రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, నవంబర్ 2023, బుధవారం

1372 : రివ్యూ

 


దర్శకత్వం : పూజా కొల్లూరు
తారాగణం : సంపూర్ణేష్ బాబు, నరేష్, వెంకటేష్ మహా, శరణ్యా ప్రదీప్ తదితరులు
రచన : వెంకటేష్ మహా, సంగీతం : స్మరణ్ సాయి, ఛాయాగ్రహణం : వై. దీపక్
నిర్మాతలు : ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర
విడుదల : అక్టోబర్ 27, 2023
***

        డాది కొక సినిమా నటించే చిన్న సినిమాల తెలంగాణ హీరో సంపూర్ణేష్ బాబుకి సక్సెస్ లు తక్కువే. 2014 లో హృదయ కాలేయం అనే కామెడీతో నటుడయ్యాక కాలక్షేప కామెడీలే చేసుకొస్తూ ఇప్పుడు వాస్తవిక కథా చిత్రంగా రాజకీయ సెటైర్ ప్రయ
త్నించాడు. దీనికి పూజా కొల్లూరు కొత్త దర్శకురాలు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కూడా చూసి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం గురించి తెలియజెప్పే ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఎలా వుందో తెలుసుకుందాం...

కథ

    పడమర పాడు అనే గ్రామంలో అమాయకుడైన స్మైల్ (సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టి జీవిస్తూంటాడు. అతను ఒంటరి, మర్రి చెట్టు అతడి నివాసం. గ్రామంలో ఎవరు ఏ పని చెప్పినా పెంపుడు జంతువులా చేస్తూ ఆ వచ్చే డబ్బుల్ని దాస్తూంటాడు. డబ్బులు కూడబెట్టి చెప్పుల షాపు తెరవాలని అతడి కల. ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. ఇలాకాదని, డబ్బు పోస్టాఫీసులో దాయాలని, స్నేహితుడు పోస్టాఫీసులో ఖాతా తెరిపించడానికి తీసుకుపోతాడు. కొత్త పోస్టు మాస్టర్ వసంత (శరణ్యా ప్రదీప్) ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అడుగుతుంది. అవి లేవు. తల్లిదండ్రులేం పేరు పెట్టారో గుర్తు లేదు. వూళ్ళో నోటికొచ్చిన తిట్టుతో తనని పిలుస్తోంటే అసలు పేరు మర్చిపోయాడు. చూస్తే చిరునవ్వుతో వున్నట్టు కన్పిస్తాడు కాబట్టికొందరు స్మైల్ అని పిలవడం మొదలెట్టారు. పేరే లేకపోతే ఐడీ కార్డు కూడా రాదు. అందుకని వసంత బాగా ఆలోచించిఅతడికి మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెట్టేస్తుంది. వెళ్ళి ఆ పేరుతో ఆధార్ కార్డు తెచ్చుకోమంటుంది. అలా ఖాతా ఓపెన్ అవుతుంది. ఇంకా ఈ దిక్కుమాలిన వాడికి ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ ఐడీ కార్డు కూడా రావడంతో గ్రామంలో సంచలనం రేగుతుంది.
       
ఇలా వుండగా
, పంచాయితీ ఎన్నికలు దగ్గర పడతాయి. గ్రామాన్ని ఉత్తర కులం, దక్షిణ కులంగా ఆక్రమించుకుని పెత్తనాలు చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములుంటారు. వీళ్ళ తల్లుల కులాలు వేర్వేరు. తండ్రి ఒక్కడే. కాబట్టి సవతులైన తల్లుల కులాల కారణంగా అన్నదమ్ములకి ఒకరంటే ఒకరికి పడక, గ్రామాన్ని కుల ఘర్షణలతో అట్టుడికిస్తూంటారు. ఉత్తరం దిక్కుకి జగ్గు (నరేష్), దక్షిణం దిక్కుకి లోకి (వెంకటేష్ మహా) కులోన్మాదులుగా పేర్గాంచి వుంటారు.
       
అయితే పంచాయితీ ఎన్నికలు రావడంతో ఓట్ల లెక్క తీస్తే
, ఇద్దరికీ సమానంగా ఓట్లు పడతాయని తెలుస్తుంది. జనాలు కులోన్మాదం పెంచుకోవడంతో ఎదుటి కులం ఓట్లు కొనలేని పరిస్థితి. అలాంటప్పుడు ఎదుటి కులం ఓట్లు తగ్గించాలంటే కొన్ని శాల్తీల్ని లేపెయ్యాలని హత్యాయత్నాలు కూడా చేస్తారు. ఇంతలో కొత్తగా ఓటు హక్కు పొంది, మార్టిన్ లూథర్ కింగ్ గా తిరుగుతున్న స్మైల్ దృష్టిలో పడతాడు. దీంతో అతడి ఓటు కొట్టేసి ఒక ఓటు మెజారిటీతో సర్పంచ్ గా గెలవచ్చని అతడ్ని పట్టుకుంటారు.
        
దీంతో మార్టిన్ వీఐపీ అయిపోతాడు. అతడి ఓటు కోసం పోటీపడుతూ అన్నదమ్ములు అతడ్ని అందలా లెక్కించడమే గాకతొక్కేస్తారు కూడా ఎవరికి వేస్తాడో చెప్పలేక పోతూంటే. ఇలా ఈ దుష్ట సోదరుల మధ్య చిక్కుకున్న మార్టిన్, తను పొందిన ఏకైక ప్రజాస్వామిక హక్కుతో ఏ నిర్ణయం తీసుకున్నాడుదీనికి ఎన్ని ప్రమాదా లేదుర్కొన్నాడు?చివరికి తన ఓటు హక్కుతో వ్యూహాత్మకంగాప్రత్యర్ధులు దిమ్మెరబోయేలా మాస్టర్ స్ట్రోక్ ఎలా ఇచ్చాడు ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    సరీగ్గా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ కీలక ఎన్నికల సినిమా విడుదలైంది. ఇలాగే సరీగ్గా 2021 ఏప్రెల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి ముందు రోజు తమిళంలో దీని మాతృక విడుదలైంది. తమిళంలో టాప్ కమెడియన్ యోగిబాబు నటించిన మండేలా కి రీమేక్ మార్టిన్ లూథర్ కింగ్. మండేలా కి జాతీయ స్థాయిలో మంచి పేరొచ్చింది. 2021 తమిళ నాడు పోలింగ్ కి ముందు రోజు విడుదలైన మండేలా లో, ఓటుకి నోటుతాయిలంకులంమతం కాదని స్వచ్ఛంగా ఓటేస్తూప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే నయా ఓటింగ్ మోడల్ చూపిస్తేఇది అక్కడ పోలింగ్ రోజున ఎంత వరకూ ప్రభావితం చేసిందో తెలీదు.
       
ఓటింగ్ పరంగా ఒక వినూత్న ఐడియాతో తమిళంలో  
మండేలా’ వాస్తవిక సినిమాని కొత్త దర్శకుడు మడోన్ అశ్విన్ ప్రయోగాత్మకంగా తీశాడు (2023 లో శివకార్తికేయన్ తో నూరు కోట్లు వసూలు చేసిన మావీరన్ తీశాడు). ఎన్నికల్లో కుల మతాలుడబ్బూ బహుమతులూ ఎరగా వేసి ఓట్లు కొల్లగొట్టుకునే కన్స్యూమరిజం రాజకీయం కొత్తదేం కాదు. ఓటర్లంటే ఫ్రీబీ (రేవడీ) లకి ఆశపడే కస్టమర్ల కింద జమకట్టి, వీరి కోసం టీవీలు, కరెంటు, లాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్కూటీలు, గ్యాస్ బండలు, నెల ఖర్చులకి డబ్బులు... ఇలా ఎన్నో బహుమతులు ఇస్తామని పార్టీలు పోటీలు పడి ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అయితే కిలో ఆవుపేడ రెండు రూపాయలకి కొంటామని కూడా  ప్రకటించింది!
       
ఇక కుల మత భావాలు రెచ్చగొట్టడం సపరేట్ సెక్షన్. దీనికి పార్టీలు సొంతంగా పెట్టుకునే ఖర్చుంటుంది. ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కో ర్యాలీ నిర్వహణకి పది కోట్లు ఖర్చు పెడుతున్నాయి పార్టీలు. ఈ ఎన్నికల ప్రచార వ్యయం అన్ని పార్టీలకీ కలిపి లెక్కకడితే
ఈ ఖర్చుతో ఒక ఏడాది పాటు దేశ ప్రజలకి రేషన్ సరఫరా చేయ వచ్చు ప్లస్ దేశవ్యాఫంగా బడి పిల్లలకి ఏడాది పాటు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వొచ్చు ప్లస్ దేశవ్యాప్తంగా పేదలకి ఏడాది పాటు ఉపాధి హామీ పథకం నిర్వహించ వచ్చు...ఈ మూడు పథకాలకి ప్రభుత్వాల దగ్గర మాత్రం డబ్బులేదు, వుండదు.
        
కానీ ఎన్నికల కోసం పార్టీల దగ్గర మాత్రం ఈ మూడు పథకాలకి సరిపడా డబ్బుంటుంది. 2023 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 121 దేశాల్లో ఇండియా 107 వ స్థానానికి దిగజారి ఆకలి రాజ్యంగా అలమటిస్తోంది. పార్టీలు మాత్రం అపర కుబేర పార్టీలుగా ఎదిగాయి. ప్రభుత్వం పేదదిప్రజలు నిరు పేదలుపార్టీలు మాత్రం అల్ట్రా రిచ్. ఎన్నికల్లో పార్టీల హోరాహోరీ పోరాటాలన్నీ ప్రభుత్వ ఖజానా మీద కబ్జా కోసమే తప్ప మరేం కాదు.
           
ప్రభుత్వ ఖజానా లోంచి మీరిచ్చే బహుమతులు కాదుమేం ఓటేయాలంటే ముందు మౌలిక సదుపాయాలు కల్పించండని గ్రామాలు ఎదురు బేరం పెడితేర్యాలీలు జరగవు. ఆ ర్యాలీల ఖర్చుతో గ్రామాలు బాగుపడతాయి. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కొరత నెదుర్కొంటున్నది గ్రామీణులే. ఇదే ఈ కథలో చూపించారు. అయితే సినిమా కథ కాబట్టి గేమ్ గా చూపించి రక్తి కట్టించాలనుకున్నారు. మండేలా/మార్టిన్  దగ్గరున్న విలువైన ఓటు కోసం ప్రత్యర్ధులైన అన్నదమ్ములు దిగివచ్చి, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించింతర్వాతగ్రామప్రజలు ఓటెయ్యకుండా మొండి చేయి చూపడమన్నది కాస్త అన్యాయమే. అయితే పార్టీల్ని ఇలా డబుల్ క్రాస్ చేస్తే తప్ప ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ప్రజా పాలన చెయ్యవేమో అనేది కూడా ఆలోచించాలి. ఇదే ఈ సినిమా రసవత్తరంగా చేస్తున్న పని.

నటనలు- సాంకేతికాలు

    యోగిబాబుతో పోల్చనవసరం లేదుగానీ సంపూర్ణేష్ బాబు చెప్పులు కుట్టే వాడిగా పాత్ర  స్వభావానికి సరిపోయాడు. తమిళంలో యోగిబాబుది క్షురకుడి పాత్ర. అయితే తమిళంలో పేరు పాత్రకి తగ్గట్టుగా వుంది. అది కులవివక్ష అనుభవించే పాత్ర కాబట్టి మండేలా పేరుపెట్టాడు తమిళ దర్శకుడు. నెల్సన్ మండేలా వర్ణవివక్ష గురించి పోరాడేడు. తెలుగులోనూ కుల వివక్ష అనుభవించే సంపూర్ణేష్ బాబు పాత్రకి మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టారు. కానీ మార్టిన్ లూథర్ కింగ్ పోరాడింది మానవ హక్కుల గురించి. కొత్త దర్శకురాలు ఈ తేడా గమనించకుండా మార్టిన్ లూథర్ కింగ్ టైటిల్ గా కూడా పెట్టేసినట్టుంది.
       
వెర్రి బాగుల వాడు వెళ్ళి వెళ్ళి 
ఓటు హక్కుతో  ఎన్నికల్లో ప్రత్యర్ధులకి చిక్కి కింగ్ అయిపోవడంవాళ్ళ కుమ్ములాటలో తన స్థానమేమిటో క్లెయిమ్ చేసుకుని పాగా వేయడం సంపూర్ణేష్ పాత్ర పని. ఈ రూపాంతరానికి ఆధారం పాత్రచిత్రణే. పైకి కింగ్ గా దర్జా వెలగబెట్టినా, లోలోపల అతను వాస్తవం తెలిసిన వాడే. చెప్పుల షాపు పెట్టి తండ్రి కోరికని నిజం చేయాలన్న కలలున్నప్పుడు అశాంతిని తెచ్చుకోకూడదన్న అర్ధంలో పాత్ర తీరు. అందుకే వూళ్ళో తనని ఎంత తక్కువ కులం వాడిగా చూసినాకించపర్చినాకిమ్మనక శాంతంగా కల కోసం పని చేసుకు పోతాడు.
        
కులమతప్రాంతీయ తత్వాలు భూమ్మీద మనుషులున్నంత కాలం వుండేవే. ఇవి తొక్కే స్తున్నాయని కులం కార్డోమతం కార్డోప్రాంతీయ కార్డో ప్రయోగించి వీధికెక్కితే ప్రయోజనం లేదు. అప్పుడా కార్డూ వుండదుసొంత కలలూ వుండవు. ఈ ఆటంకాల మధ్య నుంచి దారి చేసుకుంటూ కలల సాఫల్యతకి కృషి చేసుకు పోవడమే మార్గం. ఇది పాత్రగా సంపూర్ణేష్ నేర్పుతాడు. ఇందుకే అణిగి మణిగి వుండే క్యారక్టర్ గా కన్పించడం. వూళ్ళో అగ్రకులాల పట్ల ఎంత జాగ్రత్తగా వుంటాడంటేపోస్ట్ మాస్టర్ వసంత  మార్టిన్ లూథర్ కింగ్ అని పేరు పెడితే, అది అగ్రకులం పేరేమోనని భయపడతాడు.
        
తన నిమ్న కుల ఆత్మ న్యూనతా భావాన్ని మర్చిపోవడానికిమర్రి చెట్టుకి పైన ఉయ్యాల కట్టుకునిఉయ్యాల్లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో తను పైన స్వర్గంలో వున్నట్టు ఫీలవుతూకమ్మగా నిద్రపోతాడు. తన నిమ్న కుల స్థానంతో ఎంత విధేయంగా వుంటాడంటే పోస్టాఫీసు కెళ్ళి పక్క గోడ చూస్తూవెనుక గుమ్మం లేదే అనుకుంటాడు. ఇళ్ళల్లోకి వెనుక గుమ్మంలోంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడా అదే అనుకుంటాడు. 
        
పోస్టాఫీసులోకి వెళ్తూంటే తలుపు వూడి పడుతుంది. ఇక్కడ డబ్బులు దాస్తే వుంటాయా అని భయపడతాడు. డబ్బులు జమచేసి వెళ్తూ తలుపు గట్టిదనాన్ని మళ్ళీ పరీక్షిస్తాడు. ఈ చర్యలు పాత్ర తీరు రీత్యా హాస్యం పుట్టించినావెనుక గుమ్మంముందు తలుపు ప్రస్తావనలతో  చాలా సింబాలిజం వుంది. పోస్టాఫీసుల్లో  డిపాజిట్లు రిస్కులో వున్నాయని మీడియా రిపోర్టులు వచ్చాయి కూడా.
        
ఓటరు ఐడీ కార్డు వచ్చాక అతడి క్యారక్టర్ ని మార్చేస్తారు ఎన్నికల్లో పోటీ పడుతున్న అన్నదమ్ములు. తనని రాజాలా చూసుకోవడం చేస్తూంటే సంపూర్ణేష్  మరింత డిగ్నిటీ నటించి క్యారక్టర్ ని ఇంకో లెవెల్ కి తీసికెళ్తాడు. మళ్ళీ యధాస్థితి కొచ్చి పూర్వపు చెప్పులు కుట్టే వాడు  అయిపోతాడు. చివరికి ఓటింగ్ చేసేప్పుడు కింగ్ అయిపోతాడు. ఎక్కడా ఎదిరించకుండాఎవర్నీ ఒక్క మాట అనకుండాఓటు పవర్ తో ఓడించేస్తాడు. సంపూర్ణేష్ కి ఐడీ కార్డు వచ్చినప్పట్నుంచీముగింపు షాట్ వరకూ ఏం చేయబోతున్నాడో ఎడతెగని ఒక సస్పెన్స్ తో అతడి క్యారక్టర్ కొనసాగుతుంది.
        
ఇక పోస్ట్ మాస్టర్ వసంతతో చేతకాని ప్రేమాయణం కూడా నడుపుతాడు. ఈ రీమేక్ నటుడిగా సంపూర్ణేష్  తనని పరీక్షించుకోవడానికి కొలమానంగా ఉపయోగపడింది. ఇందులో పడికి పది మార్కులూ పొందాడు. అలాగే అన్నదమ్ములుగా నటించిన నరేష్, వెంకటేష్ లు తమ విలనీని ఎత్తుగడలతో రంజింపజేస్తూ పోయారు. తమని గెలిపించే ఓటు కోసం ప్రత్యర్ధులు ఏమేం చేస్తారో సినిమాటిక్ గా కాకుండా, రియల్ లైఫ్ లో ఏమేం ఎత్తుగడలు వేస్తారో డెటెయిలింగ్ చేస్తూ నడిపడం వల్ల కథనానికి కొత్తదనం, బలంవచ్చాయి. ఇతర సహాయ పాత్రల్లో అందరూ ఓకే.
        
అయితే టెక్నికల్ గా తమిళంలో  వున్నంత వాస్తవికతని ప్రతిబింబించ లేదు. తమిళంలో రియలిస్టిక్ జానర్ కి తగ్గ ఒక రిధమ్ఒక విజువల్ క్రాఫ్ట్  కన్పిస్తాయి. సెటైర్ గా వుండే సీన్స్ కి ఆ ఫీల్ నిస్తూసాఫ్ట్ విజువల్స్ చూపిస్తూ ఆకస్మిక కట్స్ ఇస్తాడు. ప్రత్యర్ధుల సీరియస్ సీన్లు వచ్చేసరికి డార్క్ లైటింగ్ ఉపయోగిస్తూఎమోషన్లు హైలైట్ అయ్యే క్యారక్టర్ ఫ్రేమింగ్ ఇస్తాడు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ సెటైరికల్ గాలైట్ మ్యూజిక్ తో ఇచ్చాడు. వీటి మీద పట్టు సాధించాలి కొత్త దర్శకురాలు.

చివరికేమిటి

    ‘మండేలా లాంటి ప్రయోజనాత్మకాన్ని రీమేక్ చేయాలనుకోవడం మంచి ఆలోచనే. అయితే ఇది సబ్ టైటిల్స్ తో నెట్ ఫ్లిక్స్ లో ఇదివరకే వచ్చేసి తెలుగు వాళ్ళు చూశారు. పైగా 2021 లో మండేలా థియేటర్స్ లో విడుదల కాలేదు. అప్పటి లాక్ డౌన్ సమయంలో ఓటీటీలో విడుదలైంది. థియేటర్స్ లో విడుదలై వుంటే హిట్టా ఫ్లాపా తెలిసిపోయేది. ఈ నిర్ధారణ లేకుండా తెలుగులో రీమేక్ చేశారు. ఓటీటీ సినిమాని రీమేక్ చేయడం ఇదే మొదటిసారి. ఈ రిస్కు ఎవ్వరూ తీసుకోరు.
       
కాబట్టి తెలుగులో థియేట్రికల్ విడుదల బాక్సాఫీసు దగ్గర పరీక్షే. పోతే
, తమిళంలో
 ముగింపే ఒకే షాట్ తో మరీ ఇంటలెక్చువల్ గా వుంటుంది. దీన్ని తెలుగులో పెంచి డ్రమటైజ్ చేసి వుంటే సామాన్యులకి బాగా అర్ధమయ్యేది. జాలి పుట్టించే సున్నిత హాస్యంతో ఒక పెద్ద రాజకీయ సమస్యనేకుల సమస్యనేఎవర్నీ నొప్పించకుండా ఆలోచింప జేసే చిత్రీకరణలతో ఆశ్చర్యపర్చే ప్రతిభ కనబర్చాడు కొత్త తమిళ దర్శకుడు. కొత్త దర్శకురాలు పూజా కొల్లూరు దీని మీద ఇంకా కృషి చేయాలి.  కంటెంట్ మీద తనకెంత పట్టుందో మరీ టైటిల్ పెట్టడం దగ్గరే దొరికిపోయేలా వుండకూడదు.  

—సికిందర్

 


21, అక్టోబర్ 2023, శనివారం

1371 : రివ్యూ


 

రచన -దర్శకత్వం : వంశీ
తారాగణం : రవితేజ, నుపుర్ సానన్, గాయత్రీ భరద్వాజ్, రేణూ దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ, జిషు సేన్‌గుప్తా తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : ఆర్. మధి
బ్యానర్ : అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, నిర్మాత: అభిషేక్ అగర్వాల్
విడుదల : అక్టోబర్ 20, 2023
***

మాస్ మహారాజా రవితేజ ఒక వ్యక్తి జీవిత చరిత్రతో బయోపిక్ నటిస్తే ఎలా వుంటుంది? రవితేజ సినిమాలా వుంటుందా, లేక ఆ వ్యక్తి బయోపిక్ లానే వుంటుందా? మొదటిదే అవుతుందని నిరూపించే తరహాలో టైగర్ నాగేశ్వర రావు కి రూపకల్పన చేశాడు దర్శకుడు వంశీ. స్టూవర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్రని తెరకెక్కించే ప్రయత్నంలో, రవితేజకే హాని జరిగే తీరు తెన్నులతో కూడా తయారైంది సినిమా. రవితేజ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పానిండియా స్థాయిలో సినిమాని విడుదల చేయించడం వల్ల ఆ లెవెల్లో ప్రతిష్ట కూడా దెబ్బ తింది. ఈ బయోపిక్ ఎలాగో గట్టెక్కడానికి వివాదాస్పదమై ప్రేక్షకుల్ని ఆకర్షించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కరుడుగట్టిన దొంగని సమర్ధించే వర్గాలు వుండవు కాబట్టి.
        
ఇంతకీ ఏమిటీ సినిమా/బయోపిక్? భగవంత్ కేసరి’, లియో ల తర్వాత ఎంతో హడావిడీ చేస్తూ పండక్కి విడుదలైన ఇది మొదటి రెండు సినిమాల పక్కన ఎక్కడ నిలబడుతుంది? దీని కొచ్చే రెస్పాన్స్ ఎంత? ఇవి తెలుసుకుందాం...

కథ

    1970 లలో ఢిల్లీలో ఐబీ చీఫ్ రాఘవేంద్ర రాజ్పుత్ (అనుపమ్ ఖేర్) నుంచి బాపట్ల డీఎస్పీ విశ్వనాథ శాస్త్రి (మురళీ శర్మ) కి అర్జెంట్ కాల్ వస్తుంది. విశ్వనాధ శాస్త్రి ఢిల్లీ చేరుకుంటే, ఐబీ చీఫ్ ప్రధానమంత్రి భద్రతాదళానికి టైగర్ నాగేశ్వరరావు నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని, ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరని అడుగుతాడు.
        
విశ్వనాథ శాస్త్రి చెప్పడం మొదలు పెడతాడు... నాగేశ్వరరావు స్టూవర్ట్ పురం దొంగ. అతను పోలీసులకి ఛాలెంజి విసిరి మరీ దోపిడీలు చేస్తాడు. దొరక్కుండా తప్పించుకుంటాడు....అంటూ పూర్తి వివరాలు అందిస్తాడు. టైగర్ నాగేశ్వరరావు ప్రధాని భద్రతా దళాన్ని ఏమని బెదిరించాడు? ఆ బెదిరింపు ప్రకారం ఏ నేరానికి పాల్పడ్డాడు? అప్పుడేం జరిగింది? ప్రధాని రియాక్షన్ ఏమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

    రవితేజ సినిమా కథలా వుంటూ, రవితేజకే అడ్డుపడే సన్నివేశాలతో వుంది. ఒక క్రిమినల్ ని గ్లోరిఫై చేయడానికి కొన్ని జాగ్రత్తలుంటాయి. పుష్ప లో కాల్పనిక స్మగ్లర్ క్యారక్టర్ ని గ్లోరిఫై చేయడానికి వ్యక్తిగత జీవితంతో ఆ జాగ్రత్తలు పాటించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా నిజ వ్యక్తి కథ. ఈ నిజ వ్యక్తి కథ బయోపిక్ గా తీసి గ్లోరిఫై చేయడానికి, రవితేజని ఇంకో స్థాయికి తీసికెళ్ళడానికీ పనికి రాని కథ. స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం మీద ఎక్కడా ఒక పుస్తకం వెలువడ లేదు. వాళ్ళూ వీళ్ళూ  చెప్పుకునే కథలూ, కొన్ని పోలీస్ రికార్డులూ ఇవే వున్నాయి. సినిమాకి సరిపోను మెటీరీయల్ లేకపోవడం చేత, భారీగా కల్పన చేసిన సన్నివేశాలతో సినిమాని నింపక తప్పలేదు. అడిగే వారెవరుంటారు.
       
ఈ కల్పితాలు చేయడానికి ఏ పాయింటుని ప్రధానంగా తీసుకుని కథ నడపాలో కూడా తెలుసుకోనట్టుంది. నాగేశ్వరరావు గురించి ప్రచారంలో వున్నవి రెండే అంశాలు- పోలీసులకి దొరక్కుండా చెప్పి మరీ దోపిడీలు చేయడం
, దోచుకుంది పేదలకి పంచి పెట్టడం. అంటే పోలీసులకీ నాగేశ్వరరావుకీ మధ్య ఎలుకా పిల్లీ చెలగాటంతో- ప్రధాన కథని యాక్షన్ కథగా మార్చి  థ్రిల్లింగ్ గా నడుపుతూ, ఉపకథగా పేదలకి డబ్బు పంచే మానవీయ కోణాన్ని ఆవిష్కరించ వచ్చు.
         
ఇందులో మొదటిది చూపించకుండా
, రెండోదే చూపించడంతో ప్రధాన కథ గల్లంతైన సినిమా అయింది. ఏవో కొన్ని దోపిడీలు చూపించారు- కానీ పోలీసులతో వుండాల్సిన ఎలుకా పిల్లీ చెలగాటం యాక్షన్ పార్టు మర్చిపోయారు. ఇంకేం సినిమా ఆడుతుంది?
       
చరిత్రలో నాగేశ్వరరావు లాంటి నేరస్థుడే వున్నాడు. అతను ఉన్నత స్థానాల్లో చిటికెలో ఆర్ధిక నేరాలు చేసి తప్పించుకునే ఫ్రాంక్ అబిగ్నేల్. పోలీసులకి దొరక్కుండా ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతడి మీద
క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అని సినిమా తీశాడు స్టీవెన్ స్పీల్ బెర్గ్. దొంగగా లియోనార్డో డీకాప్రియో, పోలీసుగా టామ్ హాంక్స్. ఫ్రాంక్ అబిగ్నేల్ దేనికి ప్రసిద్ధో ఆ ఎలుకా పిల్లీ చెలగాటాన్నే కథగా చేసి, టైటిల్ కూడా అలాగే పెట్టి  తీశాడు స్పీల్ బెర్గ్. టైగర్ నాగేశ్వరరావు లో ఈ పాయింటునే పక్కన బెట్టి పానిండియా తీశారు.
       
డీఎస్పీ విశ్వనాథ శాస్త్రి చెప్పుకొచ్చే కథ- రైలు దోపిడీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టి పెరిగి దొంగగా మారిన కథ వస్తుంది. ఆ తర్వాత రవితేజ రెగ్యులర్ సినిమా టెంప్లెట్ ప్రారంభమైపోతుంది. బాపట్లలో ఓ కాలేజీ
, కాలేజీలో చదివే హిందీ అమ్మాయి- ఆమెని ఆకలిగా చూస్తూ వెంటపడి వేధించి, డిజైనర్ డ్రెస్సుల్లో   స్టెప్పులేస్తూ పాటలు పాడి, ఆమె పెళ్ళి చెడగొట్టి తనవైపు తిప్పుకునే కామెడీ లవ్ ట్రాకు! కనీసం 15 మంది ఇక్కడే లేచిపోయారు థియేటర్లోంచి.
       
తిరిగి ఓ రెండు దోపిడీలు
, ఆ తర్వాత సెకండాఫ్ లో సుదీర్ఘంగా సాగే పేదలకి డబ్బులు పంచే రాబిన్ హుడ్ ఎపిసోడ్. టెంప్లెట్ ప్రకారం ఫస్ట్ హీరోయిన్ ఫస్టాఫ్ లోనే దూరమవగా, సెకండాఫ్ లో సెకండ్ హీరోయిన్! పోలీసులతో పోరాటం. చివరికి ఢిల్లీలో ప్రధాని ఇంట్లో దొంగతనం! చాలా సిల్లీగా రాసి తీశాడు సినిమాని. ఎక్కడా థ్రిల్, సస్పెన్స్, మలుపులు అనేవి లేకపోగా, సన్నివేశాలు, డైలాగులు నీరసంగా వుంటాయి. యాక్షన్ పార్టులో తప్ప టాకీ పార్టులో స్పీడు అనేదే వుండదు.
       
ఇంకోటేమిటంటే
, ఫస్టాఫ్ కథని విశ్వనాధ శాస్త్రి చెప్తే- సెకండాఫ్ కథని స్టూవర్ట్ పురం పెద్ద (నాజర్) చెప్తాడు. దీని వల్ల ఫస్టాఫ్ లో చచ్చిపోయిన దుష్ట పాత్రలు సెకండాఫ్ లో మళ్ళీ వస్తాయి. రెండు దృక్కోణాల్లో కథ చెప్తే, కథ ముందు కెళ్ళక అక్కడక్కడే తిరుగుతున్నట్టే గాక, పాత్రలు మళ్ళీ కనిపిస్తూ కన్ఫ్యూజింగ్ గా కూడా వుంటుంది. ఇది కన్ఫ్యూజన్ అనుకోలేదు దర్శకుడు, చాలా క్రియేటివ్ గా కథ చెప్తున్నా ననుకున్నాడు.

నటనలు - సాంకేతికాలు

    రవితేజ నాగేశ్వర రావు పాత్రకంటే రవితేజ టైపు టెంప్లెట్ పాత్రే నటించాడు. రక్తంతో రాసే చరిత్రలు వుంటాయి, కన్నీటితో రాసే చరిత్రలు వుంటాయి, ఇది రెండూ కలిపి రాసిన చరిత్ర అని మొదట్లో కొటేషన్ పడుతుంది. రక్తమే తప్ప కన్నీరు లేదు. రక్తాలు పారిస్తూ క్రూరంగా యాక్షన్ సీన్సు నటించి, లియో విజయ్ నే మించిపోయాడు రవితేజ. డబ్బులు పంచే మానవీయ కోణం అలా చేయడానికి పురిగొల్పిన సంఘటనేదో చెప్పకపోవడంతో, ఆ ఎపిసోడ్ ఎంత నటించినా, నాయకుడు లో కమలహాసన్ ని టచ్ చేయలేక పోయాడు. గ్రాఫిక్స్ తో యంగ్ రవితేజతో వచ్చే సీన్లలో మాత్రం ఆ ఏజిని బాగా నటించాడు.
       
బాపట్లలో హిందీ అమ్మాయిగా నుపుర్ సానన్ ది ఫస్టాఫ్ లో ఫార్ములా హీరోయిన్ సంక్షిప్త పాత్ర. సెకండాఫ్ లో లోకల్ అమ్మాయిగా గాయత్రీ భరద్వాజ్ కి నిడివి వున్న పాత్ర
, దాంతో నటించే అవకాశం.  
        
ఢిల్లీలో ఐబీ చీఫ్ గా నటించిన అనుపమ్ ఖేర్ అయితే కామెడీ పాత్ర అయిపోయాడు. హిందీ వాడైన తను మారువేషంలో బాపట్లలో తిరుగుతూ దంచి కొట్టి తెలుగు మాట్లాడేస్తూంటాడు. ఇక డీఎస్పీగా మురళీ శర్మ పోలీసు విధులు సరే,
       
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో పాటలు అలా వచ్చి వెళ్ళిపోతూంటాయి. 1970 ల కాలపు పీరియడ్ లుక్ కోసం నిర్వహించిన కళాదర్శకత్వం కోసం
, పోరాటాల కోసం బాగా ఖర్చు పెట్టారు. కానీ మాధి ఛాయాగ్రహణం సాధారణంగా వుంది. యాక్షన్ సీన్సు లో- ముఖ్యంగా రైలు దోపిడీ సీన్లో గ్రాఫిక్స్ నాసి రకంగా వున్నాయి. 1970 లలో సినిమా తీస్తే ట్రిక్ ఫోటోగ్రఫీ ఇలాగే వుండేది. ఈ సినిమా కథ కూడా 1970 ల నాటిదే కాబట్టి ఇలాగే వుంది.
       
చివరిగా
, వేశ్యావాటికల్లో తిరిగే వాడు, రమ్మంటే రాలేదని వేశ్య కడుపులో తన్నే వాడు, సొంత తండ్రిని తలనరికి చంపేవాడు- హీరోతో తీయాల్సిన సినిమా కాదు. విలన్ పాత్రలేసే ఆర్టిస్టుతో తీసుకోవచ్చు. అసలు ఇది సినిమాగా తీయడానికి పనికిరాని బయోపిక్!
—సికిందర్


20, అక్టోబర్ 2023, శుక్రవారం

1370 : రివ్యూ

 

రచన- దర్శకత్వం : లోకేష్ కనరాజ్
తారాగణం : విజయ్, త్రిష, ప్రియా ఆనంద్, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస
బ్యానర్ : సెవెన్ స్క్రీన్ స్టూడియో
నిర్మాతలు : లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి
విడుదల : అక్టోబర్ 19, 2019
***

        ళపతి విజయ్- దర్శకుడు లోకేష్ కనకరాజ్ ల  కాంబినేషన్ లో మాస్టర్ తర్వాత లియో రెండో సినిమా. భారీ ప్రచారార్భాటంతో విడుదలై, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లు వసూలు చేసిందన్న నిర్మాతల ట్వీట్లతో ఇది వైరల్ అవుతోంది. కమల హాసన్- సూర్య- విజయ్ సేతుపతి లతో పానిండియా బ్లాక్ బస్టర్ విక్రమ్ తీసిన కనకరాజ్ లియో కి తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ రెస్పాన్స్ ఇలాగే కొనసాగుతుందా, కొనసాగడానికి సరిపడా విషయముందా తెలుసుకుందాం...

కథ

    పార్తీపన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్ లో కాఫీ షాప్ నిర్వహిస్తూ కుటుంబంతో వుంటాడు. కుటుంబంలో భార్య సత్య (త్రిష), 18 ఏళ్ళ కొడుకు (మాథ్యూ థామస్), ఎనిమిదేళ్ళ కూతురు (ఇయాల్) వుంటారు. కుటుంబంతో ప్రశాంతంగా  గడుపుతున్న పార్తీపన్ జీవితంలోకి ఓ ముఠా ప్రవేశిస్తుంది. కాఫీ షాపులో డబ్బు దోచుకోవడానికి వచ్చిన ముఠా (దర్శకుడు మిస్కిన్, శాండీ) బారినుంచి కూతుర్ని కాపాడుకుంటూ వాళ్ళని చంపేస్తాడు పార్తీపన్. దీంతో అరెస్ట్ అవుతాడు. అవి ఆత్మరక్షణ కోసం జరిగిన హత్యలుగా కోర్టు నిర్ధారించి నిర్దోషిగా విడుదల చేసేస్తుంది. దీంతో పార్తీపన్ చుట్టుపక్కల హీరోగా ప్రచారమవుతాడు. ఆ ఫోటో ఎక్కడో వున్న ఆంథోనీ దాస్ (సంజయ్ దత్), అతడి కొడుకు హెరాల్డ్ దాస్ (అర్జున్) అనే క్రిమినల్స్ చూస్తారు. పార్తీపన్ పేరుతో హిమాచల్ లో వుంటున్నది తన చిన్న కొడుకు లియో దాసేనని ఆంథోనీ గుర్తించి ఎటాక్ చేస్తాడు. తను లియో దాస్ కాదని, నువ్వెవరో తెలియదనీ వాదిస్తాడు పార్తీపన్. అయినా వినిపించు
కోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు ఆంథోనీ దాస్.
       
ఇంతకీ పార్తీపన్ ఎవరు
? ఆంథోనీ చిన్న కొడుకేనా? పార్తీపన్- లియో ఒకరు కాదా? కాకపోతే ఇంకెవరు? కొడుకుని చంపాలని ఆంథోనీ ఎందుకు పగబట్టాడు? కొడుకు అతడికేం అపకారం చేశాడు? ఈ సమస్య ఎలా పరిష్కారమైంది? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
    పై కథా సంగ్రహం చదివితే ఆసక్తికరంగా వుంది. నువ్వు కొడుకువని విలన్ క్లెయిమ్ చేయడం, కాదని కొడుకు తిప్పికొట్టడం, కొడుకుని చంపాలని విలన్ ప్రయత్నించడం, తండ్రికి కొడుకు ఏం అపకారం చేశాడని ప్రశ్న తలెత్తడం, అసలు కొడుకు కొడుకేనా అన్న సందేహం కలగడం... ఇదంతా ఇంట్రెస్టింగ్ మాఫియా ఫ్యామిలీ డ్రామాగా కుతూహలం రేకెత్తిస్తుంది. తీరా ఈ సస్పెన్స్ మీద వున్న ముసుగు తీస్తే కంగాళీగా వుంటుంది.

టైటిల్స్ లో ఈ సినిమాకి ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్ అనే హాలీవుడ్ మూవీ ప్రేరణ అని వేశారు. హాలీవుడ్ మూవీలో తండ్రీ కొడుకుల సంబంధం లేదు, క్రిమినల్- క్రిమినల్ సంబంధమే వుంది. ఈ మూవీ 2000లలో వచ్చిన గొప్ప సినిమాగా నమోదైంది. ఇందులో హీరో ట్రేడ్ మార్క్ స్కిల్స్ తో వుంటాడు. కుటుంబం మీద దాడి జరిగినప్పుడు ఆ స్కిల్స్ బయటపడి తానే ఆశర్యపోతాడు. అతను తుపాకీతో కాల్చి చంపడం ఒక ప్రత్యేక శైలితో చేస్తాడు. అలా కుటుంబాన్ని రక్షించుకోవడానికి చంపేసి నేర ప్రపంచంలో ఇరుక్కుపోతాడు. ఈ దయనీయ స్థితి సినిమా అంతటా వెంటాడే భావోద్వేగంగా వుంటుంది.  
       
ఇలాటిదే కథతో 1990 లో ఏ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన
రౌడీయిజం నశించాలి వచ్చింది. నిజానికిది  మలయాళంలో మోహన్ లాల్ నటించిన కిరీడమ్కి రీమేక్. దీనికి మోహన్ లాల్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఇందులో ఓ బడా రౌడీ బారినుంచి కానిస్టేబులైన తండ్రిని కాపాడుకుంటూ  చంపేస్తాడు హీరో. దీంతో వూళ్ళో హీరో అయిపోతాడు. కానీ రోజురోజుకీ బయటపడలేని విధంగా రౌ డీయిజంలోనే  ఇరుక్కుపోతాడు. మరిన్ని మరిన్ని నేరాలు చేయాల్సి వస్తుంది...ఇందులో, పై హాలీవుడ్ మూవీలో ఒక నీతి వుంది. లియో లో ఇదే మిస్సయి, విలన్ కుటుంబ గొడవలకి పరిమితమై పోయింది. ఇదైనా సరిగ్గా లేదు.
       
హీరో పాత్రచిత్రణ మీద ఆధారపడ్డ ఈ కథ ఎంత అపరిపక్వంగా వుందంటే- ప్రారంభంలో విజయ్ వూరిమీద పడి దాడి చేస్తున్న హైనాని వీరోచితంగా ఎదుర్కొంటాడు. ఈ పోరాటంతో అతను పవర్ఫుల్ వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయిపోతాడు. తర్వాత కుటుంబంతో
, కాఫీ షాపుతో సాధారణ జీవితం గడుపుతున్న సామాన్యుడిలా వుంటాడు. కాఫీ షాపు మీద దుండగులు దాడి చేసినప్పుడు, వాళ్ళతో పొరాడి చంపేసి తన బలానికి తనే ఆశ్చర్యపోతాడు- మనం కాదు- ఎందుకంటే అతను ఎంత పవర్ఫుల్లో ముందే హైనాతో పోరాటంలోనే తెలుసుకున్నాం.
       
దీంతో కాఫీషాపు సంఘటనతో సామాన్యుడిగా సర్ప్రైజ్ చేసి నేరప్రపంచంలో ఇరుక్కోవాల్సిన పాత్ర పూర్తిగా రివర్స్ అయింది. పాత్ర పట్ల ఏ మాత్రం సానుభూతి కూడా పుట్టదు. ఓపెనింగ్ గ్రాండ్ గా వుండాలని హైనాతో పోరాటం పెట్టకుండా
, కాఫీషాపుతోనే అతడి జీవితం చూపించి వుంటే పాత్ర చిత్రణ- దాంతో కథా దెబ్బ తినేవి కావు. హాలీవుడ్ మూవీతో ప్రేరణ పొందడమంటే వాళ్ళు పెట్టని సీన్లు పెట్టడం కాదు.
       
లోపాలు పక్కన పెడితే ఫస్టాఫ్ మాత్రం క్లీన్ గా వుంటుంది. నీ తండ్రినంటూ సంజయ్ దత్ రావడం వరకూ
, అసలు తనెవరో మనకు తెలియకుండా విజయ్ సస్పెన్సు పోషించడం వరకూ, హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల్లో డ్రామా హాట్ హాట్ గా వుంటుంది. చిన్న ఇంటర్వెల్ మలుపు కూడా ఫర్వాలేదు. సెకండాఫ్ కొచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ తో కంగాళీగా మారిపోతుంది. ఏ మాత్రం ఒప్పించని బారుగా సాగే కుటుంబ డ్రామా, అది కూడా బలహీనంగా బయటపడుతుంది. ఇంత బ్యాడ్ రైటింగ్, మేకింగ్ టాప్ డైరెక్టర్ ఎలా చేశాడో తెలీదు. సెకండాఫ్ కథ, దాని క్లయిమాక్స్ మొత్తం సహన పరీక్షగా మారిపోతాయి. లేని కథకి యాక్షన్ సీన్లు మాత్రం భారీగా, అతి వయొలెంట్ గా వున్నాయి.

నటనలు- సాంకేతికాలు

    కమర్షియల్ సినిమాల్లో ప్రేక్షకులు ఆశించే ఎలాటి డ్యూయెట్లు, కామెడీలు, రోమాన్సు లేకుండా సహజంగా అన్పించే రియలిస్టిక్ పాత్ర నటించాడు విజయ్. ఎక్కడా నవ్వుతూ కూడా కంపించడు. పాత్రకి తగ్గ సీరియస్ నెస్, దానికి తగ్గ యాక్షన్ సీన్స్ ఈ రెండే సినిమాలో కనిపిస్తాయి. ఈ యాక్టింగ్ కి తగ్గ పాత్రచిత్రణ, భావోద్వేగాలు కూడా వుంటే బావుండేది.
       
త్రిష కుటుంబానికి ఎదురైన ఆపదలకి సంఘర్షణ పడే పాత్రలో ముద్ర వేస్తుంది. విలన్లిలిద్దరూ- సంజయ్ దత్
, అర్జున్ పరమ బోరు పాత్రలుగా మిగిలిపోతారు సెకండాఫ్ లో. వీళ్ళ కుటుంబ కథ అదో మార్లెండ్ బ్రాండో గాడ్ ఫాదర్ ఫ్యామిలీ కథలా ఫీలవడం!
       
ట్రెండ్ లో వున్న అనిరుధ్ రవిచందర్ సంగీతంలో
నా రెడీ సాంగ్ వింటేనే బావుండొచ్చుగానీ, తెర మీద తేలిపోయింది. మిగిలిన పాటలు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ గా వస్తాయి. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ మొదలైనవి ఫ్రెష్ గా అన్పిస్తాయి. అన్బీరవ్ సమకూర్చిన యాక్షన్ సీన్స్ లో ఎన్ని అవయువాలు తెగిపడ్డాయో, అన్నీ లీటర్ల రక్తం ప్రవహించిన్దో లెక్కే లేదు.
       
మొత్తం మీద లోకేష్  కనక రాజ్ గత మూడు సినిమాల మ్యాజిక్ మిస్సవడమే కాదు
, ఫస్టాఫ్ చూసి సెకండాఫ్ స్కిప్ చేసినా ఫర్వాలేదనిపించేలా వుంది.

—సికిందర్


19, అక్టోబర్ 2023, గురువారం

1368 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : అనిల్ రావిపూడి
తారాగణం : బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్, శరత్ కుమార్, రఘుబాబు తదితరులు
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : సి. రాంప్రసాద్
బ్యానర్ : షైన్ క్రియెషన్స్, నిర్మాతలు : గారపాటి సాహు, పెద్ది హరీష్
విడుదల : అక్టోబర్ 19, 2023
***

        ఖండ, వీర సింహారెడ్డి జంట విజయాల తర్వాత బాలకృష్ణ నుంచి భగవంత్ కేసరి దసరా కానుకగా అందింది. ఈసారి బాలకృష్ణ కామెడీ ట్రాకులతో కమర్షియల్ యాక్షన్ మసాలాలు తీసే దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ఓ భిన్నమైన ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నం మెప్పించిందా? ప్రయత్నం మంచిదే అయినా విషయం బావుందా? విషయం బావున్నా చెప్పడం బావుందా? ఇవి తెలుసుకుందాం...

కథ

    ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న భగవంత్ కేసరి (బాలకృష్ణ)  అనుకోని ప్రమాదంలో ఓ ఎస్సై (శరత్ కుమార్) చనిపోవడంతో, అతడి కూతురు విజ్జీ (శ్రీలీల) ని పెంచుకుంటాడు. ఆమె తండ్రి కోరిక ప్రకారం ఆమెని ఆర్మీ లో చేర్పించే సంకల్పంతో వుంటాడు. ఇద్దరి మధ్య తండ్రీ కూతుళ్ళ అనుబంధమేర్పడుతుంది. అయితే తండ్రి మరణంతో ఒక ఫోబియాకి లోనైన విజ్జీ ఆర్మీలోచేరేందుకు ఒప్పుకోదు. ఇంతలో ఒక టాప్ బిజినెస్ మాన్ రాహుల్ సాంఘ్వీ (అర్జున్ రామ్ పాల్) డిప్యూటీ సీఎం (శుభలేఖ సుధాకర్) ని చంపి డిప్యూటీ సీఎం పియ్యే (బ్రహ్మాజీ) దృష్టిలో పడేసరికి అతడ్ని చంపేందుకు వేట మొదలెడతాడు. ఈ వేటలో అతడికి అతడికి విజ్జీమీద అనుమానం కలిగి ఆమెని టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు భగవంత్ కేసరి విజ్జీని కాపాడుకుని, పాత శత్రువు సాంఘ్వీని అంతమొందించేందుకు ఎలా పోరాటం మొదలెట్టాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

    జైలర్ రజనీకాంత్ బాటలో బాలకృష్ణ ఇమేజి చట్రం లోంచి బయటికొచ్చి వయస్సుకి తగ్గ పాత్ర నటించిన కథ ఇది. జైలర్ లోలాగే కామెడీలు, డ్యూయెట్లూ, వీర హీరోయిజాలు, పంచ్ డైలాగులు, మాస్ బిల్డప్పులు, ఎలివేషన్లూ లేకుండా, సీదా సాదా కంటెంట్ రిచ్ సెంటిమెంటల్ యాక్షన్ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన వూర మాస్ సినిమాల చట్రం లోంచి బయటికొచ్చి కాన్సెప్ట్ ప్రధానప్రయత్నం చేశాడు. కాన్సెప్ట్ వచ్చేసి స్త్రీ స్వశక్తీ కరణకి సంబంధించింది. ఆడపిల్లలు సింహంలా వుండాలని బాహాటంగానే సందేశమివ్వడం. అయితే ఈ కాన్సెప్ట్ ఒక పక్క, ఇంకో పక్క విలన్ తో పగ - రెండూ కలిసి ఒక వొరలో ఇమడలేక పోయాయి. దీంతో స్త్రీ స్వశక్తీ కరణ అంశం గల్లంతై పోయింది.
        
ఈ స్త్రీ స్వశక్తీ కరణని కూడా హీరోయిన్ మీద బలవంతంగా రుద్దే ప్రయత్నంగా వుంది. చిన్నప్పట్నుంచీ ఆమె ఏం కావాలని కోరుకుంటోందో తెలుసుకోకుండా ఆర్మీలో చేరు, ఆర్మీలో చేరూ అని ఒకటే టార్చర్ పెట్టడం బ్యాడ్ పేరెంటింగ్ అన్పించేలా వుంది. తండ్రి మరణంతో ఆమె మానసికంగా ఒక ఫోబియాతో బాధపడుతోంటే దీనికి ట్రీట్ మెంట్ ఇప్పించకుండా, శారీరకంగా బలంగా ఎదగమని కఠిన శిక్షణకి గురి చేయడం ఇంకో బ్యాడ్ టేస్ట్.
        
కథలో సైకాలజిస్టు పాత్ర (కాజల్ అగర్వాల్) వున్నప్పటికీ కూడా ట్రీట్ మెంట్ ఇప్పించే ఆలోచనే  రాదు. ఆర్మీలో చేరితేనే బలవంతురాలవుతుందను కోవడం ఏమిటో కూడా అర్ధంగాదు. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి, వూరి చివర కరాటే శిక్షణ ఇప్పిస్తే పోయేదానికి. ఇప్పుడు సైన్యంలో చేరాలన్నా నాల్గేళ్ళ అగ్నివీర్ కొలువు తప్ప ఏం లేదు.
        
ఈ అసమగ్ర కాన్సెప్ట్ కి నెంబర్ వన్ గా ఎదగాలన్న విలన్ సొంత గొడవల కథ అడ్డుపడితే, ఇది కూడా కథ కుదరక విలన్ చాలా బలహీనంగా మారిపోయాడు. ఇలావుంటే, మెయిన్ కాన్సెప్ట్ స్త్రీ స్వశక్తీ కరణకి – చైల్డ్ ఎబ్యూజ్ ని కూడా తెచ్చి కలిపేశారు. ఈ రెండూ పరస్పర సంబంధం లేనివి. దీనిమీదా స్కూలు పిల్లల ముందు లెక్చరివ్వడం. ఇలా అసలు కథ ఎక్కడికక్కడ లయ తప్పి అపశ్రుతులు పలకడం.కంటెంట్ రిచ్ సినిమా అంటే రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ తీసేసి, అందులో ఏవేవో కంటెంటులు కలపడం కాదేమో!

నటనలు - సాంకేతికాలు

    పెద్దరికం వహించే పాత్రలో బాలకృష్ణ ప్రత్యేకంగా కన్పించే సినిమా ఇది. పైగా తెలంగాణ పాత్ర. ఆదిలాబాద్ కి చెందిన ఈ పాత్రలో తెలంగాణ డైలాగులు చెబుతూ ఎబ్బెట్టుగా ఏం లేడు బాలకృష్ణ. పైగా పవర్ఫుల్ గా వున్నాడు. ప్రతీ సీనులో (కాజల్ అగర్వాల్ తో తప్ప) ప్రభావశీలంగా వున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కూడా తన రొటీన్ పౌరుషాల నటనకి పోకుండా అదుపు చేసుకున్నాడు.
        
కానీ బలహీన విలన్ తో యాక్షన్ కథ అంతంతమాత్రమే. ఇక పెంపుడు కూతురితో బాండింగ్ కి పిలుపులే అడ్డుపడ్డాయి. చిన్నప్పట్నుంచీ పెంచుకుంటున్నప్పుడు అది తండ్రీ కూతుళ్ళ సంబంధమై పోవాలి. ఆమె చిచ్చా (చిన్నాన్న) అని పిలవడంతో బాండింగులు, ఎమోషన్లు ఉపరితలంలోనే వుండిపోయాయి. నాన్నా అని పిలిచి వుంటే ఆడియెన్స్  ఎక్కువ బాండింగ్, ఎమోషన్లు, ప్రేమలు ఫీలయ్యేవాళ్ళు. సినిమా చివర్లో ఎప్పుడో నాన్నా అనుకుంటుంది. ఈ ఆలస్యానికి అది పండని డ్రామా అయిపోయింది.
        
ఇక బాలకృష్ణ యాక్షన్ సీన్సు ఎందుకో ఈలలు వేయించేలా లేవు. హింస మాత్రం జైలర్ కి కొంచెం తక్కువ లెవెల్లో వుంది. తలకాయల నరికివేతలు లేవు. ఒకే పాట బా లకృష్ణ డాన్సుతో వుంది. గణేష్ ఉత్సవం పాట. ఈ పాట డాన్సులకి గొప్పగా చెప్పుకునే   శ్రీలీల స్కిల్స్ కనిపించకుండానే ముగిసిపోయింది.
        
ఈసారి శ్రీలీలకి చెప్పుకోదగ్గ ప్రధాన పాత్ర దక్కింది. కూతురి పాత్రలో స్ట్రగుల్ చేస్తూ భిన్న పార్శ్వాల్ని ప్రదర్శించింది. అయితే సానుభూతి పొందే సన్నివేశాలు లేకపోవడం ఆమెకి మైనస్. ఆమె పాత్రతో వున్న కాన్సెప్ట్ ఇతర ప్రస్తావనలతో కంటిన్యూటీ దెబ్బతినడం కారణం.
        
బాలకృష్ణని ప్రేమిస్తూ వుండే కాజల్ అగర్వాల్ తో లవ్ ట్రాక్ నవ్వించే బదులు జాలి పుట్టించేలా వుంది. ఇంతకీ సైకాలజిస్టుగా ఆమె చేసిందేమిటో అర్ధం గాదు. ఆమె సైకాలజిస్టు పాత్రే తప్పేమో. ఆమె వైద్యం చేసే క్లినిక్ పెడితే సైకియాట్రిస్టు అవ్వాలి. ఇక విలన్ అర్జున్ రామ్ పాల్ చేసిందేమీ లేదు. పైగా అతడి సొంత కథతో వేరే ట్రాకు చాలా సినిమా నడుస్తుంది. ఎప్పుడైనా మెయిన్ కాన్సెప్ట్ స్త్రీ స్వశక్తీ కరణకి వచ్చి అడ్డుతగులుతా డనుకుంటే అదే జరగదు.
        
ఈ సినిమాలో పాటలకి ప్రాధాన్యం లేదు. కాబట్టి తమన్ సంగీతం అలంకారప్రాయంగా వుండిపోయింది. సీనియర్ కెమెరా మాన్ సి. రామ్ ప్రసాద్  ఛాయాగ్రహణం ఒక ఆకర్షణగా చెప్పుకోవాలి. మిగతా ప్రొడక్షన్ విలువలు బాలకృష్ణ స్థాయికి తగ్గి ఎలా వుంటాయి. సినిమాలో డైలాగుల మీద మంచి కృషి చేసినట్టుంది- బంజారా హిల్సు, జూబిలీ హిల్సు, చిచ్చా కొడితే మెడికల్ బిల్సు

చివరికేమిటి

    చెప్పాల్సిన కథ ఒకటైతే దానికేదేదో కలిపి ఏమేమో చెప్పారు. ప్రారంభంలో ఇంకో గొడవ వుంటుంది. ముంబాయిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ (సంజయ్ స్వరూప్) ప్రభుత్వం నుంచి ప్రాణ భయంతో ఫ్యామిలీని తీసుకుని స్లమ్స్ లో దాక్కుందాడు. రక్షించడానికి ఒక స్నేహితుడు వచ్చి భగవంత్ కేసరి కథ చెప్పడం మొదలెడతాడు.
        
ఫస్టాఫ్ బాలకృష్ణ శ్రీలీలని పెంచడం, మరోవైపు కాజల్ అగర్వాల్ బాలకృష్ణ వెంటపడడం జరుగుతూ వచ్చి, మధ్యలో విలన్ కథ మొదలై, అతను డిప్యూటీ సీఎంని చంపి, శ్రీలీల వెంటబడడంతో- బాలకృష్ణ అడ్డుకునే సీనుతో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్ బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇందులో విలన్ తో పాత పగ బయటపడ్డాక- ఫ్లాష్ బ్యాక్ ముగిసి- బాలకృష్ణ శ్రీలలకి ట్రైనింగ్ ఇప్పించే దృశ్యాల తర్వాత విలన్ తో క్లయిమాక్స్.
        
శ్రీలీలకి బలవంతపు ట్రైనింగ్. ఇలా కాకుండా, విలన్ తో ఆమె పడ్డ ప్రమాదానికి నువ్వే ఎదుర్కొమని బాలకృష్ణ మోటివేట్ చేసివుంటే, ఆమె కేర్పడే గోల్ ఆమె సొంత గోల్ అయ్యేది. మరొకరి గోల్ కోసం బతకకుండా. కథా కథనాల లోపాల వల్ల భగవంత్  కేసరి అందుకోవాల్సిన  స్థాయిని మాత్రం అందుకోలేక పోయింది.

—సికిందర్