రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, నవంబర్ 2021, శనివారం

1083 : సాంకేతికం

       సింపుల్ గా ‘చెప్పొద్దు, చూపించాలి’ అంటే ఏమిటి? అంటే పాత్రలు వాటి ఆలోచనల్ని, భావోద్వేగాలని మాటల్లో కాకుండా చేతల ద్వారానో, లేదా సింబాలిజంల ద్వారానో వెల్లడించడం. చెప్పడమంటే పాత్ర భావానికి డైలాగు రాయడం. పాత్రకి నిద్ర వస్తూంటే, అబ్బా నిద్రొస్తోందని డైలాగు రాసి, పాత్రకి నిద్ర వస్తున్నట్టు ప్రేక్షకులకి చెప్పడం. దీన్ని చూపించడమెలా అంటే, పాత్ర ఆవులించినట్టు యాక్షన్ (చేత) లెఫ్ట్ రాయడం. లేదా పక్కన ఖాళీ కప్పులు పడుండి, టీ మీద టీ తాగేస్తున్నట్టు చూపిస్తే, అది ముంచుకొస్తున్ననిద్రకి సింబాలిజం అవుతుంది. డైలాగే రాస్తే అది విజువల్ ఆర్టు అవదు. పైగా ఆ డైలాగు ఎఫెక్టివ్ గా డబ్బింగు చెప్పించడానికి, పది నిమిషాలో పాతిక నిమిషాలో సమయం తీసుకుంటుంది. ఆ మేరకు పడే డబ్బింగు థియేటర్ రెంటు బిల్లు వేస్టు. పాత్ర ముందు నాల్గు ఖాళీ కప్పులు పడేసి, రెండు టీలు పెట్టేస్తే పది రూపాయలతో అయిపోయే పని.

        లాగని సీన్లలో డైలాగులే లేకుండా చేయమని కాదు. సినిమా మొత్తంలో పది పదిహేను చూపించడాలు వుండొచ్చు. ఆ షాట్స్ గుర్తుండి పోవడమే గాకుండా, మంచి అనుభవాన్నిచ్చాడని కూడా మేకర్ ని గుర్తుంచుకుంటారు ప్రేక్షకులు. చూపించడ మంటే అనుభవాన్నివ్వడమే, వీక్షణానుభవం. మనలో ఎంత మందిమి నిద్రవస్తూంటే టీ మీద టీ తాగేసి వుండం? ఇలా మన అనుభవమే తెర మీద మేకర్ చూపిస్తూంటే మనసారా ఎటాచ్ అయిపోతాం ఆ షాటుకి.
        
చూస్తే వుండే ప్రభావం వింటే వుండదు. చూసినప్పుడు అందులో యాక్షన్ కన్పిస్తుంది, అందుకే ప్రభావం చూపిస్తుంది. విన్నప్పుడు యాక్షన్ వుండదు. చూస్తే మెదిలే ప్రశ్నలు వింటే వుండవు. ఎదురుగా ఖాళీ కప్పులు పడున్నాయి. ఇంకో కప్పు టీ తాగడం పూర్తి చేసి మరో కప్పు అందుకుంటున్నాడు... అన్నట్టు యాక్షన్లో ముంచుకొచ్చే నిద్ర చూపిస్తూంటే - నిద్ర కాస్తూ అన్ని కప్పులు తాగాడా, ఇంకా తాగుతున్నాడా - అన్న ప్రశ్నలు మెదులుతాయి. ప్రేక్షకుల్ని ఖాళీగా కూర్చో బెట్టకుండా ఆలోచింప జేస్తుంది చూపించడం. మూకీ సినిమాలు ఇలాగే వర్కౌట్ అయ్యాయి. ఫిలిమ్ ఈజ్ బిహేవియర్ అన్నారు. మాటల కన్నా ప్రవర్తనల ద్వారా, చేతల ద్వారా విషయం బయట పడితే ఉత్తమ దర్శకత్వం.

    ప్రతీ వొక్క షాటునీ విలువైనదిగా ఎంచినప్పుడే బడ్జెట్ వృధాని అరికట్ట వచ్చు. నిద్ర వస్తోందని మాటలతో చెప్పడానికి షాటెందుకు ఖర్చు దండగ. అలాంటప్పుడు సినిమా తీయకుండా రేడియో నాటకంగా ప్రసారం చేసుకోవచ్చు ఎంచక్కా. లేదా వీధి నాటకం వేసుకోవచ్చు. సినిమాకి కళ్ళు మూసుకుని వినడానికి కాకుండా కళ్ళు తెర్చుకుని చూడ్డానికి వెళ్తాం. చూసినప్పుడు డీటెయిల్స్ లేకుండా షాట్స్ వుంటే అవి వీక్షణానందాన్ని ఇవ్వవు. నాల్గైదు ఖాళీ కప్పులు పడుండి ఇంకో కప్పు లాగిస్తున్న డిటెయిల్సే షాటంటే. షాట్ ఈజ్ డిటెయిల్. దీనికి నాటకీయత పెంచాలనుకుంటే అప్పుడు సౌండు హెల్ప్ తీసుకోవచ్చు. నిదుర పోరా తమ్ముడా అని ఎక్కడ్నించో లతా మంగేష్కర్ పాట వస్తున్నట్టు. లేదా పాత్ర నిద్ర పోగొట్టే  తెల్ల చీరకు తగధిమి తపనలు ఇంకో లతా పాట. టీలతో బాటు డబుల్ ధమాకాగా పాట!

2.

         ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’, ‘మేఘ సందేశం’, ‘సితార నాల్గూ ఒకే  సామాన్యాంశాన్ని కలిగి వుంటాయి. ఏమిటది? అతి తక్కువ డైలాగులు. ఈ నాల్గు పెద్ద హిట్స్ లో అతి తక్కువ డైలాగులు. షాట్స్ తో విజువల్ గానే ఎక్కువ కథ చెప్పారు. ఇవేం సినిమాలు, అర్ధంకాలేదని ప్రేక్షకులు తిప్పికొట్టలేదు. పెద్ద హిట్స్ చేశారు. ఆర్ట్ సినిమాలకి కాలం చెల్లిపోయాక, 2000 సంవత్సరంలో శ్యామ్ బెనెగల్ అవే కథల్ని బాలీవుడ్ స్టార్స్ తో తీసి కొత్తతరం ప్రేక్షకుల్ని ఆనందపర్చారు. అప్పుడు వీటిని కమర్షియలార్ట్ సినిమాలన్నారు.
        
కానీ చాలా పూర్వమే ఎప్పుడో ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’, ‘మేఘ సందేశం’, ‘సితార తెలుగులో కమర్షియలార్ట్ సినిమాలే! కొత్త మేకర్లు వీటిని పాఠాలుగా పెట్టుకుంటే మీడియం, స్మాల్ బడ్జెట్స్ కి కొత్త రూపునిచ్చి గుర్తింపు పొంద గల్గుతారు. మీడియం, స్మాల్ బడ్జెట్స్ కే మేకర్లకి సృజనాత్మక స్వేచ్ఛ వుంటుంది. అలాంటప్పుడు ఇవే కథల్ని కమర్షియలార్టుగా తీస్తే నష్టమేం లేదు. 
 
3.

        షాట్స్ డైలాగుల్ని తగ్గించడమే గాక, రెండు మూడు సీన్సుని కలిపి ఒకటిగా చేసి బడ్జెట్ ని మిగల్చగలవు. సన్నివేశాన్ని బట్టి సౌండ్  కూడా వాడుకుని. మంచి రోజులొచ్చాయి’, రాజ రాజ చోర లలో ఇదెలా చేయవచ్చో గమనించాం. ఇంకా సీను ఫుటేజీ, షూటింగు టైము తగ్గించాలంటే కాంప్లెక్స్ షాట్ వుంది. అంటే సీనులో వున్న అందరు నటుల్నీ మిడ్ షాట్ లో ఒకే ఫ్రేములో వుండేట్టు ప్లేస్ మెంట్స్ ని కంపోజ్ చేసి, మాట్లాడిస్తే, ఒకే షాట్ లో పూర్తవుతుంది.

      వీటన్నిటికీ బీజం ఎక్కడ పడాలి? ట్రీట్మెంట్ నుంచి డైలాగు వెర్షన్ రాస్తున్నపుడే స్టోరీ మేకింగ్ చేస్తూ. వెబ్ సిరీస్ కి కూడా ఇలా స్టోరీ మేకింగే. వెబ్ సిరీస్ కి హిందీలో రైటరే కింగ్. అక్కడ వెబ్ సిరీస్ రైటర్స్ మీడియా. మధ్యలో డైరక్టర్ని తొలగించ వచ్చేమో గానీ, రైటర్నితొలగించలేరు. అయినా రైటర్ మేకర్ లా స్టోరీ మేకింగ్ చేస్తేనే నిలదొక్కుకుంటాడు, స్టోరీ రైటింగ్ చేస్తే కాదు.
        
స్టోరీ రైటింగ్ కథ అల్లడం, స్టోరీ మేకింగ్ కథని నిర్మించడం. సినిమాకి నిర్మించాలి. సినిమాని నిర్మిస్తారు, అల్లరు. నిర్మించడమంటే మెకానిజమే. అందుకే మేకర్ మెకానిక్కు. షూటింగులోనే  కాదు, రైటింగు లోనూ.

(అయిపోయింది)

—సికిందర్

12, నవంబర్ 2021, శుక్రవారం

1082 : రివ్యూ


రచన- దర్శకత్వం : శ్రీ సరిపల్లి
తారాగణం : కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, తనికెళ్ళ భరణి, సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు
సంగీతం : ప్రశాంత్ విహారి, ఛాయాగ్రహణం : పిసీ మౌళి
నిర్మాత : రామారెడ్డి
విడుదల : నవంబర్ 12, 2021

***

        రెక్స్ - 100 హిట్ హీరో కార్తికేయ గుమ్మకొండ తర్వాత నటించిన చావు కబురు చల్లగా సహా ఐదూ హిట్ కాలేదు. ఇప్పుడు తాజాగా రాజా విక్రమార్క యాక్షన్ కామెడీ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతూ, శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడితో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వారం వారం కొత్త దర్శకులు వస్తూనే వున్నారు. ఒక సినిమాతో మళ్ళీ కన్పించకుండా వెళ్ళి పోతున్నారు. అంటే ఫ్లాపులు తీయడంలో పోటీపడుతున్నారు. ప్రస్తుత కొత్త దర్శకుడు, కార్తికేయ కూడా కలిసి ఫ్లాపు తీయడానికి పోటీ పడ్డారా? ఇది తెలుసుకుందాం...

కథ

    విక్రమ్ (కార్తికేయ) ఎన్ఐఏ ఏజెంట్. బాస్ మహేంద్ర (తనికెళ్ళ భరణి) కింద హైదరాబాద్ లో వుంటాడు. మారణాయుధాలు సరఫరా చేస్తున్న ఒక నైజేరియన్ ని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తాడు. అప్పుడు పొరపాటున తన చేతిలో వున్న తుపాకీ పేలి నైజేరియన్ చచ్చిపోతాడు. చచ్చిపోతూ మాజీ నక్సలైట్ నాయకుడు గురునారాయణ (పశుపతి) గురించి చెప్పి చచ్చిపోతాడు. గురు నారాయణ వల్ల  హోమ్ మంత్రి చక్రధర్ (సాయి కుమార్) కి ప్రాణాపాయముందని తెలుసుకున్న బాస్ మహేంద్ర, విక్రంకి హోమ్ మంత్రి చక్రధర్ సెక్యూరిటీ బాధ్యతలు అప్పగిస్తాడు. చక్రధర్ కి కాంతి (తాన్యా రవిచంద్రన్) అనే అందమైన కూతురుంటుంది. ఈమెతో ప్రేమలో పడతాడు విక్రమ్. ఒకవైపు హోమ్ మంత్రిని రక్షించే బాధ్యత తీసుకున్న విక్రమ్, అతడి కూతురితో ప్రేమలో పడ్డంతో బాధ్యతని నెరవేర్చగలిగాడా లేదా అనేది మిగతా వెండితెర మీది కథ.

ఎలావుంది కథ

  యాక్షన్ కామెడీ జానర్లో పాత రొటీన్ ఫార్ములా కథ. ఇందులో యాక్షన్, కామెడీ, ఫార్ములా కథ ఏవీ సరిగా లేని కథ. కొత్త దర్శకులు కథల దగ్గరే సినిమాల్ని బోల్తా కొట్టిస్తున్నారు వరుసగా. ఇదీ అంతే. అర్ధం పర్ధం లేని కథ. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఏజెంట్ హీరో పాత్రతో ఇష్టారాజ్యంగా వుంది కథ. ఎన్ఐఏ అనేది టెర్రరిజం, నక్సలిజం, అక్రమ మానవ రవాణా, నకిలీ నోట్లు, నిషేధిత మారణాయుధాల సరఫరా, సైబర్ టెర్రరిజం వంటి కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ. కేవలం ఇన్వెస్టిగేట్ చేసి కోర్టులో కేసులు నడిపే సంస్థ మాత్రమే. ఒకరికి సెక్యూరిటీ కల్పించడం సంస్థ పని కాదు.  అలాటిది రాష్ట్ర హోమ్ మంత్రి సెక్యూరిటీగా హీరో ఎలా వచ్చాడు? దర్శకుడు తనకి తానే ఫీలై ఇతడ్ని సెక్యూరిటీగా నియమించేస్తే చెల్లిపోతుందా? ఎన్ఐఏ ఏజెంట్లు సెక్యూరిటీ గార్డులా? ఇదెంత హాస్యంగా వుందో సినిమా కూడా అంత హాస్యాస్పదంగా వుంది.


       పేరుకి హోమ్ మంత్రిని రక్షించే డ్యూటీ, కథంతా హీరోయిన్ తో ప్రేమ కామెడీలే. హోమ్ మంత్రిని రక్షించే సీరియస్ డ్యూటీ కూడా కామెడీలే. ప్రేమ ట్రాకే మొత్తం ప్రధాన కథకి అడ్డుపడుతూ నవ్వులాటగా మార్చేసింది. ప్రేక్షకులు ఇంత తెలివి తక్కువగా సినిమాలు చూస్తారనుకున్నట్టుంది. హీరో కార్తికేయ తన ఆరో ఫ్లాప్ కోసం దిగ్విజయంగా ఈ కథ ఒప్పుకున్నట్టుంది. ఇక ఏడో ఫ్లాప్ కోసం ఇంకెలాటి కథ సైన్ చేశాడో, చేస్తాడో చూడాలి. అతను కథల మీద అవగాహన లేక చేతులారా కెరీర్ పాడు చేసుకుంటున్నాడు.

నటనలు- సాంకేతికాలు
      ఎన్ఐఏ ఏజెంట్ గా షేప్, స్టయిల్, పాయిజ్ వగైరా బాగా వర్కౌట్ చేశాడు కార్తికేయ. తన వర్కౌట్ కి తగ్గ కథ దర్శకుడివ్వ లేకపోతే ఏం లాభం. కామెడీలు చేసుకుంటూ వుండిపోవడమే. విక్రమార్క రోమాంటిక్ కామెడీలనుకోవచ్చు టైటిల్. ఈ రోమాంటిక్ సీన్లూ ఒక్కటీ ఎంటర్ టైన్ చేయలేని నిస్సహాయతని దర్శకుడి నుంచి అరువు దెచ్చుకున్నట్టుంది. ఇక యాక్షన్ సీన్స్ కి తగ్గ ఫిజిక్ అంతా వుంది కార్తీకేయకి. యాక్షన్ సీన్స్ కి తగ్గ సిట్యుయేషన్స్ నివ్వాలనే దర్శకుడికి తట్టలేదు. కార్తికేయ ఏం చేసి కనీసం మాస్ ప్రేక్షకుల్ని మెప్పించాలన్నా, వీల్లేకుండా విడివిడి ఖండాలుగా చేసి అన్నీ అందించాడు దర్శకుడు.

        దర్శకుడు చేసిన మెచ్చదగ్గ పని ఒక్కటే. తనికెళ్ళ భరణి చేత పంచ్ డైలాగులు పేల్చడం. సినిమాలో ఇదొక్కటే కాస్త ఎంటర్టయిన్మెంట్. ఇక హీరోయిన్ సహా ఎవరి గురించీ చెప్పుకోవడానికి లేదు. సుధాకర్ కోమాకుల వయసుకి మించిన ఏసీపీ పాత్రలో అతి అన్పి స్తాడు. శత్రువులు టార్గెట్ చేసిన, హీరో సెక్యూరిటీగా వున్న, సాయి కుమార్ కీలక హోమ్ మంత్రి పాత్ర అర్ధాంతరంగా ముగిసిపోవడం ఒక విచిత్రం.

        సాంకేతిక శాఖలు దర్శకత్వంకంటే అద్భుతంగా వుండడం ఒక విశేషం. యాక్షన్ సీన్స్, కెమెరా వర్క్ లాగా దర్శకుడి  దర్శకత్వ సత్తా కూడా వుండుంటే సాంకేతిక విలువలు సార్ధకమయ్యేవి. విచిత్ర మేమిటంటే  పాటలు కూడా కథానుసారం వుండవు. ఏదీ కథానుసారం వుండని అతుకుల బొంత అని కాస్త కఠినంగానే చెప్పక తప్పదు.  

చివరికేమిటి

     కథ లేకుండా నాల్గు రకాల యాక్షన్, కామెడీ, లవ్, సాంగ్స్ ఎలిమెంట్లు బిట్లు బిట్లుగా కలిపి తీసిన సినిమా ఇది. ఇది కూడా ఒక కొత్త ప్రయోగమేనేమో. ఫస్టాఫ్ పసలేని లవ్ ట్రాక్ తో, సాంగ్స్ తో విషయం లేకుండా సాగుతూ వుంటుంది. కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్ అని రివీలైనప్పుడు మనకి థ్రిల్ ఏమీ వుండదు ఈ టర్నింగ్ కి. ఎన్ఐఏ ఏజెంట్ అని ముందే పబ్లిసిటీలో చాలా చెప్పేశారు గనుక. పబ్లిసిటీలో సస్పెన్స్ లేదు, సినిమాలోనూ  సస్పెన్స్ లేదు. ఎలాగో ఫస్టాఫ్ అయిందన్పించాక సెకండాఫ్ ఏం చేయాలో అర్ధం గానట్టు సిల్లీ కథా కథనాలు, కామెడీలు. హీరోయిన్ కిడ్నాపులు.

        కొత్త దర్శకుడికి యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ల మీద అవగాహన లేకుండానే ఈ సాహసానికి ఒడిగట్టి నట్టుంది. తనవల్ల కానిది వదిలేసి కామెడీలు తీసుకుంటే సరిపోతుంది.  సగటు ప్రేక్షకులు కూడా ఎలాపడితే అలా సినిమాలు తీస్తే చూసే మూడ్ లో ఇప్పుడు లేరు. జీవన వ్యయం పెరిగిపోయి సినిమా టికెట్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఎంతో బావుందని టాక్ వస్తే తప్ప వాళ్ళ టికెట్లు తెగే పరిస్థితి లేదు. కొత్త దర్శకులు మిడిమిడి జ్ఞానంతో సినిమాలు తీసే కాలం పోయింది. ఇలా చిరంజీవి హిట్ సినిమా టైటిల్ పెట్టినంత మాత్రాన చాలదు. అవతల ఇదే వారం ఇంకో కొత్త దర్శకుడు సింగీతం- కమల్ క్లాసిక్ 'పుష్పక విమానం' టైటిల్ కి తను కూడా తీరని అన్యాయం చేశాడు.  

—సికిందర్  


1081 : రివ్యూ


 

రచన - దర్శకత్వం : దామోదర
తారాగణం : ఆనంద్ దేవరకొండ
, గీత్ సైనీ, శాన్వీ మేఘనా, సునీల్, శరణ్య, నరేష్, అజయ్, హర్షవర్ధన్ తదితరులు
సంగీతం : అమిత్ దాసానీ
, రామ్ మిరియాల, ఛాయాగ్రహణం : హెస్టిన్ జోస్ జోసెఫ్
నిర్మాతలు : గోవర్ధన్ దేవరకొండ
, ప్రదీప్, విజయ్
విడుదల : నవంబర్ 12
, 2021

***

        'కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్లో విజయ్ దేవరకొండ నిర్మాతగా రెండో మూవీ వచ్చేసింది. 2019 లో నిర్మించిన మీకు మాత్రమే చెప్తా తో విజయం సాధించలేక పోయాక, ఇప్పుడు తమ్ముడు ఆనంద్ హీరోగా పుష్పక విమానం నిర్మించాడు. దొరసాని’, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి రెండు సినిమాలతో వెలుగులోకొచ్చిన ఆనంద్ దేవరకొండ, ఈసారి  ఫ్యామిలీ- రోమాంటిక్ మూవీని ప్రయత్నించాడు. పుష్పక విమానం పాత క్లాసిక్ హిట్ టైటిల్ తో కొత్త దర్శకుడు దామోదర పరిచయమవుతున్నాడు. ఇంతకీ ఈ హైప్ కి తగ్గట్టు మూవీ వుందా? ఆనంద్ దేవరకొండ కిది మూడో ఆనందమేనా?

కథ

    సుందర్ (ఆనంద్ దేవరకొండ) కొత్తగా పెళ్ళయిన స్కూల్ టీచర్. పెళ్ళయిన వారానికే భార్య మీనాక్షీ (గీత్ సైనీ) పారిపోతుంది. దీంతో కంగారు పడ్డ సుందర్ విషయం బయట పడకుండా భార్య వున్నట్టే నటిస్తూంటాడు. షార్ట్ ఫిలిమ్ నటి రేఖ (శాన్వీ మేఘన) ని తెచ్చుకుని భార్యలా నటింప జేస్తూంటాడు. భార్య ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎందుకెళ్ళి పోయిందో మిత్రుడి సాయంతో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూంటాడు. ఇంతలో ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది. పోలీస్ ఇన్స్ పెక్టర్ రంగం (సునీల్) రంగ ప్రవేశం చేస్తాడు. ఇక భార్య అదృశ్య రహస్యం మలుపులు తిరుగుతుంది. ఏమిటా రహస్యం, ఏమిటా మలుపులు? భార్య మీనాక్షీ అదృశ్యంలో సుందర్ ని ఎందుకు అనుమానించాడు ఇన్స్ పెక్టర్ రంగం? సుందర్ అనుమాన నివృత్తి చేసుకుని మీనాక్షిని కనుక్కో గలిగాడా? అసలామె ఎందుకు అతణ్ణి వదిలేసి వెళ్ళి పోయింది? ఇవి తెలియాలంటే మిగతా సినిమా చూడాలి.

ఎలావుంది కథ
       గత వారం దీపావళికి రజనీ కాంత్ పెద్దన్న విడుదలైంది. ఇందులో రజనీ చెల్లెలు (కీర్తీ సురేశ్) పెళ్ళి తంతులోనే ఇంట్లోంచి మిస్టీరియస్ గా వెళ్ళిపోతుంది. దీని కారణం సెకండాఫ్ విలన్లతో యాక్షన్ స్టోరీలో తెలుస్తుంది. ఈవారం పుష్పక విమానం లో కొత్తగా పెళ్ళయిన భార్య ఇంట్లోంచి మిస్టీరియస్ గా వెళ్ళిపోతుంది. దీని కారణం సెకండాఫ్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. దీపావళికి అదృష్టవశాత్తూ పెద్దన్నతో బాటే పెద్దన్న పాయింటుతో పుష్పక విమానం విడుదల కాలేదు. బతికి పోయింది.

        అయితే పెద్దన్న ఒక ఫార్ములా కథ. ఇది అంతకి మించి మరోలా వుండదు. పుష్పక విమానం ఫార్ములా కథైనా కాకుండా, ఇటు నేటి రిలేషన్ షిప్ కథైనా కాకుండా, ఆషామాషీ కథ చేశాడు కొత్త దర్శకుడు దామోదర. భార్య వెళ్ళిపోయిన కారణం బలంగా లేకపోవడం, కలిసిన విధానం కూడా సిల్లీగా వుండడంతో తేలిపోయింది కథ. పెళ్ళంటే సర్దుకు  పోవడమేనని చప్పగా మెసేజి ఇచ్చేసి ముగించేశాడు.

        నేటి జంటలు కొందరు అపరిపక్వతతో వుండొచ్చు, అలాటి జంటల కథని దర్శకుడు కూడా అపరిపక్వతతో చెప్తే ఎలా, టైమ్ వేస్టు తప్ప? సినిమాలో పాత సినిమాల రికార్డులు అక్కడక్కడా మోగించినట్టు, కోడి రామకృష్ణ తీసిన సినిమాలు కూడా చూసి వుంటే, జంటల కథల్ని ఎలా బలంగా, బాగా చెప్పొచ్చో  తెలుసుకోగల్గే వాడేమో కొత్త దర్శకుడు.  

నటనలు- సాంకేతికాలు

       ఆనంద్ దేవరకొండ ఈసారి కష్టాల్లో పడ్డ కామెడీ పాత్ర చేశాడు. రాజేంద్రప్రసాద్ సినిమాలు గుర్తుకొచ్చి ఆనంద్ ఇంకెంత ట్రైనింగు పొంది, ఎంత బాగా చేయొచ్చో అన్పిస్తుంది. కామెడీని పండించే టైమింగ్ లేకపోవడం, హావభావాలు ఒకేలా వుండడం, కామెడీ కంటే విచారంగాఎక్కువ కన్పించడం, కలర్ఫుల్  టైటిల్ పుష్పక విమానం కి తగ్గట్టు లేవు. యుద్ద విమానమేదో  చక్కర్లు కొడుతున్నట్టు వుంది.  

        భార్య వెళ్ళిపోయిన విషయం దాచిపెడుతూ పడే పాట్లు, దర్శకత్వ లోపం వల్ల కొత్తగా లేకపోవడం కూడా, ఆనంద్ ఎలివేట్ అవక పోవడానికి కారణమైంది. ఇక భార్య గురించి తానే ఇన్వెస్టిగేషన్ చేయడం ఎలాగూ సీరియస్ వ్యవహారమే. ఇది తనకి సరిపోయింది. కానీ ఇది సీరియస్ సినిమా అవాల్సిన అవసరముందా? ఆనంద్ పాత్రని చేతకాని వాడి పాత్రగా ఎస్టాబ్లిష్ చేసి వుంటే, ఆ చేతకాని వాడి చేష్టలు, స్ట్రగుల్, పోరాటాల్లోంచి కామెడీ పుట్టే అవకాశముండేది. ఆనంద్ టాలెంట్ కిది సరిపోయేది. పెళ్ళి ని పుష్పక విమానంతో పోల్చినప్పుడు, ఎలాగైనా మళ్ళీ భార్యతో ఆ పుష్పక విమానం ఎక్కాలన్న ఏకైక గోల్ తో పాత్ర కొనసాగివుంటే – ఆనంద్ లోపాలు కవరై పోయేవి.

        భార్యగా నటించిన గీత్ సైనీకి పెద్దగా పాత్రలేదు, నటన కూడా అంతంత మాత్రం. రెండో హీరోయిన్ శాన్వీ మేఘనా మాత్రం హుషారు తెప్పించే నటనతో, టైటిల్ రోల్ తానే అయినట్టూ, కామిక్ ఎక్స్ ప్రెషన్స్ తో, యాక్టింగ్ తో, ఈ భారమైన  సినిమాకి చాలా రిలీఫ్ గా వుంది.

        సునీల్ వేసిన ఇన్స్ పెక్టర్ పాత్ర, ఇన్వెస్టిగేషన్, సునీల్ బ్రాండ్ ఫన్ లేకుండా, లాజిక్ కూడా లేకుండా నీరసంగా వుంది. స్కూల్లో సహ టీచర్ గా నరేష్, పక్క ఫ్లాట్ లో మ్యూజిషియన్ గా హర్షవర్ధన్ నటించారు. మిగిలిన సహాయ నటుల గురించి చెప్పుకోవడానికేం లేదు. విజువల్స్, ప్రొడక్షన్ విలువలూ బావున్నాయి గానీ పాటలు, నేపథ్య సంగీతం పుష్పక విమానాన్ని ఎగరేయలేదు.

చివరికేమిటి

     ప్రధానంగా కథా కథనాలు టైటిల్ కి పెను భారంగా మారాయి. అరువు దెచ్చుకున్న సింగీతం శ్రీనివాసరావు- కమల్ హాసన్ ల క్లాసిక్ మూవీ టైటిల్ కైనా న్యాయం చేయలేదు. ఫస్టాఫ్ ప్రారంభమే పెళ్ళి చూపించేసి, ఆ వెంటనే భార్య వెళ్ళిపోయిందన్న కథ ప్రారంభించడంతో ఫీల్ లేకుండా డ్రైగా మారింది. పెళ్ళయ్యాక వారం రోజులు భార్య వున్నప్పుడు, ఆమెతో ఆనందాలూ, పుష్పక విమాన యానాలూ వంటి సరదాలూ అవీ చూపించి, హేపీ వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేయకుండా, పెళ్ళయిన తర్వాతి సీన్లోనే భార్య కన్పించడం లేదని చెప్పిస్తూ కథ ప్రారంభించడంతో - అలాగే కథ నడపడంతో ఫీల్, ఎమోషన్లు, సానుభూతి  మొదలైనవి ప్రేక్షకులకి కలక్కుండా పోయాయి.

        ఇంటర్వెల్ వరకూ విషయాన్ని కప్పిపుచ్చుతూ చేసిన కామెడీ కూడా ఇందుకే వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్లో భార్య అదృశ్య కథ మలుపు తిరిగి పోలీసులు ఎంటరైనప్పుడు- క్రైమ్, మర్డర్ మిస్టరీగా పేలవంగా మారిపోయింది కథ. సింపుల్ గా చెప్పాలంటే, రోమాంటిక్ డ్రామాగా నమ్మిస్తున్న కథ సడెన్ గా మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ గా మారిపోవడం జానర్ మర్యాదని దెబ్బతీసింది. సెకండాఫ్ సాంతం ఇన్వెస్టిగేషన్ కూడా సిల్లీగా వుంది. క్లయిమాక్స్, ఓ బలహీన మెసేజితో ముగింపు సరే. చాలా బలహీన దర్శకత్వం, వేగంలేని చిత్రీకరణ. 

        ఇది ఓటీటీకి వర్కౌట్ అయ్యే సినిమా. మార్నింగ్ షోకి థియేటర్లో నలభై మంది కూడా లేకపోవడం పబ్లిసిటీ లోపం కాదు. విజయ్ దేవరకొండ బాగానే ప్రమోట్ చేశాడు. టైటిల్ కూడా అద్భుతంగా వుంది. ఆనంద్ దేవరకొండ కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో చాలా ఇంటర్వ్యూ లిచ్చి  గ్లామర్ పెంచాడు. అయినా ఎందుకనో ఎలావుందో చూద్దామని కూడా ఓపెనింగ్స్ కి ప్రేక్షకులు తరలి రాలేదు.

—సికిందర్

 

 

 

 

 

11, నవంబర్ 2021, గురువారం

1080 : సాంకేతికం


       రాజ రాజ చోర లో చూద్దాం : 1. ఇందులో ప్రారంభ దృశ్యాల్లో జెరాక్స్ సెంటర్లో పనిచేసే శ్రీవిష్ణు, 2. గర్ల్ ఫ్రెండ్ మేఘా ఆకాష్ ల మధ్య ఫోన్ సంభాషణ ముగిశాక, 3. శ్రీవిష్ణు ఒక గ్యారేజ్ కెళ్ళి, ఐటీ ప్రొఫెషనల్ లా డ్రెస్ మార్చుకుని, ఐటీ జాబ్ చేసే మేఘా ఆకాష్ ని కలుసుకోవడానికి బయల్దేరతాడు. అంటే జెరాక్స్ సెంటర్లో పని చేసే శ్రీ విష్ణు, మేఘా ఆకాష్ ని ఐటీ ప్రొఫెషనల్ గా నమ్మిస్తూ, అందుకు గ్యారేజీలో దాచి పెట్టిన డ్రెస్ వేసుకుని ఆమెని కలవడానికి వెళ్తున్నాడనీ ఈ మూడు సీన్లలో అర్ధం జేసుకోవాలి. వీటిలో ఏ సీను వ్యర్ధంగా వుంటూ బడ్జెట్ ని పెంచింది? వ్యూయింగ్ ఎక్స్ పీరియెన్సు ని  డల్ గా మార్చింది?

        శ్రీవిష్ణు మేఘా ఆకాష్ తో ఫోన్లో మాట్లాడే 2వ సీను బడ్జెట్ కి, వ్యూయింగు ఎక్స్ పీరియెన్సుకీ భారంగా వుంది. ఈ సీన్ని స్క్రిప్టు ఆడిట్ లోనే కట్ చేసేయ్యొచ్చు. ఈ సీను, దీని తర్వాతి గ్యారేజి సీను చూస్తే ఎలాటి ఫీలింగు నిస్తున్నాయంటే, శ్రీవిష్ణు మేఘాతో ఫోన్లో మాట్లాడి వస్తున్నట్టు చెప్పి, గ్యారేజీకి వెళ్ళి, అక్కడ తాను ఐటీ ప్రొఫెషనల్ అన్నట్టు మేఘా ముందు నటించేందుకు, డ్రెస్ మార్చుకుని వెళ్తున్నాడు... అన్న స్పూన్ ఫీడింగ్ టైపులో డల్ ఫీలింగు నిస్తోంది.

        ఇది కూడా స్థలకాలాల ఐక్యతా సూత్రాన్నుపయోగించుకుని క్రాఫ్టింగ్ తో స్టోరీ మేకింగ్ చేయాల్సిన సందర్భం. కానీ స్టోరీ రైటింగే చేస్తూ ట్రీట్మెంట్ లో రాసుకున్నది ఎత్తి రాసిన డైలాగ్ వెర్షన్లా వుందిది. ఫైనల్ గా డైలాగు వెర్షనే షూటింగు స్క్రిప్ట్ అవుతుంది. తానొక రైటర్ గా ఫీలవకుండా, స్టోరీ మేకింగ్ చేసుకోవాల్సిన మేకర్, రైటర్ గానే  ఫీలవుతూ డైలాగు వెర్షన్ (షూటింగ్ స్క్రిప్టు) ఎలా రాసుకుంటే అలాగే షూటవుతుంది. తెరకెక్కుతుంది. ఎడిటింగులో కూడా సరిదిద్దడం కుదరదు.

        సాధారణంగా రివ్యూల్లో ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా వుండాల్సిందంటూ రాస్తూంటారు. మనం చెప్పుకుంటున్న మంచి రోజులొచ్చాయి’, రాజరాజ చోర లకి సంబంధించిన సీన్లలో వంటి ల్యాగ్ ని ఎడిటింగ్ లో సరిదిద్దడం కుదరదు. స్క్రిప్టుల్లోనే సరిదిద్దుకోవాలి. ఈ చిన్న విషయం ఎడిటర్లకి తెలీక కాదు. అసలు ఎడిటింగ్ లో సినిమా రన్ నే మార్చేసి, రెండు మూడు వెర్షన్లు దర్శకులకి చూపిస్తామంటారు మార్తాండ్ వెంకటేష్ వంటి ఎడిటర్లు. రాస్తున్నప్పుడు మేకర్ మేకర్ గా ఫీలైతే, విజువల్ సెన్స్ తో స్టోరీ మేకింగ్ చేసి, సంక్షిప్తీకరించి, ముచ్చటైన డైలాగు వెర్షన్ రాస్తాడు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ట్రీట్మెంట్లో ఓ మూడు సీన్లూ కలిపి రెండు సీన్లుగానో, ఒకే సీనుగానో మారిపోవడం యాదృచ్ఛికంగా జరిగిపోయే తంతుగా వుంటుంది.

        ఇప్పుడు ఇంటర్ కట్స్ తో శ్రీవిష్ణు మేఘాతో ఫోన్లో మాట్లాడే రెండో సీను, గ్యారేజీలో డ్రెస్ మార్చుకునే మూడో సీనూ విడివిడిగా వుండడం వల్ల, ఈ రెండు సీన్లలో కలిపి వున్న  విషయంలోని పంచ్ పంచ్ కాకుండా పోయింది. జోకుని రెండుగా విడదీసి ఇక్కడో ముక్క, అక్కడో ముక్క చెప్తే ఎలా వుంటుంది?

        సీన్ 2 లో మేఘాతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ గా మనకి రివీలైంది. ఇలా రివీల్ చేసి ఏమీ జరక్కుండానే సీను ముగించేసి, సీన్ 3 లో అతను గ్యారేజీలో డ్రెస్ మార్చుకుంటున్నప్పడు, ఐటీ ప్రొఫెషనల్ గా మేఘాని నమ్మిస్తున్నాడని అర్ధమైనప్పుడు కూడా ఫన్ లేదు, పంచ్ లేదు. డ్రెస్ మార్చుకుని వెళ్ళాడంతే.

        సీన్ 2 ఎత్తేసి, జెరాక్స్ సెంటర్లో వున్న వాడు టైము చూసుకుని గ్యారేజీకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ వుంటే, ఎందుకా అని మనకి ఆసక్తి రేగుతుంది. ఇంతలో మేఘా నుంచి కాల్ వచ్చిందనుకుందాం, ఇప్పుడు ఇంటర్ కట్స్ లో ఆమె గర్ల్ ఫ్రెండ్ అని రివీలై, వాళ్ళ మాటల్లో ఆమె అమాయకత్వం, అతడి మోసం తెలుస్తూ, ఆమెని ఇటీ ఫ్రొఫెషనల్ లా నమ్మించడానికే డ్రెస్ మార్చుకుంటున్నాడని మనకి ఇప్పుడు అర్ధమవడంలో వున్న డ్రామా, డైనమిక్స్, థ్రిల్, ఫన్, పంచ్, చైతన్యం - విడివిడిగా వున్న రెండు సీన్లతో వున్నాయా? ఈ విడివిడి సీన్లు తగిన వీక్షణానుభవాన్నివ్వక పోగా, సీన్ 2 మీద అనవసర వ్యయాన్ని పట్టివ్వడం లేదూ?

2.   

స్టోరీ మేకింగ్ ట్రయాంగులర్ ఆట. స్టోరీ- మేకర్- ఆడియెన్స్ అనే ట్రయాంగిల్లో ఆట. ఇలా కాకుండా మేకర్ ఒక్కడే కూర్చుని స్టోరీయే ఆలోచిస్తూ, స్టోరీ చేసుకుపోతూంటే, అది సరళ రేఖ మీద సులభ ప్రయాణం. ఆ సరళ రేఖ మీద ఇటు చివర తను, అటు చివర స్టోరీ మాత్రమే వుంటాయి. సరళ రేఖ మీద తన కెదురుగా వున్న స్టోరీనే చూస్తూ, తన లోకంలో తోచినట్టూ స్టోరీ మేకింగ్ చేసుకుంటూ పోయీ బోరు కొట్టించే అవకాశముంటుంది.

                 ఎప్పుడైతే ఈ సరళ రేఖని వంచి త్రికోణంగా చేస్తామో, అప్పుడు మూడు మూల లేర్పడతాయి., మేకర్, స్టోరీ, ఆడియెన్స్. ఇప్పుడు మేకర్, స్టోరీ, ఆడియెన్స్  మూడు వైపులా వుంటారు. మేకర్ స్టోరీ వైపు చూసి తను ఫీలైంది ఆడియెన్స్ వైపూ చూసి ఆలోచిస్తాడు. దీనికి ఆడియెన్స్ రెస్పాన్స్, రియాక్షన్ ఎలా వుంటాయి, బుర్రకి పని చెప్పి బిజీగా ఈ సీన్ని చూస్తారా, ఎలా ఫీలౌతారు- మొదలైనవి. అంటే ఆడియెన్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసే ఇంటరాక్టివ్ స్టోరీ మేకింగ్ అన్నమాట.    


       బడ్జెట్ ఆదాతో బాటు ఆడియెన్స్ కి గుర్తుండి పోయే వ్యూయింగ్ ఎక్స్ పీరియెన్స్ నివ్వడం స్టోరీ మేకింగ్ ప్రధాన లక్ష్యంగా వుంటాయి. ట్రీట్మెంట్ నుంచి డైలాగ్ వెర్షన్ కెళ్ళే కీలక దశ దీనికి ప్రారంభం. ఓ కారు వచ్చి వచ్చి ఇంటి ముందాగింది - అని ట్రీట్మెంట్ లో మేకరే రాసుకున్నా, దీన్ని జల్లెడ పట్టి డైలాగు వెర్షన్ సవ్యంగా రాసుకోవాల్సి వుంటుంది. ఈ రోజు కొందరు మేకర్లు, కాబోయే మేకర్లు, అసిస్టెంట్లు నిన్నటి వ్యాసానికి రెస్పాండ్ అవుతూ ఫోన్లు చేశారు. తామూహించని స్క్రిప్టు రైటింగ్ టెక్నిక్స్ కొత్తగా చెప్పినందుకు బ్లాగుకి కృతజ్ఞతలు తెలుపుతూ. వీలైనంత నాలెడ్జిని వైరల్ చేయడమే ఈ బ్లాగు పని. ఇది ఎన్నాళ్ళుగానో రాయాలనుకుంటున్న వ్యాసం. అయితే సిట్టింగ్స్ లో ఈ కాన్సెప్ట్ ని అమలు పర్చడం జరుగుతూనే వుంది- స్క్రీన్ ప్లే సెట్టింగ్ వర్క్స్ లో.

3.
       
          ఓ కారు వచ్చి వచ్చి ఇంటి ముందాగింది - అని ట్రీట్మెంట్ లో మేకర్ రాసుకున్నాడనుకుందాం. అంత సెటప్ కి, షూట్ కీ డబ్బు పెట్టుకోలేను... దీంతో కథకీ, క్యారక్టర్ కీ ఉపయోగం లేదని నాలెడ్జి వున్న నిర్మాత అన్నాడనుకుందాం. అప్పుడు సమయస్ఫూర్తి గల మేకర్ ఏం చేస్తాడు? కారుని ఇంటి ముందే పెట్టి, క్యారక్టర్ని కారులోంచి దింపుతాడు. సరిపోతుంది. దీనివల్ల కథకీ, క్యారక్టర్ కీ, నిర్మాతకీ నష్టమేం లేదు. పైగా స్క్రిప్టు స్పీడు పెరుగుతుంది. ఎక్కడ్నించో దిక్కుమాలిన కారు వచ్చీ వచ్చీ, వస్తూనే.... వున్న ల్యాగ్ - సాగతీత వుండదు.

        ఒక కోళ్ళ వ్యాను వెళ్ళీ వెళ్ళీ స్తంభానికి ఓ గుద్ది, కోళ్ళు చెల్లాచెదురైన, రక్తసిక్తమైన సీనుకి బడ్జెట్ కోత వేసి ఏం చేయవచ్చు? ఇక్కడ బిగ్  బడ్జెట్ స్టార్ సినిమాల గురించి కాదు మాట్లాడుకోవడం. వాటిలో కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీను ఎంత బీభత్సంగా నైనా తీయొచ్చు. ఈ సినిమాలెన్ని వుంటాయి - ఇవి ఏడాదికి పది వుంటే మిగిలిన మీడియం, స్మాల్ వంద పైనే వుంటాయి. వీటి గురించే మాట్లాడుకుంటున్నాం. వీటికి బడ్జెట్ సేవింగ్ చాలా అవసరం. ఇక్కడ కోళ్ళ వ్యాను సీనుకి క్రాఫ్టింగ్ చేసి- వస్తున్న వ్యాను స్తంభానికి గుద్దింది చూపించి కట్ చేసేస్తే సస్పెన్స్ కూడా వుంటుంది. కట్ చేశాక, రోడ్డు పక్క కూర్చుని మూల్గుతున్న డ్రైవర్ కి, సెల్ ఫోన్లో యాక్సిడెంట్ ఫోటో చూపిస్తూంటాడు ఒకడు. వాడి చేతిలో రెండు చచ్చిన కోళ్ళుంటాయి రక్తం కారుతూ. ఇలా అంచెలంచెలుగా యాక్సిడెంట్ సీన్ ని రివీల్ చేస్తూ పోతే, టెన్షన్ కూడా పెరుగుతుంది.

        మన అభిమాన థ్రిల్లర్ నవలా రచయిత లీ చైల్డ్ వున్నాడు. అతను సృష్టించిన జాక్ రీచర్ యాక్షన్ క్యారక్టర్ చాలా పాపులర్. హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి. అతను నవలల్లోనే సినిమా చూపిస్తాడు. విజువల్ గా రాస్తాడు. ఒక రకంగా నవలలకి స్టోరీ మేకింగ్ చేస్తాడు. యాక్షన్ని స్లో చేసి డ్రామా పెంచుతాడు. డై ట్రయింగ్ నవల్లో యాక్షన్ని విజువలైజ్ చేస్తూ స్లో యాక్షన్- హై డ్రామా ఎలా క్రియేట్ చేశాడో చూద్దాం...

        జాక్ రీచర్ గురి చూసి గన్ పేల్చాడు. మరుక్షణం గన్ బ్యారెల్లోంచి వేడి వేడి పొగ బయటికి ఎగజిమ్మింది. బుల్లెట్లోని గన్ పౌడర్ సెకనులో మిలియన్ వంతు కంటే తక్కువ కాలంలో విస్ఫోటించడంతో, ఆ మండిపోతున్న పొగ బుడగలా విప్పారింది.   
    
        బుడగలా విప్పారిన పొగని తిరిగి బ్యారెల్ గుంజేసుకుని, బ్యారెల్లోపల గ్రూవ్స్ రాపిడికి గిర్రున తిరుగుతున్న బుల్లెట్ వెనుకా, చుట్టూ పొగ కమ్మేసేలా చేసి, ఆ రాపిడికి బుల్లెట్ ఎగదన్ని బయటి వాతావరణంలోకి దూసుకు పోయేలా చేసింది బ్యారెల్.

        బయటికి వెళ్ళిన పొగ బుడగ వాతావరణాన్నిచర్రున వేడెక్కించేసింది...బుల్లెట్ కి ముందు దూసుకుపోతున్న వేడివేడి పొగ, గాలిలోని ఆక్సిజన్ ని వేడెక్కించేసి మంట రేగే స్థాయికి తీసికెళ్ళింది. ఆ మంటలో మెరుపు. బుల్లెట్ పొగలోంచి బయటికి దూసుకొచ్చేసింది. మండుతున్న గాల్లోంచి గంటకి 1900 మైళ్ళ వేగంతో.

        సెకనులో వెయ్యో వంతు కాలం తర్వాత, బుల్లెట్ ఇంకో మూడు గజాల దూరంలో వుంది. ఇంకో సెకనులో వెయ్యో వంతు కాలంలో, ఆరడుగుల దూరంలో వుంది. ఇక రొద చేసుకుంటూ టార్గెట్ ని తాకబోతోంది బుల్లెట్...  

        ఇదీ లీచైల్డ్ యాక్షన్ విజువలైజేషన్. అతను చెప్పడం లేదు, చూపిస్తున్నాడు. ఇలా సినిమాల్లో చూపించాలంటే సీజీకి సమర్పించుకోవాలిగా లక్షలకి లక్షలు అన్పించొచ్చు. స్టార్ సినిమాలకి సీజీకి సీజీన్నర పెట్టుకోగలరు. ఇతర సినిమాలకి దీన్లోని అర్ధాన్ని చూడాలి. కవి హృదయాన్ని చూడాలి. ఏం తేల్చి చెప్తున్నాడు లీ చైడ్? స్లో యాక్షన్ - హై డ్రామా గా లేదూ పై సీను? ఇంతకీ ఆ బుల్లెట్ ఎవరికైనా తగిలిందా లేదా చెప్పడానికి ఇంత సస్పెన్స్ లో ముంచెత్తడమన్న మాట.

        పైన చెప్పుకున్న కోళ్ళ వ్యాను యాక్సిడెంట్ సీనులోనూ ఇంతే. కోళ్ళ వ్యాను స్తంభానికి గుద్దుకున్నాక ఏమైంది? మూల్గుతూ రోడ్డు పక్కన కూర్చుని వున్నాడు డ్రైవర్. వ్యాను కేమైంది? ముందు భాగం నజ్జయినట్టు సెల్ ఫోన్లో  ఫోటోలు చూపిస్తున్నాడొకడు.  మరి కోళ్ళు ఏమయ్యాయి? అవి చచ్చినట్టు మచ్చుకి రెండు చచ్చిన కోళ్ళు చూపిస్తున్నాడు వాడు... లో బడ్జెట్లో స్లో యాక్షన్ -హై డ్రామా!
(ముగింపు శనివారం)

—సికిందర్   


10, నవంబర్ 2021, బుధవారం

1079 : సాంకేతికం


         మంచి రోజులొచ్చాయి ప్రారంభ దృశ్యాల్లో బెంగళూరులో ఐటీ జాబ్స్ చేస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాల పాట అయిపోయాక, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడుకున్నాక, విమానం లాండ్ అవుతున్న షాట్ పడుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో విచారంగా కూర్చున్న కోటేశ్వరరావుని చూపిస్తుంది కెమెరా. అక్కడికి అజయ్ ఘోష్ వస్తాడు. వాళ్ళిద్దరి కూతుళ్ళ గురించి చర్చ జరుగుతుంది... అంటే బెంగళూరులో జాబ్స్ చేస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ఆల్రెడీ ప్రేమలో వున్నారనీ, వాళ్ళిద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారనీ, వాళ్ళు వచ్చిన విమానం హైదరాబాద్ లో లాండ్ అయిందనీ, హైదారాబాద్ లో అజయ్ ఘోష్ మిత్రుడు కోటేశ్వరరావు విచారంగా కూర్చుని వున్నాడనీ, అజయ్ ఘోష్ అతడి దగ్గరకొచ్చి విచారంగా వున్న కారణం అడిగితే, ఇద్దరి మధ్య వాళ్ళ కూతుళ్ళ  మీదికి చర్చ మళ్ళిందనీ ఈ ఐదు సీన్లలో డల్ గా చెప్పారు. సినిమా ప్రారంభంలోనే డల్ గా చెప్పిన ఈ ఐదు సీన్లు ఎలా వున్నాయి? స్క్రిప్టు ట్రీట్మెంట్ లోంచి ఎత్తిరాసిన డైలాగ్ వెర్షన్ లా లేవూ? 

        స్క్రిప్టు ట్రీట్మెంట్ లోంచి ఎత్తి రాస్తే అది డైలాగు వెర్షన్ అవుతుందా? ఇదీ ఇప్పుడు వేసుకోవాల్సిన మిలియన్ బడ్జెట్ల ప్రశ్న. రచయితకి పరిధులుంటాయి. ఆ పరిధిలు దాటి విజువల్ గా డైలాగు వెర్షన్ రాయలేడు. దర్శకులు ఒప్పుకోరు. విజువల్స్ చూసుకోవడం దర్శకుల పరిధి. కాబట్టి రచయిత స్క్రిప్టు ట్రీట్మెంట్ లోంచే ఎత్తి డైలాగు వెర్షన్ రాయగలడు. కానీ  కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం మొదలైన వాటికి మేకర్ తనే అయినప్పుడు రైటర్ లా రాయలేడు. అతను రైటర్ లా రైటింగ్ చేయలేడు, మేకర్ లా మేకింగ్ చేస్తాడు. స్టోరీ మేకింగ్. అతను పదాలతో సీన్స్ ఆలోచించడు, షాట్స్ తో సీన్స్ ని చూస్తాడు. ఆ ప్రకారం రాస్తాడు. రైటర్ దగ్గర పెన్నే వుంటుంది, మేకర్ దగ్గర కెమెరా వుంటుంది. కెమెరాతో వెండి తెర మీద రాస్తాడు. స్టోరీ రైటింగ్ రైటర్ చేసుకుంటాడు, మేకర్ గా దర్శకుడు స్టోరీ మేకింగ్ చేస్తాడు. అంటే రైటర్ లా సీన్లతో డైలాగులు రాసుకుంటూ వర్బల్ గా కథ చెప్పకుండా, కెమెరా షాట్స్ తో ఇమేజెస్ సృష్టించి కదిలే బొమ్మల కథ చూపిస్తాడు. అతను చెప్పడు. చెప్పడం పుస్తక భాష. అతను చూపిస్తాడు. చూపించడం సినిమా భాష, దృశ్య మాధ్యమం భాష. దృశ్య మాధ్యమం భాష తెలిస్తే సీన్లు తగ్గి, సినిమా నిడివీ తగ్గి, దాంతో బడ్జెట్టూ తగ్గి, నిర్మాత సంతోషిస్తాడు.

        2.
           రాజ రాజ చోర లో చూద్దాం. ఇందులో ప్రారంభ దృశ్యాల్లో జెరాక్స్ సెంటర్లో పనిచేసే శ్రీవిష్ణు, గర్ల్ ఫ్రెండ్ మేఘా ఆకాష్ ల మధ్య ఫోన్ సంభాషణ ముగిశాక, శ్రీవిష్ణు ఒక గ్యారేజ్ కెళ్ళి, ఐటీ ప్రొఫెషనల్ లా డ్రెస్ మార్చుకుని, ఐటీ జాబ్ చేసే మేఘా ఆకాష్ ని కలుసుకోవడానికి బయల్దేరతాడు. ఈ రెండు సీన్లలో అర్ధమయ్యే విషయమేమిటి? జెరాక్స్ సెంటర్లో పని చేసే శ్రీ విష్ణు, మేఘా ఆకాష్ ని  ఐటీ ప్రొఫెషనల్ గా నమ్మిస్తున్నాడనీ, అందుకు గ్యారేజీలో దాచి పెట్టిన డ్రెస్ వేసుకుని ఆమెని కలవడానికి వెళ్తున్నాడనీ డల్ గా అర్ధమవుతోంది.

        ఇవి కూడా ట్రీట్మెంట్ లోంచి ఎత్తి రాసిన డైలాగ్ వెర్షన్ సీన్లే. ట్రీట్మెంట్ లోంచి ఎత్తి రాస్తే సీన్లు డల్ గానే వుంటాయి. చాలా సినిమాల్లో, చాలా చాలా సినిమాల్లో, వెండితెర మీద ట్రీట్మెంటే చూపిస్తున్నారు కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం మేకర్లు. వెండి తెర మీద చూపించాల్సిన డైలాగ్ వెర్షన్ చూపించడం లేదు. పుస్తక భాష చెప్తున్నారు. రైటర్ చేసే స్టోరీ రైటింగ్ అనేది జస్ట్ క్రియేటివిటీ, మేకర్ చేసే స్టోరీ మేకింగ్ క్రాఫ్ట్. క్రాఫ్ట్ తెలిసిన మేకర్లు ఎంతమంది వున్నారు? ఎంత బడ్జెట్ ని సేవ్ చేస్తున్నారు? దృశ్య మాధ్యమ భాష చూపిస్తూ తమలోని ఆర్ట్ ని ఎంతవరకు ప్రదర్శిస్తున్నారు?

        పై రెండు సినిమాల్లో మచ్చుకి ప్రారంభ సీన్లే చెప్పుకున్నాం. సినిమా సాంతం  చూస్తే ఇలాటివింకెన్నో వుంటాయి. చెప్పొద్దు, చూపించు - అని సాహిత్యానికి సంబంధించే రష్యన్ రచయిత చెఖోవ్ చురక వేశాడు. ఇక సినిమాలకిది ఇంకెంత వర్తించాలి. చంద్రుడు ప్రకాశిస్తున్నాడని నాకు చెప్పకు, పగిలిన అద్దం మీద చంద్ర కాంతి తళుక్కుమనడాన్ని నాకు చూపించూ - అన్నాడు చెఖోవ్. అంటే ఉత్త మాట కాదు, వర్ణన కావాలని పుస్తక భాషక్కూడా. ఈ వర్ణనాత్మక దృశ్యాన్నే మేకర్ కెమెరాతో చూపిస్తాడు. ట్రీట్మెంట్లో వెన్నెల కాస్తోందని రాసేయ్యొచ్చు. అది పట్టుకుని రైటర్ డైలాగ్ వెర్షన్లో 'వెన్నెల కాస్తోంది' అనే రాయొచ్చు. అప్పుడు మేకర్ ఆరుబయట పండు వెన్నెలని ట్రీట్మెంట్ లాగా డల్ గా చూపిస్తాడా, లేకపోతే పగిలిన కిటికీ అద్దం మీదో, టేబుల్ మీద గాజు గ్లాసు మీదో, చంద్ర కిరణాలు పడి తళుక్కున పరావర్తనం చెందే యాక్షన్ ని బ్యూటీఫుల్ గా డైలాగ్ వెర్షన్ చూపిస్తాడా? అదన్న మాట, యాక్షన్ ఈజ్ విజువల్ రైటింగ్, స్టోరీ మేకింగ్. సినిమా స్టిల్ ఫోటోగ్రఫీ కాదు, చలనం లేకపోవడానికీ, చైతన్యంతో లేకపోవడానికీ. సినిమా చలనాన్నీ చైతన్యాన్నీ చూపించే సినిమాటోగ్రఫీ. అందుకే చలన చిత్రమన్నారు, నిశ్చల చిత్రమనలేదు.

        3.
        మరి ఎలా చేసి వుండాలి పై రెండు సినిమాల విషయంలో? మంచి రోజులొచ్చాయి నే తీసుకుందాం. 1. బెంగళూరులో ఐటీ జాబ్స్ చేస్తున్నారు  సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు. 2. ఓ పాట అయిపోయింది. 3. వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదరాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడుకున్నారు. 4. విమానం లాండ్ అవుతున్న షాట్ పడింది. 5. అప్పుడు హైదరాబాద్ లో విచారంగా కూర్చున్న కోటేశ్వర రావున్నాడు. అతడి దగ్గరికి అజయ్ ఘోష్ వచ్చాడు. వాళ్ళిద్దరి కూతుళ్ళ గురించి చర్చ జరిగింది...ఇలా వున్నాయి స్టోరీ రైటింగ్ చేసిన ఐదు సీన్లు.

        వీటిని స్టోరీ మేకింగ్ చేస్తే... బెంగళూరులో సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ఐటీ జాబ్స్ చేస్తున్నట్టు చూపించి పాట వేశాక, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కథనమంటే ఆడియెన్స్ కి ప్రశ్నలా సీను వేసి, దానికి జవాబు సీను తర్వాత చూపించడమేని చాలాసార్లు చెప్పుకున్నాం. అప్పుడే ఆడియెన్స్ ఏం జరుగుతోందాని బుర్రకి పని చెప్పి, సీను తర్వాత సీను యాక్టివ్ గా చూడ్డంలో లీనమైపోతారు. ప్రశ్నలు జవాబులుగా సీన్లుంటేనే కథనానికి డైనమిక్స్ వుంటాయి. ఎప్పటికప్పుడు కథనం చలనంలో వుంటూ చైతన్యవంతంగా, థ్రిల్లింగ్ గా వుంటుంది.             

            ఇలా కాక - బెంగళూరులో ఐటీ జాబ్స్ చేస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ప్రేమలో వున్నారు. పాట పూర్తయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళి పోవాలనుకున్నారు. విమానం లాండ్ అయింది. హైదరాబాద్ లో విచారంగా కూర్చుని వున్నాడు కోటేశ్వరరావు. అతడి దగ్గరికి అజయ్ ఘోష్ వచ్చాడు. కూతుళ్ళ గురించి మాట్లాడుకున్నారు - అంటూ పండు వొలిచి చేతిలో పెట్టినట్టు, స్పూన్ ఫీడింగ్ చేస్తున్నట్టు వరస పెట్టి, కథ తెలిసిపోయేలా అన్నీ ముందే చెప్పేస్తూంటే, ఇక చూడడానికి ఆసక్తి ఏముంటుంది. ఏవో వచ్చిపోతున్న సీన్లని ఆడియెన్స్ లేజీగా, పాసివ్ గా చూడ్డం తప్ప.

        అందుకని, బెంగళూరులో సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలు ఐటీ జాబ్స్ చేస్తున్నట్టు చూపించి పాట వేశాక, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వెళ్ళిపోవాలని మాట్లాడు కోవాల్సిన అవసరం లేదు. విమానం లాండింగ్ షాట్  కూడా అవసరం లేదు. కోటేశ్వర రావు విచారంగా కూర్చున్న సీనూ అవసరం లేదు. ఈ మూడు సీన్లూ అవసరం లేదు.

        పాట అవగానే హైదరాబాద్ లో వున్న మెహ్రీన్ పీర్జాదా తండ్రి అజయ్ ఘోష్ ని చూపించి, అతడి మీద విమానం సౌండ్ వేస్తే సస్పెన్స్ క్రియేటై పోతుంది, ఆ విమానం సౌండేంటని. దీని తర్వాత కోటేశ్వర రావుతో అజయ్ ఘోష్ సీను వేసి,  దీని తర్వాత సినిమాలో చూపించినట్టు ఏర్ పోర్టు నుంచి క్యాబ్ లో వస్తున్న సంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదాలని చూపిస్తున్నప్పుడు, వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదారాబాద్ వచ్చేసినట్టు చెప్పిస్తే సరిపోతుంది. తలెత్తిన ప్రశ్నలూ జబాబులూ అన్నీ వచ్చేస్తాయి. డైలాగ్ వెర్షన్ డైనమిక్ గా, విజువల్ గా వుంటుంది. మేకర్ ఆర్టు బయటపడుతుంది.

        ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ కి హైదరాబాద్ వెళ్ళిపోవాలని బెంగుళూరు కాఫీ షాప్ లో మాట్లాడుకునే సీను, విమానం లాండింగ్ షాట్, కోటేశ్వరరావు మీదే ఓపెన్ చేసిన సీనూ- ఈ మూడిటి ఖర్చూ తప్పి, బడ్జెట్ తగ్గిపోతుంది. అవసరానికి మించి వున్న సినిమా నిడివి కూడా తగ్గి అర్ధవంతంగా, చైతన్య వంతంగా వుంటాయి సీన్లు.

        అర్ధవంతంగా ఎలా వుంటాయి? విడి విడిగా చూపించిన విమానం షాటుకీ, తర్వాత కోటేశ్వర రావు సీనుకీ ఏమైనా సంబంధముందా? దీన్నే లేజీ రైటింగ్ అంటారు. ఈ రెండూ లేపేసి, అజయ్ ఘోష్ మీద విమానం సౌండు పోస్టు చేస్తే అర్ధముంటుంది. ఆడియెన్స్ కి దాచి పెడుతూ, విమానంలో వస్తున్నది అతడి కూతురే కాబట్టి. సౌండ్ చాలా స్క్రీన్ ప్లే సమస్యల్ని పరిష్కరిస్తుంది, బడ్జెట్ నీ ని తగ్గిస్తుంది. స్టోరీ మేకింగ్ కి సౌండ్ కూడా ఒక టూలే. ఈ టూల్ తో కూడా కలిపి  షాట్సునీ, సీన్సునీ ఆలోచించడం చాలా అవసరం.
(మిగతా రేపు)

—సికిందర్

9, నవంబర్ 2021, మంగళవారం

 

Wednesday, July 13, 2016

నాటి సినిమా!


సినిమా దర్శకుడు భావుకత గల రచయిత కూడా అయినపుడు (సినిమా రచయిత కాదు) అతడి సినిమాలు పర్సనల్ డైరీలవుతాయి. వెంటనే  అర్ధంగాక పోస్ట్ ప్రొడక్షన్లోనే  గొడవలైపోతాయి. అతను ‘గాడ్ ఫాదర్’ తీసివున్న కపోలా అయితేనో, ‘సిరిసిరిమువ్వ’ తీసివున్న విశ్వనాథ్ అయితేనో ఫర్వాలేదు.  కపోలా, విశ్వనాథ్ లు కమర్షియల్ గా నిరూపించుకున్నాకే ‘యూత్ వితవుట్ యూత్’, ‘శంకరాభరణం’ లాంటి పర్సనల్ సినిమాలు తీసి డిస్ట్రిబ్యూటర్లని ఒప్పించుకోగల్గారు. కానీ లేడికి  లేచిందే పరుగన్నట్టు, ఓ భావుకత గల కొత్త దర్శకుడు రంగ ప్రవేశం చేసింది లగాయతు అదేపనిగా పర్సనల్ సినిమాలే తీస్తూ పోతే దీన్నేమనాలి?


        ది లేడి కాబట్టి పచ్చని ప్రకృతిలో తిరుగాడుతుంది. గోదావరీ పరివాహక ప్రాంతాల్లో తచ్చాడుతుంది. అడవుల్లో చెట్లే దారి  చూపుతాయన్నట్టు, జీవితాలకి అంతటి మట్టి వాసనల కథలే  మార్గం చూపుతాయి. అలాటి కమ్మటి నేటివ్ వాసనల కథలు సినిమాలకి అవసరపడతాయనుకున్న లేడి, ఫార్ములా పులి చంపిన లేడి నెత్తురై పోకుండా, కీకారణ్యం  లాంటి మూస మాస్ మసాలాల క్రియేషన్ల  మధ్య, తనదైన ఓ ప్రత్యేక ముద్రతో కూడిన బాణీని విన్పిస్తూ యావత్ప్రజానీకాన్నీ మంత్రముగ్ధుల్ని చేయడం సామాన్య విషయమా? 

         చాలామంది సాహితీపరులు సినిమా దర్శకులుగా కన్పిస్తారు. వాళ్ళు సినిమా దర్శకత్వానికి సరిపోరనే అభిప్రాయాన్నే కల్గించారు. ఒక జర్నలిస్టుగా మారిన రచయితని యుద్ధ రంగానికి పంపిస్తే, అతను యుద్ధ వార్తలు  రాయకుండా ఆ చుట్టూ ప్రకృతి అందాలని  అద్భుతంగా వర్ణిస్తూ పోయాడట. ఇలాకాక, చాప కింద నీరు లాంటి ఇలాటి చాపల్యాన్ని ఈదేసిన గజఈత గాడు కూడా అయ్యింది పైన చెప్పుకున్న లేడీ. లేకపోతే  అచ్చులో కథలు రాసుకునే వాడికి జన్మకి సినిమా డైరెక్షన్ అబ్బే పరిస్థితి లేదా రోజుల్లో.


        ఇలా వంశీ అనే హైలీ ఇండివిడ్యువలిస్టిక్ డైరక్టర్ గురించి ఇంత చాలు.  తీసిన మొట్ట మొదటి ‘సితార’ తోనే తను బాపు, విశ్వనాథ్ ల సరసన చేరిపోయాడు. ముత్యాలముగ్గు (1975), శంకరాభరణం (1980),  మేఘసందేశం (1982), సితార (1984) ... ఈ నాల్గూ ఒకే అచ్చులో పోసిన కళా ఖండాలుగా కన్పిస్తాయి. వీటిలో కామన్ గా కన్పించేది ఒక్కటే : అతి తక్కువ సంభాషణలు! అసలు డైలాగు లేవీ అని ఫైనాన్షియర్లు గొడవ పడేంతగా, దృశ్యానికో  పోలియో చుక్క లాంటి  ఏకవాక్య సంభాషణ మాత్రమే వీటి ప్రత్యేకత! ప్రేక్షకులు హారతులు పట్టిన ఈ విజయవంతమైన కమర్షియలార్టు పంథాకి  ఎవరు మొదట  బీజం వేసి,  ఎవరెవరు పెంచి పోషిస్తూ పోయారో పై నాల్గు సినిమాల విడుదల  క్రమాన్ని చూస్తే  తెలిసిపోతుంది.

        ‘మహల్లో కోకిల’ అని వంశీయే రాసిన నవల ‘సితార’ గా తెర కెక్కింది. ‘శంకరాభరణం’ , ‘సాగర సంగమం’ లాంటి రెండు ఘన విజయాలు సాధించి వున్న ఏడిద నాగేశ్వరరావు దీని నిర్మాత.  తమిళ రీమేకుగా వంశీ మొదటి సినిమా ‘మంచు పల్లకి’  హిట్ అవలేదు. రెండో సినిమా ‘సితార’ తో నిర్మాత చేసింది సాహసమే. ఈ సినిమా చారడేసి కళ్ళ భానుప్రియని పరిచయం చేసింది. అప్పటికామెకి పచ్చి కొబ్బెర లాంటి పదిహేడేళ్లే.  అప్పటికే మంచి డాన్సర్ కూడా అయిన ఆమె నృత్యాలతో  ‘సితార’  విక్షణాసక్తత బాగా పెరిగింది. తెర వెనుక ఇళయరాజా హిట్ బాణీలు కన్పించని దేవుడిలా అభయహస్తమిచ్చాయి.


          మరో కన్పించని మాంత్రికుడు ఛాయాగ్రాహకుడు ఎంవీ రఘు. గ్రామీణ అందాల్ని చూపించడంలో దిట్ట. అక్కడే తచ్చాడే వంశీలాంటి దర్శకుడ్ని ఈయన కాపేసి పట్టుకుంటే ఇక చెప్పనక్కర్లేదు- వెండి తెరమీద సినిమా రీళ్ళు తిరగవు, రంగులరాట్నం తిరుగుతుంది.

        రాచరికపు పంజరంలో బందీ అయిపోయిన అందాల బొమ్మ జీవితాన్ని ‘సితార’ చూపిస్తుంది. ఆస్తులూ  పరువు ప్రతిష్టలూ సమకూరడానికి  ఏయే న్యాయమైన కారణాలైతే తోడ్పడ్డాయో, వాటిని గౌరవించుకోకపోతే, ఆ కారణాలూ తొలగిపోయి ఆస్తులూ పరువు ప్రతిష్టలూ మంట గలిసిపోతాయని ఒక సూక్తి.  ఇలాంటి దుర్గతే సూడో జమీందారు చందర్ ( శరత్ బాబు) ది. ఇతడి జమీందారు తండ్రి విలాసాలు మరిగి ఆస్తులు గుల్ల చేశాడు. దుర్భర దారిద్ర్యాన్ని కొడుక్కి మిగిల్చిపోతూ, ఆస్తి పాస్తులు ఇక లేవన్న విషయం బయటి ప్రపంచానికి తెలీనివ్వకూడదని, వంశ ప్రతిష్ట నిలబెట్టాలనీ మాట తీసుకుని స్వర్గానికో ఇంకెక్కడికో  వెళ్ళిపోయాడు. లోన చిరిగిన చొక్కా,  పైన వంశ హోదా వెలగబెడుతూ కోటూ -  ఇదీ చందర్ డబుల్ యాక్షన్ జీవితం. తగాదాల్లో వున్న  పొలం మీద ఎలాగో కేసు గెల్చుకుని, తండ్రి కిచ్చిన మాట ప్రకారం పూర్వవైభవం కల్పించుకుందామని లాయర్ (జెవి సోమయాజులు) తో కలిసి ఎంత ప్రయత్నించినా పప్పులుడకడం లేదు. 

        ఇలాటి చందర్ కి ఓ చెల్లెలు కోకిల (భానుప్రియ) అని. బంగళాలో ఈమెని బందీ చేసి వుంచాడు. ఏమంటే, ‘పరదాలు, ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయం’  అంటూ గొప్పలు. ‘ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా?’  అని ఎవరైనా ప్రశ్నిస్తే, సాంప్రదాయం పట్ల  గౌరవమే వుంటే  హింసే అన్పించదనీ, అయినా ఒంటరిగా వుంచకుండా వాళ్ళ కాలక్షేపం కోసం నాట్యం, సంగీతం నేర్పిస్తామనీ, కోకిల కూడా వాటితో కాలక్షేపం చేస్తోందనీ సమర్ధన. ఆమె ఏదో స్వేచ్ఛ అంటూ సాంప్రదాయాన్ని కాల దన్నుకోదని ప్రగాఢ విశ్వాసం  కూడా చందర్ కి.

      గృహ నిర్బంధంలో వున్న కోకిలకి రాజు  (సుమన్) దగ్గరవుతాడు. వూళ్ళో జరుగుతున్న  జాతరకి పగటి వేషగాళ్ళ బృందంతో వచ్చిన కళా కారుడితను. ఇతడి ఆటా పాటా కోకిలలోని  నాట్యకళాకారిణిని  తట్టి లేపుతాయి. ఇక నాట్య విన్యాసాలే నాట్య విన్యాసాలు. విరహ గీతాలే గీతాలు ప్రేమలో. చందర్ కిది తెలిసిపోయి  రాజుని చంపించేసి, తండ్రి  మాట నిలబెట్టలేకపోయానని ఆత్మ హత్య చేసుకుంటాడు. 

        ఈ జరిగిందంతా దేవదాసు ( శుభలేఖ సుధాకర్) కి చెప్పుకొస్తుంది కోకిల. ఇతనొక ఫోటోగ్రాఫర్. ఇలా తన ఆశ్రయం పొందిన  కోకిలని సినిమా హీరోయిన్ ని చేస్తాడు. ఇంతలో తన గతమంతా పేపర్లకెక్కి బెంబెలెత్తిపోతుంది కోకిల. ఏ వంశ గుట్టు కాపాడతానని తను అన్న కిచ్చిన మాట ఇలా అయ్యిందో, ఇక దీనికి ఒకే ఒక్క  పరిష్కార మార్గంగా  వయసుమళ్ళిన  డాక్టర్ (ప్రభాకర రెడ్డి) ని తన తో పెళ్ళికి ఒప్పిస్తుంది. ఇది కూడా బెడిసి కొట్టి తను ఆత్మహత్య చేసుకోబోతున్నప్పుడు, చనిపోయాడనుకున్న రాజు బయల్దేరి వస్తూంటాడు. 

        ముందు కోకిలగా, తర్వాత సితారగా రెండు విభిన్న పాత్రల్లో కన్పించే భాను ప్రియ కిది తెలుగులో అడుగు పెడుతూనే సూపర్ హిట్ ఎంట్రీ. తను తెలుగే అయినా దీనికి ముందు  ఒక తమిళం చేసింది. మాస్ కమర్షియల్ హీరోగా కొనసాగుతున్న సుమన్ కిది ఒక జ్ఞాపిక లాంటిది. సినిమాలో భానుప్రియ జ్ఞాపికగా ఇచ్చే పళ్ళెం పట్టుకుని తన బృందాన్ని బాధ పెట్టి వెళ్ళిపోయే సీను ఒక్కటి చాలు సుమన్ హావభావ ప్రకటనా సామర్థ్యానికి. 

        వంశీ విజువల్ సెన్స్ కి శృంఖలాల్లే

వనడానికి ఓ మూడు సీన్లు చూస్తే చాలు-  1. పంజరాల్లో చిలుకలు తల్లడిల్లే షాట్లు, 2. ఎగిరే చిలుకని పట్టుకుందుకు సుమన్- భాను ప్రియల రాపాడే చేతుల శృంగారభరిత విజువల్స్, 3. హాలు నిండా వాద్య పరికరాల మధ్య సుమన్- భానుప్రియలతో వుండే ఒక సన్నివేశం ...ఇక పాటల చిత్రీకరణ చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ చాలా సూపర్ హిట్  పాటలే ఇప్పటికీ. 


        ఇంత కళాఖండంలోనూ  లోపాలూ లేకపోలేదు. లోపాలతోనే కళాఖండాలకి  అందం వస్తుందేమో. ఇందులో భానుప్రియ పాత్ర ఎంతకీ ఎదగదేమిటి? సుమన్ ఆమె చెర విడిపించాక ఆమె పూర్తి స్వేచ్ఛా జీవియే. ఇంకా తన స్వేచ్ఛని హరించిన వంశప్రతిష్ట గురించి ప్రాకులాట ఎందుకు? తన అన్న సుమన్ ని చంపించాడని  తెలిసీ అన్నంటే సెంటి మెంట్లు ఎందుకు? బాధపడాల్సింది చనిపోయాడనుకున్న సుమన్ గురించి కాదా? అంతలోనే ముక్కలైన అతడితో తన ప్రేమ గురించి కాదా? ఇంకా అన్న గురించీ, సాంప్రదాయాల గురించీ ఆలోచిస్తే ముందు కెళ్ళిపోయిన పాత్ర ఎలా ఎదుగుతుంది? ఎదగ వద్దన్న ఫ్యూడలిజాన్ని బోధిస్తున్నట్టా ఈ పాత్రతో? 

        ఇక తను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చీటీ రాసి ప్రభాకర రెడ్డికి పంపడమెందుకు? తనని కాపాడేందుకా? అలా చీటీ రాసి ఆత్మహత్యా యత్నం ఒక నాటకంగా పాత్ర దిగజారి పోలేదా? (ఈ వ్యాసం చదివి వంశీ తర్వాత లోపాలు ఒప్పుకున్నారు). క్లయిమాక్స్ బలహీనంగా తేలిపోవడానికి శరత్ బాబు ఆత్మహత్య చేసుకునే దగ్గర కథ  బలహీన పడడమే కారణం. హాలీవుడ్ ఇంద్రజాలికుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఇందుకే అన్నాడేమో- కథ ఎలా చెప్పాలో మర్చిపోతున్నారు. కథలకి మిడిల్, ఎండ్ లు ఏమాత్రం వుండడం లేదు, ఎంత సేపూ బిగినింగే .. ఈ బిగినింగ్ కూడా ఎంత సేపటికీ ముగియదు..అని!

         అసలు బిగినింగ్, మిడిల్, ఎండ్ అంటే ఏమిటో తెలిస్తేగా అవి వుండడానికి. ఈ చిన్న విషయం  వంశీకి తెలీదనుకోలేం. నవలని సినిమాగా మారుస్తున్నప్పుడు ఆ  నవలా కథనమే స్క్రిప్టులో జొరబడినట్టుంది. కానీ కెరీర్ కొత్త లోనే ఇంత సాహసమూ సృజ నాత్మకతా  ప్రదర్శించినందుకు వంశీని అభినందిద్దాం. వంశీ మరో ‘సితార’ లాంటిది తీయడు, తీయలేడు కూడా- పర్సనల్ డైరీ అనేది ఒక్కటే వుంటుంది కాబట్టి.

పట్టపగలే చుక్కలు!

          వాళ్ళందరికీ ‘సితార’ ని చూసి పట్టపగలే చుక్కలు కన్పించాయి... వాళ్ళందరూ-  నిర్మాత, దర్శకుడు, ఫైనాన్షియర్లూ- ప్రివ్యూ థియేటర్లో కొలువుదీరారు ‘సితార’ చూద్దామని. ఇంకా రీ రికార్డింగ్ మిగిలి వుంది. ముందు డబుల్ పాజిటివ్ పోస్ట్ ప్రివ్యూ చూద్దామనుకున్నారు. అంతాకలిసి చూశారు. ఇదేం సినిమా? డైలాగులేవీ? ఆ కళ్ళు, చేతులు, కాళ్ళూ చూపించడమేమిటి మాటిమాటికీ? ఆ నీడలేంటి?  ఆ పడవ లేంటి? ఐపోయింది! పనైపోయింది! పూర్ణోదయా వారి పని గోవిందా! పదండి వెళ్లి పోదాం,  చెక్కేద్దాం- అనేసి ఫైనాన్షియర్లు చెక్కేశారు. వంశీ బొమ్మలా నిలబడిపోయాడు. 

        రీరికార్డింగ్ మొదలైంది. ఇళయరాజాని చూస్తూంటే వంశీకి ఒకటే గుబులుగా వుంది.  ఈయన కూడా పారిపోతే?  అలా చేయలేదు ఇళయరాజా.  సినిమా సాంతం చూసి నె మ్మదిగా లేచారు. వంశీ దగ్గరి కొచ్చారు. ‘భలే బ్యూటిఫుల్ కాన్వాస్ ఇచ్చావయ్యా! థాంక్యూ...ఎవ్విరీ మినట్ ఈ పిక్చర్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తా!’ అనేసరికి  వంశీ ఎక్కడికో వెళ్ళిపోయాడు!

        12 కేంద్రాల్లో వంద రోజులాడింది సినిమా. మంచి మ్యూజికల్ హిట్. పైగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు, ఉత్తమ గాయనిగా ఎస్. జానకికి మరో జాతీయ అవార్డు, ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఎస్వీ రామనాథన్ కి మరింకో జాతీయ అవార్డు సంపాదించి పెట్టింది ‘సితార’.



-సికిందర్
(“సాక్షి” –నవంబర్ 2009)