రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

9, అక్టోబర్ 2016, ఆదివారం

రివ్యూ!

రచన-  దర్శకత్వం: వీరూ పోట్ల
తారాగణం: సునీల్‌, సుష్మా రాజ్‌, రిచా పనాయ్‌, పునీత్‌ ఇస్సార్‌, జయసుధ, అరవింద్‌కృష్ణ, నరేష్‌, శత్రు, షకలక శంకర్‌, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృధ్వీ 
సంగీతం: సాగర్‌ ఎం.శర్మ, ఛాయాగ్రహణం: దేవరాజ్‌
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల: అక్టోబరు 7, 2016
***
యాక్షన్ హీరో- కమెడియన్ సునీల్ మరో దండయాత్ర చేస్తూ విజయదశమికి వచ్చేశాడు. కాస్త పంథా మార్చి ఈసారి కామిక్ థ్రిల్లర్ తో అదృష్ట పరీక్షకి నిలబడ్డాడు. అదృష్టం దక్కని గత కొన్ని మూస ఫార్ములా యాక్షన్ కామెడీలకి దూరంగా కొంచెం తేడా గల ప్రయత్నం చేద్దామనుకున్నట్టుంది- తేడా రాకుండా చూసుకునే బాధ్యత మాస్  సినిమాల దర్శకుడు వీరూ పోట్ల భుజానేసుకున్నాడు. అప్పుడేం జరిగింది? తేడా వచ్చిందా, తేడాగల ప్రయత్నంగా నిలబడిందా తెలుసుకోవాలంటే బంగార్రాజు కథలోకి వెళ్ళాలి...

కథ 
     అతను బంగార్రాజు (సునీల్). బెజవాడ వస్తాడు పని వెతుక్కుంటూ.  నారదరావు (పృథ్వీ) కొరియర్ కంపెనీలో చేరతాడు. తను ఎవరి దగ్గర పనిలో చేరినా  ఆ యజమాని తన్నులు తిని వ్యాపారం కోల్పోవడమే జరుగుతుంది. అలా తన్నులు తిని వ్యాపారం కోల్పోయిన నారదరావు, బంగార్రాజుని వదిలించుకుంటూ హైదరాబాద్ పంపించేస్తాడు.  అక్కడ బంగార్రాజుకి రోడ్ల మీద తిరిగే గీత (సుష్మా రాజ్) పరిచయమవుతుంది. ఓ స్కూల్ టీచర్ (జయసుధ) ని ఓ అవమానం నుంచి కాపాడడంతో ఆమెకి అతడిలో ఇప్పుడు లేని తన పెద్ద కొడుకు కన్పిస్తాడు. దాంతో  ఇంట్లో ఆశ్రయమిస్తుంది. ఇంట్లో చేరిన బంగార్రాజు ‘తమ్ముడు’ శ్రీనివాస్ (అరవింద్ కృష్ణ) పని చేసే కంపెనీలోనే చేరతాడు. 

        ఉన్నట్టుండి బంగార్రాజు చిక్కుల్లోపడతాడు. ఒక గ్యాంగ్ సునీల్ వర్మ అనే వాడికోసం వెతుకుతూంటారు. వాడు ఓ విగ్రహం కొట్టేసుకు పోయాడు. ఆ విగ్రహంలో 900 కోట్ల రూపాయల విలువైన వజ్రాలున్నాయి. ఆ వజ్రాలు బెట్టింగ్ మాఫియా మహదేవ్ (పునీత్ ఇస్సార్) కి చెందినవి. మహదేవ్ కొడుకు సహదేవ్ తన గ్యాంగ్ తో సునీల్ వర్మ కోసం వెతుకుతూంటే బంగార్రాజు దొరికిపోతాడు. బంగార్రాజు సునీల్ వర్మ పోలికలతోనే వుం టాడు. తను సునీల్ వర్మ కాదని ఎంత మొత్తుకున్నా, అతడి తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి  వజ్రాలు పట్రమ్మంటారు. బంగార్రాజు సునీల్ వర్మని పట్టుకుని తమ్ముణ్ణి విడిపించుకునేం దుకు  అన్వేషణ మొదలెడతాడు. ఈ అన్వేణలో ఏమేం జరిగాయి, ఏఏ కుట్రలు బయట పడ్డాయి,ఎవరెవరు కుట్ర దారులుగా బయట పడ్డారు, అసలు సునీల్ వర్మ ఎవరు, అతణ్ణి  ఎలా పట్టుకున్నాడు బంగార్రాజు - అన్నవి మిగతా కథలో తెలిసే అంశాలు.

ఎలా వుంది కథ 
      కామిక్ థ్రిల్లర్ జానర్ లో సస్పన్స్ ని జోడించుకున్న కథే. కానీ దర్శకుడు గతంలో మూస ఫార్ములా మాస్ సినిమాల దర్శకుడవడం చేత ఆ వాసనలన్నీ ఇందులోకి జొరబడి పోయి జానర్ మర్యాదని దెబ్బ తీశాయి. ప్రేక్షకులు తమిళ డబ్బింగ్ సినిమాల్లో తమిళ వాసనలు  పసిగట్టినట్టు, జానర్ కాని జానర్ వాసనలు కూడా ఇప్పుడు పసిగట్టి ఫ్లాప్ చేయగలరని గత సంవత్సరం తెలుగులో విడుదలైన ఫ్లాప్ సినిమాలన్నీ నిరూపించాయి. అవన్నీ జానర్ మర్యాదని మంటగలిపినవే. జానర్ మర్యాదని కచ్చితంగా పాటించిన కేవలం అయిదారు చిన్నా పెద్దా తెలుగు సినిమాలు మాత్రమే గత సంవత్సరం హిట్టయ్యాయి. కామిక్ థ్రిల్లర్ అంటేనే ట్రెండీగా, న్యూవేవ్ మూవీలా వుండాలి. వుంది కాబట్టే ‘స్వామిరారా’ అనే కామిక్ థ్రిల్లర్ అంత  హిట్టయింది. మూస ఫార్ములాతో ఆ నిగ్రహం చూపించలేదు కాబట్టే అదే దర్శకుడు తీసిన ‘దోచేయ్’ అంత ఫ్లాపయ్యింది. కామిక్ థ్రిల్లర్ ‘దోచేయ్’ ని దెబ్బ తీసిన పాత మూసఫార్ములా పైత్యాలే ‘ఈడు గోల్డ్ ఎహె’ జానర్ మర్యాదని కూడా చెరిచాయి. ఏ పాత మూస వాసనలతో గత కొన్ని సినిమాల కథలతో సునీల్ కి శృంగభంగమవుతూ వచ్చిందో, అవే వాసనలు పుష్కలంగా ఈ జానర్ కథకీ పూశారు. మదర్ సెంటిమెంటు, బ్రదర్ సెంటిమెంటు, బరువైన సెంటిమెంటల్ డైలాగులూ, అనాధ హీరో పాత్ర, హీరో మూస ఎంట్రీ, హీరో ఎక్కడ పనిలో చేరితే  అక్కడ నష్టం అనే క్యారక్టరైజేషన్- ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఇద్దరు హీరోయిన్లు, రొటీన్ స్లాట్స్ లో వాళ్ళతో రోమాన్సులూ పాటలు, బంగార్రాజు అనే పేరు, ఈడు గోల్డ్ ఎహె అనే టైటిల్ కూడా సంకల్పించిన జానర్ కి రసభంగమే. ఇవి అసలు కథని చాలా దెబ్బ తీశాయి. కామిక్ థ్రిల్లర్స్ తో అంత అలరించిన, నవ్వించిన జాకీ చాన్ సినిమాల్లో ఇలాటివి వుంటాయా? ప్రతీ జానర్ కథలోనూ జానర్ స్పృహ లేకుండా నవరసాలన్నీ నింపాలన్నచాపల్యం వుంటే, దీన్ని ఓరకంట గమనిస్తున్నారిప్పుడు ప్రేక్షకులు.

ఎవరెలా చేశారు 
        సహజంగానే సునీల్ నటన లక్ష్యిత జానర్ కి న్యాయం చేయడం కష్టమైపోయింది. ఈ కామిక్ థ్రిల్లర్ లక్ష్యిత జానర్ పట్ల స్పష్టత వుంటే,  ఆ ప్రకారం సీన్లు మార్పించి ఆ జానర్ కి తగ్గ ఆటాడుకునే వాడు. ‘ముత్యాల ముగ్గు’ లో తల్లి కున్న విషాదం పిల్లలు అనుభవించరు. పిల్లలు బాధ పడే సీను ఒక్కటి కూడా వుండదు. వాళ్ళ హాస్య ధోరణిలో వాళ్ళు విలన్లతో ఆటాడుకుని తల్లికి న్యాయం చేస్తారు. ఆ విషాద కథని అద్భుత రసంతో నడిపారు. అయోధ్య కొచ్చిన లవకుశలు కూడా అడవి పాలైన  తల్లి సీత గురించి బాధ పడుతూ కూర్చోరు. యాక్టివ్ క్యారక్టర్స్ ఎప్పుడూ బాధ పడుతూ కూర్చోవు. సునీల్ కి ఈ వెసులుబాటు లేకుండా పోయింది. పైన చెప్పుకున్న మూసఫార్ములా ధోరణుల వల్ల బాధ,  ఏడ్పు, రోషాలు, అక్రందనలూ, సెంటిమెంట్- మెలోడ్రామాలూ కూడా నటించడంతో జానర్ ప్రధాన రసమైన అద్భుత రసం, దీని బై ప్రోడక్టు అయిన హస్యరసమూ దెబ్బతినిపోయాయి. కథలో రెండే కీలక పరిణామాలని గుర్తించినప్పుడు (తమ్ముడు అనేవాడి కిడ్నాప్, సునీల్ వర్మ పేరుతో తనలాగే మరొకడు- అనే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడిన సమస్య- గోల్) వీటి ఆధారంగానే ముత్యాల ముగ్గు పిల్లల్లాగా నవ్విస్తూ, జాకీచాన్ లా నరుక్కుంటూ పోవాలే తప్ప- వీటి తాలూకు విషాదం, బాధ ఏదైనావుంటే వాటిని ప్రేక్షకులు ఫీలవడానికి ముత్యాల ముగ్గులో లాగా, బ్యాక్ డ్రాప్ లో సబ్ టెక్స్ట్ లా వదిలెయ్యాలే తప్ప- అన్నీ విప్పి అవన్నీ నటన ద్వారా ప్రదర్శిస్తే  చాలా దెబ్బతినిపోతుంది వ్యవహారం. 

        హీరోయిన్ల పాత్రలూ మూస ఫార్ములా హీరోయిన్లలాగే వున్నాయి ఎక్స్ పోజింగ్స్ తో. పునీత్ ఇస్సార్ విలన్ పాత్రకి బాగా సరిపోయాడు భీకరంగా. మిగిలినవి కామెడీ పాత్రలు. రెండో హీరోయిన్ తండ్రిగా నరేష్, కిడ్నాపర్ గా పోసాని, ఫాం హౌస్ ఓనర్ గా పృథ్వీ, రైల్వే టీసీగా వెన్నెల కిషోర్, దొంగోడిగా షకలక శంకర్, నరేష్ ఇంట్లో పనివాడుగా భరత్ - వీళ్ళందరికీ సునీల్ పాత్రకి లాగా ఏ బాధల బ్యాగేజీ, సెంటిమెంట్ల బస్తాలూ లేకపోవడం వల్ల హేపీ - గో- లక్కీగా నవ్వించుకుంటూ పోయారు. ముఖ్యంగా పృథ్వీ, వెన్నెల, షకలక కామెడీ చివరంటా నవ్వించేదే. ఇందులో పృథ్వీ మళ్ళీ వేరే సినిమాల పేరడీ లేవీ చేయకుండా ఫ్రెష్  కలర్ఫుల్ క్యారక్టర్ లో నటించాడు.  
    
        సంగీతం, కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నాయి. కొన్ని సీన్లలో డీఐ శృతిమించింది. యాక్షన్ దృశ్యాలు క్లయిమాక్స్ లో జానర్ కి విరుద్దంగా హింసాత్మకంగా వున్నాయి. కారణం, వెనకటి దృశ్యాల్లో హీరో తల్లిని విలన్ కొట్టి వుండడం. కాబట్టి హీరో విలన్ల మధ్య హీరో మదర్ సెంటిమెంట్లూ ఎమోషన్స్ తో ఈ హింస. ఈ కథలో అనవసరమైన తల్లి పాత్ర వల్ల, తల్లిని విలన్ కొట్టే అనవసరమైన దృశ్యం వల్ల,  క్లయిమాక్స్ ఫైట్ హీరో విలన్ల మధ్య జానర్ ప్రకారం హిలేరియస్ గా వుండక, యమ సీరియస్ అయిపోయింది వ్రతం చెడగొడుతూ. 

చివరికేమిటి 
        ఓ మంచి ఐడియాతో ఈ ‘కామిక్ థ్రిల్లర్’ కి పూనుకున్నాడు వీరూపోట్ల. ఇందులో అంచెలంచెలుగా వీడే సస్పెన్స్ వుంది. ఎండ్ సస్పెన్స్ అన్పించని ఎండ్ సస్పెన్ కథనం ప్రాణంగా వుంది- ఎండ్ సస్పెన్స్ గండాన్ని దాటే విధం చూపిన ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ – బ్రిటిష్ సస్పెన్స్, 1958 (హిందీలో ‘ధువాఁ’ - 1981, బెంగాలీలో ‘శేషాంక’ - 1963, తమిళంలో ‘పుథియ పరవాయి’ - 1964) తరహాలో అప్రయత్నంగానో,  ప్రయత్న పూర్వకంగానో కథనం చేశాడు. కథలో సస్పెన్స్ వుందని చివరి వరకూ తెలియ జేయకపోవడం ఈ తరహా కమర్షియల్ సినిమాలకి పనికొచ్చే ఎండ్ సస్పెన్స్ బాపతు కథనం. క్లయిమాక్స్ లో ఫైనల్ షోడౌన్ ఇస్తూ పాత్రలన్నీ ఓపెన్ కావడం ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ లాంటి మాస్టర్ స్ట్రోకే. ఇంతమంచి జానర్ ఫ్రెండ్లీ తురుపు ముక్క చేతిలో పెట్టుకుని దర్శకుడు విజాతి మూస ఫార్ములా ధోరణులతో ఎవరినో సంతృప్తి పరుస్తూ కూర్చున్నాడు. గంటంపావు సేపు ఫస్టాఫ్ అంతా అసలు కథేమిటో తెలియకుండా పోయే గజిబిజి మూస మాస్ దృశ్యాలతో పాత సినిమాలాగా నడుస్తుంది. ఇంటర్వెల్లో తమ్ముడి కిడ్నాప్, సునీవర్మ యాంగిల్,  ఓపెన్ కావడంతో అసలు కథ మొదలైనా- దీనికీ మళ్ళీ సెకండాఫ్ లో హీరోకి కొనసాగించిన సెంటిమెంటు సిమెంటు బస్తాలతో హమాలీ కథైపోయింది క్లైమాక్స్ వరకూ. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో తెలిసి ఈ సినిమా తీసినట్టు కన్పించదు. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రేక్షకులు ఎలర్ట్ అయ్యేట్టు చేసిన - బంగార్రాజులా వున్నాడంటున్న సునీల్ వర్మ అసలెవరన్న  పాయింటు ప్రధానంగా హీరో పాత్ర ప్రయాణం కొనసాగించకుండా- అంత ముఖ్యమైన పాయింటూ, అసలు కిడ్నాపైన తమ్ముడి విషయమూ మరుగున పడేలా వేరేవేరే కథనాలు చేసుకుంటూ పోయారు. 

        రచయితగా దర్శకుడు సఫలమయ్యింది కామెడీ దృశ్యాల్లోనే. సునీల్- నరేష్- భరత్ ల మధ్య అదొక ఫన్నీ దృశ్యం. రైల్లో వెన్నెల కామెడీ ఎపిసోడ్ మరో ఎంటర్ టైనర్, ఫాం హౌస్ లో కోళ్ళ గురించి పృథ్వీ వెర్బల్ కామెడీ మరో వినోదం. అయితే ఎడాపెడా ప్రతీ చోటా ప్రాస డైలాగులు వాడేశారు. సీన్లు ఫన్నీగా వుండడంతో ఈ ప్రాస డైలాగులు చెల్లిపోయాయి. విలన్ ‘బ్లడీ ఫూల్’  అంటే కమెడియన్ ‘లకడీకా పూల్’  అనడం, వెన్నెల డౌట్ కి పృథ్వీ ‘బ్లెండర్ పడితే పడితే జెండర్ తెలీదు’ అనడం ...లాంటివి బహుశా హిందీలో వచ్చే మైండ్ లెస్ కామెడీల కిందికొస్తుంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కామెడీ నాటికల్లో కన్పించే ఇలాటి మాటకి మాట ఏదో మాట అనెయ్యడమనే డైలాగ్ స్కీమ్ రచయిత- దర్శకుడు అయిన వీరూపోట్ల చివరంటా దారం తెగకుండా చక్కగా పోషించాడు- ఈ బిజీలో తెగిన గాలిపటం అయింది అసలు కథే!


-సికిందర్
http://www.cinemabazaar.in







.









25, డిసెంబర్ 2015, శుక్రవారం

సౌఖ్యం ఎవరికి?





దర్శకత్వం : ఏఎస్. రవికుమార్ చౌదరి

తారాగణం :  గోపీచంద్ , రేజీనా కాసాండ్రా, బ్రహ్మానందం, షావుకారు జానకి, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణ భగవాన్, ముఖేష్ రిషి, ప్రదీప్ రావత్, రాజన్   తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం :  ప్రసాద్ మురెళ్ళ, కథ- మాటలు : శ్రీధర్ సీపాన, స్క్రీన్ ప్లే : కోన వెంకట్- గోపీ మోహన్, కూర్పు : గౌతం రాజు, పోరాటాలు : వెంకట్
బ్యానర్ : భవ్య క్రియేషన్స్, నిర్మాత : ఆనంద్ ప్రసాద్
విడుదల : 24 డిసెంబర్,   2015
       2004 లో గోపీచంద్ తో ‘యజ్ఞం’ తీసి సక్సెస్ అయిన దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ దశాబ్దం తర్వాత తిరిగి గోపీచంద్ తో ‘సౌఖ్యం’ తీస్తూ ప్రేక్షకులకి తగిన సుఖశాంతులు ఇద్దామనుకున్నాడు. గత సంవత్సరం సాయి ధరమ్ తేజ్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ గా  ‘పిల్లా నువ్వు లేని జీవితం’  అనే హిట్ ఇచ్చిన తను, ఈ సక్సెస్ బాటలో ఈసారి ఏం చేశాడో తెలుసుకుంటే సుఖ శాంతులు  కష్ట సాధ్యంగానే వుంటాయి. శాంతము లేక సౌఖ్యము లేదన్నారు కాబట్టి – గోపీచంద్ కూడా లౌక్యం, శౌర్యం, శంఖం టైటిల్స్ బాటలో ‘సౌఖ్యం’ తో మోజు తీర్చుకోవడం కూడా అయింది. కానీ ‘సౌఖ్యం’ కంటే ముందు  ‘శాంతం’  అని ఒకటి తీసివుంటే వరస బావుండేది. జరిగిందేదో జరిగిపోయిందని ఇప్పటికైనా శాంతం గా ఉండకపోతే ఇకముందు ఎలాటి సౌఖ్యమూ దక్కదని గ్యారంటీగా చెప్పొచ్చు. అంతా గజిబిజిగా వుంది కదూ టైటిల్స్ తో ? కాస్సేపు ఈ టైటిల్స్ గొడవ పక్కన పెట్టి అసలు సంగతేమిటో చూద్దాం...


మళ్ళీ మళ్ళీ  అదే కథ!
చాలా చాలా రిపీట్- రిపీట్- రిపీటెడ్ గా శీను ( గోపీచంద్) పెళ్లవుతున్న ఓ అమ్మాయిని ఎత్తుకెళ్ళి  ఆమె ఇష్ట పడ్డ వేరే పెళ్లి చేసేస్తాడు. వెంటనే రొటీన్ గా పాటేసుకుంటాడు. ఆ వెంటనే  రొటీన్ గా ఓ రౌడీని కొడతాడు. ఆ రౌడీ బావూజీ (ప్రదీప్ రావత్) అనే ముఠా కోరు కొడుకు. తన కొడుకుని కొట్టిన వాణ్ణి చంపుతానని రొటీన్ గా ప్రతిజ్ఞ చేస్తాడు. శీను కి ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటారు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక ఏ పెళ్ళీ వద్దంటాడు. ఆ అమ్మాయి శైలజ ( రేజీనా) ని కోలకత్తాలో పవర్ఫుల్  పీఆర్ (రాజన్) అనే అతడి కూతురు. అక్కడి సీఎం కొడుకుతో ఇష్టం లేని పెళ్లి చేస్తోంటే రొటీన్ గా పారిపోయి వచ్చి శీనుతో రొటీన్ గా ప్రేమలో పడింది. ఇప్పుడా తండ్రి గ్యాంగే రొటీన్  గా ఎత్తుకెళ్ళారు. ఈ నేపధ్యంలో బావూజీ కి ఇంకో గొడవ వుంటుంది. రొటీన్ గా శైలజని తన కొడుక్కు చేసుకోవాలని. ఇప్పుడా శైలజని కొలకత్తా లో పీఆర్ ఇంట్లోంచి తీ సుకురావాలంటే చాలా గట్టివాడు కావాలి. ఆ గట్టి వాడుగా రొటీన్ గా శీను ఆఫరిస్తాడు. కొలకత్తా వెళ్లి  శైలజని తీసుకుని రొటీన్ గా పారిపోయి వచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇక్కడ్నించీ ఇంకా  -రొటీన్- రొటీన్ – పరమ రొటీన్ గా ఏం జరిగిందనేది ఓపిక మిగిలుంటే వెండితెర మీద చూసుకోవచ్చు.
కథెలా వుంది
        ప్రేక్షకుల మీద చేసిన స్కామ్ లా వుంది. ఏవేవో గొప్ప అంచనాలు కల్పిస్తారు, తీరా చూస్తే సవాలక్ష సార్లు చూసిందే చూపించి, నేడు సినిమా కథల పేరుతో జరుగుతోంది రీసైక్లింగ్ స్కామే తప్ప ఇంకేమీ కాదని చెప్పకుండానే చెప్పేస్తారు. పైన సగం వరకూ చెప్పుకున్న కథని చూస్తే అర్ధమైపోతుంది.  కథెలా వుందో ఇంకా విడమర్చి చెప్పుకోనవసరం లేదు. కథ రాసిన శ్రీధర్ సీపాన అనే రచయిత తన సొంత మస్తిష్కంతో ఏమీ ఆలోచించలేదు. శివమ్, బాద్షా, ఢీ, రెఢీ, పండగ చేస్కో...లాంటి డజన్ల సినిమాల దగ్గర్నుంచీ నిన్నటి ‘లోఫర్’ వరకూ తిరగమోత తాలింపు సినిమాలెన్నో వుండగా- వాటిని దింపెయ్యడానికి పెద్దగా మస్తిష్కం అవసరం లేదు. టాలీవుడ్ లో రైటర్ అనే వాడికి బుర్రే అవసరం లేదు. వచ్చిన ఏ తెలుగు సినిమాలో ఏ సీన్లున్నాయో గుర్తుంటే చాలు. పరీక్షలో అందరూ కలిసి ఒకరి దాంట్లో ఇంకొకరు చూసి మాస్ కాపీయింగ్ కి పాల్పడితే ఆన్సర్ పేపర్లు ఎలావుంటాయో, తెలుగు సినిమాలు అలాటి జిరాక్స్ కాపీల్లా ఉంటున్నాయి, ఇంకా వుంటాయి కూడా.
ఎవరెలా చేశారు
వరైనా చేయడానికి ఏం కావాలి? ఓ కథ, ఓ పాత్ర. ఈ రెండూ లేనప్పుడు గోపీచంద్ పొందిన సౌఖ్య మేమిటో జుట్టు పీక్కున్నా అర్ధంగాదు. మాట్లాడితే ఫైటు, మాట్లాడితే పాట, మధ్యమధ్యలో నాలుగు మాటలు- సెకండాఫ్ ని ఇతర నటీ నటులు పూర్తిగా హైజాక్ చేయడంతో,  ఆ గ్రూపుల  వెనకాల ఎక్కడో- చేష్టలుడిగి చూడ్డంతోనే సరిపోయింది. సెకండాఫ్ లో గోపీచంద్ వున్నట్టే గుర్తుండదు.  క్లయిమాక్స్ లో వచ్చే ఫైట్ కోసం పొంచి వున్నట్టు సీన్లలోంచి  గైర్ హాజరు. ఇలా వుంది హీరోయిజం.
హీరోయిన్ రేజీనా డిటో. ఈ  ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకీ  తనని దాచిపెట్టే వాళ్ళ చేతుల్లో, అడపాదడపా ఎత్తుకెళ్ళే వాళ్ళ హస్తాల్లో పిప్పళ్ల బస్తాలా తయారయ్యింది తప్ప- నటనకి అవకాశం వున్న ఒక్క సీనూ లేదు.
ఇదేదో ఒక మహా ‘పండంటి కాపురం’ అయినట్టు, ఒక మహామహా  ‘దేవుడు చేసిన మనుషులు’ అయినట్టూ సినిమా నిండా తారాతోరణమే. ఎందరెందరో నటీ నటులు. అంతా కలిసి  దర్శకుడు- రచయితా చేసిన స్కామ్ లో తలా ఓ చెయ్యివేసి సాయం పట్టారు. పాపం ఇటీవలే శంకరాభరణం, బెంగాల్ టైగర్ లతో ఎక్కడికో....వెళ్ళిపోయిన మాస్టర్ కమెడియన్ పృథ్వీ కి సైతం జాపిగోల్పే స్థితి. బ్రహ్మానందం, సప్తగిరిలు చెప్పక్కర్లేదు. స్కామ్ అన్నాక బావుకోవడం ఎవరికైనా సాధ్య మవుతుందా?
రచన సైడు స్క్రీన్ ప్లేకి కోన – మోహన్ ద్వయం దోహదం చేశారు.  ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అవసరమా? అది వున్నట్టు అన్పిస్తోందా? హీరో క్యారక్టర్ పాసివ్ గా మారి సోదిలోకి లేకుండా పోయాక, ఎక్కడా సస్పెన్స్, థ్రిల్ అనేవి లేక కథనం నీరసించి పోయాక - దీన్నో డబ్బులు వచ్చే కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లే అందామా – రూపాయి రాని ఆర్ట్ సినిమా అవతారం అందామా? పదే పదే స్టార్స్ పోషించే పాత్రలు పాసివ్ పాత్రలు అవుతున్నాయనే స్పృహ కూడా లేకుండా- గొప్ప గొప్ప కాంబినేషన్స్ తో తీస్తున్న సినిమాలు – నిజానికి కమర్షియల్ ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలంటే నమ్ముతారా?
ఇక మాటలు కూడా రాసిన శ్రీధర్ సీపాన ఇంకా  ప్రాస డైలాగులే – అవి కూడా వచ్చిన సినిమాల్లో పేలిన డైలాగులే రూపం మార్చి దిగుమతి చేసుకోవడం  కూడా స్కామే!
సాంకేతికాల విషయానికొస్తే, కెమేరాతో ప్రసాద్ మూరెళ్ళ కీ, ఎడిటింగ్ తో గౌతమ్ రాజుకీ, పోరాటాలతో వెంకట్ కీ, సంగీతం తో అనూప్ రూబెన్స్ కీ   స్కాము బాధితుల పరిస్థితే. రొటీన్ సినిమాలే కదా అని ఒప్పుకుంటే స్కాములే మిగులుతాయి. రొటీన్ల కాలం పోయింది. స్కామ్ సినిమాల సీజన్ నడుస్తోంది.
చివరికేమిటి?
        ది రవికుమార్ చౌదరి వేసుకోవాల్సిన ప్రశ్న. చాలాకాలం కనుమరుగై,  ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే హిట్ తో ఆశ్చర్య పరచిన తను- ఆ హిట్ కారణాలని బేరీజు వేసుకున్నట్టు లేదు.  పిల్లా నువ్వు లేని జీవితంలో కథనానికి వాడిన టెక్నిక్కే ఆ సినిమాకి టానిక్. సినిమాలకి ప్రమాదకరంగా పరిణమించే ఎండ్ సస్పెన్స్ ప్రక్రియతో కథనాన్ని - అసలు చివరిదాకా నడిచింది ఎండ్ సస్పెన్స్ కథనమే అని  తెలియకుండా ఇంటర్వెల్ వరకూ, ఆపైన మళ్ళీ క్లైమాక్స్ వరకూ రెండు సార్లు  ఎండ్ సస్పెన్స్ కథనం నడిపి సక్సెస్ అయ్యారు. సినిమాలకి సంబంధించి ఎండ్ సస్పెన్ కథలతో వచ్చే ఇబ్బందుల్ని తొలగిస్తూ ఎప్పుడో 1958 లో బ్రిటిష్ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో అనే బ్లాక్ అండ్ వైట్ థ్రిల్లర్ ద్వారా సెట్ చేసి పెట్టాడు. 1981 లో దీన్నే ధువాఁ గా హిందీలో విజయవంతంగా ఫ్రీమేక్ చేశారు. ఇదే యాదృచ్చికంగా, లేకపోతే  కాకతాళీయంగా పిల్లా నువ్వు లేని జీవితంలోనూ ప్రయోగించి విజయం సాధించారు. లేకపోతే ఎండ్ సస్పెన్స్ కథనాలతో  ‘జాదూగాడు’, ‘ఆ ఒక్కడు’ లాంటివి అనేక తెలుగు సినిమాలు వచ్చి ఫ్లాపయ్యాయి. ఎండ్ సస్పెన్స్ వల్లే ఇటీవల ‘బెంగాల్ టైగర్’ సెకండాఫ్ కూడా బలహీన పడింది.
ప్రస్తుత సినిమాలో రవికుమార్ చౌదరి క్రియేటివిటీ కనుమరుగైపోయింది. స్కామ్ కథే అయినా దాన్ని ఎక్సైటింగ్ గా చెప్పాలన్న ఆలోచనకోడా చేయకపోవడం విచారకరం. ఇంకెన్ని సార్లు సెకండాఫ్ లో కన్ఫ్యూజ్ కామెడీ పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించాలనుకుంటారు. మారు వేషాలు వేయించి కామెడీ చేస్తారు? మారువేషాల కామెడీ ఎన్టీఆర్ బ్లాక్ అండ్ వైట్ ల రోజుల్లోనే నడించాయి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పోయి- కలర్ ఫిల్మూ పోయి – డిజిటల్ వచ్చింది. డిజిటల్ లో కూడా పాత మూస డ్రామాలతో చేతనైనంత స్కాములు చేసుకోవడమేనా?

-సికిందర్ 

(స్క్రీన్ ప్లే సంగతులు రేపు! )

18, జనవరి 2023, బుధవారం

1287 : రివ్యూ!


  కొన్ని విజాతి జానర్లని కలిపి జానర్ బ్లెండర్ గా సినిమాలు తెలుగులో వస్తూంటాయి. అవి చాలా వరకూ క్రాఫ్టు కుదరక విఫలమవుతూ వుంటాయి. కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ అని ఒకటి రాబోతోంది. దీని గురించి చెబుతూ- కాన్సెప్ట్ తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయి, క్రైమ్ నుంచి సస్పెన్స్ నుంచి సాగే ఒక ఇంటెన్స్ డ్రామా అనుకోవచ్చు - అని పబ్లిసిటీ ఇచ్చారు. ఇలా చాంతాడంత గందరగోళంగా చెబితే సినిమా ఇంకెంత గందరగోళంగా వుంటుందో అర్ధం జేసుకోవచ్చు. నవరసాల్లో ఏది ఎందుకు మిక్స్ చేస్తున్నారో స్పష్టత లేక ఫ్లాపయిన సినిమాలున్నాయి. పూర్వం హవా అనే హిందీలో తల్లి కథగా నడుస్తున్న హార్రర్ కథనం (బీభత్స రసం) కాస్తా, ఆమె కూతురి కథగా మారిపోయి సైకో థ్రిల్లర్ గా (అద్భుత రసం) ముగుస్తుంది. ఇలా విజాతి జానర్ల కలబోత అతుకులేసినట్టు వుంటే సినిమా ఎటూ గాకుండా పోతుంది. కలబోత అంటే జానర్ల మద్య కార్యకారణ సంబంధం.
ట్రైలర్

         నేపథ్యంలో వచ్చిందే విజాతి జానర్ల స్వ- ఎ సౌండ్ ఆఫ్ సోల్ అనే హార్రర్-రోమాంటిక్ - సస్పెన్స్ థ్రిల్లర్. కొత్త వాళ్ళు చేసిన ప్రయోగం. రచన -దర్శకత్వం మను పీవీ. జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ బ్యానర్‌పై జిఎం సురేష్ నిర్మాణం. మహేష్ యడ్లపల్లి, స్వాతీ భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, మాణిక్ రెడ్డి, శ్రీనివాస్ భోగిరెడ్డి, సిద్ధార్థ్ గొల్లపూడి నటీనటులు. సంగీతం కరణం శ్రీ రాఘవేంద్ర, ఛాయాగ్రహణం దేవేంద్ర సూరి, కూర్పు శ్రీ వర్కల.

భ్రాంతితో దిగ్భ్రాంతులు

అభిషేక్ ఒక ఆర్టిటెక్ట్. నాయనమ్మ చనిపోతే వస్తాడు. మంచం మీద వున్న చనిపోయిన నానమ్మ లేచి మంచి నీళ్ళు తాగి పడుకోవడం చూసి కలవరపతాడు. అంత్యక్రియల తర్వాత కూడా నాయనమ్మ సజీవంగానే కన్పిస్తూ వుంటే దిగ్భ్రాంతి చెందుతాడు. తనది లాజికల్ మైండ్. తనకి కన్పిస్తున్నవి నిజం కాదు, భ్రాంతి అని నమ్ముతాడు. ఈ భ్రాంతితో వుండగానే ఇంకో భ్రాంతికి లోనవుతాడు. తను ప్రేమించిన చనిపోయిన స్వప్న వచ్చి తను నిజం అంటుంది, అబద్ధమంటాడు. ఈ సంఘర్షణతో వుండగానే ఆమె చావు వెనుక రహస్యముందని అనుమానిస్తాడు. ఈ అనుమానంతో ఛేదించుకుంటూ వెళ్తూంటే వూహించని విషయాలు బయటపడుతూంటాయి. ఇదంతా నిజమా? అబద్దమా? అసలు తనకి ఏం జరుగుతోంది? దీన్నుంచి ఎలా బయటపడాలి? కొలీగ్ భాస్కర్, డాక్టర్ జయప్రకాష్, పోలీస్ ఇన్స్ పెక్టర్, మినిస్టర్...వీళ్ళందరికీ వున్న సంబంధమేమిటి? తెలుసుకుంటూంటే అభిషేక్ కి మతి పోతూంటుంది...

బలమైన కథ- బిగువైన మలుపులు

నాయనమ్మ మరణంతో హార్రర్ గా ప్రారంభమై, స్వప్న రాకతో ఫ్లాష్ బ్యాక్ లో రోమాన్స్ లోకి తిరగబెట్టి, ఆమె మరణంతో సస్పెన్స్ థ్రిల్లర్లోకి మలుపు తీసుకునే మల్టీపుల్ జానర్స్ కథ. ఈ మూడు జానర్స్ కార్యకారణ సంబంధం (కాజ్ అండ్ ఎఫెక్ట్) తో పరస్పరం కనెక్ట్ అయివుంటాయి. నాయనమ్మ మరణం అభిషేక్ సబ్ కాన్షస్స్ మైండ్ లో ట్రిగర్ పాయింట్ గా పనిచేస్తే, దీంతో చనిపోయిన స్వప్న మైండ్లోకి తిరిగొచ్చింది. తిరిగొచ్చిన స్వప్న ఆమె మరణం వెనుక రహస్యం తెలుసుకునేందుకు దారితీసింది. వీటన్నిటికీ మూలకారణం షిజోఫ్రేనియాతో బాధపడే అభిషేక్ మానసిక స్థితి. విజాతి జానర్లతో కాన్సెప్ట్ పకడ్బందీగా వుంది.    
        
దీని కథనం కామెడీలతో, ఎంటర్టైన్ మెంట్ తో పక్కదారులు పట్టకుండా జానర్స్ మర్యాదలతో సూటిగా, స్పష్టంగా వుంది. సెకండాఫ్ కథనంలో మలుపులు కావాల్సినంత సస్పెన్స్ నీ, థ్రిల్స్ నీ సృష్టిస్తాయి.
        
దర్శకుడు మనూ ప్రొఫెషనల్ గా కనిపిస్తాడు కథ విషయంలో- సెకండాఫ్ లో  లాజికల్ గా కొన్ని లోపాలున్నప్పటికీ. ముగింపు ముగిసిపోయిన కథకి పొడిగింపులా వుంటుంది. 1983 లో హిందీ ధువా లో (హాలీవుడ్ టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’- 1958 కి అనుసరణ) క్యారక్టర్లు ఒకటొకటే నిజస్వరూపాలు బయటపెట్టుకుని, ఎంతో దయామయురాలిగా కన్పించే రాజమాతని హంతకురాలిగా రివీల్ చేసే షాకింగ్ ముగింపులాంటిది వుండాల్సింది అభిషేక్ పాత్రతో. అభిషేక్ పాత్ర ఏ మానసిక సమస్యతో మొదలైందో అదే మానసిక సమస్యతో క్యారక్టర్ ఆర్క్, ట్విస్టు వంటివి లేకుండా ముగిసి పోవడం డైనమిక్స్ లేమిని సూచిస్తుంది.
        
పోతే, అభిషేక్ పాత్రలో మానసిక సంఘర్షణతో వుండే నటనని మహేష్ యడవల్లి మంచి టెంపో తో పోషించాడు. కొత్త వాడులా అన్పించడు. దాదాపు ప్రతీ సీనులో తను వుంటూ కథని బాగా క్యారీ చేశాడు. స్వప్న పాత్రలో స్వాతీ భీమిరెడ్డి సంఘర్షణ కూడా బలంగా పోషించింది. నెగెటివ్ గా కన్పించే భాస్కర్ గా యశ్వంత్ పెండ్యాల యాక్షన్ తో కథ ముందుకు సాగడానికి తోడ్పడ్డాడు. డాక్టర్ గా శ్రీనివాస్ భోగిరెడ్డి, మరో డాక్టర్ గా సిద్ధార్థ్ గొల్లపూడి డ్రామాని పకడ్బందీగా పోషించారు. ఇన్స్ పాత్రలో మాణిక్ రెడ్డి ప్రత్యేక దృష్టినాకర్షిస్తాడు.
        
సంగీతం, ఛాయాగ్రహణం, కూర్పు మొదలైన విభాగాలు నిర్వహించిన సాంకేతికులు కథతో పోటీపడ్డారు. దర్శకుడు మానూ పీవీ చిన్న సినిమాకి బలమైన కంటెంట్ ముఖ్యమని, దానికి బలమైన టాలెంట్ కూడా అవసరమని ఈ జానర్ బ్లెండర్ తో తేల్చి చెప్పాడు. దీన్ని clasc యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని ఉచితంగా చూడొచ్చు.

—సికిందర్

23, ఏప్రిల్ 2019, మంగళవారం

807 : సందేహాలు - సమాధానాలు


Q : మీరు ‘సూర్యకాంతం’ స్క్రీన్ ప్లే సంగతులు రాశారు. కానీ మజిలీ, జెర్సీ, చిత్రలహరి స్క్రీన్ ప్లే సంగతులు రాయలేదు. ఇలా అయితే మాకు కష్టంగా వుంది.  
సుధీర్, టాలీవుడ్
         
A : తెలుగు రాజ్యం డాట్ కాంలో ప్రతీవారం రివ్యూల వరకూ రాస్తూనే వున్నాం. మళ్ళీ విడిగా వాటికి  స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే సమయం చిక్కడం లేదు. ఆలస్యమైపోయాక రాయడంలో అర్ధం కూడా వుండదు. ఓ రెండు వెబ్ సైట్లకి, ఓ పత్రిక్కి, బ్లాగుకి తెలుగు, హిందీ, ప్రాంతీయ సినిమాలు నాల్గైదు చూసి రాసేసరికల్లా వారం గడిచిపోయి మళ్ళీ కొత్త వారం కొత్త సినిమాలు ముందుంటున్నాయి. ఈ పరిస్థితిలో స్క్రీన్ ప్లే సంగతులు దైవాధీనంగా తయారయ్యాయి. ప్రయత్నిద్దాం. మజిలీ, జెర్సీ, చిత్రలహరిల గురించి కొన్ని అభిప్రాయాలు  వచ్చాయి. వాటిని ఈ కింద తెలుసుకుందాం. 

         
Q : వరుసగా విడుదలైన మజిలీ, జెర్సీ, చిత్రలహరి మూడూ పరాజితుల కథలేనని మీరు ‘జెర్సీ’ రివ్యూలో రాశారు. కానీ జెర్సీ పరాజితుడి కథ అనుకోను. అతను జబ్బు వున్న క్యారక్టర్ కదా? నాకు ముగింపులో తేల్చిన విషయం రొటీన్ క్యాన్సర్ ఫార్ములా కథలా అన్పించింది.
రామ్ కే, టాలీవుడ్ 

      A : వాస్తవానికి అతను జబ్బు కారణంగా క్రికెట్ కి దూరమైన క్యారెక్టర్. కానీ ధూమపానానికి, మద్యపానానికీ జబ్బు అడ్డు కాదన్నట్టు చిత్రణ వుంది. జబ్బు అనేది ముగింపులో బయట పెట్టిన రహస్యం. అంతవరకూ అతన్ని చూపించింది క్రీడా రంగంలో రాజకీయాల వల్ల క్రికెట్ కి దూరమై, పదేళ్ళ తర్వాత పరిస్థితుల వల్ల తప్పని సరై లేటు వయసులో క్రికెట్ కి పూనుకున్నాడనే. దీంతో జీవితంలో ఏదైనా సాధించడానికి వయసు అడ్డు కాదనే పరాజితుడి కథ ఉపరితలంలో కన్పిస్తోంది. అంతరంగంలో దాచిన కారణం మాత్రం జబ్బు. దీని వల్ల ఒక కాన్సెప్ట్ కి సెటిలై ఒక రియలిస్టిక్ గా నడుస్తున్న మూవీ చూస్తున్నప్పుడు, ముగింపులో ఈ కాన్సెప్ట్ క్యాన్సిలై రియలిస్టిక్ జానర్ కాస్తా జబ్బు అనే ఫార్ములా ట్విస్టుతో ముగింపు కొచ్చినప్పుడు,  సహజంగానే మింగుడుపడదు మీలాటి ఆలోచనాపరులకి. కానీ మెజారిటీ ప్రేక్షకులకి నచ్చిందిది. ఇదే కథ అంతగా ఫాలోయింగ్ లేని హీరోతో తీస్తే ఛీఛీ అంటారు మెజారిటీ ప్రేక్షకులే. కాబట్టి ‘జెర్సీ’ లో ప్రేక్షకులు తమ అభిమాన నేచురల్ స్టార్ ని నానిని చూస్తున్నారు కొత్తగా, కథని కాదు. ఉపరితలంలో ఒక కథ నడుస్తూ,  చివర అంతరంగంలో దాచిపెట్టిన అసలు కథ బయటపడే కాన్సెప్టులు మర్డర్ మిస్టరీలతో, సస్పన్స్ థ్రిల్లర్స్ తో వుంటాయి. ఇలాటి కాన్సెప్ట్స్ తో ‘ఎండ్ సస్పెన్స్’  అనే సినిమా విజయావకాశాల్ని దెబ్బతీసే కథా ప్రక్రియని కవర్ చేయడానికి ఈ టెక్నిక్ ని వాడతారు. ఈ టెక్నిక్ ని కనిపెట్టింది 1958 లో ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ తో. దీని గురించి బ్లాగులో అనేక సార్లు రాశాం. 

           
Q : జెర్సీ, మజిలీ, చిత్రలహరి సినిమాలు ఇంచుమించు ఒకే రకమైన పాత్రలతో, కథలతో రావడాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రేక్షకులు సహజత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో దీన్ని బట్టి అర్ధంజేసుకోవాలేమో. అలాగని అన్నీ ఇలాటి సినిమాలే వచ్చి పడితే చూస్తారనుకోను. తెలుగు సినిమా ప్రైమరీగా యూత్ ఓరియెంటెడ్. వాళ్ళు కోరుకునేది ఎంటర్ టైన్మెంట్. తామేం చేయాలో మెసేజీలు కాదేమో అన్పిస్తోంది.
దర్శకుడు, టాలీవుడ్ 

      A : సినిమా పని పరిస్థితిని ఏకరువు పెట్టడం తప్ప, అంటే రిపోర్టింగ్ చేయడం తప్ప,  మెసేజి లివ్వడం కాదనేది అందరూ ఒప్పుకునే మాటే. ఆ చేసిన రిపోర్టింగ్ లో ఏదైనా మెసేజి ఫీలైతే ప్రీక్షకులే తీసుకుంటారు, లేకపోతే లేదు. కొన్ని ప్రాంతీయ సినిమాలు చూస్తే ఈ కళనే ఒడిసి పట్టినట్టు కన్పిస్తాయి. ‘ఆదిమ్ విచార్’ అనే కోసలీ గిరిజన కథా చిత్రంగానీ, ‘లోక్టాక్ లైరేంబీ’ అనే మణిపురి మత్య్సకారుల కథా చిత్రం గానీ... ఇలా ప్రాంతీయ సినిమాలు పనిగట్టుకుని మెసేజి లివ్వడం లేదు. పరిస్థితిని ఏకరువు పెట్టి వదిలేస్తున్నాయి. ప్రేక్షకులే ఆలోచించుకుంటారు. మన తెలుగులోకి వచ్చేసరికి బల్లగుద్ది ఏదో మెసేజి ఇచ్చేయాలన్న పెద్దరికం వచ్చేస్తోంది. దర్శకుడు పెద్దోడు కాదు, ప్రేక్షకులకంటే చిన్నోడే. బల్ల మీద విషయం పెట్టాలి, ప్రేక్షకులు చూసి ఏమనుకోవాలో అనుకుంటారు. మీరన్నట్టు ఇలా సీరియస్ రియలిస్టిక్ ధోరణుల్లో తీస్తూపోతే ఎవరూ చూడరు. కొత్తగా అన్పించి ఇప్పుడు రెండు మూడు చూశారేమో. సినిమా అనేది ప్రధానంగా వినోద సాధనమే. లేకపోతే డబ్బులు రావు, ఇంత వందేళ్ళ చరిత్రా వుండదు. కాబట్టి ఏదైనా పరిస్థితిని ఏకరువు పెట్టాలన్నా, పరిస్థితులు ఇలా వుండకూడదని చెప్పాలన్నా అది వినోదాత్మకంగానే చేయాలి. ఇలాటివి తెలుగులో పాతవి చాలా వున్నాయి. ఎంటర్ టైనర్స్  అనేవి సమాజంలో పరిస్థితులుగానీ, వ్యక్తులుగానీ అలాకాదు, ఇలా వుండాలని చిత్రిస్తూ ఎంటర్ టైన్ చేస్తాయి. అదే ఆర్ట్ సినిమాలు లేదా రియలిస్టిక్ సినిమాలు ఉన్నదున్నట్టు మాత్రమే పరిస్థితిని చూపిస్తాయి. ఈ మాట – ఈ తేడా ఫేమస్ క్రిటిక్ రోజర్ ఎబర్ట్ చెప్పాడు. కాబట్టి ఎంటర్ టైనర్స్ ని ఈ చెప్పిన విధానంలో తీసే ప్రయత్నం చేస్తే, విశేష ప్రజాదరణ పొందే అవకాశముంది. 

           
Q : ‘జెర్సీ’ సినిమా ప్రయత్నిస్తూ ఓడిపోయిన 99 మందిలో ఒకడి కథ అన్నారు చివర్లో. కానీ జబ్బు కారణంగా ఆటను వదిలి, కొడుకు కోసం ఆడి చనిపోయిన ఒక తండ్రి కథ అన్పించింది. ఇటీవల విడుదలైన జెర్సీ, మజిలీ, చిత్రలహరి మూడూ లూజర్స్ కథలే ఏ కారణం వల్ల విజయం సాధించాయో. ‘జెర్సీ’ బావుందనిపించినా, అసమర్ధుని జీవ యాత్రలా వుందనిపించింది నాకైతే.
మహేష్ ఆర్,  టాలీవుడ్ 

     A : మీరు చెప్పినవన్నీ కరెక్టు. అది ఆ పాత్రవరకూ దాని పర్సనల్ కథ మాత్రమే. దీంట్లోంచి ప్రేక్షకులు తీసుకోవాల్సినంత మెసేజీ ఏమీ లేదు. ఎందుకంటే ప్రేక్షకులందరూ అలాటి జబ్బున్నవాళ్ళయి వుండరు. అతడికి గనుక డయాబెటిస్ వుంటే, దాని కారణంగా ఆడలేకపోతే, ఆ డయాబెటిస్ ని జయించి - బ్యాటు పట్టుకుని సిక్సర్లు కొట్టిన కథగా అప్పుడు జనరలైజ్ అవుతుంది. అతడి పర్సనల్ కథగా వుండిపోదు. నేడు కామనై పోయిన డయాబెటిస్ వ్యాధిని జీవితాంతం మందులు వాడే  అవసరం లేకుండా క్యూర్ చేసుకున్న విజయగాథలు ఫారిన్లో వున్నాయి. వీటిలో మార్షల్ ఆర్ట్స్ ప్రముఖులూ వున్నారు. మార్షల్ ఆర్ట్స్ తో శరీరంలో ఇన్సులిన్ ప్రేరేరింప జేసుకుని డయాబెటిస్ ని జయించిన క్రీడాకారులున్నారు. ఇలాటి కథలు డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకి కొత్త ఉత్సాహాన్నీ, డయాబెటిస్ ని జయించవచ్చన్న కొత్త ఎవేర్ నెస్ ని కల్గిస్తూ ప్రయోజనాత్మకంగా వుంటాయి. వినోదాత్మకంగా చూపించవచ్చు. ‘జెర్సీ’ లాగా రియలిస్టిక్ కథకి ఓల్డ్ ఫార్ములా ట్విస్టు ఇచ్చే అగత్యమే ఏర్పడదు. కాన్సెప్ట్ ని సాధారణ స్థాయికి కుదించే, ప్రయోజన రహిత పర్సనల్ డ్రామాగా మార్చే అవసరమే రాదు. 

         ఇక ఈ లూజర్స్ కథలతో సినిమాలు మూడూ ఎందుకు ఆడాయంటే అగ్రతారలకి ఎట్రాక్ట్ అయి కావచ్చు. ఆ అగ్రతారలు ప్రేక్షకులు విసిగిపోయిన మూస రొటీన్ మాస్ హీరోయిజాల, పంచ్ డైలాగుల, ఫైటింగుల జోలికిపోకుండా,  కామన్ మ్యాన్ పాత్రలకి ఒదిగి కాస్త కొత్తగా కన్పించడం వల్ల కావచ్చు. ప్రేక్షకులకి పరమ బోరెత్తిపోయిన టెంప్లెట్ కథలనుంచి ఉపశమనం లభించడం వల్ల కావచ్చు. ఇలా పర్యావరణ సంగతులు ఫ్రెష్ గా కలిసివచ్చుంటాయి.
 
సికిందర్


16, నవంబర్ 2014, ఆదివారం

రివ్యూ..

స్క్రీన్ ప్లే తోనే జీవితం!
రచన- దర్శకత్వం : ఏఎస్ రవికుమార్ చౌదరి 
తారాగణం : సాయి ధరమ్ తేజ్, రెజినా కసాండ్రా, జగపతిబాబు, ప్రకాశ రాజ్,సాయాజీ షిండే, రఘుబాబు, షఫీ తదితరులు.
సంగీతం : అనూప్ రూబెన్స్ , ఛాయాగ్రహణం : దాశరధి శివేంద్ర, కూర్పు : గౌతమ్ రాజు, కళ : రమణ, యాక్షన్ : గణేష్
బ్యానర్ : గీతా ఆర్ట్స్ – శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్    నిర్మాతలు : బన్నీ వాస్, శ్రీ హర్షిత్
విడుదల : నవంబర్ 14, 2014
***
మెగా ఫ్యామిలీ నుంచి కొత్త హీరో  సాయి ధరమ్ తేజ్ ప్రయోగం సాఫీగా జరిగిపోయింది. ఇక కక్ష్యలో ప్రవేశించడమే మిగిలింది. నింగి నంతా పర్చుకుని ఇప్పటికే  తళుక్కు మంటున్న బోలెడు తారల్లో  ఏ తారగా మెరుస్తాడో  ఇక అతడిపైనే ఆధారపడి వుంది. రిమోట్ ఎలాగూ గ్రౌండ్ స్టేషన్ లో వుంటుంది కాబట్టి, ఆ విషయంలో ఆందోళన చెందనవసరం లేదు.
          గత నాల్గేళ్ళుగా అజ్ఞాతంలో వున్న దర్శకుడు ఏ ఎస్ రవి కుమార్ చౌదరికి మెగా వారసుణ్ణి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసే ఖ్యాతి దక్కింది. ఏదో గేమ్ ఆడిస్తే తప్ప యువహీరో జెట్ స్పీడుతో దూసుకుపోలేడన్న నమ్మకం కొద్దీ కావొచ్చు- నితిన్ తో  ‘ఆటాడిస్తా’ లాంటి గేమ్ విఫలమయ్యాక, రిస్కు చేసి మళ్ళీ ఇంకో గేమ్ తో ఈ కొత్త మెగా హీరోని బరిలోకి దింపాడు.
          అల్లు అరవింద్, దిల్ రాజు లిద్దరూ ఈ బరువుని మోశారు. ఇద్దరికీ ఒక హిట్ చాలా అవసరమే. ఈ బెట్ బెడిసి కొట్టలేదు.
          రవికుమార్ చౌదరి పూర్వపు పేలవమైన టేకింగ్ ని పక్కనబెట్టి, ఈ సారి ట్రెండీ గా –ఆడియెన్స్ ఫ్రెండ్లీ గా వుండడం కోసం ప్రయత్నించడం వల్ల ఈ బెట్ బెడిసి కొట్టలేదు.
మరో మాస్ శీను మసాలా!
          తెలుగు రాష్ట్రాల్లో వున్న అనాథల్ని ఎవరు ఆదుకుంటున్నారో లేదో గానీ, తెలుగు సినిమాలని మాత్రం అనాథలే బతికిస్తున్నారు. అలాటి ఒక శీను (సాయి ధరమ్ తేజ్) అనే అనాథ ఈసారి ఏకంగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తునే నిర్ణయించే గేమ్ ఆడేశాడు. తొలి సినిమాకి టెండర్ క్యారక్టర్, లవ్ స్టోరీ ఉండాలన్న నియమ నిబంధనలు ఇప్పుడు లేవు కాబట్టి, శీను సీన్ వన్ నుంచీ  రాఫ్ఫాడించేస్తూంటే ఈ సడెన్ జెర్కుకి అడ్జస్టయ్యే  స్టామినా కూడా ప్రేక్షకులకి వుండాలి. పాలకొల్లు నుంచి వచ్చి అతను హైదరాబాద్ లో సుపారీ కిల్లర్ మైసమ్మ (జగపతి బాబు) ని కలిసి తనని చంపెయ్యమని ఆఫరిస్తాడు. మైసమ్మ ఆరా తీస్తే తన ప్రేమ కథ చెప్పు కొస్తాడు. తను చదువుతున్న కాలేజీలోనే శైలూ (రెజినా కసాండ్రా) ని ప్రేమించాడు, ఆమె ఛీ కొడుతోందంటూ రకరకాల మలుపులతో, మెలికలతో చెప్పుకొస్తూ- మైసమ్మ ఒప్పుకున్న కాంట్రాక్టుకే  గట్టి షాకిచ్చే అసలు విషయం విప్పుతాడు.
          ఆ శైలూనే మైసమ్మ చంపబోతున్నాడు. ఇప్పుడు శీను ఛాలెంజి చేస్తున్నాడు. మైసమ్మ ఏం చెయ్యాలి? ఇదీ పాయింటు. ఇక్కడ్నించీ ద్వితీయార్ధం కథ.
          అప్పుడప్పుడే ఎన్నికలు జరిగి, గెలిచిన పార్టీ సీనియర్లు రెండు వర్గాలుగా చీలిపోయి సీఎం పదవికోసం పోటీ పడుతోంటే షఫీ (షఫీ) అనే టీవీ జర్నలిస్టు ఇద్దరి అవినీతి, అనైతిక బాగోతాలూ చేజిక్కించుకుంటాడు. సుపారీ తీసుకున్న మైసమ్మ  అతణ్ణి చావబాదుతాడు. అతన్నే కాదు, బాగోతం బైటపడే అవకాశమున్న శైలూని కూడా చంపే బాధ్యత అతడి మీద వుంది. శైలూ కేం సంబంధం? ఇదీ సస్పెన్సు.
          నేపధ్యంలో ప్రభాకరరావు ( ప్రకాష్ రాజ్), గంగా ప్రసాద్ ( సాయాజీ షిండే) వర్గాలు, ప్రత్యక్షంగా మైసమ్మా అతడి గ్యాంగు, వెంట ద్వేషించే శైలూ..ఇలాటి పరిస్థితుల్లో శైలూని  శీను ఎలా కాపాడాడు? ఇదీ విషయం.
ఎవరెలా చేశారంటే...
          హడావిడీ చేశారు. పట్టుకోలేనంత స్పీడుతో పరుగులు తీశారు. హీరో సరే సరి, పాత హిందీ హీరోయిన్ సాధన పేరు మీదుగా పాపులరైన ‘సాధన కటింగ్’ అనే హేర్ స్టయిల్ తో అబ్బిన చైల్డిష్ లుక్స్ తో, కావలిసనంత మాస్ నటన పాత కాపులా రుద్ది అవతల పడేశాడు. శరీరం, ముఖ్యంగా తొడలు లావెక్కి డాన్స్ మూవ్ మెంట్స్ లో అవి కొట్టొచ్చినట్టు కన్పించసాగాయి. ఫైట్స్ కూడా స్పీడే. డైలాగ్ డెలివరీ, వాయిస్ బలంగానే వున్నాయి, కానీ హావభావాల దగ్గర అంత పట్టులేదు. పైగా పాత్ర ఒకటే పరుగు తీయడం వల్ల కాస్తయినా ఊపిరి తీసుకునే స్పేస్ లేక – అతను హృదయాల్లో ఒదిగిపోయే సీన్స్ కొరవడ్డాయి. ఎక్కడ మన మనసులో ముద్ర వేశాడంటే ఏమీ చెప్పుకోలేం. కనీసం ఒక ఫీల్ తో కూడుకున్న క్లోజప్ కూడా! అతన్ని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు కావలసినంత టెక్నికల్ హంగామాకి పాల్పడ్డాడే తప్ప అందులో ఆత్మని పోయలేకపోయాడు. జ్యూనియర్ ఎన్టీఆర్ నటించిన  ‘అశోక్’ లో ఆ పాత్ర ఎలా వున్నా, ఇంటర్వెల్ తర్వాత  వచ్చే సోలో మెలోడీ పాటలో లయబద్ధంగా స్టెప్పు లేస్తూ అతను చాలా హోమ్లీగా హత్తుకు పోతాడు.
          హీరోయిన్ రెజీనా ది సీరియస్ పాత్ర కావడంతో ( రోమాంటిక్ కామెడీలో శోకరసం తో కూడిన సీరియెస్ నెస్ కి  తావులేదు, అలాగని రోమాంటిక్ కామెడీ కాని ఈ యాక్షన్ కామెడీలో నూ సీరియెస్ నెస్ కి చోటు వుండ కూడదు)  గ్లామర్ కోషెంట్, యూత్ అప్పీల్  వగైరా కొరవడ్డం తో బాటు, రోమాన్స్ కీ అవకాశం లేకుండా పోయింది. ఈ  నేపధ్యానికి  తగట్టే ఆమె ముఖ కవళికలూ వున్నాయి.
          మరోసారి జగపతిబాబు విలన్ గా ముద్రవేశాడు. గమ్మత్తేమిటంటే  హీరో కంటే కూడా జగపతిబాబే ఆ పాత్రలో గుర్తుండి పోతాడు. కామిక్ విలనీ ఎప్పుడూ కలర్ ఫుల్ గానే హైలైట్ అవుతుంది.
          కామెడీ ని మోసిన ఇంకో ముఖ్య నటుడు రఘుబాబు. ఇక బ్రహ్మానందం అవసరమే రాలేదు! ఇతర పాత్రల్లో నటించిన వాళ్ళందరూ –ప్రకాష్ రాజ్ –సహా కామెడీకి కావలసినంత తోడ్పడ్డారు.
          సంభాషణల పరంగా డైమాండ్ రత్నం రాసిన డైలాగు ‘మనిషి అనేవాడు బ్లడ్ రిలేషన్ ని వదిలేస్తాడేమో గానీ, మనీ రిలేషన్ ని వదులుకోడు’ టాప్ డైలాగ్. సంగీతం, ఛాయాగ్రహణం, పోరాటాలు ఇతర సాంకేతికాంశాలూ ఓకే. ముఖ్యంగా స్టయిలిష్ లుక్ తీసుకు రావడానికి ఎడిటింగ్ చాలా తోడ్పడింది- స్మాష్ కట్స్, జంప్ కట్స్ వగైరాలతో.  రీ రికార్డింగ్ విషయాని కొస్తే – రైల్వే ట్రాక్ మీద హీరో మైసమ్మ గ్యాంగుతో అభిమన్యుడిలా తలపడుతున్నప్పుడు, ఆ సన్నివేశానికి ఉత్తేజం తీసుకురావడానికి ఉద్వేగ భరిత పాట వేయడం వరకూ ఓకే- హిందీ ‘గ్యాంగ్ స్టర్’  లో ‘యా ఆలీ’ పాట వేసినట్టుగా- కానీ, దానికది అదొక ఘట్టం మాత్రమే! దాంట్లో కి తర్వాతి మెయిన్ షో డౌన్ ని కూడా కలిపేసి గుంపులో గోవిందా చేయకూడదు. అది ముగిసి, అదే చోట ఇక ఫైనల్ గా హీరో మైసమ్మ తో తలపడుతున్నప్పుడు- ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సన్నివేశం దానికదే ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. ఆ ప్రత్యేకత గాంభీర్యం!  దీనికి మునుపు ముఠా తో పోరాడినప్పటి నేపధ్య సంగీతాన్నే గోలోగోలగా కంటిన్యూ చేస్తే ఆ గాంభీర్యం కాస్తా, ఎదురుచూసిన హైలైట్ కాస్తా మట్టి కొట్టుకు పోయింది. పూర్తి నిశ్శబ్ద వాతావరణంలో, కేవలం వాళ్ళిద్దరి ఎమోషన్స్ తో, పిడి గుద్దుల  చప్పుళ్ళతో మాత్రమే రక్తికట్టించాల్సిన ఘట్టమది- ‘షోలే’  లో ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ సింగ్ వచ్చి హతమారు స్తున్నప్పుడు, విన్పించే ఒక్క ఆ గన్ షాట్స్ లాగా!
          కథలోనే ఆత్మ గురించి ఆలోచించ నప్పుడు టెక్నికల్ విలువలకీ అది పట్టలేదు. ఎంత రిచ్ గా తీశామని కాదు- సినిమా వీడియో గేమ్ కాదేమో? దాని రక్త మాంసాల గురించి కూడా కాస్త పట్టించుకోవాలేమో?
స్క్రీన్ ప్లే సంగతులు
          ఈ మధ్య వస్తున్న చాలా స్టార్ సినిమాల స్క్రీన్ ప్లేలు ఏవైనా కొత్త టెక్నిక్స్ తో కథ చెప్పడంగాక, ఎప్పుడు ఈ సోదిని ఇంటర్వెల్ కి చేరవేస్తామా, అక్కడ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసి పారేసి, ఎప్పుడు సెకండాఫ్ లోకి దూకేస్తామా అన్నట్టుగా ఉంటున్న విషయం  తెలిసిందే. ఫస్టాఫ్ ని కేవలం సెకండాఫ్ కి బల్ల కట్టుగా ఉపయోగించుకుంటున్నారు. విషయం లేకుండా ఏదో కాలక్షేపం మాత్రంగా  కానిచ్చేస్తున్నారు. ఆ సెకండాఫ్ అయినా విషయం వుంటుందా అంటే అదీ లేదు. విషయంతో సంబంధంలేని కామెడీ ట్రాకుతో నడిపేసి చివర్లో మొక్కుబడిగా విషయం  చెప్పేయడం. ఈ సెకండాఫ్ సిండ్రోమ్ అనేది ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా రకరకాలుగా వెంటాడుతున్నదే. క్రియేటివిటీ కోల్లేరవడం అంటారు దీన్ని. కొల్లేటి సరస్సులో బల్లకట్టు విన్యాసాలు.
          ప్రస్తుత సినిమాకి అదృష్ట వశాత్తూ ఇది దాపురించలేదు.  ఉన్న రొటీన్ కథని ఏదో భిన్నంగా చెప్పాలని తపన పడ్డాడు. ఐతే ఈ భిన్నత్వం ఇందాక పైన చెప్పుకున్న హీరో-విలన్ల మధ్య షోడౌన్ లో రసోత్పత్తిని అంతకి ముందు ఫైట్ ఆర్.ఆర్ తోనే ఫ్లాట్ గా చదును చేసేసి నట్టు- ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ నే సెకండాఫ్ లోనూ ప్రయోగించి- రెంటికీ తేడా లేకుండా చేశాడు. అంతసేపూ ఫస్టాఫ్ టెక్నిక్ తో ప్రేక్షకులు అలసిపోతారు- సెకండాఫ్ లో మళ్ళీ దాన్నే ప్రారంభించాడమంటే రిలీఫ్ ఏదీ లేదు, కొత్త ఫీల్ ఏదీ లేదు. ఈ తరహా కథనాన్ని ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లోనూ చూడొచ్చు. 

      ఈ టెక్నిక్ ని - అంటే ఎండ్ సస్పెన్స్ తో నడిచే ఇలాటి కథలతో అనుసరించాల్సిన  టెక్నిక్ ని-1958 లో బ్రిటిష్ దర్శకుడు మైకేల్ ఆండర్సన్ ‘టు ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ అనే బ్లాక్ అండ్ వైట్ థ్రిల్లర్ ద్వారా సెట్ చేసి పెట్టాడు. 1981 లో దీన్నే ‘ధువాఁ’ గా హిందీలో విజయవంతంగా ఫ్రీమేక్ చేశారు. దురదృష్ట మేమిటంటే, ఎండ్ సస్పెన్స్ తో వచ్చే, వస్తున్న సవాలక్ష సినిమాలు ఈ టెక్నిక్ ని పట్టుకోకపోవడంతో అట్టర్ ఫ్లాపవుతూ వస్తున్నాయి. నవలకి తప్ప దృశ్య మధ్యమానికి ఎండ్ సస్పెన్స్ కథలు పనికి రావని ఇప్పటికీ తెలుసుకోవడం లేదు.
          దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి పైన చెప్పుకున్న బ్రిటిష్ థ్రిల్లర్ టెక్నిక్ తోనే ఇంటర్వెల్ దగ్గర ఎండ్ సస్పెన్స్ ని సమర్ధవంతంగా బ్లాస్ట్ చేశాడు. ( ఇది కాకతాళీయమే కావొచ్చు- ఈ బ్రిటిష్ సినిమాలో గిటార్ తో విన్పించే థీమ్ మ్యూజిక్ లాంటిదే అక్కడక్కడా హీరో ని హైలైట్ చేస్తున్నప్పుడు అనూప్ రూబెన్స్ విన్పించాడు)  అప్పటివరకూ నడించింది ఒక దోషిని పట్టుకునే పన్నాగమే నని మనకి తట్టదు. కాకపోతే బ్రిటిష్ సినిమాలో ఆ దోషిగా ఏన్ బాక్స్టర్ దొరికిపోతుంది, హిందీలో రాఖీ దొరికిపోతుంది, ఇప్పుడు తెలుగులో జగపతి బాబు!

     ఇలాటి స్క్రిప్టుల్లోనే రివ్యూలు  రాయడానికి ఆనందం దొరుకుతుంది. ‘మనం’ తర్వాత ఆ ఆనందం ఇదే. దీంతో అయిపోలేదు. అసలు మొత్తం కథలోనే ఒక ఎండ్ సస్పెన్స్ సమస్య వుంది. అది ప్రధాన విలన్ చిట్ట చివర్లోనే రివీలయ్యే సస్పెన్స్. అప్పటివరకూ ఆ విలన్ వున్నట్టు మనకే కాదు, హీరోకీ తెలీదు. మైసమ్మ పాత్ర లేకపోతే, ఈ కథ ఇలా వుండేది : ఎవరు తనమీద, హీరోయిన్ మీదా హత్యాయత్నాలు చేస్తున్నారో తెలీక, హీరో ఆ దాడుల్ని తిప్పి కొడుతూ మాత్రమే ఉండిపోయే రియాక్టివ్ ( అంటే పేలవమైన పాసివ్) క్యారక్టర్ గా వుండి  పోయేవాడు- ‘అశోక్’  లో ఇలాటి సిట్యుయేషన్ లోనే ఎన్టీఆర్ పాత్ర వుండి  పోయినట్టు!
          చిట్ట చివర్లో ఆ విలన్ని కనుక్కుని అప్పుడు మాత్రమే నేరుగా తలపడేవాడు.
అప్పటివరకూ విలన్ని దాచడం ఎండ్ సస్పెన్స్ కథ. ఇలాటి కథలో హీరో పాత్ర పేలవమై పోతుంది. ఏకపక్షంగా కథ నడుస్తూ వుంటుంది. దిక్కుతోచక హీరో తిరుగుతూంటాడు. మనల్ని దిక్కులు చూసేలా చేస్తాడు.
          ఈ  సమస్యని కవర్ చేయడానికే మైసమ్మ పాత్ర పనికొచ్చింది. దీంతో హీరో విలన్ కోసం వెతుక్కుంటు న్నాడన్నవిసుగు పుట్టలేదు. కళ్ళ ముందు మైసమ్మే విలన్ గా కన్పిస్తున్నాడు, అతడి మనుషులే వెంట పడ్డారు, అతడితోనే హీరో తలపడుతున్నాడు- ఇలా ఎండ్ సస్పెన్స్ అనే ఆత్మహత్యా సదృశ ఫీల్ కలక్కుండా కథ  నడుస్తూ- ఇక చివర్లో అసలు విలన్ రివీలయ్యే టప్పటికి మరో కొత్త మూడ్ లోకి ప్రేక్షకులు సర్దుబాటు అయ్యేట్టు ప్లే అయ్యింది.
          కథలో స్ట్రక్చర్ పరంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి పాత్ర పనికొస్తే అది నిలబడుతుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులుగా మనసంగతి వదిలేస్తే, అసలు మైసమ్మకి ఆ కాంట్రాక్టు ఇచ్చిన అసలు కుట్రదారు ఎవరా అని హీరో ఆలోచించక పోవడం అతడి కుశాగ్రబుద్ధి పాత్ర చిత్రణకే గొడ్డలి పెట్టు.  సెకండాఫ్ లో హీరోయిన్ చెప్పే వరకూ అతను తెలుసుకోడు.           ఇలాకాక, మైసమ్మ గురించి మొత్తం ముందే తెలిసి ఎలా వచ్చాడో- అలా అప్పటికి ప్రధాన విలన్ గురించి కూడా హీరో కి అంత ముందే తెలిసివుండాలి. అది చివర్లో తనే రివీల్ చేయాలి. అప్పుడీ పాసివ్ నెస్ పోయేది. మొత్తం కథా ప్రపంచంలో ఏం జరుగుతుందో హీరోకి తెలియకుండా వుండకూడదు కదా?.
          ఇక క్లైమాక్స్ కూడా జర్నలిస్టు చేతికి వదిలేశాడు. ఇలా ఎప్పుడు వదిలేస్తారంటే- ప్రాణాలు వదుల్తున్నప్పుడు! ఒక పాత్ర క్లైమాక్స్ లో ప్రాణాలు వదుల్తూ  లక్ష్యం పూర్తి చేయమని ఇంకో పాత్రకి అందిస్తుంది. అప్పుడా అందుకున్న పాత్ర ఫ్లాగ్ క్యారక్టర్ అవుతుంది. ఇక్కడ లెక్క ప్రకారం జర్నలిస్టు పాత్ర వుండకూడదు. చనిపోతూ ఆ ట్రంప్ కార్డు హీరో ప్లే చేసుకోవడానికి ఇచ్చేసి అడ్డుతొలగాలి.

-సికిందర్