిట్టచివర్లో ఆ వూరొచ్చినప్పుడు ఆమెకూడా రాసిన అక్షరాలూ చూస్తాడు హీరో. ఇంకేముంది...లవ్ సక్సెస్, అక్కడ ఏం రాస్తే అది నిజమౌతుందన్న మాట నిజమవుతోందని మనం సంతోషిస్తూండగానే- అవిటిదానిగా హీరోయిన్ దర్శనం! 

          వావ్, కృష్ణమ్మ ఇంత ఘోరంగా కలిపిందా!

సికిందర్ 



22, డిసెంబర్ 2015, మంగళవారం

స్మాల్ సెన్స్!






ప్రతి ఏడాదీ సగటున యాభై 
మంది కొత్త దర్శకులు తెలుగులో పరిచయ మవుతున్నారు.  మొత్తం తెలుగు సినిమాల్లో సగం సినిమాలు వీళ్ళే తీస్తున్నారు. ఆ సగానికి సగమూ అపజయాల పాల్జేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కొత్త సంవత్సరంలో ఇంకో యాభై మంది కొత్తగా వస్తున్నారు. వాళ్ళూ ఓ యాభై ఫ్లాపులిచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్లి పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఓ రెండు శాతమే వుంటుంది. అలా వచ్చి రెండో సినిమా కూడా ఫ్లాపే ఇస్తున్నారు. 2014 లో 70 మంది కొత్త దర్శకులు వచ్చారు. 64 ఫ్లాపులిచ్చారు. 2015 లో కొత్త దర్శకుల సంఖ్య 48 కి తగ్గింది.  వీళ్ళు 39 ఫ్లాపులిచ్చారు. అసలు ఎవరు వీళ్ళంతా,  వీళ్ళతో సినిమాలు తీస్తున్న నిర్మాత లెవరనీ చూస్తే,  నిర్మాతలు కొత్త వాళ్ళు, దర్శకులు కొత్త వాళ్ళే.  ఎన్నాళ్ళ నుంచో స్ట్రగుల్ చేస్తూ ఓ అవకాశం పొందిన వాళ్ళు. కొందరైతే సినిమాలు  తీయడంలో ఏ అనుభవమూ లేకుండానే కొత్త నిర్మాతల్ని పట్టేస్తున్న వాళ్ళు.

అగ్ర నిర్మాతలు తీసే భారీ సినిమాలూ,  పది కోట్ల లోపు సినిమాలు తీసే ఇతర నిర్మాతలూ  మొత్తం  కలిపి తీసేవి ప్రతీ సంవత్సరం ఇరవైకి మించవు. మిగతా లో- బడ్జెట్ చిన్నాచితకా సినిమాలే భారీ సంఖ్యలో  వుంటాయి. ఒక విధంగా ఇవి తీసే కొత్త నిర్మాతలు అంతా పోగొట్టుకుని టెక్నీషియన్లనీ, కార్మికుల్నీ  పోషిస్తున్నట్టే. కానీ థియేటర్లలో క్యాంటీన్ వాళ్ళనీ, పార్కింగ్ వాళ్ళనీ కలెక్షన్లు  లేక తెగ ఏడ్పిస్తూంటారు. ప్రొడక్షన్ రంగంలో అందరికీ కామెడీగా వుంటే, ప్రదర్శనా  రంగంలో అందరికీ ఈ సినిమాలతో ట్రాజెడీయే. పల్లీలమ్ముకునే వాడుకూడా బతకలేడు. ఇదంతా  ఛోటా నిర్మాతల గ్రేట్ టాలీవుడ్ షో గా ప్రతీ సంవత్సరమూ రన్  అవుతూంటుంది సగర్వంగా. ఈ ఛోటా నిర్మాతలకి కావలసినంత  ‘కీ’ ఇచ్చి వదిలేది కొత్త కొత్త దర్శకులు. దీని తర్వాత ఈ నిర్మాతలూ వుండరు, కొత్త దర్శకులూ వుండరు. ఈ వెళ్ళిపోయినా యాభై మంది కొత్త దర్శకుల, కొత్త నిర్మాతల స్థానాన్ని భర్తీ చేస్తూ, ఇంకో యాభై మంది కొత్త నిర్మాతలూ దర్శకులూ వచ్చేసి, ఆ ఏడాదికి ఫ్లాపుల కాష్టాన్ని ఆరకుండా మండించడం మొదలెడతారు. ది షో మస్ట్ గో ఆన్- అన్నట్టు రావణ కాష్టం మండుతూనే వుంటుంది. ఎప్పటికపుడు ఓ యాభై – అరవై చెత్త చెత్త సినిమాలు భస్మీపటలం అవుతూనే  వుంటాయి.



 వీళ్ళు తీస్తున్న  సినిమా లేమిటీ  అని చూస్తే మాత్రం,  నూటికి తొంభై శాతం చెత్త ప్రేమ సినిమాలే. ఒకటీ అరా హార్రరో మరోటో వుంటాయి. ఇవన్నీ  మళ్ళీ ముక్కూ మొహం తెలీని ఆ ఒక్క సినిమాతో ఖతం అయిపోయే కొత్త కొత్త హీరో హీరోయిన్లతోనే  తీస్తారు. ఆ కథలూ బావుండవు, హీరో హీరోయిన్లూ నటించలేరు, దర్శకుడూ సరీగ్గా తీయలేడు.  అర్ధం పర్ధం లేని ప్రేమలు, వాటికి చాలా ఇమ్మెచ్యూర్డ్ కథనాలు, ఇంకా మాటాడితే అవే  మూస ఫార్ములా షోకులూ... ఇవే ఈ నయా దర్శకుల పాలిట యమ పాశా లైపోతున్నాయి.    

        ‘నువ్వు నేను ఒకటవుదాం’ అని ఒక కొత్త దర్శకుడు తీస్తాడు. ఇంకో కొత్త దర్శకుడు ‘గాయకుడు’ అని తీస్తాడు. మరొకతను వచ్చేసి  ‘ భం భోలే నాథ్’ అంటూ ఏదో తీస్తాడు. వీళ్ళ ఉద్దేశంలో ఇలాటి సినిమాలన్నీ చూడాల్సింది యువ ప్రేక్షకులే. కానీ ముక్కూ మొహం తెలీని కొత్త కొత్త  హీరో హీరోయిన్లని యువ ప్రేక్షకులు అసలే కేర్ చెయ్యరని వీళ్ళకి తెలీదు. థియేటర్ వైపు కూడా తొంగి చూడరని తెలుసుకోరు. ఇక ఇవి తీసే కొత్త దర్శకుణ్ణి  ఏ యువ ప్రేక్షకులూ అసలే పట్టించుకోరనీ గ్రహించరు. ఇక తయారైన ఇలాటి సినిమాల్ని ఏ బయ్యరూ కొనడు. మళ్ళీ నిర్మాతలే డబ్బులు పెట్టుకుని విడుదల చేసుకోవాలి. విడుదల చేస్తే ఓపెనింగ్సే వుండవు. డబ్బుల్లేక పోతే విడుదలే కావు. 

        ఇక్కడ కొత్త దర్శకులకి అర్ధం కాని ఇంకో సంగతేమిటంటే, కొత్త కొత్త హీరో హీరోయిన్లని ఏ అగ్ర దర్శకుడో లేదా ఏ ప్రముఖ బ్యానరో  పరిచయం చేస్తే తప్ప యువ ప్రేక్షకుల్లో సినిమాకి గ్లామర్ రాదనేది. ఒకప్పుడు యువప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు తేజా,  ఎవర్ని పెట్టి సినిమా తీసినా యువ ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఇప్పుడు తేజ క్రేజ్ తగ్గిపోయాక, ఆయన కొత్త వాళ్ళని పెట్టి ఎంత గట్టిగా సినిమా తీసినా ఆయన్నీ, ఆయన ప్రెజెంట్ చేస్తున్న కొత్త హీరో హీరోయిన్లనీ కనీసం కన్నెత్తి చూడడం లేదు యువ ప్రేక్షకులు.  ఇదే కొత్త దర్శకుల విషయంలోనూ జరుగుతోంది. నువ్వే  కొత్తయి నప్పుడు నువ్వు పెట్టే కొత్త మొహాలెవరికి అవసరం? రెండోది
,  యువ ప్రేక్షకులు గ్లామరస్ గా వుండే బిగ్ ఈవెంట్ నే కోరుకుంటారు. ఫీల్డులో పేరున్న కుటుంబాల నుంచి ఏ  కొత్త హీరో వస్తున్నా ఒక గ్లామర్ తో, ఒక సెలెబ్రేషన్ తో మొదట్నించీ దృష్టి పెడతారు యువ ప్రేక్షకులు. వాళ్ళ సినిమాలకి ఓపెనింగ్స్ ఇస్తారు. బావుంటే హిట్ కూడా చేస్తారు.




అంతే  గానీ ఒక కొత్త నిర్మాత ఎవరో వచ్చేసి,  నా కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తానని అంటే,  నీ కొడుకెవరు? మెగా స్టార్ వారసుడా? రామానాయుడు మనవడా? అసలు నువ్వెవరు? నీ కొడుకుతో సినిమా తీస్తే ఎవరు విడుదల చేస్తారు? ఎవరు చూస్తారు? ..అనే ఈ ప్రశ్న లేవీ వీళ్ళ మీద పనిచెయ్యవు. ఇలాటి బాపతు వ్యక్తులు కూడా ఈ  మధ్య ఎక్కువైపోయారు. వీళ్ళని చూసి స్వాభిమానం వున్న కొత్త దర్శకులు పారిపోవడమో, వచ్చిన  అవకాశమే గొప్పనుకున్న వాళ్ళు అలాగే పెట్టి ఆ సినిమా చుట్టి పారేసి తప్పించుకోవడమో  చేస్తున్నారు.

ఈ సంవత్సరం  కొత్తగా వచ్చిన దర్శకుల్లో  కిషోర్ కుమార్ ( గోపాల గోపాల), అనిల్ రావిపూడి ( పటాస్), క్రాంతి మాధవ్ ( మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), నాగ్ అశ్విన్ ( ఎవడే సుబ్రహ్మణ్యం), రాధాకృష్ణ కుమార్ (జిల్).. ఈ ఆరుగురు మాత్రమే సక్సెస్ అవగల్గారు. ( డిసెంబర్ 25 న విడుదల కానున్న ‘భలే మంచి రోజు’ తో మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య రిజల్ట్  ఇంకా తేలాల్సి వుంది). ఈ కొత్త దర్శకులందరూ స్టార్స్ తో తీసి సక్సెస్ అయిన వాళ్ళే. అలాగే బాలకృష్ణ తో ‘లయన్’ తీసినప్పటికీ సత్య దేవ్ అనే కొత్త దర్శకుడు రాణించలేక పోయాడు. సుధీర్ తో ‘మోసగాళ్ళకు మోసగాడు’ తీసిన ఏఎన్ బోస్, నారా రోహిత్ తో ‘అసుర’ తీసిన కృష్ణ విజయ్, సుమంత్ అశ్విన్ తో ‘కొలంబస్’ తీసిన సామల ఆర్, కోనవెంకట్ నీడన నిఖిల్ తో ‘ శంకరాభరణం’ తీసిన ఉదయ్ లాంటి కొత్త దర్శకులు ఫ్లాప్ అయితే, సుకుమార్ పంచన ‘కుమారి 21 ఎఫ్’  తీసిన సూర్య ప్రతాప్ హిట్టయ్యాడు. 

ఇక గతంలో కొత్త దర్శకుడుగా ‘రిషి’ అనే ఫ్లాప్ తీసిన రాజ్ మాదిరాజు, మళ్ళీ తిరిగి వచ్చి ఈ సంవత్సరం ‘ఆంధ్రాపోరి’ తీసి రెండో సారి కూడా చతికిలబడ్డాడు. కొత్త దర్శకుడుగా ‘రారా స్వామీ’ అనే న్యూవేవ్ సూపర్ హిట్ తీసి ప్రామిజింగ్ గా కన్పించిన సుధీర్ వర్మ, నాగచైతన్యతో ‘ దోచేయ్’ అనే పాత మూసకి పాల్పడి మోసపోయాడు. ఇంకో కొత్త దర్శకుడు రాజ కిరణ్ తిరిగి రెండో సినిమాతో వచ్చాడు. ఈయన ‘గీతాంజలి’ తో సక్సెస్ అయి, రెండో సినిమా ‘త్రిపుర’ తో ఫ్లాపయ్యాడు.



కొత్త దర్శకులందరికీ పెద్ద అవకాశాలు రావు. ఓ చిన్న బడ్జెట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ఫోన్ కాల్స్ రావచ్చు. కానీ ఈ ప్రూవ్ చేసుకునే ఆలోచన ఎంతమంది కొత్త దర్శకులు చేస్తున్నారు. అలాటి ఉన్నతమైన ఆలోచనలు చేస్తే ఏటా యాభై అరవై చిన్న సినిమాల్ని గంగలో ఎందుకు కలుపుతున్నారు. వాటి మొత్తం విలువ ఎన్ని వందల కోట్లు వుంటుంది? వందలాది  కోట్లతో ఏం చూసుకుని ఆటలాడుతున్నారు? పోనీ ఓ ‘కంచె’ లాంటి  భిన్న ప్రయోగం చేసీ చేయరాక, హిందీ లో ఓ ‘తిత్లీ’ లాంటి రియలిస్టిక్ ఫిక్షన్ లాంటిది ప్రయత్నించీ చేతులెత్తేసి, ఈ వందలాది  కోట్ల రూపాయల్నీ  ముంచేస్తున్నారా?  ఇలా చేస్తే ఆ మునిగినా కొత్త దర్శకుడికీ, కొత్త నిర్మాతకీ మంచి పేరైనా వస్తుంది- సోదిలోకి రాని చెత్త ప్రేమకథలే  తీస్తూ కూర్చుంటే  పేరూ డబ్బులూ రెండూ పోతాయి కదా?

గడ్డి పోచ దొరకనట్టు ప్రవాహంలో కొట్టుకు పోవడం కాదు, గడ్డి పోచని కనిపెట్టడం తెలుసుకోవాలి. దాన్ని పట్టుకుని విజయవంతంగా ఒడ్డున పడడం నేర్చుకోవాలి. కొరియన్ సినిమాల కట్ అండ్ పేస్ట్ కృత్రిమ పనులు పనికి రావు, సమాజాన్ని తెలుసుకోవాలి. సమాజంలోకి చూపు సారించినప్పుడు, యూత్ అసలేం కోరుకుంటున్నారో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే యూత్ తో కనెక్ట్ అవగల్గి, బలమైన కథాకథనాల్ని సృష్టించగల్గుతారు. కోటి రూపాయలతో తీసిన సిన్మా సొంత క్రియేటివిటీ తో కళకళ లాడితే థియేటర్లు కిటకిట లాడతాయి. ఈ పనికి మనస్కరించని మందబుద్ధులైన కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలూ రంగం నుంచి తప్పుకోవాలి. ఏటేటా ఇంత ట్రాష్ తో టాలీవుడ్ సుగంధాల్ని మాత్రం వెదజల్లడం లేదు. 

-సికిందర్


6, అక్టోబర్ 2019, ఆదివారం

879 :


        వారం బాక్సాఫీసుకి ఇంకో స్టార్ మూవీ బలైంది. బాక్సాఫీసు లౌక్యం  లేక 'చాణక్య' బాక్సాఫీస్ రేసు మొదటి పావు గంకే ఓటమి గంట మోగించింది. కొన్ని సినిమాల జాతకం మొదటి పావు గంట సీన్లలోనే తెలిసిపోతుంది. అంటే స్క్రిప్టులో మొదటి పదిహేను పేజీల్లోనే దాని వెండితెర మర్యాద తెలిసి పోతుందన్నమాట. అలాటిది గంటో గంటన్నరో వింటున్నా కూడా గోపీచంద్ కి ఇంకేవో అద్భుతాలు కన్పించాయంటే అది యాక్షన్ సీన్లతో వలపు వల. హైటెక్ యాక్షన్ సీన్లు మెప్పిస్తే ఇంకే ‘విషయ’ మయినా ఓకే అన్పించడమే. కానీ ‘విషయం’ బాక్సాఫీసు ఫ్రెండ్లీగా, మార్కెట్ ఓరియెంటెడ్ గా లేక, కేవలం యాక్షన్ సీన్లే పెట్టుబడి అనుకుంటే, స్టార్ ఇమేజి పూర్ గా మారుతుంది, మార్కెటింగ్ రేటింగ్ పడిపోతుంది.

         
తెలుగు మార్కు కంటెంట్ ని నాలుగు భాషల్లో తీసి పాన్ ఇండియా మూవీ అనేకన్నా, పాన్ ఇండియా కంటెంట్ ని రెండు భాషల్లో తీసినప్పుడే తెలుగు మీసం తిప్పాలి. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లతో యాక్షన్ సీన్లు తీసి ఇంటర్నేషనల్ రేంజి ఇచ్చామని చెప్పుకునే కన్నా, ఇండియన్ స్టంట్ మాస్టర్లతో ఆ ప్రయత్నం చేసి హాలీవుడ్ రేంజి ఇచ్చామని చెప్పుకోవాలి. బయటివాడే వచ్చి చేసిపోతే అది మన అంతర్జాతీయ స్థాయి ఎలా అవుతుంది.

          పాత రోజులెలా వుండేవో ఈ ఆదివారం సాయంత్రం హోరున దంచుతున్నవర్షానికి వెచ్చ వెచ్చగా తల్చుకుందాం...ఆయన హీరో కృష్ణ, ఇంకో ఆయన కవి / రచయిత ఆరుద్ర, మరింకో ఆయన యాక్షన్ సినిమాల దర్శకుడు కెఎస్ఆర్ దాస్. ఈ ముగ్గురూ కలిస్తే 1971 లో  పంచ రంగుల కౌబాయ్ ‘'మోసగాళ్ళకు మోసగాడు’ ట్రెండ్ సెట్టర్ అయింది - టెక్నికల్ గా, కంటెంట్ పరంగా. టెక్నికల్ గా కెమరామాన్ వీఎస్సార్ స్వామి లెజెండ్. ఆఫ్ కోర్స్, కంటెంట్ హాలీవుడ్ స్ఫూర్తే.  ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’, ‘మెకన్నాస్ గోల్డ్’ ల వంటి హాలీవుడ్స్ స్ఫూర్తేగానీ, ఒక్క కాపీ సీను లేదు. ఒక్క కాపీ యాక్షన్ సీను - షాటు లేవు. బయటి నటీనటులు లేరు, సాంకేతిక నిపుణులూ లేరు. అంతా తిప్పరా మీసం తెలుగుదనమంటూ అప్పుడే గ్లోబల్ మూవీ ఇచ్చేశారు కృష్ణ -  ఆరుద్ర - దాస్ త్రయం. ఇక తెలుగులో సూపర్ డూపర్ టాపర్ హిట్టయి, పాన్ ఇండియా కాదు- ఏకంగా ఇండియా దాటి 125 దేశాల్లో ఇంగ్లీష్ డబ్బింగ్ మోత మోగించింది. ఎవ్వడూ ఇది మా నుంచి కాపీ అనలేదు. తెలుగు మీసానికి వందనం చేశారు. ఇప్పుడు తెలుగో కాదో అర్ధంగాని వేషం తప్ప మీసం లేదు.    

         
రాయడం మానేయడం కూడా రైటింగ్ ప్రణాళికలో భాగమవుతుందా? అంటే కొంత కాలం రాయడానికి ప్రయత్నించి, ఇక రాయలేమని అన్పిస్తే మానెయ్యాలని ముందే అనుకుని రాసే పనిలోకి దిగాలా? రాయడానికి ఆత్మ స్థైర్యం అత్యవసరం. ఇంకొకరిలా రాయాలని ప్రయత్నిస్తే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. కాబట్టి ‘ఇంకొకరిలా’ అనే ఆలోచన వుండకూడదు. అందుకని ‘రాయడం మానేయడం’ అనే క్లాజు ఈ సందర్భంలో రైటింగ్ ప్రణాళికలో వుండకూడదు. కాలం మారితే, మారిన  కాలానికి తగ్గట్టుగా రాయలేకపోతే అప్పుడు కొంత తగ్గ వచ్చు. ఈ క్లాజు మాత్రం రైటింగ్ ప్రణాళికలో పెట్టుకోవచ్చు. ఐతే ఈ క్లాజుని కూడా వర్కౌట్ చేస్తూండాలి. ఒకసారి రాయడం వచ్చేశాక, ఇక మనకి ఫర్వాలేదని అనుకోకుండా అప్డేట్ అవుతూంటేనే ఉనికిలో వుంటారు. అయినా ముఖం పాతబడి కొత్త ముఖాల్ని కోరుకునే తర్వాతి తరం ప్రేక్షకులతోనో / పాఠకులతోనో గ్యాప్ వస్తుంది. అయినా రాయడానికి మాధ్యమాలు విస్తరించాయి. విస్తరిస్తున్నకొద్దీ రాసే వాళ్ళ కొరత పెరుగుతోంది. కాబట్టి రాయడం నుంచి రిటైర్మెంటు లేదు. రైటర్ అన్నాక ఏ సమయంలోనూ బ్రేక్ వుండదు. విహార యాత్ర కెళ్ళినా రాసే ఆలోచనలే సుళ్ళు తిరుగుతూంటాయి.
సికిందర్

3, అక్టోబర్ 2018, బుధవారం

692 : స్క్రీన్ ప్లే సంగతులు


          తెలుగు సినిమా మలిస్వర్ణ యుగంలో పాతాళభైరవి తర్వాత దొంగరాముడు పుణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బోధనాంశంగా స్థానం సంపాదించుకుంది. సినిమా విడుదలై అరవై యేళ్ళు దాటింది. ఈ అరవై ఏళ్ళ కాలంలో సినిమా ధోరణులు ఆరు సార్లు మారుతూ వచ్చాయి. పదేళ్లకో ధోరణి (ట్రెండ్) మారిపోతూ వుంటుంది. తొలిస్వర్ణ యుగమైనా (1931-51), మలిస్వర్ణ యుగమైనా (1951- 71) అప్పట్లో సినిమాలు పూర్తిగా వ్యాపారాత్మకం కాలేదు. దేశస్వాతంత్ర్యానికి పూర్వం రెండు దశాబ్దాలు, స్వాతంత్ర్యానికి తర్వాత ఇంకో రెండు దశాబ్దాలుగా అటూ ఇటూ సాగిన ఈ రెండు స్వర్ణ యుగాలూ, విలువలకి పట్టం గట్టాయంటే  అప్పటి దేశకాల పరిస్థితులు అలాటివి. దేశభక్తి ముందు అవినీతి రాజకీయాల్లేవు, స్వార్ధపూరిత జీవితాలు లేవు. దేశంలో మొట్ట మొదటి స్కామ్1980 లలోనే బోఫోర్స్ తో ప్రారంభమైంది. అలా జీవితాల్లో విలువలు తరిగి పోవడంతో,  తొలివ్యాపార యుగపు (1971 – 2000) సినిమాల్లో కూడా విలువలకి స్థానం లేకుండా పోయింది. ఇక 2000 నుంచి ప్రారంభమైన మలి (కల్తీ) వ్యాపార యుగం గురించి చెప్పనవసరం లేదు. ఇవి కూడా విలువలే, కాకపోతే లపాకీ విలువలు. 

          యితే విలువలు ఎలాటివైనా వాటిని చిత్రించేందుకు కొన్ని ప్రమాణాలు వుంటాయి. ప్రమాణాలకి కూడా విలువలు తీసేస్తే?  అప్పుడు మలి (కల్తీ) వ్యాపార యుగమైనా వ్యాపారంలా వుండదు. 90 శాతం అట్టర్ ఫ్లాపులతో పాపంలా పెరుగుతుంది. 

          నాటి మలిస్వర్ణ యుగం సమాజంలో విలువలు - సినిమా నిర్మాణంలో ప్రమాణాలూ అనే జోడుగుర్రాల స్వారీగా సాగినట్టు కనబడుతుంది చరిత్ర చూస్తే. సమాజ విలువల్ని కాపాడుతూనే; రచనలో, దర్శకత్వంలో, నటనల్లో ప్రమాణాలు నెలకొల్పడం. పాతాళ భైరవి, మిస్సమ్మ, మల్లీశ్వరి, మాయాబజార్, దేవదాసుల నుంచి మొదలుకొంటే; మూగమనసులు, మోసగాళ్ళకు మోసగాడు, సాక్షి, మరో ప్రపంచం, సుడి గుండాలు వరకూ ఈ ప్రమాణాలు - ఇప్పుడు మాయమైపోయిన ఎన్నో వైవిధ్యభరిత జానర్లని కూడా అందించాయి. తొలి స్వర్ణయుగపు ప్రతీకలైన భక్తీ, పౌరాణిక, చారిత్రాత్మక, సామాజిక, కుటుంబ జానర్లని కొనసాగిస్తూనే; విప్లవ, హాస్య, ప్రేమ, వాస్తవిక, గూఢచారి, కౌబాయ్, హార్రర్, క్రైం థ్రిల్లర్ మొదలైన ఇతర జానర్లెన్నోమలి స్వర్ణయుగంలో ప్రవేశ పెట్టినవే. అంతే కాదు, సార్వజనీన త్రీ యాక్ట్ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లేలు పరిఢవిల్లింది కూడా ఈ కాలంలోనే. స్ట్రక్చర్ ని నిలుపుకుంటూనే స్ట్రక్చర్ లోపల విభిన్న క్రియేటివిటీలు, తత్సంబంధ టెక్నిక్కులు, ఫార్ములాలూ కనిపెట్టింది కూడా ఈ కాలంలోనే. ఊత పదాలు సహా ఐటెం సాంగుల్ని పరిచయం చేసింది కూడా ఈ మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే ఊతపదాలు ప్రతినాయక పాత్రలకి రాశారు. పాతాళభైరవి ఎస్వీ రంగారావు నోట ‘సాహసం శాయరా డింభకా’, దొంగ రాముడులో ఆర్ నాగేశ్వరరావు చేత ‘బాబుల్ గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి’  లాంటివి. పాతాళభైరవిలో ‘వగలోయ్ వగలు’  అనే పాట ఐటెం సాంగే. ఐతే ఈ పాటని కథలో వుంచుతూ, కథని మలుపు తిప్పే ఘట్టంగా చిత్రించారు. యాభయ్యేళ్ళ తర్వాత ప్రారంభమైన ఇదే ఐటెం సాంగుల ట్రెండులో కథతో సంబంధంలేని కరివేపాకు పాటలయ్యాయి. ఇక లో - బడ్జెట్ లో సాక్షి, సుడిగుండాలు, మరోప్రపంచం లాంటి వాస్తవిక ప్రయోగాత్మక సినిమాలని తీయడాన్ని ప్రారంభించింది కూడా మలిస్వర్ణ యుగంలోనే. కాకపోతే చివరి అంకంలో. 

        మలి స్వర్ణ యుగంలో గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, కథల్ని తేటగా, నునులేతగా, సహజత్వంతో కూడుకున్న నిరాడంబర కథనాలుగా చూపించే వారు. డైలాగుల మోత, మెలో డ్రామా వుండేవి  కాదు. ఇదంతా తర్వాత తొలివ్యాపార యుగంలో హీరోయిజాల, వూర హీరోయిజాల కొత్త ట్రెండ్ లో  తిరగబడింది. వాస్తవికత, సహజత్వాలనేవి జవసత్వాలు చాలించి కూర్చున్నాయి. ఒవరాక్షన్లు, అతి డైలాగులు, రక్త స్నానాలు, బూతు జలకాలూ, మెలో డ్రామాలు, నాటకీయతలూ, అమల్లోకి వచ్చాయి. మలి (కల్తీ) వ్యాపార యుగంలోనూ గత నాల్గైదు ఏళ్ల క్రితం వరకూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మారుతోంది. అంటే నాటి మలి స్వర్ణయుగంలోకి ప్రయాణం కడుతోంది. అప్పటి సహజత్వాలు, అప్పటి వాస్తవికతలు, అప్పటి తక్కువ సంభాషణలు, అప్పటి తేటదనాలే కాకుండా, అప్పటి ప్రయోగాత్మక ప్రయత్నాలూ ఇప్పుడు కనబడుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీలో ఒకటే లోపం – మలిస్వర్ణ యుగపు కథ చెప్పే టెక్నిక్, అప్పటి డైనమిక్స్ మచ్చుకైనా కానరాకపోవడం. అసలు కథనాల్లో డైనమిక్స్ అంటే ఏమిటో, అవెలా ఏర్పడతాయో, వాటి ప్రయోజనాలేమిటో అసలే అర్ధంజేసుకోలేక పోవడం.  

          దొంగరాముడు మలిస్వర్ణ యుగపు 1955 లో విడుదలైంది. ఇప్పుడు చరిత్ర పునరావృతమవుతున్నట్టు, లపాకీ విలువల మలి (కల్తీ) వ్యాపార యుగం, తెలియకుండానే నాటి మలిస్వర్ణ యుగపు సొగసులు అద్దుకుంటున్నఈ చారిత్రక మలుపులో -  సృజనాత్మకతా పరంగా దొంగరాముడ్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరముందని పక్కాగా తేలింది. ఈ కల్తీ యుగం తర్వాత మిగిలేది యుగాంతమేనేమో తెలీదు. ‘మేరా నామ్ జోకర్’ లో రాజ్ కపూర్ పాడినట్టు - ఈ సర్కస్ మూడు గంటల షో...మొదటి గంట బాల్యం, రెండో గంట యౌవనం, మూడో గంట వృద్ధాప్యం...ఆ తర్వాత – ఖాళీ ఖాళీ కుర్చీలే, పిచ్చుకలెగిరి పోయిన గూళ్ళే... లాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకోకూడదంటే, ఇంకా ముసలి సినిమాలు రాయకుండా తీయకుండా వుండాలంటే - కుర్చీలు ఖాళీ అయిపోకుండా వుండాలంటే – పరవళ్ళు తొక్కిన మలిస్వర్ణ యుగంతో గుణాత్మకంగా బంధుత్వాన్ని కలుపుకోవాల్సిందే.

***
       దొంగ రాముడులో డైనమిక్స్ ఎక్కువ. కథ నిదానంగా దాని సమయం తీసుకుంటూ సాగినా, దృశ్యాల్లో కన్పించే డైనమిక్స్ ఎక్కువ. హీరో చిన్నప్పటి కథ పూర్తవడానికి 25 నిమిషాలు పడుతుంది. అప్పుడు మాత్రమే ఎదిగిన హీరోగా దొంగరాముడు (అక్కినేని నా గేశ్వర రావు) కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకో 15 నిమిషాలకి గానీ హీరోయిన్ సీత (సావిత్రి) కన్పించదు. ఆ తర్వాత 5 నిమిషాలకి గానీ ఇంకో ముఖ్యపాత్ర దొంగరాముడి చెల్లెలు లక్ష్మి (జమున) తెరపైకి రాదు. అంటే నాగేశ్వరరావు, సావిత్రి, జమునలు వంటి ప్రముఖ తారలు ప్రేక్షకులకి తెరమీద కన్పించడానికి అరగంట నుంచీ ముప్పావు గంట సమయమూ  తీసుకుంటారన్న మాట. అప్పటికి ఆక్కినేని –సావిత్రిల సూపర్ హిట్ దేవదాసు విడుదలై రెండేళ్ళయింది. అయినప్పటికీ కూడా అంతటి పాపులర్ తారల ఇమేజిని, ఫాలోయింగ్ నీ దృష్టిలో పెట్టుకుని దొంగరాముడు కథ చేయలేదు. అప్పట్లో ఇంకా హీరోయిజాలు ప్రారంభం కాలేదు కాబట్టి, తారలు కాకుండా కథ, అది తీసుకునే సమయమే ప్రధానమైంది. తర్వాత వ్యాపార యుగం నుంచీ ప్రారంభమైన తారల గ్లామర్ హంగూ ఆర్భాటాలతో పోలిస్తే, మలిస్వర్ణ యుగంలో కన్పించేది గ్లామర్ లేని పాత్రలే. ఏవైతే 1970 లలో ఆర్టు సినిమాలంటూ రావడం ప్రారంభించాయో, వాటిలో వుండే బీదాబిక్కీ తరహా గ్లామర్ లేని సామాన్య పాత్రల్నే మలిస్వర్ణ యుగంలో సహజత్వానికి ధర్మాసనం వేస్తూ ప్రేక్షకులకి అందించారు. 

          దొంగరాముడులో ఇంకో ముఖ్య పాత్ర కన్పించదు. అది విలన్ పాత్ర. విలన్ లేకుండానే దొంగరాముడికి కష్టాలుంటాయి. అతడి చేష్టలు చాలు తనకి తానే విలన్ అవడానికి. 

          దొంగరాముడు నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు; దర్శకుడు – స్క్రీన్ ప్లే రచయిత కెవి రెడ్డి, కథ కెవి రెడ్డి, డివి నరసరాజు, దుక్కిపాటి మధుసూదన రావు; మాటలు డివి నరసరాజు, సంగీతం పెండ్యాల, ఛాయాగ్రహణం ఆడి ఎం ఇరానీ, ఇతర తారాగణం జగ్గయ్య, రేలంగి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం తదితరులు. 

          దొంగరాముడు కథ అరగంటకోసారి రిపీటవుతూ వుంటుంది. దీంతో మూడు క్లయిమాక్సులు వున్నట్టుగా అన్పిస్తుంది. భవిష్యత్తులో 1998 లో రన్ లోలా రన్ లాంటి మూడు క్లయిమాక్సుల మూవీ వస్తుందని అప్పుడే వూహించారేమో. కొన్ని అలా జరిగిపోతాయి. 

          దొంగరాముడు చిన్నప్పుడు అలా చేసి వుండకపోతే జైలుకి వెళ్ళేవాడు కాదు. విడుదలై  పెద్దోడుగా అలా చేసి వుండక పోతే మరోసారి జైలుకి వెళ్ళే వాడు కాదు. మళ్ళీ విడుదలయ్యాక అలా కూడా చేసి వుండక పోతే ఇంకోసారీ జైలుకి వెళ్ళే వాడే కాదు. మరి ఏంచేసి వుండాలి దొంగరాముడనే వాడు?



 రేపు!

సికిందర్