రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

చిన్నప్పటి కథ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
చిన్నప్పటి కథ ప్రశ్న కోసం తేదీ ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. ఔచిత్యం ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

16, ఏప్రిల్ 2024, మంగళవారం

1423 : రివ్యూ

 

రచన -దర్శకత్వం: చిదంబరం
తారాగణం : సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్, లాల్ జూనియర్, ఖాలిద్ రెహమాన్ తదితరులు
సంగీతం : సుశీన్ శ్యామ్, ఛాయాగ్రహణం :             షైజూ ఖాలీద్
నిర్మాతలు : సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ
బ్యానర్ : పరవ ఫిలిమ్స్
తెలుగు పంపిణీ : మైత్రీ మూవీ మేకర్స్
విడుదల : ఏప్రిల్ 6, 2024
***
        టీవల రెండు మలయాళం సినిమాలు వసూళ్ళలోనూ సంచలనం సృష్టించాయి.  వాటిలో ఒకటి ప్రేమలు’. ఇది 135 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్ కూడా బాగానే వసూలు చేసింది. అలాగే మంజుమ్మల్ బాయ్స్  230 కోట్లు వసూలు చేసింది. దీని తెలుగు డబ్బింగ్  ఈ రోజు విడుదలైంది. దీని గొప్పదనమేమిటో ఓసారి చూద్దాం...

కథ
కేరళలోని కొచ్చి సమీపంలో మంజుమ్మల్ అనే చిన్న పట్టణానికి చెందిన రెండు స్నేహితుల సమూహాలుంటాయి. వీళ్ళెప్పుడూ తగాదాలు పడి కొట్టుకుంటూ వుంటారు. ఒకర్నిమించిన పనులు మరొకరు చేయాలని పోటీలు పడుతూంటారు. 2006 లో వీళ్ళల్లో ఆర్ట్స్ క్లబ్ గ్రూపు కొడైకెనాల్ విహార యాత్ర ప్లాన్ చేస్తారు. కొడైకెనాల్‌ అంతా తిరిగి ఎంజాయ్ చేశాక, గుణ గుహలు చూడాలని ఉత్సాహ పడతారు. కమలహాసన్ నటించిన గుణ షూటింగ్ ఇక్కడే జరగడంతో గుహల కీ పేరొచ్చింది. ప్రమాదకరమైన ఈ గుహాల్లోకి ప్రవేశాన్ని నిషేధించి  ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ దూకి సాహసం ఛేస్తారు మంజుమ్మల్ బాయ్స్. అలా గుహలు చూస్తూ తిరుగుతూంటే బాయ్స్ లో ఒకడైన సుభాష్ (శ్రీనాథ్ భాసి) మనిషి వెడల్పుగల లోతైన రంధ్రం లో పడిపోతాడు. ఇది ప్రాణాంతక బిలం. ఇందులోకి ఇంతవరకూ 16 మంది పడిపోతే శవాల్ని కూడా బైటికి తీయలేక పోయారు.
       
ఇప్పుడు సుభాష్ పడిపోవడంతో మిత్రబృందం భయంతో కేకలు వేస్తారు. పోలీస్ స్టేషన్ కి పరిగెడతారు. గ్రామస్థులకి చెప్పుకుంటారు. పోలీసులు ఉల్టా కేసు బనాయిస్తారు. కాళ్ళావేళ్ళా పడ్డాక పోలీసు
,లు, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులూ అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తారు. తాడు సాయంతో లోపలికి వెళ్ళి బాధితుడ్ని పైకి తీసుకు రావడానికి సిబ్బంది ముందుకు రారు. మంజుమ్మల్ బాయ్స్ లో ఒకడైన కుట్టన్ (
సౌబిన్ షాహిర్) ముందుకొస్తాడు.
       
కుట్టన్ ఈ సాహసం చేయడానికి కారణముంది. ప్రాణాలు పణంగా పెట్టి  స్నేహితుడ్ని కాపాడేందుకు అతను పూనుకోవడానికి ప్రేరేపించిన ఆ కారణమేంటి
? అలా స్నేహితుడ్ని ప్రాణాలతో కాపాడుకోగలిగాడా? ఇందుకు అధికార్లు అందించిన సహాయక చర్యలేమిటి? అసలు వందల అడుగుల లోతులో పడిపోయింది గాక, భారీగా కురిసిన వర్షం నీళ్ళల్లో సుభాష్ బతికున్నాడా? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగతా కథ. 

యదార్థంతో ప్రయోగం
ఇది యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సర్వైవల్ డ్రామా.  యదార్థ సంఘటనలతో మలయాళంలో వరుసగా మూడు సర్వైవల్ డ్రామాలు హిట్టయ్యాయి. కేరళ వరద బీభత్సం మీద ’2018’ (2023), గుణ గుహల మీద మంజుమ్మల్ బాయ్స్ (2024), సౌదీ వలస కార్మికుడి మీద ఆడు జీవితం (2024).  గుణ గుహలు  అనేవి తమిళనాడులోని కొడైకెనాల్ లో వున్న ఒక గుహల సముదాయం. ఈ సముదాయంలో మనిషి పట్టే వెడల్పుతో లోతైన బిలాన్ని 1821లో బీఎస్ వార్డ్ అనే బ్రిటిష్ అధికారి రికార్డు చేశాడు. దీనికి అతను డెవిల్స్ కిచెన్ అని పేరు పెట్టాడు. 1991 లో ఇక్కడ కమలహాసన్ సినిమా గుణ షూటింగ్ జరిగినప్పట్నుంచీ ఇది పర్యాటక కేంద్రంగా ఆకర్షించ సాగింది. 2016 వరకూ ఈ బిలంలో పడిపోయిన వ్యక్తుల కేసులు 16 నమోదయ్యాయి. కేవలం మంజుమ్మల్ బాయ్స్ ఘటనలో ఒక్కడే బతికి బయట పడ్డాడు.
       
ఈ సినిమా చూస్తూంటే ఒక సందేహం వెంటాడుతూ వుంటుంది. అంత మంది ఆ రంధ్రం లో పడిపోతున్నప్పుడు ఇనుప మెష్ తో ఆ రంధ్రాన్ని ఎందుకు మూసేయలేదు
? కేవలం అక్కడికి చేరుకోకుండా ఎక్కడో ఫెన్సింగులు మాత్రమే వేసి ఎందుకు వదిలేశారు? ఈ విషయం తట్టే కాబోలు-

సినిమా చివర్లో ఇదే చూపించాడు దర్శకుడు- ఆ రంధ్రం మీద ధడేలుమని ఇనుప మెష్ పడేసి! కానీ క్రోనాలజీ ప్రకారం చూస్తే ఇది కరెక్ట్ కాదు. మంజుమ్మల్ బాయ్స్ ఉదంతం 2006 లోనే జరిగింది. అప్పుడు ధడేలుమని ఇనుప మెష్ పడేస్తే
, 2016 వరకూ ఇంకొన్ని మరణాలు ఎలా జరిగినట్టు? ఇంతకీ ఇప్పుడైనా మూసి వుందా లేదా? ఎవరైనా గూగుల్ చేసి కనుక్కోవాలి.

       
ఈ సర్వైవల్ డ్రామా 2 గంటల పకడ్బందీ సస్పెన్స్ థ్రిల్లర్. హ్యూమన్ డ్రామా.  అడ్వెంచర్స్ లో ఒక లెసన్. పర్యాటకులు నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కడ పడితే అక్కడికి ఎలా వెళ్ళిపోతారు
? ఈ గుహల్లో తేళ్ళు పాములైనా వుంటే? నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణ ఈ సర్వైవల్ డ్రామా.
        
అందుకే దీన్ని హార్రర్ కామెడీలా తీసి ఎంటర్ టైన్ చేయాలనుకోలేదు. తెలుగు చేతులైతే ఈ పనే చేసి సినిమా తీస్తాయి. వాడు రంధ్రంలో పడిపోయి ఆర్తనాదాలు చేస్తూంటే అక్కడ దెయ్యాల్ని కూడా జొప్పించి కామెడీ చేస్తారు. చివరికి ఏ వేపమండల అమ్మవారి ముందో కాంతారా డాన్సులు చేసి బిలంలో దెయ్యాల్ని చంపి అర్భకుడ్ని కాపాడతారు.

1. క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ (స్టీవెన్ స్పీల్ బెర్గ్ -1977),
2.
 ‘మంజుమ్మల్ బాయ్స్’ (మలయాళం- 2024)
 
బిలం అంతర్భాగాన్ని సెట్ వేసి షూటింగు జరిపారు. ఈ కథని కేవలం బిలంలో పడిపోయిన మిత్రుడి రెస్క్యూ ఆపరేషన్ గా చూపిస్తే ఇది సినిమా అయ్యేది కాదు. డాక్యుమెంటరీ అయ్యేది. ఈ ప్రమాదానికి సమానాంతరంగా  చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్స్ లో ఈ బాయ్సే అప్పటి పిల్ల మూక. వాళ్ళల్లో ఒకడు (సుభాష్) తన మీద ప్రాంక్స్ ప్లే చేసుకుంటూ వుంటాడు. ఆవిప్పుడు బిలంలో పడిపోవానికి సింబాలిక్ గా వుంటాయి. ఇలాటి ఫోర్ షాడోయింగ్ సీన్స్ తో సందర్భానుసారంగా ఫ్లాష్ బ్యాక్స్ రన్ అవుతూ వుంటాయి. ఒకసారి అంతా నదిలో దూకేసి ఈత కొడుతూంటారు. సుభాష్ నీ దూకెయ్యమంటారు. భయపడుతూ దూకేసిన సుభాష్ ఏమయ్యాడు? అప్పుడు వాడ్నిఎవరు కాపాడారు. ఇది ఇప్పటి  ప్రమాదంతో ఎలా లింకప్ అయింది? ఇప్పుడు కుట్టన్ రంధ్రంలోంచి సుభాష్ ని కాపాడ్డానికి ప్రేరణ ఏమిటి? లోనైన ఎమోషన్స్ ఏమిటి?

కదిలించే ఎమోషనల్ డ్రామా కూడా ఇది.  ఫ్రెండ్ షిప్ స్టోరీ కూడా. యువనటులతో యూత్ ఆడియెన్స్ పల్స్ ని పట్టుకున్న ప్రయోజనాత్మక సినిమా. నిడివి కేవలం రెండు గంటలు. తారాగణ బలం లేని సినిమాకి 20 కోట్ల బడ్జెట్ ప్రొడక్షన్ మీద పెట్టారు. తెలుగు ప్రేక్షకులు ఓటీటీలో వచ్చేదాకా ఆగకుండా బిగ్ స్క్రీన్ మీద చూస్తే దీని బలం పదింతలు తెలుస్తుంది. ఆడు జీవితం తర్వాత బలమైన సినిమా చూడాలనుకుంటే ఇదే.

2024 లో సందర్శకుల్ని ఆకర్షించడానికి గుహకు వెళ్ళే రహదారిని  తిరిగి తెరిచారు. అయితే పర్యాటకుల భద్రత కోసం గుహ ప్రవేశ ద్వారం ఇప్పటికీ మూసివేసే వుంచారు. ఈ సినిమా ప్రారంభ ముగింపుల్లో గుణ లో కమల హాసన్ వెంటాడే పాట ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఇళయరాజా స్వరకల్పనలో వస్తూంటుంది. గుహ బాధితుల్ని పరామర్శిస్తున్నట్టు.

—సికిందర్

5, మార్చి 2024, మంగళవారం

1411 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : పురుషోత్తం రాజ్
తారాగణం : శివ కందుకూరి, రాశీ సింగ్, దేవీ ప్రసాద్, ర్శిణీ సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్, ఛాయాగ్రహణం : గౌతమ్. జి
నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడింబి
విడుదల : మార్చి 1, 2024
***
        రో సస్పెన్స్ థ్రిల్లర్ ఈవారం వెండి తెరనలంకరించింది. హీరో శివ కందుకూరి చూసీ చూడగానే’, గమనం అనే రెండు సినిమాల్లో నటించిన నటుడు. వీటితో గుర్తింపేమీ రాలేదు. ఇక టైటిల్ రోల్ పోషిస్తేనే గుర్తింపుకి అవకాశం వుండగలదని భూతద్దం భాస్కర్ నారాయణ లో నటించినట్టుంది.  ఇది డిటెక్టివ్ పాత్ర. దీని కథకి ప్రయోగాత్మకంగా పురాణ కథతో లింకు పెట్టారు. అదేమిటో చూద్దాం.

కథ

ఆంధ్ర -కర్ణాటక సరిహద్దులోని అడవుల్లో కర్ణాటక వైపు కొన్నేళ్ళుగా స్త్రీల శవాలు బయటపడుతూంటాయి. అవి తలలు తెగి, మొండెమ్మీద దిష్టి బొమ్మలు అమర్చి వుంటాయి. ఇవి సీరియల్ కిల్లింగ్స్ అని తెలిసిపోతున్నా ఆ సీరియల్ కిల్లరెవరో దొరకడు. తలలు దొరక్కపోవడంతో శవాలెవరివో గుర్తించడం కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఆంధ్రావైపు గ్రామంలో చిన్నతనం నుంచీ డిటెక్టివ్ అవ్వాలన్న కోరికతో భాస్కర్ నారాయణ పెరుగుతాడు. గ్రామంలోనే డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. లుంగీ కట్టుకుని వుంటాడు. ఇతడి తెలివి తేటలకి మెచ్చి పోలీసులు హత్య కేసుల్లో సైతం ఇతడి సాయం తీసుకుంటూ వుంటారు. ఇలా వుండగా, ఈసారి ఆంధ్రా గ్రామం వైపు అడవిలో దిష్టి బొమ్మ అమర్చిన మరో స్త్రీ శవం బయటపడుతుంది. ఇక డిటెక్టివ్ భాస్కర్ ఈ కేసుని పరిశోధించడానికి రంగంలోకి దిగుతాడు.
       
ఈ శవాలు అసలెవరివి
? అజ్ఞాతంగా వుంటున్న సీరియల్ కిల్లరెవరు? ఎందుకీ రకంగా హత్యలు చేస్తున్నాడు? వీణ్ణీ పట్టుకోవడమెలా? పరిశోధన మొదలెట్టిన డిటెక్టివ్ భాస్కర్ తెలుసుకున్న కొత్త సంగతులేమిటి? అసాధ్యుడుగా వున్న సీరియల్ కిల్లర్ని చివరికి పట్టుకోగలిగాడా లేదా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ మధ్య కాంతారా హిట్టయినప్పట్నుంచీ డివైన్ జానర్ సినిమాలు ఒక ట్రెండ్ గా వస్తున్నాయి. కార్తికేయ 2’, విరూపాక్ష’, హిడింబ’, మా వూరి పొలిమేర’, మంగళవారం హనుమాన్’, ఊరి పేరు భైరవకోన లాంటివి. ఈ వరుసలో భూతద్దం భాస్కర్ నారాయణ చేరింది. అయితే ఒక డిటెక్టివ్ కథకి డివైన్ జానర్ ని కల్పించడం ఇదే తొలిసారి. అదీ పురాణంతో కలిపి. పురాణంలో మహిషాసురుడి కథకి, కథలో జరుగుతున్న హత్యలతో ముడిపెట్టి డిటెక్టివ్ జానర్ లో కొత్త ప్రయోగం చేశారు. దీంతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా తయారయ్యింది.
       
అయితే విషయం కొత్తగా వున్నా చెప్పడం అంత కొత్తగా లేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ పాత సినిమా చూస్తున్నట్టు వుంటుంది. భాస్కర్ డిటెక్టివ్ అవడానికి చిన్నప్పటి సన్నివే శాలు
, పెద్దయ్యాక కుటుంబ సభ్యులతో సీన్లు, అతను గాయపడితే వాళ్ళ ఏడ్పులతో డ్రామా, జర్నలిస్టుతో అతడి ప్రేమ, ఇలా డిటెక్టివ్ జానర్ మర్యాదలకి పాత మూస సీన్లు అడ్డుపడుతూ కథ థ్రిల్లింగ్ గా సాగదు. యాక్షన్ తో గాకుండా డైలాగులతో కథ నడపడం ఎక్కువవడంతో ఫస్టాఫ్ నత్త నడక నడుస్తున్నట్టు వుంటుంది.
       
సెకండాఫ్ లోనే డిటెక్టివ్ కథ ప్రొఫెషనల్ గా సాగుతుంది. జరుగుతున్న హత్యలకి క్లూస్ సంపాదించడం
, అవి సీరియల్ కిల్లర్ కి దారితీయించే క్రమంలో ఒకొక్కటే ఇతర పాత్రలు సీరియల్ కిల్లర్ అన్నట్టుగా రివీలవడం, ఈ క్రమంలో ఈ వరస హత్యలకి పురాణంతో సంబంధముందని ఆధారాలు దొరకడంతో కథ మిస్టీరియస్ గా కొత్త మలుపు తిరుగడం... ఇలా సాగుతున్నాక, హంతకుడు శవాలకి తగిలిస్తున్న దిష్టిబొమ్మలు నిజానికి మహిషాసురుడి దిష్టి బొమ్మలని తెలియడంతో ఉత్కంఠ పెరుగుతుంది. ఇక దీంతో హంతకుడికేం సంబంధమనే ప్రశ్నతో చిట్టచివర్లో హంతకుడ్ని పట్టుకుంటే - అతను మొత్తం రివీల్ చేస్తాడు. అయితే పురాణకథని వాడుకోవడం బాగానే వున్నా, ముగింపు మూఢనమ్మకంగా ముగుస్తుంది. డిటెక్టివ్ క్యారక్టర్ ఆ హంతకుడి ఆలోచనలు మూఢనమ్మకమని ఖండించి వుంటే సరైన సందేశం వెళ్ళేది.

నటనలు –సాంకేతికాలు

దృష్టి లోపంతో చిన్నప్పుడే కళ్ళద్దాలు వచ్చిన హీరోకి ఆ అద్ధాలతో కలిపి భూతద్దం  భాస్కర్ నారాయణ పేరొచ్చింది. డిటెక్టివ్ కి అలంకారం భూతద్దమే కాబట్టి టైటిల్ కూడా ఇలా జస్టిఫై అయింది. గ్రామంలో ఈ డిటెక్టివ్ పాత్ర హాస్య పాత్రే అయినా హీరో శివ కందుకూరి నవ్వించే ప్రయత్నం చేయడు. ఆ పని అసిస్టెంట్ చేస్తాడు. మరొకటేమిటంటే,  డిటెక్టివ్ పాత్ర లుంగీ కట్టుకుని తిరగగడం. ఈ పాత్రకి యాక్షన్ తో కూడిన ఫన్నీ సీన్స్ వుండుంటే ఫస్టాఫ్ స్పీడుగా సాగేది. డిటెక్టివ్ కథంటే అద్భుత రసంతో చెప్పాల్సిన కథ అనీ జానర్ మర్యాద మర్చిపోతే ఎలా?
        
సెకండాఫ్ లో శివ కందుకూరి యాక్షన్ లో కొచ్చి పాత్రని పాక్షికంగా నిలబెడతాడు. ఎలాగంటే డిటెక్టివ్ గా అతడికి ఏ ప్రత్యేకతలుండవు. ఇలాటి పరిస్థితుల్లో ఒక సాధారణ యూత్ ఎలా ప్రవర్తిస్తాడో ఆ లెవెల్లో వుంటాడు. డిటెక్టివ్ అయినందుకు ఇంట్లో వ్యతిరేకతతో బాటు, చిన్నప్పుడు అన్న చావు ఆత్మహత్యకాదనీ, అది హత్య  అనీ నిరూపించలేకపోయిన అసమర్ధత, అతడి పర్సనాలిటీలో పట్టుదలని, అసాధారణ స్కిల్స్ నీ కల్పించి వుండాలి. అప్పుడే క్యారక్టర్ పోషించడానికి, అందులో రాణించ డానికీ వీలుంటుంది.
       
జర్నలిస్టు పాత్రలో రాశీ సింగ్ ది చిన్న పాత్ర. పోలీసు అధికారిగా దేవీ ప్రసాద్ ది క్లయిమాక్స్ ని మలుపు తిప్పే పెద్ద పాత్ర. ఈ పాత్రని సమర్ధవంతంగా పోషించాడు. షఫీ, శివ కుమార్, సురభి సంతోష్ తదితరులు సహాయ పాత్రల్లో కనిపిస్తారు.
        
శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం, గౌతమ్ జి ఛాయాగ్రహణం మరీ గొప్పగా ఏం లేవు. పరిమిత బడ్జెట్ కి తగ్గట్టున్నాయి. కొన్ని అవసరం లేని షాట్స్ బడ్జెట్ పెరగడానికే పనికొచ్చాయి. ఒక విషయం అడగడానికి హీరో బృందం ఇన్స్ పెక్టర్ ఇంటి దాకా రావడం, అడిగి వెళ్ళి పోవడం అనవసరం లేని సీను. ఫోన్లో అడిగితే సరిపోయేది. ఇక సెకండాఫ్ లో కాస్త కథ, మలుపులు తగ్గిస్తే సినిమా భారంగా వుండేది కాదు. ఈ థ్రిల్లర్ కి రెండు గంటల నిడివి చాలు. 
        
మొత్తానికి ఈ కొత్త ప్రయోగపు డిటెక్టివ్  సినిమా సెకండాఫే కథ అన్నట్టు  గాకుండా ఫస్టాఫ్ లో కూడా కాస్త బిగి వున్న కథతో -యూత్ అప్పీల్ తో ప్రొఫెషనల్ గా నడిపివుంటే ఎక్కువ రోజులు ఆడే అవకాశముంటుంది. డిటెక్టివ్ కథలో డిటెక్టివ్ కి కుటుంబ పాత్రలు, సెంటిమెంట్లు, డ్రామాలు ఫీల్ ని చెడగొడతాయి. డిటెక్టివ్ లకి, గూఢచారులకి కుటుంబాలు, కుటుంబ సమస్యలూ వుండవు. ప్రపంచ సమస్యలే  ఈ పాత్రల సమస్యలు!

—సికిందర్

18, నవంబర్ 2023, శనివారం

1379 : రివ్యూ


 రచన -దర్శకత్వం: అజయ్ భూపతి

తారాగణం : పాయల్ రాజ్‌పుత్, నందితా శ్వేతా, రవీంద్ర విజయ్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, శ్రవణ్ రెడ్డి, దివ్యా పిళ్ళై, అజయ్ ఘోష్ తదితరులు  
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్
బ్యానర్ : ముద్ర  మీడియా వర్క్స్
నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ, అజయ్ భూపతి
విడుదల : నవంబర్ 17, 2023
***

        ‘ఆర్ ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి మూడో సినిమా ‘మంగళవారం’. ఇందులో పాయల్ రాజ్పుత్ హీరోయిన్. అజయ్ భూపతి పాయల్ రాజ్పుత్ తో అడల్ట్ మూవీ ఆర్ ఎక్స్ 100 తీసిన తర్వాత శర్వానంద్- సిద్ధార్థ్ లతో తీసిన మహాసముద్రం హిట్ కాలేదు. పాయల్ కూడా ఆర్ ఎక్స్ 100  తర్వాత నటించిన 8 సినిమాలూ హిట్ కాలేదు. తిరిగి ఇప్పుడు ఇద్దరూ ఇంకో అడల్ట్ మూవీ మంగళవారం తో తిరిగి వచ్చారు. మరి ఈసారి ఆర్ ఎక్స్ 100 లాంటి మ్యాజిక్ వర్కౌట్ అయిందా? ఈ విషయం తెలుసుకుందాం...

కథ  

    రాజమండ్రి దగ్గర్లో ఓ గ్రామంలో గ్రామ దేవతకి ఇష్టమైన  మంగళవారం రోజు రెండు ఆత్మహత్యలు జరుగుతాయి. దీనికి ముందు రోజు మృతులిద్దరికీ అక్రమ సంబంధముందని గోడ మీద ఎవరో రాస్తారు. కొత్తగా వచ్చిన ఎస్సై మాయ (నందితా శ్వేత) వీటిని హత్యలుగా అనుమానించి పోస్ట్ మార్టంకి పంపించబోతే జమీందారు (కృష్ణ చైతన్య) అడ్డుపడతాడు. తిరిగి మళ్ళీ మంగళవారం ఇలాగే ఇంకో రెండు ఆత్మహత్యలు జరుగుతాయి. వీళ్ళిద్దరికి కూడా అక్రమ సంబంధముందని ముందురోజు ఎవరో గోడ మీద రాస్తారు. దీంతో ఎస్సై మాయ  ఈ నాలుగు మరణాలని హత్యలుగా భావించి చర్యలు తీసుకుంటుంది. ఇవి హత్యలైతే ఎవరు ఎందుకు చేస్తున్నారు? గోడల మీద రాస్తోందెవరు రు? ఈ వ్యవహారంలో జమీందారు, జమీందారు భార్య (దివ్యా పిళ్ళై), ఫోటోగ్రాఫర్ (శ్రవణ్ రెడ్డి), డాక్టర్ (రవీంద్ర విజయ్) ల ప్రమేయం ఏమిటి? కొన్నాళ్ళ ముందు ఊరంతా వెలి వేసిన శైలు (పాయల్ రాజ్పుత్) కథ ఏమిటి? ఆమె ప్రేమించిన మదన్ (అజ్మల్ అమీర్) వ్యవహారమేమిటి? చివరికి ఏం తేల్చింది ఎస్సై మాయ? ఈ ప్రశ్నలకి సమాధానాలు మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

    ఏ- సర్టిఫికేట్ పొందిన ఈ అడల్ట్ సినిమా కథ నింఫోమేనియక్(అదుపులో లేని  కామకోరికల) యువతి గురించి. నింఫోమేనియా మీద హాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలొచ్చాయి. దీన్ని తెలుగులో ప్రయత్నించారు. ఈ నింఫోమేనియా బాధితురాలి చుట్టూ వాళ్ళవాళ్ళ అవసరాలతో చాలామంది నేరాలు ఘోరాలకి పాల్పడతారు. చివరి అరగంట కథలో ఇవి పొరలుపొరలుగా బయటపడతాయి. అయితే కథంతా ఈ బాధితురాలి సమస్యకి పరిష్కారం వెతికే మానవత్వం చూపించక, అడుగడుగునా ఆమె పట్ల క్రూరత్వమే ప్రదర్శించి అంతమొందించడం సినిమాకోసం అవసరమై వుండొచ్చు.
       
ప్రధాన పాత్ర పోషించిన పాయల్ ఇంటర్వెల్ వరకూ కనిపించదు. ఫస్టాఫ్ గ్రామంలో మరణాలు
, వివిధ పాత్రలు వాటి పరిచయాలు, స్వభావాలు, వేడుకలు, కొట్లాటలు ఇవే సాగుతూ, ఇంటర్వెల్ షాట్ లో పాయల్ మిస్టీరియస్ గా కనిపించడంతో ముగుస్తుంది. ఇలా ప్రధాన పాత్ర లేని, కథ ప్రారంభం కాని ఫస్టాఫ్ తో బోరు కొట్టకుండా కాస్త ఎంటర్ టైన్ కూడా చేస్తూ నడిపాడు దర్శకుడు.
       
ఇంటర్వెల్లో ఎంట్రీ ఇచ్చిన పాయల్ తో సెకండాఫ్ కథ ఒక ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆమె కాలేజీకి వెళ్ళడం
, కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్ మదన్ తో ప్రేమాయణం చాలా పేలవంగా సాగుతాయి.  అయితే ఈ ఎపిసోడ్ లోనే పాయల్ మానసిక రుగ్మత తాలూకు చిహ్నాలు కన్పిస్తాయి. అవి పెరిగి పెరిగి లైంగికంగా ఆమె విచ్చల విడితనానికి దారి తీస్తాయి. ఈ మలుపు దగ్గర్నుంచి కథ ఇంకెన్ని మలుపులు తిరిగిందన్నది వెండి తెరపైనే చూడాలి.  
       
చివరి అరగంటలోనే ఐదారు మలుపులు
, వాటి ఫ్లాష్ బ్యాకులు మొత్తం జరిగిన నేరాల చుట్టూ కథని సమప్ చేస్తాయి. దీన్ని లాజికల్ గా పకడ్బందీగా పోషించాడు దర్శకుడు. ఫస్టాఫ్ లో కనిపించిన వివిధ పాత్రలు ఇక్కడ సర్ప్రైజింగ్ గా రివీలవుతాయి. అయితే చివర్లో ముసుగు వ్యక్తి ఎవరన్న సస్పెన్స్ ని విప్పినప్పుడు ఈ హైడ్రామా తేలిపోతుంది. అసలు ముసుగు వ్యక్తి ఎవరై వుంటాడో పెద్ద సస్పెన్స్ కాదు. ఎందుకంటే ఫస్టాఫ్ ప్రారంభంలో పాయల్ చిన్నప్పటి కథలో అతను చనిపోయినట్టు చూపించారుగానీ, పాత్రని బట్టి బతికే వుంటాడనీ, తిరిగి వస్తాడనీ వూహించేయ వచ్చు.
       
కాబట్టి ముగింపులో హల్చల్ చేస్తున్న ముసుగు వ్యక్తి ఎవరై వుంటాడో ఇట్టే తెలిసిపోతుంది. అయితే సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం ఇంకో ఫినిషింగ్ టచ్ ఇచ్చి వుండొచ్చు. ముసుగు తీసినప్పుడు అతను ఎవరైనా పాపులర్ హీరో అయివుంటే సర్ప్రైజ్ చేసే వాడు. ముగింపు నెక్స్ట్ లెవెల్లో వుండేది. ఈలలు పడేవి. ఇలా కాకుండా ఎవరో తెలియని ఆర్టిస్టుని చూపించారు. ఆ స్థానంలో వుండాల్సింది ఎంతో కొంత గుర్తింపు వున్న హీరో. ఎవరైనా తెలిసిన హీరో అయివుంటే పాయల్ లాంటి హీరోయిన్ కోసం డ్రామా ఎక్సైటింగ్ గా ఎలివేట్ అయ్యేది. అనామకుడితో
, అతడి అనుభవం లేని నటనతో పూర్తిగా విఫలమైంది. దీని తర్వాత రెండు పాత్రలతో వేరే ట్విస్టులు ముగింపుని నిలబెడతాయి.

నటనలు- సాంకేతికాలు

    ఫస్టాఫ్ ప్రారంభంలో పాయల్ చిన్ననాటి కథ వుంటుంది. ఇంటర్వెల్లో హార్రర్ ఎంట్రీ ఇచ్చాక సెకండాఫ్ లో అరగంట ఫ్లాష్ బ్యాక్ లో ఆమె కనిపిస్తుంది. కాకపోతే ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే మూసి పెట్టిన ఆమె కథని, వివిధ పాత్రలు వాటి ఫ్లాష్ బ్యాకులు చెప్తూ ఆమెని తెరపైకి తీసుకొస్తూంటారు. దీంతో పాయల్ సెకండాఫ్ అంతా కన్పిస్తుంది. ఈ సెకండాఫ్ అంతా ఆమెది నాన్ స్టాప్ ఏడుపే. ప్రతీ సీనులో ఆమని కొట్టడం,వాడుకోవడం, వెళ్ళగొట్టడం తాలూకు ఏడ్పులే వుంటాయి. ఇలా పాత్ర మానసిక సంఘర్షణతో బలమైనదే. దీన్ని పకడ్బందీగా పోషించింది. ఆర్ ఎక్స్ 1000 కంటే ఈ పాత్ర బలమైనదే. ఇది నటించడానికి ధైర్యం కూడా కావాలి. కాకపోతే కథగా పాత్రకి న్యాయం జరగలేదు. ఆమె పాత్రని మిగతా పాత్రల కథలు కమ్మేయడంతో, ఆఖరికి పటానికి దండేసి వూరంతా కొలిచే పాత్ర వేరే అయింది.
        
ఇక బాగా ఆకట్టుకునే ఇంకో పాత్ర డాక్టర్. ఈ పాత్రలో రవీందర్ విజయ్ చివరి ట్విస్టుల్లో పాయల్ కంటే ఎక్కువ సానుభూతిని కొట్టేస్తాడు. రియల్ హీరో అనిపిస్తాడు. జమీందారుగా చైతన్య కృష్ణకి నటించే అవకాశమున్న పాత్ర దక్కింది. జమీందారు భార్యగా దివ్యా పిళ్ళై ముగింపులో విజృంభిస్తుంది. అన్ని పాత్రల మధ్య కరివేపాకు పాత్ర ఎస్సైగా వేసిన నందితా శ్వేతదే. ఈమె వూళ్ళో పోలీసు గస్తీ పెట్టిస్తే ఒక్క మర్డర్ జరగదు. ఆ పని చేయదు. పాత్రలిచ్చే ట్విస్టులు చూసి తెల్లబోవడం తప్ప.
       
అంధుడి పాత్ర వేసిన ఆర్టిస్టుతో అజయ్ ఘోష్ కామెడీ చేశాడు- డబుల్ మీనింగుల కామెడీ. ఫోటో గ్రాఫర్ గా శ్రవణ్ రెడ్డిది కీలక పాత్రే. ఇంగ్లీష్ లెక్చరర్ గా అజ్మల్ అమీర్ కి పాయల్ తో రోమాన్స్
, ఒక పాట, కొన్ని అడల్ట్ సీన్స్ కుదిరాయి.
       
అజనీష్ లోక్‌నాథ్
సంగీతంలో మూడు పాటలున్నాయి. జాతర పాట చిత్రీకరణ సహా హైలైట్. దాశరథి శివేంద్ కెమెరా వర్క్ చెప్పుకోదగ్గది సీజీ సహా. సాంకేతికంగా సినిమా బలంగా వుంది. దర్శకుడు అజయ్ భూపతి తిరిగి ఆర్ ఎక్స్ 100 రేంజికి చేరుకోకపోయినా యూత్ అప్పీల్ లేని అడల్ట్ మూవీతో ఫర్వాలేదనిపించే కొత్త ప్రయోగం మాత్రం చేశాడు.
—సికిందర్

16, సెప్టెంబర్ 2023, శనివారం

1364 : రివ్యూ!

రచన-దర్శకత్వం : ఆదిక్ రవిచంద్రన్
తారాగణం : విశాల్, రీతూ వర్మ, అభినయ, సునీల్, ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, రెడిన్ కింగ్స్లే, నిళంగల్  రవి, వైజీ మహేంద్ర తదితరులు
సంగీతం : జివి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : అభినందన్ రామానుజం
నిర్మాత : వినోద్ కుమార్
విడుదల : సెప్టెంబర్ 15, 2023
***

        పురచ్చి దళపతి (విప్లవ దళపతి అని టైటిల్స్ లో వేశారు) విశాల్ 2017 లో తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్’) హిట్టయిన తర్వాత, వరుసగా 9 ఫ్లాపులిచ్చి కూడా విప్లవ దళపతి అన్పించుకోవడం విచిత్రం. ఒకే రకమైన మాస్ యాక్షన్ సినిమాలు అతడిని ముందుకెళ్ళకుండా చేశాయి. ఇప్పుడు కూడా మాస్ యాక్షన్నే తీసుకుని మార్క్ ఆంటోనీ నటించాడు. అయితే ఇక్కడ నిజమైన విప్లవం తీసుకొచ్చాడు. ఈ మాస్ యాక్షన్ కి సైన్స్ ఫిక్షన్ జోడించి విప్లవాత్మకంగా ఒక కొత్త వెరైటీని సృష్టించాడు. గతంలో  త్రిష-ఇలియానా-నయనతార’, ఏఏఏ’, బాఘీరా అనే మూడు తమిళ సినిమాలు తీసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ కొత్త వెరైటీని ప్రేక్షకుల ముందుంచాడు. ఇందులో ఎంతవరకు విశాల్ ని నిలబెట్టేందుకు కృషి చేశాడో తెలుసుకుందాం....

కథ

1975 లో డాన్ ఆంటోనీ (విశాల్), గాడ్ ఫాదర్ జాకీ మార్తాండ (ఎస్ జె సూర్య) మంచి దోస్తులు. వీళ్ళ శత్రువు గ్యాంగ్ స్టర్ ఏకాంబరం (సునీల్), ఆంటోనీ వల్ల తన తండ్రి చనిపోయాడని ఆంటోనీని చంపేస్తాడు. అప్పుడు ఆంటోనీ కొడుకు మార్క్ ఆంటోనీ (యంగ్ విశాల్) ని జాకీ మార్తాండ కన్నకొడుకులా పెంచుకుంటాడు. మార్క్ ఆంటోనీ తల్లి వేదవల్లి (అభినయ) కిచ్చిన మాట కోసం తండ్రిలా ఆయుధాలు పట్టకుండా మెకానిక్ అవుతాడు.
       
తర్వాత 1995 లో గ్యారేజి నడుపుకుంటున్న మార్క్ ఆంటోనీతో రమ్య (రీతూవర్మ) ప్రేమలో పడుతుంది. ఇలా వుండగా
, ఒక సైంటిస్టు 30 ఏళ్ళు కష్టపడి తయారు చేసిన టెలిఫోను గ్యారేజీలో మూలన పడి వుంటుంది. ఆ టెలిఫోన్ కి టైమ్ ట్రావెల్ ఫోన్ అని పేరు పెట్టాడు. దాన్ని డయల్ చేస్తే కాల్స్ వర్తమానం నుంచి గతంలోకి వెళ్తాయి. ఈ ఫోను అనుకోకుండా మార్క్ ఆంటోనీకి తగిలే సరికి, ఆ బుక్కులో వున్న సూచనల ప్రకారం 1975 లో చనిపోక ముందు తన తల్లి నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. అప్పట్లో తన తల్లిని తండ్రి చంపేశాడని అతడికి తెలుసు. అందుకని ఇప్పుడు చిన్నప్పటి తనకే ఫోన్ చేసి, తల్లిని కాపాడుకోమని హెచ్చరిస్తాడు...ఐతే ఇక్కడే మొత్తం మలుపు తిరుగుతుంది.
       
అసలు తల్లిని చంపిందెవరు
? తండ్రిని చంపింది కూడా ఎవరు? చనిపోయిన తండ్రి ఇప్పుడెలా బతికున్నాడు? బతికున్న జాకీ మార్తాండ ఇప్పుడెలా చచ్చిపోయాడు? ఈ మొత్తం గేమ్ లో ఏకాంబరం పాత్రేమిటి? నిజాలు బయటికి తీయడానికి, ఆ నిజాలతో శత్రువు మీద పగదీర్చుకోవడానికీ మార్క్ ఆంటోనీకి టెలిఫోన్ ఎలా ఉపయోగపడింది? మొత్తానికి మొత్తం తనే వెళ్ళి 1975 కాలంలో ఎలా పడ్డాడు? చివరికేమైంది? ఇదీ మిగతా కథ. 

ఎలావుంది కథ

ఇది గమ్మత్తయిన గ్యాంగ్ స్టర్స్ కథ. 2011లో డేనియల్ క్రేగ్, హారిసన్ ఫోర్డ్ లతో కౌబాయ్స్ అండ్ ఎలియెన్స్ అనే హాలీవుడ్ మూవీ ఇలాటిదే గమ్మత్తయిన కథతో వచ్చింది. సాధారణంగా గ్రహాంతర జీవులతో సైన్స్ ఫిక్షన్ కథలు వర్తమాన కాలపు కథలుగా వచ్చాయి. అలాటిది 19 శతాబ్దంలో కౌబాయ్స్, తమపై కొచ్చిన గ్రహాంతర జీవులతో పోరాడే కొత్త సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా తీసి సంచలనం సృష్టించారు.      ఇలాగే టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ కథలు ప్రేమ సినిమాలుగానో, ఇంకేదైనా యాక్షన్ సినిమాలుగానో వచ్చాయి. కానీ గ్యాంగ్ స్టర్స్ కథని టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ తో కలిపి యాక్షన్ సినిమాగా తీయడం ఇదే మొదటిసారి. అందుకని ఆద్యంతం ఇది కొత్త థ్రిల్ ని స్తుంది.
       
రెండోదేమిటంటే
, ఈ గ్యాంగ్ స్టర్స్ కథ సీరియస్ గా లేకపోవడం. ఫన్నీగా, కామిక్ సెన్స్ తో లైట్ గా తీసుకుని చంపుకోవడాలు, శతృత్వాలు వుండడం. అందుకని టైంట్రావెల్ ఎలిమెంట్ తో –ట్విస్టులతో థ్రిల్ చేస్తూ నవ్విస్తుంది. ఈ కామెడీకి కేంద్రబిందువు జాకీ మార్తాండగా నటించిన దర్శకుడు ఎస్ జె సూర్య. మూడోది, ఎక్కడా స్లో అవకుండా సీన్స్, యాక్షన్ స్పీడుగా సాగడం. నాల్గోది 1975, 1995 రెండు కాలాల కాల్పనిక ప్రపంచాలు చాలా వరకూ నైట్ సీన్లతో, లైటింగ్ ఎఫెక్ట్స్ తో కనువిందు చేయడం.
       
అయితే ఫస్టాఫ్ ఇంటర్వెల్ కొచ్చేసరికి ఎవరు ఎవర్ని చంపారో సస్పెన్స్ వీడిపోయి- విలన్ ని చంపడంతో కథైపోతుంది. ఇక్కడే ఒక చిన్న ట్విస్టుతో మళ్ళీ కథ పుట్టి సెకండాఫ్ లో కెళ్తుంది. ఫస్టాఫ్ లో టెలిఫోన్ తో మేనేజ్ చేసిన విశాల్
, ఇప్పుడు తానే వెళ్ళి 1975 కాలంలో కెళ్ళి పడేసరికి- అక్కడ తన తండ్రిని చంపిన వాడికోసం వేచివున్న ఎస్ జె సూర్య చేతిలో పడతాడు. ఆ టెలిఫోన్ కూడా సూర్య చేతిలో పడేసరికి కథ ఇంకో మలుపు తిరిగి ఫన్ గా మారుతుంది.
       
ఈ సెకండాఫే కథ ఆగిన చోటే మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి
, ఇంకో రూపంలో రిపీటవడంతో - టైమ్ లూప్ స్క్రీన్ ప్లేగా, సర్క్యులర్ స్క్రీన్ ప్లేగా మారిపోయి మూడ్ చెడగొడతుంది. అర్ధం జేసుకోవడానికి భారంగా మారుతుంది. టైమ్ ట్రావెల్ జానర్లో ఈ కొత్త గా అన్పింఛే సైన్ ఫిక్షన్ కథని మళ్ళీ ఇన్ని క్రియేటివిటీలతో సంక్లిష్టం చేయనవసరం లేదు. దీన్ని దాటేసే ప్రయత్నం చేస్తూ ఎస్ జె సూర్య కామెడీ లేకపోతే, విశాల్  నటించిన ఈ సినిమా కూడా చాలా ప్రమాదంలో పడేది.

నటనలు – సాంకేతికాలు

తండ్రిగా కొడుకుగా విశాల్ నటించిన రెండు పాత్రలు ఇదివరకు సినిమాల్లోని అతడి ఒకే మూస యాక్షన్ పాత్రలకి కాస్త భిన్నంగా వున్నాయి. ముఖ్యంగా అమాయకుడైన కొడుకు పాత్రలో కొత్త గెటప్ తో నటించడానికున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అమాయకత్వంతో బాటు పిరికితనం కూడా బాగా నటించాడు.
       
అయితే విశాల్ ని ఎస్ జె సూర్య కామిక్ విలనీతో డామినేట్ చేశాడు. సూర్య లేకపోతే ఈ మైండ్ లెస్ కామెడీ ఫెయిలయ్యేది. సెకండాఫ్ లో యంగ్ విశాల్ చాలా సేపు కనిపించకపోవడంతో
, ఆ లోటుని సూర్యయే తెగ నవ్వించే విలనీతో భర్తీ చేశాడు. 
       
హీరోయిన్ రీతూవర్మ మాత్రం ఎప్పుడో గానీ కనిపించదు. ఈ సూపర్ ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లో ఆమెతో రోమాన్స్ కి
, సాంగ్స్ కీ చోటు లేదు. వుంటే స్పీడ్ బ్రేకర్స్ లా బోరు కొట్టేవేమో. విశాల్ తల్లిగా అభినయది చిన్న పాత్ర. విశాల్ తో వుండే కమెడియన్ రెడిన్ కింగ్స్లే కి ఈసారి ఆశాభంగం తప్పలేదు. సూర్య లేకపోతే అతడి కామెడీని ఎంజాయ్ చేయొచ్చు. సూర్య వుండేసరికి అతడి టక్కుటమారాలు పనిచేయలేదు.
       
సునీల్ పోషించిన గ్యాంగ్ స్టర్ పాత్రకి మంచి -చెడు రెండు షేడ్స్ వున్నాయి. రెండిట్లో ప్రూవ్ చేసుకున్నాడు. సైంటిస్టుగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈసారి ముఖం కని పించని గడ్డం మీసాలతో గుర్తు పట్టలేకుండా
, తన విలక్షణ నటనని ప్రేక్షకులు ఎంజాయ్ చేయకుండా జాలిగా మిగిలిపోయాడు.
       
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం
, అభినందన్ ఛాయాగ్రహణం సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. ప్రొడక్షన్ క్వాలిటీకి భారీగా ఖర్చు పెట్టారు. అలాగే ఐదుగురు యాక్షన్ డైరెక్టర్లతో ఈ నాన్ స్టాప్ యాక్షన్ థ్రిల్లర్ ని దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ కొత్త తరహాలో ప్రేక్షకుల ముందుంచాడు. తుప్పరివాలన్ తర్వాత విశాల్ కెరీర్ లో ఇదొక వెరైటీ సినిమా అనొచ్చు!

—సికిందర్ 

 

9, జులై 2023, ఆదివారం

1344 : రివ్యూ!


 

రచన- దర్శకత్వం : పవన్ బాసంశెట్టి  
 తారాగణం : నాగశౌర్య, యుక్తీ తరేజా, సత్య, గోపరాజు రమణ, మురళీశర్మ, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు
సంగీతం : పవన్ సిహెచ్, ఛాయాగ్రహణం :  దివాకర్ మణి, వంశీ పచ్చిపులుసు
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
విడుదల : జులై 7, 2023
***

2019 లో  ఓహ్ బేబీ విజయం తర్వాత నాగశౌర్య నటించిన 5 సినిమాలూ (అశ్వత్థామ, వరుడు కావలెను, లక్ష్య, కృష్ణా వ్రిందా విహారీ, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి) వరసగా పరాజయాల పాలయ్యాయి. రోమాంటిక్ కామెడీల మీద ఆసక్తి పెంచుకుని వాటినే నటిస్తూ పోతున్న తను వైవిధ్యానికి ఏ మాత్రం స్థానమిస్తున్నాడో తెలుసుకోవాలంటే తాజా ‘రంగబలి’ ని చూడాలి. కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి చేతిలో నాగశౌర్య నటించిన ఈ రంగబలి ఏవిధంగా వుందో చూద్దాం...

కథ

రాజవరం అనే వూళ్ళో శౌర్య (నాగశౌర్య) పనీపాటా లేకుండా తిరుగుతూ తండ్రికి సమస్యగా మారతాడు. శౌర్య పుట్టి పెరిగిన వూరే బలమని నమ్ముతాడు. ఈ బలమే తనకి గుర్తింపు నిస్తుందనుకుంటాడు. ఇలాటి అవగాహనతో ఇతను పాల్పడే చేష్టలు భరించలేకపోతాడు తండ్రి. దీంతో మెడికల్ షాపు నడిపే తండ్రి విశ్వం (గోపరాజు రమణ), ఫార్మసీ కోర్సు చేసి వచ్చి షాపు చూసుకోమని శౌర్యని వైజాగ్ పంపేస్తాడు. వైజాగ్ లో కోర్సులో చేరిన శౌర్య అక్కడ సహజ (యుక్తీ తరేజా) తో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమని సహజ తండ్రి (మురళీ శర్మ) అంగీకరిస్తాడు. అయితే శౌర్య వూరి పేరు తెలుసుకున్న అతను శౌర్య ప్రేమని వ్యతిరేకిస్తాడు. రాజవరంలో రంగబలి సెంటర్ అంటే అతడికి పడదు. అందుకని ఆ వూరు వదిలి వైజాగ్ వచ్చేస్తే ప్రేమని అంగీకరిస్తానంటాడు.
       
రంగబలి సెంటర్ తో సహజ తండ్రికున్న సంబంధమేమిటి
? ఎందుకు ఆ పేరు విని శౌర్యని తిరస్కరిస్తున్నాడు? సొంత వూరు వదిలి రాలేని శౌర్య తన ప్రేమకి అడ్డుగా వున్న రంగబలి సెంటర్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నాడు? ఆ వూళ్ళో వుంటున్న ఎమ్మెల్యే పరశురామ్ (షైన్ టామ్ చాకో) కీ, సహజ తండ్రికీ మధ్య వున్న సంబంధమేమిటి? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాలి.

ఎలావుంది కథ  

ప్రేమ కోసం వూరి సెంటర్ పేరు మార్చేందుకు హీరో చేసే ప్రయత్నాలతో ఎదురయ్యే ప్రతిఘటనల గురించి ఈ కథ. ఈ కథని ప్రేక్షకులకి వినోదాత్మకంగా చెప్పాలా, లేక సీరియస్ గా చెప్పాలా - ఎలా చెప్తే ఆకట్టుకుంటుందన్నది మొదటి పాయింటు. కథ కోసం తీసుకున్న విషయంలో తగినంత సంఘర్షణ వున్నదా, లేదా అన్నది రెండో పాయింటు. ఈ రెండు పాయింట్లతో స్పష్టత, దాంతో నిర్వహణా సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందన్నది మూడో పాయింటు.
       
కొత్త దర్శకుడు వినోదాత్మకంగానే కథని మొదలుపెట్టి దాన్ని సీరియస్ గా మార్చేయడంతో
, సీరియస్ గా మార్చివేశాక సంఘర్షణని  బలంగా తీర్చిదిద్దక పోవడంతో- మొత్తానికే ఎసరు వచ్చింది. నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ జమ పడింది. రిలీజ్ చేసిన ట్రైలరే చప్పగా వున్నప్పుడు, సినిమా గొప్పగా వుండే అవకాశం లేదు. కనీసం ముగింపయినా అర్ధవంతంగా లేదు, ఇంటర్వెల్ మలుపు సహా. ఫస్టాఫ్ ని కామెడీతో లాక్కొచ్చినా, హీరోకి రంగబలి సమస్య ఎదురయ్యాకా, కథ ఎలా నడపాలో అర్ధంగాక, గజిబిజి చేసేయడంతో సెకండాఫ్ బోల్తా పడింది.
       
ఫస్టాఫ్ లో వూళ్ళో నాగ శౌర్య ఆవారా తనం
, తండ్రితో చీవాట్లు వందల సినిమాల్లో వచ్చేసిన అరిగిపోయిన విషయమే. అలాగే వైజాగ్ లో హీరోయిన్ యుక్తితో లవ్ ట్రాక్ లోనూ కొత్తదనం లేదు. నాగశౌర్యతో ఫస్టాఫ్ లాగలేక పోతున్నప్పుడు, కమెడియన్ సత్యని ప్రవేశపెట్టి ఫస్టాఫ్ కి అతడ్ని హీరోగా చేశాడు దర్శకుడు. ఈ సినిమా గురించి ఏదైనా చెప్పుకుంటే సత్య చేసిన కామెడీ గురించే చెప్పుకుంటారు ప్రేక్షకులు- ఇది అద్భుతమైన కామెడీ ఏమీ కాదు- చీప్ కామెడీయే బూతుతో కలిసి.
       
హీరోయిన్ తండ్రితో హీరోకి సమస్య ఎదురయ్యాక సెకండాఫ్ లో పడుతుంది కథ. ఇక్కడ్నించే రంగబలి పేర్చు మార్చే కథనం సీరియస్ యాక్షన్ సినిమాలాగా మారిపోయి- అర్ధం పర్ధం లేకుండా దారితప్పి పోయింది కథ. రంగబలి కాదు
, ప్రేక్షకులు బలి అన్నట్టు తయారయ్యింది. ఈ తయారీలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో- ఇటీవలి దసరా లో తను చేసిన విలనీ లాగా, మరోసారి హాస్యాస్పదంగా తయారయ్యాడు.
       
వూళ్ళో ఒక సెంటరు పేరు మార్చే కథనే రాజకీయ విలన్ పాత్రతో రాజకీయ సెటైర్లతో
, చురకలతో కొత్త కథగా చేసి నడపొచ్చు. స్థలాల పేర్లు రాజకీయ అవసరాల కోసం వివాదాస్పదమవుతున్న వైనాన్ని చిత్రించి- ఒక మెసేజితో ఈ బలహీన రోమాంటిక్ కామెడీని బలంగా నిలబెట్టి, బాక్సాఫీసు ప్రయోజనాలు పొంది వుండొచ్చు.

నటనలు- సాంకేతికాలు

నాగశౌర్యకి నటన వచ్చనడంలో ఎలాటి సందేహం లేదు. ఆ టాలెంట్ ఇలాటి సినిమాలతో వృధా అయిపోతోంది. ఆరు వరస ఫ్లాపులివ్వడానికి సరిపోతోంది. ఫస్టాఫ్ లో తండ్రి పాత్ర గోపరాజు రమణతో కామెడీ బాగా చేశాడు. అయితే ఏ సీనుకా సీనే. విషయంలేని ఫస్టాఫ్ లో ఈ కామెడీలతో తనేమీ నిలబెట్టలేదు. సత్య నిలబెట్టాడు. ఇక సెకండాఫ్ లో ఎటుపోతోందో అర్ధంగాని గజిబిజి సీరియస్ కథతో, చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకుతో, తను పూర్తిగా చేతులెత్తేశాడు. రంగబలి స్థల పురాణం గురించి చెప్పే చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ ఏం చెప్పారో అర్ధంగాదు. హీరోయిన్ తో లవర్ బాయ్ నటన అంతంత మాత్రమే.
       
కమెడియన్ సత్య మాత్రం ఎవరైనా సంతోషంగా వుంటే ఓర్వలేని పాత్రలో చేసిన కామెడీతో సినిమాకి తనవంతు న్యాయం చేశాడు. హీరోయిన్ యుక్తి రొటీనే. చెప్పుకోదగ్గ పాత్ర కాదు. తండ్రుల పాత్రల్లో గోపరాజు రమణ
, మురళీ శర్మ ప్యాడింగ్ కి నిండుదనం తెచ్చారు. విలన్ ఎమ్మెల్యేగా మలయాళ నటుడు షైన్ చాకో ఆటలో అరటిపండు.
       
అరడజను ఫ్లాపుల తర్వాత
దసరా తీసి హిట్ అన్పించుకున్న అగ్ర నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమా ప్రొడక్షన్ విలువలకి బాగా ఖర్చు పెట్టారు. అయితే కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి తన క్రాఫ్టుకి ఇంకా చాలా సానబెట్టు కోవాల్సిన అవసరం వుంది.
—సికిందర్