రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, సెప్టెంబర్ 2019, గురువారం

869 : స్క్రీన్ ప్లే సంగతులు



       
        ఖరికి 350 కోట్ల అతి ఖరీదైన నాలుగు భాషల పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ని కూడా, అదే లోకల్ తెలుగు లైటర్ వీన్ ప్రేమ కథల ఫార్ములా (ఎల్పీ ఎఫ్) చట్రంలో పెట్టేశారు!  పాన్ ఇండియా అన్నాక గ్లోబల్ స్క్రిప్టు వుండాలని ఆలోచించలేదు. గత ఇరవై ఏళ్లుగా ఈ ఎల్పీఎఫ్ చట్రమే తెలుగు సినిమాలకి  ఎన్నోసార్లు చుక్కలు చూపించింది...ఏ తెలుగు సినిమా తలపెట్టినా దాని జానర్ ని పట్టించుకోకుండా ఏనాటిదో లైటర్ వీన్ ప్రేమ కథల ఫార్ములా చట్రంలో చుట్టేయడమే. అప్పట్లో ఏ కథ చేస్తున్నారంటే, ‘లైటర్ వీన్’ అనడం ఫ్యాషన్ గా మారింది. ఈ ఎల్పీ ఎఫ్ సినిమాలే  చూస్తూ పెరిగిన తరం కూడా అవే తీస్తూ, ఏ కథ చేస్తున్నారంటే, ‘రోమ్ కాం’ అని మరింత ఫ్యాషనబుల్ గా అనడం మొదలెట్టారు. ఏవి చూస్తూ పెరిగితే అవే తీస్తారు. ఇంకాస్తా పోయాక వరల్డ్ మూవీస్ మీద మోజు కూడా పెంచుకున్నారు కాబట్టి, వాటినీ ఎల్పీఎఫ్ తో కలిపి తీసేస్తారు. ఇవి తప్ప ఇంకో ప్రపంచం, సొంత ప్రతిభ లేనట్టే వుంటుంది. 2000 - 2005 మధ్యకాలంలో వేలం వెర్రిగా వచ్చిపడ్డ  ఎల్పీ ఎఫ్ సినిమాల ప్రభావంతో  ఇంకా అదే చట్రంలో స్టార్ సినిమాలు కూడా తీస్తూ, ఇంకా చిన్నా చితకా రోమాంటిక్ కామెడీలూ తీస్తూ, ఇప్పటికీ 90 శాతం అట్టర్ ఫ్లాపుల జాబితాని విజయవంతంగా నిలబెట్టుకుంటున్నారు. 

         
‘సాహో’ – ‘లార్గో వించ్’ కాపీ అంటూ హల్చల్ చేయడం అనవసరం. గాడ్ ఫాదర్ ని బైబిల్ లా పెట్టుకుని 100 సినిమాలు తీశారు. హమ్ ఆప్కే హై కౌన్ ని రాజ్యాంగంలా పెట్టుకుని 200 సినిమాలు తీశారు. సమరసింహా రెడ్డిని భగవద్గీతలా కళ్ళకద్దుకుని 300 సినిమాలు తీశారు. అంతర్జాతీయ మీడియా 1.5 రేటింగులిచ్చిన లార్గో వించ్ అనే వరల్డ్ మూవీని తీసుకుని, తెలుగులో ఓ రెండు తీస్తే కొంపలేం మునిగిపోవు.
    

         
కొంపలు మునిగింది తీసిన విధానంతో. ఇది లేజర్ స్కానింగ్ లో బయటపడే విషయం. ఆఖరికి ఈ ఎల్పీ ఎఫ్ చట్రంలో ప్రసిద్ధ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో, సింగీతం శ్రీనివాసరావు లాంటి సీనియర్ దర్శకుడు కూడా ‘విజయం’ (2003) అనే  రోమాంటిక్ కామెడీ తీసి దెబ్బతిన్నారు. ఎల్పీ ఎఫ్ చట్రంలో కథనేది వుండదు, కాలక్షేపమే వుంటుంది. కాలక్షేపం సాగి సాగి, సినిమా చివర ఎక్కడో పిసరంత కథ వుండి చప్పున ముగిసిపోతుంది. దీన్నే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అంటాం. స్ట్రక్చర్ అంటే గిట్టని వాళ్లకి ఈ సాంకేతికం తెలిసే అవకాశం లేదు. దీంతో పరాకాష్టకి పోయి షాకింగ్ గా ఇప్పుడు చేసిందేమిటంటే, ‘సాహో’ లాంటి భారీ మాఫియా పోరాటాల కథకి కూడా దీంతోనే పాల్పడ్డం! పిట్ట ప్రాణాన్ని గరుత్మంతుడులో పోయాలనుకోవడం!

          ఈ పిట్ట ప్రాణం ఎక్కడిది? 2014 లో దర్శకుడి తొలిప్రయత్నం ‘రన్ రాజా రన్’ లోనిదే. ఇందులో వాడిన ఎల్పీ ఎఫ్ చట్రంలోనే ‘లార్గో వించ్’ ని దింపితే,  అదికాస్తా ‘సాహో’ అనే శాండ్ విచ్ గా తయారయ్యింది - స్టఫ్ లేని మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో.

          ‘సాహో’ కేవలం భారీ యాక్షన్ థ్రిల్లరేనా? కాదు, ఇంత భారీ స్థాయిలో యాక్షన్ థ్రిల్లర్ తలపెడితే  హై కాన్సెప్ట్ మూవీస్ వర్గంలో చేరుతుంది. హై కాన్సెప్ట్ జానర్ మర్యాదలు ఒనగూడుతాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదు. మురగదాస్ సాధారణ సైకో థ్రిల్లర్ ‘స్పైడర్’ కథకి, క్లయిమాక్స్ లో హై కాన్సెప్ట్ జానర్ దృశ్యాలు అతికించినట్టు, సుజీత్ హై కాన్సెప్ట్ యాక్షన్ థ్రిల్లర్ కి లో
- కాన్సెప్ట్ కథనం చేశాడు, అదీ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేతో. ‘రన్ రాజా రన్’ మిడిల్ మటాష్ తో ఆడిందంటే తెలిసో తెలీకో సీన్ రివర్సల్ టెక్నిక్ తో కథనం చేయడం వల్ల. ‘సాహో’ లో మిడిల్ మటాష్ కి ఈ టెక్నిక్ బదులు, ట్విస్టుల మీద ట్విస్టులతో కథనం చేశాడు. ఇది బెడిసి కొట్టింది. 

బిగినింగ్ కథనం ?
      వాజీ ఆనే కాల్పనిక నగరంలో పృథ్వీ రాజ్ అనే అతను అండర్ వరల్డ్ సామ్రాజ్యాధిపతి. ఇతను కొడుకు దేవరాజ్ ని వారసుడుగా చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీ రాజ్ కి పోటీగా పృథ్వీ రాజ్ చేరదీసిన నరాంతక్ రాయ్, ఇంకో క్రైం సిండికేట్ నడుపుతూంటాడు. దీంతో పృథ్వీరాజ్ కొడుకు దేవరాజ్, రాయ్ మీద పగ పెంచుకుంటాడు. రాయ్ ముంబాయి వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఇంకోచోట రెండు లక్షల కోట్లతో వస్తున్న నౌక సముద్రంలో పేలిపోతుంది. ఇప్పుడు రాయ్ కొడుకు విశ్వాంక్ క్రైం సిండికేట్ ని చేపట్టి, పోయిన రెండు లక్షల కోట్లని రెండు వారాల్లో తెస్తానని, అలాగే తండ్రిని చంపిన వాళ్ళని పట్టుకుని శిక్షిస్తాననీ శపథం చేస్తాడు

         
ఇంతలో ముంబాయిలో వేరే రెండు వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. కేసుని ఛేదించడానికి అండర్ కవర్ పోలీసుగా అశోక్ చక్రవర్తి (హీరో) వస్తాడు. ఇతడికి సాయంగా క్రైం బ్రాంచ్ పోలీసు అమృత (హీరోయిన్) వస్తుంది. చక్రవర్తి ఈమెతో  ప్రేమలో పడి ఈమె ప్రేమ పొందేందుకు వెంటబడుతూంటాడు. వీళ్ళ దర్యాప్తులో ఒక వ్యక్తి అనుమానితుడిగా దృష్టికొస్తాడు. అతడి దగ్గర కూపీ లాగితే, ఒక బ్లాక్ బాక్స్ వుందనీ, అది చిక్కితే రెండు లక్షల కోట్లు సొంతమవుతాయనీ తెలుస్తుంది.

         
బ్లాక్ బాక్స్ కోసం విశ్వాంక్ దగ్గర పని చేసే లీగల్ అడ్వైజర్ కల్కి వెళ్తున్నప్పుడు ఆమె మీద దాడి జరుగుతుంది. ఇంతలో అశోక్ చక్రవర్తి పోలీస్ అండర్ కవర్ కాదనీ, అతను దొంగ అనీ, రెండు వేల కోట్లు అతనే కొట్టేశాడనీ, అసలు అశోక్ చక్రవర్తి అనుమానిత వ్యక్తే ననీ, అతను పోలీసు అనీ, పోలీసులకి తెలుస్తుంది.
         
ఇప్పుడు అశోక్ చక్రవర్తిగా నటిస్తున్న హీరో, బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకుని తన పేరు సాహో అని చెప్పి పారిపోతాడు. విశ్రాంతి.

బిగినింగ్ కథనం కంటిన్యూ
         పైన చెప్పుకున్న ఫస్టాఫ్ 50 నిమిషంలో, బ్లాక్ బాక్స్ అనే క్లూతో, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడి, బిగినింగ్ ముగిశాక, సెకండాఫ్ లో ఇంకా బిగినింగ్ కథనం కంటిన్యూ ఏమిటి? ఇక బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకునే సంఘర్షణతో కథపుట్టి, ప్రారంభమయ్యాక, మిడిల్లో పడ్డాక, మిడిల్ మలుపుగా విశ్రాంతిలో హీరో తను సాహో అంటూ రివీల్ చేశాక, ఇంకా బిగినింగ్ కథనం కంటిన్యూ అనడమేమిటి

         
సాధారణంగా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయితే ఆ సంగతి ఇంటర్వెల్ కల్లా తెలిసిపోతుంది, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడక పోతే. ఇక ప్లాట్ పాయింట్ వన్ సెకండాఫ్ లో ఎక్కడో ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఏర్పడి, అక్కడి ప్లాట్ పాయింట్ టూని ఎండ్ లోకి జరిపేస్తుందని, అక్కడే కథ ప్రారంభమవుతుందని తెలిసిపోతుంది. అంటే ఇంత సేపూ బిగినింగే కథలేకుండా, ఉపోద్ఘాతం రూపంలో హద్దులు దాటి సాగుతుందన్న మాట ముప్పావు వంతు సినిమా వరకూ.

         
అప్పుడు చివరి పావు వంతులో బిగినింగ్ ముగిసి, ప్లాట్ పాయింట్ తో కథ ప్రారంభమైతే, అంటే మిడిల్ ప్రారంభమైతే, మిగిలిన పావు వంతు సినిమాని అది ఎండ్ విభాగంతో, అంటే క్లయిమాక్స్ తో కలిసి పంచుకోవాలన్న మాట. ఇది పదో, పదిహేనో  నిమిషాలు మాత్రమే వుంటుంది. అంటే రెండు గంటల సినిమాలో దాదాపు సగం, అంటే  గంట పాటు వుండాల్సిన మిడిల్ -  అంటే కథ అనే పదార్ధం - ఇలా కొన్నినిమిషాలకి కుదించుకుపోవడంతో, మిడిల్  అనగా కథ అనే అమృతకలశం మటాష్ అయినట్టు అర్ధం.  

         
పావుగంట అత్తెసరు కథ కోసం గంటన్నర పిప్పి చూస్తూ కూర్చోవాలన్నమాట. ఇదే ఎల్పీ ఎఫ్ తడాఖా అంటే. లీనియర్ కథలతో పాల్పడే అనౌచిత్యం. అప్పట్లో తేజ ఒక్కరే ప్రేమకథల్ని త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో చేసే వారు. అంటే ఫస్టాఫ్ సగంలో కథ ప్రారంభమై పోయేది. ఆ సినిమాలు బలంగా వుండేవి. ఇతరులంతా మిడిల్ మటాషులే. కథంటే భయపడిపోయే వాళ్ళు. అమ్మో అంత కథా...సరదా సరదాగా అలా అలా నడిపి, క్లయిమాక్స్ లో లవర్స్ కి లైట్ ప్రాబ్లం పెట్టి తీర్చేస్తే చాలనే వాళ్ళే.  ఇదే తర్వాత వివిధ రూపాల్లో స్టార్ సినిమాలకీ  అంటించారు. ఒక సీనియర్ వ్యక్తి  స్టార్ కథ చేస్తూ, అందులో స్టార్ అసలేమీ చేయని అలా అలా సరదాగా సాగిపోయే లైటర్ వీను కథే చేసుకుని, వద్దన్నా ‘సాహో’ తీసిన ఇదే యూవీ క్రియేషన్స్ కెళ్ళి, గోడకి కొట్టిన బంతిలా వెనక్కొచ్చాడు. ఇదే యూవీ క్రియేషన్స్  అదే ఎల్పీ ఎఫ్ బాపతు ‘సాహో’ ని ఎలా ఓకే చేసిందో మరి.

రెగ్యులర్ నాన్ లీనియర్ 
       లీనియర్ కథల మిడిల్ మటాష్ అనౌచిత్యం ఇలావుంటే, ఇక నాన్ లీనియర్ తో కూడా మిడిల్ మటాష్ కి పాల్పడతారని సాహో’ చూశాకే తెలుస్తోందిమామూలుగా రెగ్యులర్ గా వుండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఎలావుంటుందంటేఖైదీ’ నే ఉదాహరణగా తీసుకుంటేప్రారంభంలోనే పోలీసులు అనుమానితుడిగా చిరంజీవిని పట్టుకుంటారుదీంతో మనకి క్లియర్ గా అర్ధమైపోతుంది -  స్క్రీన్ ప్లే బిగింనింగ్ విభాగంతో ప్రారంభం కావడం లేదనీ, చిరంజీవి ఏదో స్ట్రగుల్ తో వున్నాడంటేఆ స్ట్రగుల్ బిజినెస్ తో వుండే మిడిల్ - 1 తో స్క్రీన్ ప్లే ప్రారంభమైందనీ.

          ఈ
మిడిల్ - 1  కొంత నడిచాక, చిరంజీవి ఇలా స్ట్రగుల్ తో వుండడంలోని పూర్వాపరాల కథనంతో బిగినింగ్ విభాగం ప్రారంభమవుతుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి స్ట్రగుల్ చేయడానికి తలెత్తిన పరిస్థితులేమిటో తెలుసుకుంటాం. ఇప్పుడు బిగినింగ్ విభాగం బిజినెస్, లేదా ఫ్లాష్ బ్యాక్ ముగిసే చోట, ప్లాట్ పాయింట్ – 1 ఏర్పడి, చిరంజీవికి గోల్ ఏర్పాటు కావడాన్ని చూస్తాం. ఇక్కడ్నించీ తిరిగి ముందాపిన మిడిల్ -1 బిజినెస్ కొచ్చి, అక్కడ్నించీ మిడిల్ -2 బిజినెస్ ని లేదా తీవ్రతరమైన స్ట్రగుల్ ని చూస్తాం. దీని చివర కొచ్చి ప్లాట్ పాయింట్ -2 చూసి, ఇక ఎండ్ విభాగంలో కెళ్ళిపోతాం.

         
ఇదీ సర్వ సాధారణంగా వుండే రెగ్యులర్ నాన్ లీనియర్ కథనపు ఏర్పాటు.  మిడిల్ -1, బిగినింగ్, మిడిల్ -2, ఎండ్, ఇంతే. రెగ్యులర్ నాన్ లీనియర్ కథనంలో, స్క్రీన్ ప్లే మిడిల్ -1 తో ప్రారంభమయిందని పైన చెప్పుకున్న విధంగా వెంటనే తెలిసిపోతుంది. ఇందులో మిడిల్ మటాష్ అవదు. అది స్క్రీన్ ప్లేలో వుండాల్సిన సగభాగమూ వుంటుంది

నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ 
      ఇక రెండోది, నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ కథనం వుంటుంది : దీన్ని ఫ్యాక్షన్ సినిమాల్లో చూస్తాం. వీటిలో మిడిల్ -1 తోనే స్క్రీన్ ప్లే ప్రారంభమైనా, విషయం మనకి తెలీకుండా వుంటుంది. బిగినింగ్ బిజినెస్ లాగే వుంటుంది. దీని ప్లాట్ పాయింట్ -1  కోసం చూస్తూంటే, ఇంటర్వెల్లో బాలకృష్ణ ఇంకో స్వరూపం బయట పడుతుంది. బాలకృష్ణ బాలకృష్ణ కాదనీ, వేరే బాలకృష్ణ వున్నాడనీ, వేరే ఫ్యాక్షన్ నేపథ్యముందనీ తెలుసుకుంటాం. దీంతో ఫస్టాఫ్ లో చూసిందంతా అసలు బిగినింగ్ కాదనీ, మిడిల్ -1 అనీ ఇప్పుడు తెలుసుకుంటాం. ఎందుకంటే ప్లాట్ పాయింట్ -1 రావాల్సిన చోట ఇంటర్వెల్లో బిగినింగ్ ప్రారంభమైంది కాబట్టి.

         
అంటే బాలకృష్ణ అసలెవరో తెలుసుకునే పూర్వపరాల బిజినెస్ తో ఇప్పుడు బిగినింగ్ వచ్చింది. దీంతో  సెకండాఫ్ ప్రారంభంకాగానే బాలకృష్ణ  రాయలసీమ జీవితం, గొడవలు, వూరు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులతో ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. ఫ్లాష్ బ్యాక్ ముగియగానే తిరిగి ఇంటర్వెల్లో ఆపిన చోటికొస్తాం. ఇప్పుడు బాలకృష్ణకి వూళ్ళో తలెత్తిన పరిస్థతుల దృష్ట్యా వెంటనే పరిష్కరించాల్సిన గోల్ ఏర్పడి బయల్దేరడంతో, ప్లాట్ పాయింట్ -1 ని చూస్తాం. ఇక్కడ్నించీ మిడిల్ -2 ని చూస్తూ, దాని చివర ప్లాట్ పాయింట్ -2 మీదుగా ఎండ్ వగైరా చూసుకుంటూ వెళ్లి పోతాం.

         
నాన్ రెగ్యులర్  నాన్ లీనియర్ ఏర్పాటులో మిడిల్ -1 , బిగినింగ్, ప్లాట్ పాయింట్ -1, మిడిల్, ఎండ్ - విధంగా కథనం సాగుతుంది. ప్లాట్ పాయింట్ -1 ని సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యాక చూస్తాం. ఇలా సాగినప్పటికీ  స్క్రీన్ ప్లే మిడిల్ -1 తో ప్రారంభమైనట్టు దృశ్యాలుండవు, బిగినింగ్ దృశ్యాల్లాగే వుండి బిగినింగే చూస్తున్నామ
నుకుంటాం. ఇందులో మిడిల్ మటాష్ అవదు.

సాహోఆవిష్కరణ  
          ఇప్పుడు సాహోవిషయానికొద్దాం. ఎంతో అయోమయంగా వున్నసాహోస్క్రిప్టు లో అసలు కవి (దర్శకుడి) హృదయమేమిటో పట్టుకోవడానికి పైన చెప్పుకున్న నమూనాలు ముందుపెట్టుకుని, నాల్గైదు రోజులాలోచిస్తే గానీ సాధ్యం కాలేదు. ఇలాకూడా స్క్రిప్టులు రాసేస్తారా అని నెత్తిన పిడుగు పడినంత పనైంది. పైన చెప్పుకున్న నమూనా కాని నిరర్ధక నమూనాని ఓం ప్రథమంగా ఆవిష్కరించినందుకు ఏమనాలో తెలియని పరిస్థితి. 

         
సాహోకి పెట్టిన బడ్జెట్ వచ్చేసింది కాబట్టి బంపర్ హిట్టే నంటున్నారు. అలాంటప్పుడు స్క్రీన్ ప్లే సంగతులు ఇంకోలా రాయాలి బ్రహ్మ రథం పడుతూ. అప్పుడిదీ  కరెక్టు స్క్రీన్ ప్లేనే అనుకుని మరికొన్ని సినిమాలు ఇలాగే తీసేసే ధైర్యం చేస్తారేమో? చేయక పోతే ఇంత హిట్టయి ఎందుకు? ‘బాషా’ ని పట్టుకుని కొన్ని డజన్లు తీశారు, ‘సాహో’ ని ఎందుకు వదలాలి? అయితే ‘సాహో’ దర్శకుడి అపనమ్మకమే దీనికి అడ్డు. ఒక పక్క బంపర్ హిట్టే నంటూ, ఇంకో పక్క దర్శకుడు ఏమంటున్నాడో చూద్దాం... 

          ... తన మొదటి షార్ట్ ఫిల్మ్ 17 ఏళ్ల వయసులో తీశానని చెబుతూ,  విమర్శ ఎప్పుడూ తనకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాడు. సినిమా చాలా మందికి నచ్చిందని, అయితే ఎవరైతే అంచనాలకు మించి చేరలేదని అనుకుంటున్నారో,  వారు మరోసారి సినిమా చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నాడు.
                                   
సాహో’ చిత్రంలోని గొప్ప స్క్రీన్ ప్లే,అలాగే  తాము పడ్డ కష్టం తెలియాలంటే మరొక్క మారు థియేటర్లకు వెళ్లి చూడాలని మనవి చేశాడు. భారీ అంచనాలతో సినిమా చూడడం వలనే సాహో’  చిత్రం నచ్చడం లేదని అభిప్రాయపడ్డాడు.

         
అలాగే ఇన్నేళ్ల కెరీర్ లో ఏనాడు వెనక్కి తగ్గలేదని, సాహో’ సినిమాలో మీరు మిస్ అయిన  విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడండని సుజిత్ వివరణ ఇచ్చాడు.                                                                                               తెలుగు రాజ్యం డాట్ కాం

         
ఇదీ విషయం! అంచనాలకు మించి చేరలేదని భావించడం వల్ల... భారీ అంచనాలతో సినిమా చూడడం వల్ల ... నచ్చడం లేదనీ,  మిస్ అయిన  విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడాలనీ - ఇలా అన్నికోణాల్లో సినిమా ఎలా వుందో తేల్చేశాడు. దీన్ని ఇంకేం ఫాలో అయి ఇలాగే తీస్తారు.

         
350 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తూంటే, ప్రేక్షకులు కనీసం రెండు టన్నులు భారీగానే  అంచనాలు పెట్టుకోకుండా ఎలా వుంటారు. కంటెంట్ పరంగా తప్పకుండా భారీగానే  అంచనాలు పెట్టుకుంటారు. ఇది గొప్ప స్క్రీన్ ప్లేనే అయితే అదెలా అయింది చెప్పాలి - గొప్ప స్క్రీన్ ప్లేనే  అయితే, మిస్ అయిన  విషయాలు అర్ధం కావాలంటే, మరోసారి చూడమనడ మేమిటి. గొప్ప స్క్రీన్ ప్లే అర్ధమవాలంటే రెండు సార్లు చూడాలా? తన బొమ్మ మంచిదైతే, పదేపదే మరొక్క మారు చూసి అర్ధం జేసుకోండని నచ్చ జెప్పుకోవాల్సిన పని లేదు. 

         
మరి ‘సాహో’ లో  ఏ నమూనా వుంది? ఫస్టాఫ్ 50 వ నిమిషంలో, బ్లాక్ బాక్స్ క్లూతో ప్లాట్ పాయింట్ -1 రావడంతో,  ఇది నాన్ లీనియర్ కథనమన్పించదు. బిగినింగ్ - మిడిల్ -ఎండ్ వరసలో లీనియర్ కథనమే అన్పిస్తుంది. ఈ లీనియర్ కథనంలో ప్లాట్ పాయింట్ -1 వచ్చేసిందంటే, ఇక మిడిల్ మటాష్ వుంటుందని వూహించలేం. ప్లాట్ పాయింట్ -1 వచ్చిందంటే, హీరోకి గోల్ తో, మిడిల్ -1 అంటే, కథ ప్రారంభమైనట్టే. ఇలా హీరో బ్లాక్ బాక్స్ జాడ కనుక్కునే గోల్ తో, ఫస్టాఫ్ లో 50 వ నిమిషంలో కథ ప్రారంభమయ్యాక, దీని కొనసాగింపుగా ఇంటర్వెల్లో ఏం జరగాలి? ఆ గోల్ దెబ్బతినడమో, లేదా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడమో జరగాలి. ఇంటర్వెల్లో హీరో బ్లాక్ బాక్స్ ని చేజిక్కించుకోవడంతో రెండోదే జరిగింది. ఇలా ఇంటర్వెల్లో గోల్ నెక్స్ట్ లెవెల్ కెళ్లాక సెకండాఫ్ లో,  అంటే మిడిల్ -2 లో ఏం జరగాలి? ఆ బ్లాక్ బాక్స్ కోసం విలన్లు వెంటపడాలి. ఇదే జరిగింది సినిమాలో.

          అయితే ... అయితే ...ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ చిక్కడమనే టర్నింగ్ మాత్రమే కాదు, హీరో తను అశోక్ చక్రవర్తి కాదనీ, సాహో ననీ ట్విస్టు నివ్వడం కూడా వుంది. దీంతో టర్నింగ్ కంటే మాంచి రేంజిలో వున్న ఈ ట్విస్టు టర్నింగ్ కి చెక్ పెట్టేసింది. హీరో సాహో అనే మాట బిగ్ డిక్లరేషన్. దీని ముందు టర్నింగ్ పాయింటు (బ్లాక్ బాక్స్ చిక్కడం) వెలవెలబోతూ వుంది. ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు టర్నింగ్ పాయింటు మీంచి ఈ ట్విస్టు మీద కేంద్రీకృతమైపోతుంది. బ్లాక్ బాక్స్ సంగత్తర్వాత, ముందు ఈ సాహో అంటున్న హీరో కథేమిటో తెలుసుకోవాలన్న ఉత్కంఠకి లోనవుతారు. ఇది కామన్ సెన్సు. 


           ఈ కామన్ సెన్స్ కాదనుకుని న్యూసెన్స్ చేశారు. బిగ్ డిక్లరేషన్ తో వున్న ట్విస్టుని వదిలేసి, సెకండాఫ్ కథగా బ్లాక్ బాక్స్ చిక్కిన విలువ తగ్గిన - మార్కెట్ వేల్యూ లేని  టర్నింగ్ ని ఎత్తుకున్నారు. దీంతో సెకండాఫ్ సమస్యల్లో పడింది. అంటే ఇంకా కథ ప్రారంభం కాలేదు... మిడిల్ మటాష్ వైపుగా సాగుతోంది. బిగ్ డిక్లరేషన్ అయిన సాహో ఎవరనే దాని మీదికెళ్తే  కదా కథంటూ  ప్రారంభమయ్యేది? ఇందుకే సెకండాఫ్ లో బిగినింగ్ కథనం కంటిన్యూ అనాల్సి వచ్చింది...

          అదేమిటి, ఫస్టాఫ్ లో బ్లాక్ బాక్స్ క్లూతో ప్లాట్ పాయింట్ -1 వచ్చి  మిడిల్ - 1 ప్రారంభమయిందిగా అంటే -ఇలాగే మిస్ లీడ్ చేస్తాయి మిడిల్ మటాషులు. సెకండాఫ్ వస్తే గానీ మిడిల్ మటాష్ అని అర్ధంగాదు. అర్ధమయ్యాక వెనక్కెళ్ళి  మొదట్నించీ  ఏర్పరచుకున్న అవగాహనని సవరించుకోవాలి. ఇప్పుడు అది ప్లాట్ పాయింట్ -1 కాదు. ఇంకా ప్రారంభంకాని కథకి సంబంధించిన పర్యవసానం. ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ చిక్కడం కూడా ఇంకా ప్రారంభం కాని కథకి మిడ్ పాయింట్ కాదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కాదు, అదింకో పర్యవసానం. అసలు ఫస్టాఫ్ అంతా బిగినింగ్ విభాగం కాదు. పైన చెప్పుకున్న ఫ్యాక్షన్ సినిమాల్లో లాగా పైకి తెలియని మిడిల్ -1. ఇంటర్వెల్లో బాలకృష్ణ బాలకృష్ణ కాదన్న బిగ్ డిక్లరేషన్ తో బయటపడేలాంటి  మిడిల్ -1. అంతవరకూ బిగినింగ్ లాగే అన్పిస్తుంది.

          ఇంటర్వెల్లో ఏదో ఒక్కటే  పెట్టకుండా టర్నింగ్ పెట్టారు, ట్విస్టు కూడా పెట్టారు. పెట్టినప్పుడు ట్విస్టుతో కథ చెప్పకుండా, టర్నింగ్ కి కథనం చేశారు. ట్విస్టు సుప్రీమ్. టర్నింగ్ కేవలం సిట్యుయేషన్. సిట్యుయేషన్ లోంచి ట్విస్టు పుట్టిందంటే, ఆ ట్విస్టే డామినేట్ చేస్తుంది. బ్లాక్ బాక్సుతో టర్నింగ్ కాదు, అతను సాహో అనే ట్విస్టు వెరీ ఇంపార్టెంట్ అవుతుంది.

          ఈ ఫస్టాఫ్ కథనంలో చూపించిందంతా నాన్ రెగ్యులర్ నాన్ లీనియర్ (ఫ్యాక్షన్) తో మిడిల్ -1 విభాగం. అయితే ఇంటర్వెల్ నుంచి హీరో సాహో అన్న ట్విస్టుని పక్కనబెట్టి, హీరోకి బ్లాక్ బాక్స్ చిక్కిన టర్నింగ్ లో కథనాన్ని కొనసాగించారు. అంటే సెకండాఫ్ నుంచీ మిడిల్ -2 ఎత్తుకున్నారు. మిడిల్ -1, మిడిల్ -2 పక్కపక్కన ఎలా వుంటుంది? మధ్యలో బిగినింగ్ వుండాలిగా, ఖైదీలో - ఫ్యాక్షన్ లో వున్నట్టు. లేనప్పుడు ఏం కథ చూస్తున్నామో ఏమర్ధమవుతుంది? అందుకే  సాహో ఎవరు, అతడి సమస్య, గోల్ ఏమిటనే బిగినింగ్, దాని ప్లాట్ పాయింట్ -1 లేకపోయేసరికి, (బిగినింగ్ లేని) ఈ మిడిల్ -1.మిడిల్ -2 రెండూ వుండీ కూడా మటాష్ అయిపోయాయి.

          ఎల్పీ ఎఫ్ లో మిడిల్ ఎక్కడో చివర పిసరంత వుండి మటాషై మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్పించుకోవడాన్ని చూస్తూ వచ్చాం. ఇప్పుడు  సాహోలో మిడిల్ వుండీ బిగినింగ్ లేక మిడిల్ మటాష్ అయ్యే అనర్ధాన్ని కొత్తగా చూస్తున్నాం.

సెకండాఫ్ సంగతులు

      సరే, ఫస్టాఫ్ బిగినింగ్ కథనమంటూ పైన చాలా ముందే చెప్పుకున్నాం. ఇంటర్వెల్ తర్వాత మిడిల్ మటాష్ బయటపడ్డాక, అది మిడిల్ -1 అని గుర్తిస్తూ, వెంటనే ఇప్పుడు సెకండాఫ్ లో మిడిల్ -2 కథనమెలా వుందని చూస్తే...  మనకి ఒక్కముక్కా అర్ధంగాలేదన్న కఠోర సత్యాన్ని ఒప్పుకు తీరాలి. నిజంగా సెకండాఫ్ సినిమా మనకేమీ అర్ధం గాలేదు. అర్ధంగావాలంటే దర్శకుడు రెండో సారి చూడమన్నాడు. రెండో సారి చూసి అర్ధంజేసుకోవడానికి  ‘టైటానిక్’  స్క్రీన్ ప్లే పాఠమైతేగా?  

          రావణాసురుడికి ఎన్ని తలకాయలుంటాయో అంతమంది విలన్లు. ఎవరికి ఎవరేమవుతారో, ఎప్పుడే ట్విస్టు పెడతారో అంతుచిక్కదు. ట్విస్టు మీద ట్విస్టులు. ఎవరితో ఎవరు ఎందుకు కలబడుతున్నారో, ఏమి కోరుకుంటున్నారో బుర్రకెక్కదు. బ్లాక్ బాక్సుతో హీరో ఏం చేయాలనుకుంటున్నాడో, అది చెయ్యకుండా ఎందుకు తనమీద దాడులు జరిపించుకుంటూ బిగ్ యాక్షన్ సీన్సు లో పాల్గొంటున్నాడో తెలియదు. ఒక విలన్ బ్లాక్ బాక్సుకి ట్రాకర్ వుందని, అదెక్కడున్నా తెల్సిపోతుందనీ కంప్యూటర్ మీద ఏదో చేస్తాడు. ఆ తర్వాత దాని సంగతే మర్చిపోతాడు. బ్లాక్ బాక్స్ అనే మాట విమాన ప్రమాదాలు జరిగినప్పుడు వింటూంటాం. ప్రమాద కారణాలు ఆ బ్లాక్ బాక్సులో డేటా వల్ల తెలుస్తాయి. ఇక్కడ ఏ విమాన ప్రమాదంలోంచి దాన్నెత్తు కొచ్చారో, దాంట్లో రెండు లక్షల కోట్ల రూపాయల రహస్యముందని ఒకటే ఆడుకుంటున్నారు. రెండు లక్షల కోట్ల నగదు ఎవరైనా నిల్వ చేయడం సాధ్యమా, అలా చేస్తే 15 లక్షల కోట్ల రూపాయల నగదు చలామణిలో వుండే ఇండియాలో ఆ కొరతకి అల్లకల్లోలం మొదలవదా...అన్న ప్రశ్నలు వద్దు. ఉన్న విలన్లు చాలనట్టు, లీగల్ అడ్వైజర్ గా వున్నావిడ ఉన్నట్టుండి ఒక విలన్ని లేప్పారేసి ఇంకో విలనై పోతుంది. ఇలా చెప్పుకుంటూపోతే పొంతనలేని ట్విస్టు లెన్నో. ఈ ట్విస్టుల వల్ల ఇంటర్వెల్లో ఫ్లాగ్ షిప్ ట్విస్టు  - సాహో ఎవరు? - అన్నది కూడా మార్కెట్ వేల్యూ కోల్పోతోందని స్క్రీన్ ప్లే రచయిత గుర్తించలేదు.

          ఈ పాటికే మనకి సాహో కథ తెలుసుకోవాలన్న ఆసక్తి నశిస్తుంది.  ఎవడైతే ఏంటి, సినిమానే ఐపోతూ వస్తున్నాక. చిట్ట చివరి నిమిషాల్లో సాహో ఫలానా కారు ప్రమాదంలో  చనిపోయిన నరాంతక్ రాయ్ కొడుకని ఫ్లాష్ బ్యాక్. అంటే ఇప్పుడు బిగినింగ్ వచ్చిందన్నమాట - మిడిల్ అయిపోయాక!  ఇక ఆ తండ్రి చావుకి పగదీర్చుకోవడానికి హీరో ఏమేం చేశాడో ఆ దృశ్యాలు రీప్లే చేస్తూ మనకి గుర్తు చేయడం. అప్పటికి రెండున్నర గంటలు డస్సి పోయివున్న మనకి, ఈ రీప్లే అదనపు భారం బుర్రకెక్కదు. ఇందుకే ఎండ్ సస్పెన్స్ కథలు వద్దురాబాబూ అని హాలీవుడ్ ఏనాడో మానుకుంది. దీని గురించి ఈ బ్లాగులో వందల సార్లు చెప్పినా ఎండ్ సస్పెన్సు తో సినిమాలు తీస్తూనే వుంటారు. ఇప్పుడు మిడిల్ మటాష్ తో బాటు, ఎండ్ సస్పెన్స్ గండంలో కూడా పడిందన్న మాట. మిడిల్ – 1, మిడిల్ -2 ల తర్వాత బిగినింగ్ వస్తే మిడిల్స్ మటాషవడంతో బాటు, ఎండ్ సస్పెన్స్ అవుతుందని ‘సాహో’ తో తెలుసుకోవచ్చు.

మరేం చేసి వుండాలి?

       ఏం చేయాలో చెప్తే చీకాకు పుట్టొచ్చు. ఎవరి కథలు వాళ్ళే చేసుకోవాలి. ఐతే మిడిల్ -1 కీ, మిడిల్ - 2 కీ మధ్య ఫ్లాష్ బ్యాక్ రూపంలో బిగినింగ్ రావాలని శాస్త్రం చెప్తుంది. ఖైదీ చెప్పింది, ఫ్యాక్షన్ సినిమాలు చెప్పాయి. అందువల్ల - ఇంటర్వెల్లో బ్లాక్ బాక్స్ తో వచ్చిన టర్నింగ్ ని సస్పెన్స్ లోపెట్టి, సాహో ట్విస్టుతో సెకండాఫ్ ప్రారంభించాలి. అంటే సాహో ఫ్లాష్ బ్యాక్ ఏమిటో, దాని తలూకు బిగినింగ్ విభాగం పూర్తి చేయాలి. మాఫియాలతో అతడి రివెంజి గోల్ ఏమిటో రివీల్ చేయాలి. అప్పుడు ఇంటర్వెల్లో సస్పెన్స్ లో పెట్టిన బ్లాక్ బాక్స్ టర్నింగ్ తో మిడిల్ - 2 ని మొదలెట్టుకుని, క్లయిమాక్స్ లో రివెంజి తీర్చుకుని ముగించాలి.

          ఇలా చేస్తే హీరోది తండ్రిని చంపిన రివెంజి కథేనని మధ్యలోనే తెలిసిపోయి ప్రేక్షకులు చప్పరించేస్తారని,  స్క్రీన్ ప్లే రచయిత ఈ బిగినింగ్ ని తీసికెళ్ళి చివర్లో పెట్టుకున్నట్టుంది. దీంతో వరసగా రెండు మిడిళ్ళు ఎందుకోసం జరుగుతున్నాయో రెండున్నర గంటలపాటు అర్ధంగాకుండా పోయింది. మరి రొటీన్ రివెంజి కథని రివెంజి కథ అని తెలియకుండా చేయడమెట్లా?  


          డిస్ క్లెయిమర్ : ఇది కూడా చెప్తే చీకాకు పుట్టొచ్చు. అకిరా కురసావా ‘సెవెన్ సమురాయ్’ తీశాడు. దాని రీమేకుగా హాలీవుడ్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’  తీసింది. దీని రీమేకుగా హాలీవుడ్లోనే తాజాగా ఆంటన్ ఫుక్వా, డెంజిల్ వాషింగ్టన్ తో,  రీబూట్ చేసిన  ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ తీశాడు. ఇది బందిపోట్ల బారి నుంచి ఊరుని కాపాడే ఏడుగురు కిరాయి సైనికుల కథ. దీన్నే తీసుకుని హిందీలో ఖోటే సిక్కే, షోలే లాంటివి వచ్చాయి. అయితే కురసావా వొరిజినల్లో, మొదటి హాలీవుడ్ రీమేక్ లో, హీరో పాత్రతో పర్సనల్ టచ్ లేదు. ఊరుని కాపాడే సామాజిక ఎమోషనే వుంటుంది. ఫుక్వా  రీబూట్ చేసి, పర్సనల్ టచ్ ఇచ్చాడు బిగ్ స్టార్ డెంజిల్ వాషింగ్టన్ పాత్రకి. ఎంత యాక్షన్ హీరో అయినా కంట్లో తడి అవసరం.

          కిరాయి సైనికులకి ఓ పని చేపట్టడానికి డబ్బే మోటివ్. ఇంతకంటే కారణం వుండనవసరం లేదు. అలా ఊరుని కాపాడ్డానికొచ్చిన డెంజిల్ వాషింగ్టన్, కథ ముగిసి చివర్లో విలన్ని పట్టుకున్నాక, ‘ఆ నాడు మా అమ్మనీ, చెల్లినీ చంపింది నువ్వే కదరా’ అని ఒక్క  డైలాగుతో ఎమోషనలై లేప్పారేస్తాడు.

          రెప్పపాటులో ఒక ఫ్లాష్ లా వెళ్లి పోతుందీ చివరి బిట్. తనవాళ్ళని విలన్ ఎలా చంపాడూ, ఏం జరిగిందీ అంటూ ఫ్లాష్ బ్యాక్ తో రచ్చబండ పెట్టుకోలేదు. రొచ్చు అవుతుంది. కేవలం ఒక్క డైలాగే మెరుపులా.

          ఇది మనకి సూటిగా గుచ్చుకుని ఉలిక్కిపడతాం. ఇంత పర్సనల్ బాధని గుండెల్లో దాచుకుని పరోపకారం చేస్తున్నాడా  - అని హీరో పాత్ర ఉన్నతంగా కన్పిస్తుంది. ఇదే వాషింగ్టన్ ని  ఫుక్వా తర్వాత ‘ఈక్వలైజర్ -2’ లో, చివర్లో పర్సనల్ టచ్ తో ఉన్నతమైన వ్యక్తిగా బలంగా రిజిస్టర్ చేస్తాడు. హై కాన్సెప్ట్ కథల్లో హీరో లేదా హీరోయిన్, చిన్న మనసుతో తమ కోసమే బతుకుతూ వుండవు, పెద్ద మనసుతో పరులకోసం కూడా బతుకుతాయి. సాహోసారు ఇలా బతకాల్సింది.  


          అప్పుడు రివెంజి పాయింటు బయటపడకుండా ఆల్టర్నేట్ స్క్రీన్ ప్లే ఎలా వుండొచ్చు? డిస్ క్లెయిమర్ : ఇదీ చెప్తే చిర్రెత్త వచ్చు, సినిమా ఎలా తీయాలో చెప్తాడేమిటని.   అప్పుడు  స్ట్రెయిట్ నేరేషన్ అంటే లీనియర్ కథనంతో ఫస్టాఫ్ తో అదే ప్లాట్ పాయింట్ -1 తోనే, తర్వాత ఇంటర్వెల్లో బ్లాక్ బాక్సు తో ఆ టర్నింగ్ తోనే, దాని కథ చేస్తూ  సెకండాఫ్ కెళ్ళాలి. ఇంటర్వెల్లో అతను సాహో అని రివీల్ చేయకూడదు. సాహో అన్న సంగతి, రివెంజి సంగతీ, ఇప్పుడు తనే మాఫియా వారసుడనే సంగతీ, అనూహ్యంగా చిట్టచివర్లో పైన చెప్పుకున్న పుఖ్వా రీబూటింగ్ ప్రకారం – పర్సనల్ టచ్ గా, పనిలో పనిగా మాస్టర్ స్ట్రోక్ గా  డైలాగ్ తో ఇచ్చి వదిలెయ్యాలి.

          మరి కేవలం బ్లాక్ బాక్స్ తో స్ట్రెయిట్ నేరేషన్ కథెలా చెప్పొచ్చు? డిస్ క్లెయిమర్ : ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆర్టికల్ ని చించి పారెయ్యొచ్చు ఎవడ్రా వీడని... ఫస్టాఫ్ లో హీరో అండర్ కవర్ పోలీసుగా కథనం ఏమైనా బాగుందా? అతను దొంగ అన్న విషయం దాచి పెట్టారు, తర్వాత సాహో అన్న విషయమూ దాచి పెట్టారు. ఇన్ని దాచిపెట్టడాలు బావున్నాయా ఎండ్ సస్పెన్స్ తో? ఇది మర్డర్ మిస్టరీ కాదుగా? యాక్షన్ జానర్ కదా? యాక్షన్ జానర్ కి సీన్ టు సీన్ సస్పెన్స్ వుండాలిగా? దొంగ అన్న సంగతి మూసి పెట్టి, నడపడం వల్ల డ్రామా లేకుండా పోయిందిగా? రెండు వేల కోట్ల దోపిడీ ఇన్వెస్టిగేషన్ అతడితో ఏ డైమెన్షన్ లేకుండా ఫ్లాట్ గా, డల్ గా, యమబోరుగా సాగిందిగా?

          అందుకని, దొంగోడని ప్రేక్షకులకి చెప్పేసి, పాత్రలకి దాచి పెట్టి, తను చేసిన దోపిడీని తనే ఇన్వెస్టిగేట్ చేసే గమ్మత్తైన డైమెన్షన్, డ్రామా, డైనమిక్స్ వగైరాలాతో హుషారెక్కించేలా ఫన్ రైడ్ చేయొచ్చుగా? ఆఫ్టరాల్, హై కాన్సెప్ట్ మూవీ అంటే ఏమిటి? పిల్లల కాడ్నించీ పెద్దల వరకూ అలరించేదేగా? అన్నీ డార్క్ పాత్రలతో వికర్షించేలా ఇంత డార్క్ మూవీయే తీయాలా? హాలీవుడ్ వాడైతే ఆ బ్లాక్ బాక్స్ కి మిథికల్ మహిమ అంటగట్టేసి ఫాంటసీ చేస్తాడు. టెక్నికల్ గా హాలీవుడ్ రేంజిలో తీశామనడం గొప్పా? విషయపరంగా భారతీయత ఏది? హై కాన్సెప్ట్  ‘భారతీయుడు’ లాంటి భారతీయత? అంతర్జాతీయ సమాజం ఇదే చూస్తుంది : టెక్నికల్ గా హాలీ వుడ్ తో సరితూగారు సరే, హాలీవుడ్ కథలే మళ్ళీ మామీద ఎందుకు మోపుతారు, మీ భారతీయ కథేదీ? ఆస్కార్ కూడా ఇదే ప్రశ్న వేస్తుంది...

          హేవ్ ఏ నైస్ టైం, బై!



సికిందర్

2, సెప్టెంబర్ 2019, సోమవారం

868 : 'పాలపిట్ట' ఆర్టికల్


          విగా, రచయితగా, అనువాదకునిగా, సినీ విశ్లేషకునిగా బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శించే అరుదైన సృజనశీలి మామిడి హరికృష్ణ. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఆయన నిర్వహిస్తున్న పాత్ర విలక్షణమైనది. విభిన్న రంగాలలో తనదైన ముద్ర వేసిన హరికృష్ణ సృజనశీలత్వాన్ని, విశిష్టతని ప్రతిఫలించే స్పెషల్ ఇష్యూ ఇది. మామిడి హరికృష్ణ తో ప్రముఖ రచయిత కస్తూరి మురళి కృష్ణ చేసిన ఇంటర్వ్యూ తో పాటు హరికృష్ణ మూర్తిమత్వాన్ని వ్యక్తం చేసే వ్యాసాల, అభిప్రాయాల సమాహారం ఈ ‘పాలపిట్ట’ సంచిక. డజన్ కు పైగా వ్యాసాలు, కవితలు హరికృష్ణ క్రియేటివ్ నేచర్ ని తెలియజేస్తాయి. హరికృష్ణ ప్రయాణం లోని అనేక కోణాలు ఈ సంచిక లో చూడవచ్చు. కవిగా హరికృష్ణ ప్రత్యేకత లను సిద్ధార్థ, ఎం.నారాయణ శర్మ చెప్పారు. సినిమాలపై హరికృష్ణ కు ఉన్న సాధికారిక పట్టును సికిందర్ చెప్పిన తీరు ఆకర్షణీయం. అందరికి తెలిసినట్టే కనిపించే హరికృష్ణ లోని తెలియని ఆర్ద్రమైన కోణాలు ఎన్నో ఈ ‘పాలపిట్ట’ సంచిక పాఠకుల ముందుకు తెచ్చింది. ఇందుకు సహకరించిన రచయతలకు, ముఖ్యంగా అక్షర కుమార్ కు, ఇతర మిత్రులకు ధన్యవాదాలుఅభినందనలు.
కె.పి. అశోక్ కుమార్
వర్కింగ్ ఎడిటర్, ‘పాలపిట్ట’ మాసపత్రిక
 
          తెలుగు సినిమా విమర్శకుడు, చరిత్ర కారుడు మామిడి హరికృష్ణ పేరు తెలియని వారు వుండరు. వివిధ పత్రికల్లో విరివిగా ఆయన సినిమా వ్యాసాలు రాసి పేరు గడించారు. సినిమా విమర్శకుడుగా రెండు సార్లు నంది అవార్డులు పొందారు.  హాలీవుడ్ నుంచీ బాలీవుడ్, టాలీవుడ్, ప్రాంతీయ సినిమాల దాకా గొప్ప జ్ఞానసంపద వున్న వ్యాసకర్తగా ఖ్యాతి సంపాదించారు. ఈ నాల్గు సినీరంగాలపై ఆయన రాసిన వ్యాసాలు తగినంత సమాచారాన్ని అందిస్తాయి. ఆయన స్పృశించని అంశమంటూ లేదు. సినిమా  పుట్టిందగ్గర్నుంచి,  ఏ స్థాయికి చేరిందనేవరకూ ఒక నిఘంటువులా వ్యాసపరంపర సాగించారు. ఈ వ్యాస సంపదని సినిమా కళ శాస్త్ర సాంకేతిక విషయ అధ్యయన దృష్టితో కాకుండా, విస్తృత ఉపరితల సమాచారాన్నందించే డేటా బ్యాంకుగా అందుబాటులో వుంచారు. సగటు సినిమా పాఠకుల్ని అలరించే విశేషాలు  ఆయన విషయ సేకరణకి ప్రధానంగా వున్నాయి.

          2013 వరకూ విరివిగా సినిమా వ్యాసాలు రాస్తూ పోయారు. ఆ తర్వాత సినిమా వ్యాసాలు గానీ, తెలుగు సినిమా సమీక్షలు గానీ రాసినట్టు లేదు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడుగా తీరిక లేని బాధ్యతల వల్ల ఇది కుదరక పోవచ్చు. అయితే రవీంద్ర భారతి కేంద్రంగా ఆయన భావి సినిమా కళాకారుల్ని తీర్చిదిద్దే వివిధ కార్యక్రమాలు నిర్విహిస్తూ బిజీగానే వుంటున్నారు.

          ఆంధ్రభూమి సినిమా పేజీ వెన్నెలలో హరికృష్ణ రాయడం ప్రారంభించి ఇతర పత్రికలకి విస్తరించారు. దేశంలో సినిమా ఆవిర్భావానికి అద్యులైన దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య నాయుడు, జెసీ డేనియల్ నాడార్ ల గురించి ఇంకా  జీవిత చరిత్రలు  రాయడం, పరిచయం చేయడం అవసరం లేదు. ఈ ముగ్గురిపై వివిధ భాషల్లో కొన్నేళ్లుగా అనేక కథనాలు వచ్చేశాయి. సినిమా చరిత్రకారుడిగా హరికృష్ణ తనూ రాసి కొత్తగా తెలిపేదేమీ వుండదు. అందుకని ఈ ముగ్గురి జీవితాలాధారంగా నిర్మించిన మూడు బయోపిక్స్ ని పాఠకుల ముందుంచారు. ఇంతకాలం వివిధ వ్యాసాలతో ఈ ముగ్గురు సినీ పితామహుల్ని స్మరించుకుంటూనే వున్నాం. బయోపిక్స్ తో స్మరించుకోవడం ఒకెత్తు. దాదా ఫాల్కే హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’ (మరాఠీ), ‘రఘుపతి వెంకయ్య’ (తెలుగు), ‘సెల్యూలాయిడ్’ (మలయాళం) అనే మూడు బయోపిక్స్ విశేషాలు తెలియజేశారు. అయితే దక్షిణ దేశంలో తొలి సినిమా నిర్మించింది రంగస్వామి నటరాజ మొదలియార్. ఈయన 1918 లోనే తమిళంలో కీచక వధమ్నిర్మించాడు. ఈయన బయోపిక్ లేకపోయినా ఈయన గురించి ప్రస్తావించి ఉండాల్సింది. దక్షిణాది చిత్రంఅనే వేరే వ్యాసంలో మొదలియార్ గురించి రాశారు.  ఇక రఘుపతి వెంకయ్య అనకుండా, రఘుపతి వెంకయ్య నాయుడు అని పూర్తి పేరు రాయాల్సింది. 

        పునర్జన్మల మీద వచ్చిన సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు, కాపీ సంస్కృతి, సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు, వివిధ అవార్డులు, చలన చిత్రోత్సవాలు, ఆస్కార్ అవార్డుల చరిత్ర, ఆస్కార్ అవార్డులు సాధించిన సినిమాల జాబితా, ఆస్కార్ అవార్డులకి పోటీ పడ్డ భారతీయ సినిమాలు, దేవానంద్ నట జీవితం, తెలుగు సినిమా టైటిల్స్, తెలుగు సినిమాల్లో ఊతపదాలు, రామాయణం మీద తీసిన సినిమాలు, తెలంగాణా సినిమాలు, ప్రపంచంలో తొలి బయోపిక్, హిందీ సినిమాల్లో మాండలికం, యశ్  చోప్రా నిర్మించిన చిత్రాలు, బాలల చిత్రాలు, చిత్రోత్సవాలు, బాలీవుడ్ కథా వస్తువులు, మాస్ సినిమా లక్షణాలు, సినిమాలపై సామాజిక ఉద్రిక్తల ప్రభావం, ప్రాంతీయ సినిమాలు ...ఇలా ఒకటనేమిటి, వీలైనన్నిఅంశాలపై విస్తృతంగా, విపులంగా రాశారు. 

          రిఫరెన్స్ కోసం ఆయన వ్యాసాలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ వ్యాసాల్లో ఆయనలోని విమర్శకుడు కన్నా చరిత్రకారుడే కన్పిస్తాడు. విషయాన్ని పరిచయం చేయడం వరకే ఈ వ్యాసాల ఉద్దేశంగా కనబడుతుంది. విమర్శనాత్మక దృష్టితో వాటి లోతైన విశ్లేషణ కన్నా, తులనాత్మక విశ్లేషణ కొంత కన్పిస్తుంది. రెండు మూడు భాషల్లో వచ్చిన పునర్జన్మల సినిమాలని పోల్చడం, జేమ్స్ బాండ్  సినిమాలని పోల్చడం వగైరా. 

          పునర్జన్మల సినిమాలకి సంబంధించి ఇవెందుకు హిట్ ఫార్ములా అయ్యాయో మనోవిశ్లేషణ చేశారు. పునర్జన్మలు ఒక నమ్మకం కాదనీ వాటిని శాస్త్రీయంగా నిరూపించేందుకు పారాసైకాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ తదితర రంగాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయనీ వివరించారు. ఇవే కాక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే టెక్నిక్ తో ఇప్పటికిప్పుడు మనిషిని గత జన్మలోకి తీసికెళ్ళే నిపుణుడుగా డాక్టర్ బ్రియాన్ వీస్ వున్న విషయం మనకి తెలిసిందే. అయితే కొన్ని నమ్మకాలకి ప్రేక్షకులకి నిరూపణలతో నిమిత్తముండదేమో. దేవుళ్ళతో భక్తి సినిమాలు, దెయ్యాలతో హార్రర్ సినిమాలూ ఎలా చూస్తారో పునర్జన్మ సినిమాలూ అంతే. వీటి నాటకీయ విలువలే, పలాయన వాద చిత్రణలే ప్రేక్షకులకి సత్కాలక్షేప వినోద సాధనాలవుతున్నాయేమో ఆలోచించాలి.

 
          ఇక్కడ వ్యాసకర్త ఇచ్చిన శాస్త్రీయ సమాచారం విలువైనదే. అయితే పాఠకులు క్షమిస్తే, కొంత బేసిక్ సినిమా శాస్త్రాన్ని ఇక్కడ జోడించడం అవశ్యం కావచ్చు. క్లుప్తంగా చెప్పుకుంటే, వెండితెర మీద సినిమా ప్రదర్శనంటే ఏమిటి? ప్రేక్షకుల మానసిక లోకాన్ని ఆవిష్కరించడమే. ప్రేక్షకుల కాన్షస్ మైండ్ తో వాళ్ళ సబ్ కాన్షస్ మైండ్ కి లడాయి పెట్టడమే. దీన్నే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే అన్నారు. చిన్మయానంద స్వామి ప్రకారం కురుక్షేత్రం ఎక్కడో జరగలేదు. మనిషి మస్తిష్కంలోనే నూరు మంది కౌరవులనే నెగెటివ్ భావాలతో, ఐదు మంది పాండవులనే పాజిటివ్ ఫీలింగ్స్ జరిపే నిత్య సంఘర్షణే మనిషి మానసిక లోకంలో జరిగే కురుక్షేత్రం. పురాణాలన్నీ సైకో ఎనాలిసిస్ లే. మనసు గురించి చెప్పేవే. ఈ విశ్వమే దేవుడి మనసు. మనస్సు తప్ప ఇంకేమీ లేదు ఎక్కడా. దురదృష్టవశాత్తూ మనసే మనిషికి శత్రువైంది. ఈ మనస్సుని మధించడమే వెండితెర మీద సినిమా చేసే పని.


          పైన చెప్పుకున్న లడాయికి  ప్రేక్షకుల ఇగో కథానాయకుడుగా వుంటుంది. ఇతర పాత్రలు ప్రేక్షకుల వివిధ భావోద్వేగాలకి ప్రతిరూపాలుగా వుంటాయి. సినిమా కథంటే ఏమిటి? అన్న ప్రశ్న వేసుకుని,  ఇరవై ఏళ్ళూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి పరిశోధన చేసిన స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ కనుగొన్న వాస్తవాలివి. ఇలా గొప్ప సినిమాలు కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేగానే ఉంటున్నాయని తేల్చాడు. లేనివి మామూలు సినిమాలుగా మిగిలిపోతున్నాయన్నాడు. అంతరాత్మ (సబ్ కాన్షస్ మైండ్) తో కాన్షస్ ఇగో  జరిపే పోరాటమే సినిమా కథ అన్నాడు. ఈ పోరాటంలో జీవిత సత్యాలు తెలుసుకున్న ఇగో, చివరాఖరికి  మెచ్యూర్డ్ ఇగోగా ఉన్నతిని పొందుతుందన్నాడు. ఇగోని ఏం చేసీ చంపడం సాధ్యం కాదు గనుక, దాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని బాగుపడ్డమే చేయగల్గింది. దీన్నే గొప్ప సినిమాలు చిత్రిస్తాయన్నాడు. ఈ బేసిక్ సినిమా సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు, ప్రేక్షకుల అన్ని నమ్మకాలూ, మూఢనమ్మకాలూ వగైరా మనోఫలకాలన్నీ  వెండి తెరమీద ఈ చట్రంలోకే వచ్చేసి నర్తిస్తాయి. జేమ్స్ బానెట్ ప్రసిద్ధ గ్రంధం ‘Stealing Fire from the Gods’ సారాంశమిది.



బాండ్ డిటెక్టివ్?
          జేమ్స్ బాండ్ సినిమాల గురించి ఎక్కువ సమాచారమిచ్చారు. జేమ్స్ బాండ్ ని సృష్టించిన రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ గురించి రాశారు. జేమ్స్ బాండ్ పాత్ర ఎలా పుట్టిందీ రాశారు. అయితే ఇది డిటెక్టివ్ జానర్  అన్నట్టుగా రాశారు. జేమ్స్ బాండ్  డిటెక్టివ్ నవలా సాహిత్యంలో ఎంత సంచలనం సృష్టించాడో, స్పై  థ్రిల్లర్ సినిమాలతో కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేశాడుఅనడం సరి కాదేమో. జేమ్స్ బాండ్ ది డిటెక్టివ్ నవలా సాహిత్యంకాక,  స్పై గూఢచార సాహిత్యమే. డిటెక్టివ్ పాత్ర  స్థానికంగా నేర పరిశోధన చేస్తే, స్పై లేదా గూఢచారి పాత్ర విదేశాల్లో రహస్య కార్యకలాపాలు సాగిస్తాడనేది జగమెరిగిన సత్యం. వృత్తుల్లో ఈ తేడా వుంది. జేమ్స్ బాండ్ ఈ రెండో కోవకి చెందిన వాడు. సత్యజిత్ రే సృష్టించిన ఫెలూదా పాత్ర జేమ్స్ బాండ్ పాత్ర అనడం కూడా సరికాదేమో. అది పక్కా డిటెక్టివ్ పాత్రే. అలాగే జంధ్యాల తీసిన చంటబ్బాయ్లో చిరంజీవి ప్రైవేట్ డిటెక్టివే తప్ప, జేమ్స్ బాండ్ పాత్ర కాదు. హాస్యం కోసం, ప్రేక్షకులకి అర్ధం అవడం కోసం ఆ పాత్ర జేమ్స్ పాండ్అని పలుకుతుంది. పాత్రపేరు పాండు రంగా రావు అయినందుకు. ఇక రాజ్ కపూర్ నటించిన జాసూస్’, ‘దో జాసూస్లు కూడా బాండ్ సినిమాలు / పాత్రలు కావు, అవి డిటెక్టివ్ సినిమాలే, డిటెక్టివ్ పాత్రలే. జాసూస్ అంటేనే పత్తేదారు లేదా డిటెక్టివ్ అని అర్ధం. జేమ్స్ బాండ్ స్పై జానర్ గురించిన వ్యాసంలో, డిటెక్టివ్ జానర్ సినిమాలని స్పై జానర్ కింద పేర్కొంటూ కలిపి రాసేశారు.  తెలుగులో డిటెక్టివ్ యుగంధర్ సృష్టికర్త కొమ్మూరి సాంబశివరావు, షాడో సృష్టికర్త మధుబాబు, జేమ్స్ బాండ్ స్ఫూర్తితో రాయడం మొదలెట్టినట్టు తెలియజేశారు. కానీ జేమ్స్ బాండ్ పుట్టక ముందే యుగంధర్ పాత్రని సృష్టించి నవలలు రాయడం మొదలెట్టారు కొమ్మూరి. మధు బాబు షాడో పాత్ర మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేస్తూ, తెలుగు డిటెక్టివ్ సాహిత్యాన్ని అటకెక్కిస్తూ, ఆధునికంగా పుట్టిన స్పై పాత్ర. దీనికి జేమ్స్ బాండ్ స్ఫూర్తి కాదు. కొమ్మూరి సాంబశివరావు పేరుని సాంబశివరావు అనకుండా, కొమ్మూరి సాంబశివరావు అని పూర్తి  పేరు రాసివుంటే గౌరవంగా వుండేది.


          ఇక తెలుగులో మొదటి జేమ్స్ బాండ్ సినిమా హీరో కృష్ణ నటించిన గూఢచారి 116’  అన్నారు కానీ దర్శకుడు కెఎస్ఆర్ దాస్ కాదు, ఎం మల్లిఖార్జునరావు. ఆ తర్వాత హీరో కృష్ణ 1978 లో జేమ్స్ బాండ్ గా ఏజెంట్ గోపీలో నటించారన్నారు. కానీ గూఢచారి 116తర్వాత జేమ్స్ బాండ్ 777లో, ‘ఏజెంట్ గోపీతర్వాత మరో రెండు బాండ్ సినిమాలు రహస్య గూఢచారి’, ‘గూఢ చారి 117లలో నటించారు హీరో కృష్ణ. ఇన్ని బాండ్ సినిమాల్లో నటించినందుకే ఆయన ఆంధ్రా జేమ్స్ బాండ్ అయ్యారు. చిరంజీవి నటించిన బాండ్ సినిమాల్ని పేర్కొనడం బావుంది గానీ, కృష్ణం రాజు నటించిన అందడు ఆగడుకూడా పేర్కొని వుండాల్సింది.


          ఇక రామాయణ సినిమాల విషయానికొస్తే ఇవి ఎన్ని రకాలుగా వచ్చాయో వర్గాలుగా విభజించి చక్కగా పేర్కొన్నారు. ఇంకా ఈ జాబితాలో  ఇంద్రజిత్, పాదుకా పట్టాభిషేకంతో బాటు బాపు దర్శకత్వంలో సీతాకళ్యాణంకూడా చేర్చాలి. 1972 లో బాపు దర్శకత్వంలో శోభన్ బాబు, చంద్రకళ జంటగా ఓ సినిమా వచ్చిందన్నారు. అ సినిమా పేరు సంపూర్ణ రామాయణంఅని రాయాల్సింది.

మాండలికం ముచ్చట్లు
          హిందీలో ఎన్ని మాండలికాలున్నాయో (12) వాటి గురించి వివరంగా సేకరించి తెలియజేశారు. ఈ మాండలికాలు ప్రధాన స్రవంతి హిందీ సినిమాల్లోకి ఎలా ప్రవేశించాయో విపులంగా రాశారు. ఈ మాండలిక వాడకం1961 లో  గంగా జమునతో ప్రారంభమై,  ఆ తర్వాత 1970 లలో రివెంజి సినిమాల వెల్లువలో కొట్టుకు పోయి2000 లలో ప్రకాష్ ఝా, విశాల్ భరద్వాజ్ తదితర దర్శకులతో తిరిగి మాండలిక ప్రయోగాలు  జరుగుతున్నట్టు చెప్పుకొచ్చారు.  కానీ 1970 లలో హిందీ బందిపోటు సినిమాల వెల్లువలో మాండలికం బాగానే వెల్లివిరిసింది. ఇక 1975 లో షోలేలో గబ్బర్ సింగ్ మాట్లాడిన ఖరీబోలీ యాస గురించి చెప్పాల్సిన పనిలేదు.

          తెలుగు సినిమా టైటిల్స్ పరిణామ క్రమం గురించి, తెలుగు సినిమాల్లో సంభాషణల చమత్కారం గురించీ, ఊత పదాల గురించీ పాతాళ భైరవిదగ్గర్నుంచీ కొన్ని  సినిమాలని సరదాగా ఉదహరించారు. ముత్యాల ముగ్గులో రావుగోపాల రావు పొడవైన డైలాగుల గురించి రాశారు గానీ, ‘అలోవలోవలోఅనే ఊతపదం, ‘యాభైలో సగం పన్నెండున్నరఅనే బాగా పేలిన డైలాగు కూడా వున్నాయి.

          సినిమా కథలు ఎన్ని రకలుగా కాపీ చేస్తారో ఒక జనరల్ వ్యాసం రాశారు. ఇది రాసే నాటికే బాలీవుడ్ లో  హాలీవుడ్ కంపెనీలు శాఖలు ఏర్పాటు చేసుకుని, హాలీవుడ్ నుంచి కాపీ కొడుతున్న నిర్మాతలకి నోటీసులు పంపడం ప్రారంభించడంతో అప్రమత్తమై, బాలీవుడ్ లో కాపీలు  కొట్టడం మానేశారు. ఈ కొసమెరుపు రాసి ఉండాల్సింది. ఇక స్వామీ రారాఅనే మొదటి సినిమా తీసిన దర్శకుడు సుధీర్ వర్మ,  ‘నాకు నచ్చిన సినిమాలన్నిటినీ కాపీ కొడతానుఅని టైటిల్స్ కి ముందు వేశారని పేర్కొన్నారు. నిజానికి ఈ లైను కూడా దర్శకుడు కాపీ కొట్టిందే. స్వామీరారాని హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరాంటినో తీసిన కల్ట్ ఫిలిం పల్ప్ ఫిక్షన్కి ప్రభావితుడై తీశాడు. క్వెంటిన్ టరాంటినో  ప్రసిద్ధ కొటేషన్ ఒకటుంది - 
“I steal from every single movie ever made. అని. దీన్ని కాపీ కొట్టి తెలుగులో తన కొటేషనుగా వేసుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత ఈ దర్శకుడు కనిపించడం మానేశాడు. టరాంటినోలా కాపీ కొడతానని గొప్పగా చెప్పుకోవాలంటే తనూ టరాంటినో స్థాయికి ఎదిగితేనే కదా - ఫర్వా లేదనుకుని ధైర్యం చేసి నిర్మాతలు సినిమాలిస్తారు. ఓవరాక్షన్ చేస్తే ఇలాగే వుంటుంది.

          హిందీ సినిమాలు ఎలా మార్పు చెందుతూ వచ్చాయో పేర్కొన్న వ్యాసంలో, అమితాబ్ బచ్చన్ కెరీర్ గ్రాఫ్ తలకిందులుగా వుంది.  “ ‘షోలే’ (1975) తో మొదలైన అమితాబ్ జైత్ర యాత్ర,  ‘జంజీర్’, ‘దీవార్లతో దూసు కెళ్ళి... అంటూ రాసు కొచ్చారు. నిజానికి జంజీర్’ (1973) తో మొదలైన అమితాబ్ జైత్ర యాత్ర, ‘మజ్బూర్’ (1974), ‘దీవార్’ (1975), షోలే (1975) లతో దూసుకెళ్లింది...అని వుండాలి.


సాంఘిక సంక్షోభాల్లో విజయాలు 

          సమాజం సంక్షుభితంగా వున్నప్పుడు సినిమాలు విజయాలు సాధిస్తాయని సూత్రీకరణ చేశారు. దూకుడుసినిమా ఘనవిజయం సాధించడానికి ఆ సమయంలో తెలంగాణా ఉద్యమంతో సంక్షుభిత వాతావరణం  ఏర్పడడం కారణమే తప్ప మరొకటి కాదన్నారు. అలాటి  సంక్షోభ సమయాల్లో మనిషి ఎలాటి  మానసిక స్థితికి లోనవుతాడో మానసిక శాస్త్ర ఆధారాలు చూపారు. ఉద్యమాలు భావోద్వేగాలతో వుంటాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో కూడిన భావోద్వేగాల తెలంగాణా ఉద్యమ సమయంలో, ఆంధ్రా సినిమాకి తెలంగాణాలో కూడా ఘనవిజయం లభించిందంటే, తెలంగాణా భావోద్వేగాలు పనిచేయకుండా వుండాలి. వ్యాసకర్త వివరించిన వ్యక్తిగత భావోద్రేకాలు తోడ్పడి వుండాలి. అంటే తెలంగాణా ప్రేక్షకులు తెలంగాణా ఉద్యమంతో విసిగి వేసారి వుండాలి. ఈ విసుగుతో సినిమాని విజయవంతం చేసి ఉపశమనం పొంది వుండాలి.

          ఇదే ఉద్యమం తీవ్రంగా వున్న  సమయంలో నితిన్ నటించిన సీతా రాముల కళ్యాణం- లంకలో’  విడుదలైప్పుడు, ఆంధ్రా ప్రాంత విద్యార్థులు తెలంగాణా సోదరుడి సినిమాని ఆహ్వానిద్దాంఅని థియేటర్ల దగ్గర ప్రేక్షకులకి గులాబీలు పంచారు. అయినా ఆ సినిమా ఆడలేదు. 1969 తెలంగాణా ఉద్యమ కాలంలో,  కృష్ణ - విజయనిర్మల నటంచిన లవ్ ఇన్ ఆంధ్రవిడుదలైతే ఆంధ్రాలోనే అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ దృష్టాంతాల రీత్యా వ్యాసకర్త సూత్రీకరణ సంతృప్తికరంగా అన్పించడం లేదు.

          ఇకపోతే తెలంగాణా సినిమాలు ఎన్నిరకాలుగా వున్నాయో వర్గీకరణ చేసి, ఆ ఎనిమిది రకాల సినిమాల్ని పేర్కొన్నారు. అ యితే ఓ రెండు సినిమాలకి తప్ప,  మిగతా  వాటిలో కూడా నటీనటులెవరో పేర్కొనలేదు. పేర్కొని వుంటే సమాచారం సమగ్రంగా వుండేది.

          ఇలా విభిన్న అంశాలపై తన సునిశిత దృష్టిని సారించారు వ్యాసకర్త. ఈ వ్యాసాలు చదివితే సినిమా జర్నలిస్టుగా ఆయన పరిపూర్ణంగా అర్ధమవుతారు. అయితే అవసరమైన చోటల్లా సంబంధిత సినిమా నిపుణుల్ని సంప్రదించి, వారి అభిప్రాయాలని కూడ జతపర్చి వుంటే ఆయన  జర్నలిజం మరింత ప్రకాశించేది. ఈ వ్యాసాలు 2013 వరకూ రాసినవి. ఇన్నేళ్ళ విరామం తర్వాత వీటిని పుస్తకంగా వేయాలంటే, కొత్త సమాచారంతో  అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా  వుంది.

సికిందర్
(‘పాలపిట్ట’, మే 2019 సంచిక) 


867 : స్క్రీన్ ప్లే సంగతులు -1


  (‘సాహో’ లైన్ ‘లార్గో వించ్’ నుంచి కాపీ అని వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొందరు టాలీవుడ్ మిత్రులు ‘సాహో’ లో ఎండ్ సస్పెన్ తో మిడిల్ మటాష్  స్క్రీన్ ప్లే చేశారని ఫోన్లు చేసి చెప్పేస్తున్నారు. తాజాగా సిఎస్ అనే ఇంకో మిత్రుడు, ఇంకో అడుగు ముందుకేస్తూ రీసెర్చి చేసి, అసలు ‘సాహో’ స్క్రీన్ ప్లే, కథనం ఇదే దర్శకుడు తీసిన తొలి మూవీ, ‘రన్ రాజా రన్’ నుంచే దించేశాడని విశ్లేషణ రాసి పంపారు. ‘రన్ రాజా రన్’ లోని రోమాన్సు, ‘సాహో’లో యాక్షన్ గా ఎలా మారిందో వివరించారు. ఇంకా ‘రన్ రాజా రన్’ లోని పాత్రలే, వాటితో వున్న కథనాలే  ‘సాహో’ లో ఎలా మార్చి తీశాడో చెప్పారు. ఈ విశ్లేషణ చదవండి. చివర ‘రన్ రాజా  రన్’ కి అప్పట్లో పోస్టు చేసిన బ్లాగు రివ్యూ లింక్ ఇచ్చాం, అది కూడా చదవండి)

         న్ రాజా రన్సినిమానే మళ్ళీ  ‘సాహో’ గా తీసిన సుజీత్. అదేంటి? ‘లార్గో వించ్’ నుండి ‘సాహో’ కు లైన్ తీసుకున్నారని అంటున్నారే?  మరి 'రన్ రాజా రన్' కు పోలిక ఏమిటి? ఎందుకో చూద్దాం...

          న్ రాజా రన్' సినిమాలో  కథ ఏమిటో, అసలేం జరుగుతుందో చివరి ఇరవై నిమిషాల వరకూ తెలీదు.  మరి అంత వరకూ జరిగింది ఏమిటి?  ఒక పక్క, శర్వానంద్ కూరగాయల షాపు నడుపుకుంటూ డిజైనర్ డ్రెస్సులు వేసుకుని తెలుగు సినిమా హీరోలా ఏ పనీ పాట లేకుండా హీరోయిన్ తో అచ్చిక బుచ్చికలు, ఇంకో పక్క నగరంలో జరుగుతున్న కిడ్నాపులు, కిడ్నాపర్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్న కమీషనర్ సంపత్ రాజ్, అతను వేసే చెత్త పథకాలు. సినిమా మొదలైన గంటా యాభై నిముషాలు వరకూ జరిగింది ఇంతే.  

          హీరో సమస్య ఏమిటి
, అతని గోల్ ఏమిటి, విలన్ ఎవరు, వాడి గోల్ ఏమిటి? ఇలా ఏమీ తెలీకుండా గూగుల్ లో వెతికితే  వచ్చే జోకులతో టైమ్ పాస్ తప్ప, దాదాపు ఒక గంటా యాభై నిముషాల సినిమాలో కథ ప్రసక్తే లేదు. ఇంటర్వల్లో హీరో హీరోయిన్ ను కిడ్నాప్ చేయడం ట్విస్ట్ అట! నాకు బోర్ కొట్టి ఇక వెళ్ళి పోదాము అనుకున్న టైమ్ లో, చివరి ఇరవై నిమిషాలూ ట్విస్టుమీద ట్విస్టులు.  



      ఒకప్పుడు కిడ్నాపులు (డబ్బు కోసం) చేసింది ఇప్పటి కమీషనరు సంపత్ రాజ్ అనీ, అప్పటి ఆ కిడ్నాపు నేరాన్ని మన హీరో నాన్న మీద వేసి జైలుకు పంపాడనీఇప్పటి కిడ్నాపులు చేసేది మన హీరో అనీఇది సంపత్ రాజ్ ను జైలుకు పంపడాని కి మన హీరో వేసిన అతి తెలివైన (!) పథకం అనీ. ఇవి కాకహీరోయిన్ హీరో ను ప్రేమించలేదనీ, జస్ట్ బక్రా గా సెలెక్ట్ చేసుకుందనీ, అయితే అంత కంటే ముదురైన మన హీరో ఆమెను బక్రాను చేయడానికే తాను బక్రాగా నటించాననీ, ఇలా వంశీ తీసిన  ‘అన్వేషణ’ సినిమా చివరలో రాళ్ళ పల్లి అన్ని రహస్యాలు  ఒక్క సారి గా గుక్క తిప్పుకోకుండా చెప్పినట్టు, డైరెక్టర్ మనకు చెప్తాడు- చూసారా నా స్క్రీన్ ప్లే అన్నట్టు. 

          చివరలో సస్పెన్స్ విప్పడానికి ఇదేమీ ‘అన్వేషణ’ లా సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. ‘అన్వేషణ’ లో ఆ సస్పెన్స్ మొదటినుండీ బిల్డ్అప్ అవుతుంది
.

           
చివరి నిమిషం వరకూ ఏదో సోది చెబుతూ, చివరలో వాటికి కారణాలు చెబుతూ, ఇదీ అసలు కథ అని అప్పుడు రివీల్ చేయడం ఒక రకమైన మోసమే. డైరెక్టర్ ఉద్దేశం  ప్రకారం ఇది నాన్న కోసం కొడుకు రివెంజ్ తీర్చుకునే కథ. అయితే ఇది స్ట్రక్చర్ లో లేని సినిమా. అయినా కూడా ‘రన్ రాజా రన్’ సక్సెస్ అయిందంటే దానికి వేరే కారణాలు ఉండొచ్చు. కొంత మంది యువతకు నచ్చే హీరో హీరోయిన్ మధ్య వచ్చే పిచ్చి కామెడీ సీన్లు కావచ్చు , ఇంకొంత మందికి నచ్చే పాచి పోయిన 'మామను తిప్పలు పెట్టే అల్లుడు' కామెడీ సీన్లు కావచ్చు, లేదా శర్వానంద్ తన కుబుసాన్ని విడిచి రవితేజ మాస్కును తొడుక్కుని వేసే వెకిలి వేషాల సీన్లు కావచ్చు, రిలీజ్ అయిన టైమ్ కావచ్చు. ఇంకా అనేకం కావచ్చు. Sujeeth just got away.

       ‘రన్ రాజా రన్’ సినిమా సక్సెస్ అయినందుకు సుజీత్ కు ఆ ఫార్మాట్ పై నమ్మకం పెరిగింది. అందుకే సరిగ్గా అదే ఫార్మాట్ లో ‘సాహో’ రాశాడు. ‘సాహో’ లో కూడా చివరి ఇరవై నిమిషాల వరకూ ఏం జరుగుతుందో తెలీదు. ఇక్కడ స్టార్ హీరో కాబట్టి గూగుల్ జోక్స్ తో వర్క్ అవదు కాబట్టి, యాక్షన్ సీన్స్ తో టైమ్ పాస్ చేశాడు.
        

             ఇంటర్వల్లో హీరోనే దొంగ అని ఒక ట్విస్ట్ (‘రన్ రాజా రన్’ లో హీరో హీరోయిన్ ను కిడ్నాప్ చేసినట్టు). ఇక చివరి ఇరవై నిమిషాల్లో...ఇది నాన్న కోసం కొడుకు రివెంజ్ తీర్చుకునే కథ (రన్ రాజా రన్ లాగా). హీరో చేసే ప్రతీ పని వెనుక పెద్ద ప్లాన్ ఉంది (రన్ రాజా రన్ లాగా). హీరోయిన్ హీరో ను ప్రేమించినట్టు నటించింది బట్ చివరికి ప్రేమలో పడింది (రన్ రాజా రన్ లాగా).  ఇకపోతే  పోలీసే ఒక క్రిమినల్ (రన్ రాజా రన్ లో సంపత్ రాజ్ లాగా). ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చివరి నిమిషాల్లో రివీల్ అయ్యే ట్విస్టులు. ‘లార్గో వించ్’ లైన్ తీసుకుని, ‘రన్ రాజా రన్’ స్క్రిప్ట్ ను మళ్ళీ రాస్తే అయింది ‘సాహో’. Sujeeth got away for the first time but luck won't favour every time.

సి.ఎస్, టాలీవుడ్ 

31, ఆగస్టు 2019, శనివారం

866 : సందేహాలు - సమాధానాలు


Q :  కథ రాస్తున్నామనే భ్రమలో గాథల్ని రాయకుండా, పూర్తి స్పృహతో గాథల్ని రాయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారా? గాథ సినిమాకు పనికిరాదని మీరు చాలాసార్లు చెప్పారు. కానీ గాథల్లో మెజారిటీ ప్లాప్స్ వున్నా, ఫారెస్ట్ గంప్, ప్రేమమ్ లాంటి విజయవంతమైనవి కూడా వున్నాయి కదా. ఒక వేళ మహానటి’ సినిమా బయోపిక్ కాకపోయి వుంటే, అది కూడా గాథ కిందకు వస్తుందా? తెలియజేయగలరు.
ఎపి, AD
A :  ‘మహానటి’ లో చూపించిన సావిత్రి గారి జీవితమంతా గాథే. ఈ గాథకి ‘సిటిజన్ కేన్’  లోని రోజ్ బడ్ ప్లాట్ డివైస్ టైపులో ‘శంకరయ్య ఎవరు?’ అనే జర్నలిస్టుల (సమంత, విజయ్ దేవరకొండ) ఇన్వెస్టిగేషన్ ‘కథ’ తో కవరింగ్ ఇవ్వడంతో, ‘మహానటి’ కి గాథగా ఎదుర్కొనే బాక్సాఫీసు ప్రమాదం తప్పింది. కథంటే స్ట్రక్చర్ కాబట్టి జర్నలిస్టుల ఇన్వెస్టిగేషన్ పార్టుని గమనిస్తే, త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో వుంటుంది. అందులో బిగినింగ్, మిడిల్, ఎండ్ వుంటాయి, ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ వుంటాయి. గోల్ వుంటుంది. సంఘర్షణ వుంటుంది. చివరికి ఫలప్రాప్తీ వుంటుంది. ఇవే సావిత్రి గారి పార్టుకి వుండవు. సావిత్రి గారి పార్టుని గాథగానే చెప్పాలి తప్ప కథగా కుదరదు. అందుకని ఈ గాథని జర్నలిస్టుల కథతో కవరింగ్ ఇచ్చి కాపాడారు. ఇంకోటి గమనిస్తే గాథంతా ఫ్లాష్ బ్యాక్సే, కథ వచ్చేసి వర్తమానం. సమస్య ఎక్కడొస్తోందంటే ఏది స్ట్రక్చర్, ఏది కాదు పట్టుకోవడం దగ్గరే వస్తోంది. జర్నలిస్టుల కథలో ప్లాట్ పాయింట్స్ పట్టుకోండి చూద్దాం. 

          గాథ ఎలా రాయాలో చెప్పలేం. గాథకి స్ట్రక్చర్, శాస్త్రం, నియమాలు లేవు. కథకే వున్నాయి. కాబట్టి గాథలే రాయాలనుకుంటే ఎలా అన్పిస్తే అలా రాసుకోవడమే. బొమ్మ ఆడేదా పోయేదా దైవాధీనం. ఎందుకొచ్చిన బాధ. ఈ కమర్షియల్ సినిమాల కాలంలో ఉదాత్త గాథలకి అభిరుచిగల ప్రేక్షకులేరీ?

          కానీ జరుగుతున్నదేమిటంటే రాస్తున్నది కథలనుకుని గాథలే రాసుకుని తీయడం. స్టార్ సినిమాల్ని కూడా కమర్షియల్ ముసుగేసిన గాథలుగా తీసి ఫ్లాప్ చేసుకోవడం. చాలా కాలం అసలు స్ట్రక్చర్ ని ఎందుకు వ్యతిరేకిస్తారో, ఎందుకు దాన్ని శత్రువులా చూస్తారో అర్ధమయ్యేది కాదు. తర్వాత్తర్వాత అర్ధమవుతూ వచ్చింది. రాసుకునేది కథలనుకుంటూ గాథలు కాబట్టి స్ట్రక్చరంటే అసహ్యమని. నూటికి నూరు పాళ్ళూ వాళ్ళు కరెక్ట్. గాథలకి స్ట్రక్చర్ వుండదుగా. ‘ఇది కథ కాదు గాథ, తర్వాత మీకు తీరని వ్యధ’ అన్నా కూడా కథకీ గాథకీ తేడా కూడా తెలీదు కాబట్టి, ఇంకా పట్టులకి పోయి గాథే  రాసుకోవడం!

      మెజారిటీగా వున్న ఈ వర్గం స్ట్రక్చర్ ని వ్యతిరేకించడం పూర్తి న్యాయం, హక్కు. మనం గౌరవించాల్సిందే. వీళ్ళ తప్పుకాదు. 2000 – 2005 మధ్య వెల్లువెత్తిన మిడిల్ మటాష్ రోమాంటిక్ కామెడీల ట్రెండ్ లో వీళ్ళకెవరో వేసిన జ్ఞాన గుళిక తప్పు. ఆ గుళికే తరం తర్వాత తరానికి  సరఫరా అవుతోంది.

          ఈ వర్గాన్ని పక్కనపెట్టి మాట్లాడుకుంటే, స్ట్రక్చర్ వుండని గాథలకి వివిధ టెక్నిక్స్ తో సపోర్టు నివ్వొచ్చు. ఇది చాలా లోతైన అవగాహనని డిమాండ్ చేసే క్రియేటివ్ ఇంజనీరింగ్. ‘మహానటి’ లో జర్నలిస్టుల కథతో సపోర్టు నిచ్చినట్టు. అన్నిటికీ ఒకే టెక్నిక్ వుండదు. ఆ టెక్నిక్ ఏమిటనేది ఏ గాథకా గాథ చూసి నిర్ణయించాల్సి వుంటుంది. ఇక ‘ఫారెస్ట్ గంప్’ గాథ అని ఎవరన్నారు?  అది కథే. ఆ కథ ఫ్లాష్ బ్యాక్స్ రూపంలో వచ్చి పోతూంటుంది. ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ కథ చెబుతున్న హీరోతో వర్తమానంలో గాథ వుంటుంది. ‘మహానటి’ కి రివర్స్ అన్నమాట. ‘మహానటి’ లో ఫ్లాష్ బ్యాక్స్ తో వున్నగాథకి వర్తమానంలో కథతో సపోర్టునిచ్చారు, అదే ‘ఫారెస్ట్ గంప్’ లో కథని ఫ్లాష్ బ్యాక్స్ తో సపోర్టుగా పెట్టి, వర్తమానంలో గాథ చెప్పారు. ఇవి చూస్తూంటే కథని సపోర్టుగా పెట్టక పోతే గాథ నిలబడదేమో నన్పించక మానదు.

          ఫారెస్ట్ గంప్’ ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్స్ లో, ‘నీకు ప్రేమంటే తెలీదు, నన్నిక కలవకు’ అని హీరోయిన్ వెళ్ళిపోవడం. సిడ్ ఫీల్డ్ లెక్కల్లో పించ్ పాయింట్ వన్ వచ్చేసి, హీరోయిన్ కి రాసిన ఉత్తరాలన్నీ ఆమె అడ్రసులో లేకపోవడంతో తిరిగి రావడం. మిడ్ పాయింట్ వచ్చేసి, హీరోయిన్ తనని టార్చర్ పెట్టే బాయ్ ఫ్రెండ్ తోనే తిరగడం, ‘నేనెప్పటికీ నీ దాన్నే ఫారెస్ట్’  అని హీరోతో అనడం.

          ఇక పించ్ పాయింట్ టూ- చనిపోయిన ఫ్రెండ్ కిచ్చిన మాట ప్రకారం హీరో ఫిషింగ్ బోటు కొనుక్కోవడం, ప్లాట్ పాయింట్ టూ - ఫిషింగ్ తో డబ్బు సంపాదిస్తూ వుండగా మదర్ చనిపోవడం. మదర్ లేక, హీరోయిన్ లేక పిచ్చి పట్టిన వాడిలా తిరగడం.

          ఇక క్లయిమాక్స్ చూస్తే, ఆఖరికి హీరోయిన్ తనే పిలుస్తుంది హీరోని రమ్మని. వెళ్తే వాళ్ళకి పుట్టిన కొడుకుతో మరణశయ్యపై వుంటుంది. పెళ్లి చేసుకోమంటుంది. చేసుకుంటాడు. కన్ను మూస్తుంది...వాళ్ళ మధ్య కథకి కాన్ఫ్లిక్ట్ ఇలా ముగుస్తుంది. అంటే ఫ్లాష్ బ్యాక్స్ లో వున్న కథ, వర్తమానంలో నడుస్తున్న గాథ లోకి ప్రవహించి ముగిసిందన్నమాట. ఇలా కథా గాథా రెండూ 
ఐక్యమైపోయాయి.

      గాథల్లో హీరోకి గోల్ వుండదు. వాడొక సినిమా వ్యాపారానికి పనికి రాని శుద్ధ వేస్టు పాసివ్ క్యారక్టర్. వాడికి మంచైనా చెడైనా విధివశాత్తే జరుగుతాయి. ప్రయత్నపూర్వకంగా జరగవు. కర్మ చేయడు. అదృష్టాన్ని విధికి వదిలేస్తాడు. నిన్న ‘సంచిక’ వెబ్ సైట్ కోసం ‘ఆదిశంకరాచార్య’ సంస్కృత మూవీ చూస్తూంటే, అందులో శంకరాచార్య, ‘కర్మ చేయడం వ్యర్థం, జ్ఞానాన్ని పొందాక’ అంటాడు. మన కర్మ చేయని పాసివ్ క్యారక్టరేమో జ్ఞానాన్ని కూడా పొందడు. లేజీ ఫెలో. అందుకని వాడికోసం, అంటే వాడు పట్టించుకోని వాడి గాథ కోసం, మనమే ఒక డ్రమెటిక్ క్వశ్చన్ ని ఏర్పాటు చేయాలంటారు నిపుణులు. ఆ డ్రమెటిక్ క్వశ్చన్ ప్రేక్షకులకి తెలిసేలా చేస్తే, దాని కోసమైనా స్ట్రక్చర్ లేని, గోల్ వుండని గాథని చూస్తారు ప్రేక్షకులు. అంటే ‘ఫారెస్ట్ గంప్’ లో చూస్తే, ఆ హీరో హీరోయిన్ని పొందుతాడా లేదా అన్నదే డ్రమెటిక్ క్వశ్చన్ అవుతుంది. 

          పూర్వం ‘పెదరాయుడు’ అతి పెద్ద హిట్టయిన గాథ. తమిళ రీమేక్. ఆ గాథకి ‘సోల్’ ఆయువు పట్టు, టెక్నిక్, క్రియేటివ్ ఇంజనీరింగ్ వగైరా. ఈ ‘సోల్’ చెదరకుండా దర్శకుడు రవిరాజా పినిశెట్టి జాగ్రత్తగా తెలుగు ప్రేక్షకులకి అందించి పరవశింపజేశారు. ఇప్పుడు ‘సోల్’ నెవరు పట్టించుకుంటారు. గిట్టుబాటు ధరకి హోల్ సేల్ గా బయ్యర్లకి అంటగట్టడమే.

          ‘ప్రేమం’ గాథగా హిట్టయిందంటే దానికో క్రియేటివ్ ఇంజనీరింగ్ వుంటుంది. ఆ క్రియేటివ్ ఇంజనీరింగ్ యూత్ అప్పీల్ తో కావచ్చు, తెలుగులోలేని, మలయాళంలో వున్న నేటివిటీతో కావొచ్చు. మలయాళంలో నేటివిటీ ఎంతబలంగా  వుందంటే, సినిమాలో చూపించిన వూళ్ళో హీరోహీరోయిన్లు ప్రేమలో పడ్డ చోటు టూరిస్టు కేంద్రమైపోయింది. బస్సులు కట్టుకుని స్టూడెంట్స్ వెళ్లి చూసొచ్చేంత లాండ్ మార్క్ అయింది. ఇది తెలుగులో సాధ్యమైందా ఎప్పుడైనా?

          అందుకని వర్ధమాన రచయితలకీ, దర్శకులకీ రాబర్ట్ మెక్ కీ ఒకటే మాట చెప్తాడు- మామూలు కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకోనంత వరకూ కళాత్మక సినిమాల జోలికి పోవద్దని. గాథలు కళాత్మకతనే డిమాండ్ చేస్తాయి. పుట్టు కళాత్మకత వుంటే ప్రయత్నించ వచ్చు. పెట్టు కళాత్మకతకి టైం తీసుకుని ట్రైనింగు పొందాలి. తొందరపడి నిర్మాతల్ని పట్టి పల్లార్చకూడదు.
  
 Q :  ‘పెళ్ళి సందడి’ ప్లాట్ పాయింట్స్, రివ్యూ చెప్తారా?
ఎన్, కన్నయ్య, రైటర్

A :  
       అన్ని సినిమాల ప్లాట్ పాయింట్స్ గుర్తుండవు. మీరా సినిమా కథ చెప్తే ప్లాట్ పాయింట్స్ ఎక్కడున్నాయో చెప్పొచ్చు. వికీపీడియాలో కథ వుంటే చెప్పొచ్చు. ‘పెళ్లి సందడి’ ని అప్పట్లో విజయవాడలో, వరంగల్లో రెండు సార్లు చూశాం. అప్పట్లో స్ట్రక్చర్ తెలీని అమాయకులం. 2000 లో వృత్తికి అవసరమేర్పడి సిడ్ ఫీల్డ్ ని చదువుతున్నాకే తెలిసింది. మీరు ప్లాట్ పాయింట్స్ అంటూ టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ‘పెళ్లి సందడి’ చూసిన మీకు ప్లాట్ పాయింట్స్ ఎక్కడున్నాయో తెలిసి పోయే వుండాలి. అయితే అత్యధికులు ప్లాట్ పాయింట్స్ చెప్పలేని పరిస్థితిలో వుంటున్నారు. తాజాగా చూసిన  ‘సాహో’ ప్లాట్ పాయింట్స్ చెప్పమంటే చెప్పలేరు. ప్లాట్ పాయింట్స్ ని ఎలా గుర్తించాలో అస్సలు తెలుసుకోవడం లేదు. వాళ్ళు రాసుకుంటున్న కథల్లోనే  ప్లాట్ పాయింట్స్ కాదు కదా, కాన్ఫ్లిక్ట్ ఏమిటో చెప్పమంటే కూడా చెప్పలేకపోతున్నారు. ఇంకెందుకు తెలుసుకోవడం. స్క్రీన్ ప్లే వ్యాసాలు చదవడం. ‘పెళ్ళి సందడి’ ప్లాట్ పాయింట్స్ తెలుసుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం. అసలంటూ కథ ఎలా డెవలప్ అయి, ఏ ఘట్టంలో, ఏఏ అంశాలతో ప్లాట్ పాయింట్స్ ఏర్పడతాయో సాంకేతికాల్ని అర్ధంజేసుకోగల్గాలిగా. కాబట్టి ఇవన్నీ పక్కనబెట్టి, అలవాటుగా ఎలా రాసుకుంటున్నారో అలాగే రాసుకుని తీసుకుంటే సరిపోతుంది, నాలెడ్జి అంటూ సమయం వృధా చేసుకోకుండా.


సికిందర్