రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, సెప్టెంబర్ 2019, సోమవారం

868 : 'పాలపిట్ట' ఆర్టికల్


          విగా, రచయితగా, అనువాదకునిగా, సినీ విశ్లేషకునిగా బహుముఖ ప్రజ్ఞని ప్రదర్శించే అరుదైన సృజనశీలి మామిడి హరికృష్ణ. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఆయన నిర్వహిస్తున్న పాత్ర విలక్షణమైనది. విభిన్న రంగాలలో తనదైన ముద్ర వేసిన హరికృష్ణ సృజనశీలత్వాన్ని, విశిష్టతని ప్రతిఫలించే స్పెషల్ ఇష్యూ ఇది. మామిడి హరికృష్ణ తో ప్రముఖ రచయిత కస్తూరి మురళి కృష్ణ చేసిన ఇంటర్వ్యూ తో పాటు హరికృష్ణ మూర్తిమత్వాన్ని వ్యక్తం చేసే వ్యాసాల, అభిప్రాయాల సమాహారం ఈ ‘పాలపిట్ట’ సంచిక. డజన్ కు పైగా వ్యాసాలు, కవితలు హరికృష్ణ క్రియేటివ్ నేచర్ ని తెలియజేస్తాయి. హరికృష్ణ ప్రయాణం లోని అనేక కోణాలు ఈ సంచిక లో చూడవచ్చు. కవిగా హరికృష్ణ ప్రత్యేకత లను సిద్ధార్థ, ఎం.నారాయణ శర్మ చెప్పారు. సినిమాలపై హరికృష్ణ కు ఉన్న సాధికారిక పట్టును సికిందర్ చెప్పిన తీరు ఆకర్షణీయం. అందరికి తెలిసినట్టే కనిపించే హరికృష్ణ లోని తెలియని ఆర్ద్రమైన కోణాలు ఎన్నో ఈ ‘పాలపిట్ట’ సంచిక పాఠకుల ముందుకు తెచ్చింది. ఇందుకు సహకరించిన రచయతలకు, ముఖ్యంగా అక్షర కుమార్ కు, ఇతర మిత్రులకు ధన్యవాదాలుఅభినందనలు.
కె.పి. అశోక్ కుమార్
వర్కింగ్ ఎడిటర్, ‘పాలపిట్ట’ మాసపత్రిక
 
          తెలుగు సినిమా విమర్శకుడు, చరిత్ర కారుడు మామిడి హరికృష్ణ పేరు తెలియని వారు వుండరు. వివిధ పత్రికల్లో విరివిగా ఆయన సినిమా వ్యాసాలు రాసి పేరు గడించారు. సినిమా విమర్శకుడుగా రెండు సార్లు నంది అవార్డులు పొందారు.  హాలీవుడ్ నుంచీ బాలీవుడ్, టాలీవుడ్, ప్రాంతీయ సినిమాల దాకా గొప్ప జ్ఞానసంపద వున్న వ్యాసకర్తగా ఖ్యాతి సంపాదించారు. ఈ నాల్గు సినీరంగాలపై ఆయన రాసిన వ్యాసాలు తగినంత సమాచారాన్ని అందిస్తాయి. ఆయన స్పృశించని అంశమంటూ లేదు. సినిమా  పుట్టిందగ్గర్నుంచి,  ఏ స్థాయికి చేరిందనేవరకూ ఒక నిఘంటువులా వ్యాసపరంపర సాగించారు. ఈ వ్యాస సంపదని సినిమా కళ శాస్త్ర సాంకేతిక విషయ అధ్యయన దృష్టితో కాకుండా, విస్తృత ఉపరితల సమాచారాన్నందించే డేటా బ్యాంకుగా అందుబాటులో వుంచారు. సగటు సినిమా పాఠకుల్ని అలరించే విశేషాలు  ఆయన విషయ సేకరణకి ప్రధానంగా వున్నాయి.

          2013 వరకూ విరివిగా సినిమా వ్యాసాలు రాస్తూ పోయారు. ఆ తర్వాత సినిమా వ్యాసాలు గానీ, తెలుగు సినిమా సమీక్షలు గానీ రాసినట్టు లేదు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడుగా తీరిక లేని బాధ్యతల వల్ల ఇది కుదరక పోవచ్చు. అయితే రవీంద్ర భారతి కేంద్రంగా ఆయన భావి సినిమా కళాకారుల్ని తీర్చిదిద్దే వివిధ కార్యక్రమాలు నిర్విహిస్తూ బిజీగానే వుంటున్నారు.

          ఆంధ్రభూమి సినిమా పేజీ వెన్నెలలో హరికృష్ణ రాయడం ప్రారంభించి ఇతర పత్రికలకి విస్తరించారు. దేశంలో సినిమా ఆవిర్భావానికి అద్యులైన దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య నాయుడు, జెసీ డేనియల్ నాడార్ ల గురించి ఇంకా  జీవిత చరిత్రలు  రాయడం, పరిచయం చేయడం అవసరం లేదు. ఈ ముగ్గురిపై వివిధ భాషల్లో కొన్నేళ్లుగా అనేక కథనాలు వచ్చేశాయి. సినిమా చరిత్రకారుడిగా హరికృష్ణ తనూ రాసి కొత్తగా తెలిపేదేమీ వుండదు. అందుకని ఈ ముగ్గురి జీవితాలాధారంగా నిర్మించిన మూడు బయోపిక్స్ ని పాఠకుల ముందుంచారు. ఇంతకాలం వివిధ వ్యాసాలతో ఈ ముగ్గురు సినీ పితామహుల్ని స్మరించుకుంటూనే వున్నాం. బయోపిక్స్ తో స్మరించుకోవడం ఒకెత్తు. దాదా ఫాల్కే హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’ (మరాఠీ), ‘రఘుపతి వెంకయ్య’ (తెలుగు), ‘సెల్యూలాయిడ్’ (మలయాళం) అనే మూడు బయోపిక్స్ విశేషాలు తెలియజేశారు. అయితే దక్షిణ దేశంలో తొలి సినిమా నిర్మించింది రంగస్వామి నటరాజ మొదలియార్. ఈయన 1918 లోనే తమిళంలో కీచక వధమ్నిర్మించాడు. ఈయన బయోపిక్ లేకపోయినా ఈయన గురించి ప్రస్తావించి ఉండాల్సింది. దక్షిణాది చిత్రంఅనే వేరే వ్యాసంలో మొదలియార్ గురించి రాశారు.  ఇక రఘుపతి వెంకయ్య అనకుండా, రఘుపతి వెంకయ్య నాయుడు అని పూర్తి పేరు రాయాల్సింది. 

        పునర్జన్మల మీద వచ్చిన సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు, కాపీ సంస్కృతి, సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు, వివిధ అవార్డులు, చలన చిత్రోత్సవాలు, ఆస్కార్ అవార్డుల చరిత్ర, ఆస్కార్ అవార్డులు సాధించిన సినిమాల జాబితా, ఆస్కార్ అవార్డులకి పోటీ పడ్డ భారతీయ సినిమాలు, దేవానంద్ నట జీవితం, తెలుగు సినిమా టైటిల్స్, తెలుగు సినిమాల్లో ఊతపదాలు, రామాయణం మీద తీసిన సినిమాలు, తెలంగాణా సినిమాలు, ప్రపంచంలో తొలి బయోపిక్, హిందీ సినిమాల్లో మాండలికం, యశ్  చోప్రా నిర్మించిన చిత్రాలు, బాలల చిత్రాలు, చిత్రోత్సవాలు, బాలీవుడ్ కథా వస్తువులు, మాస్ సినిమా లక్షణాలు, సినిమాలపై సామాజిక ఉద్రిక్తల ప్రభావం, ప్రాంతీయ సినిమాలు ...ఇలా ఒకటనేమిటి, వీలైనన్నిఅంశాలపై విస్తృతంగా, విపులంగా రాశారు. 

          రిఫరెన్స్ కోసం ఆయన వ్యాసాలు చక్కగా ఉపయోగపడతాయి. ఈ వ్యాసాల్లో ఆయనలోని విమర్శకుడు కన్నా చరిత్రకారుడే కన్పిస్తాడు. విషయాన్ని పరిచయం చేయడం వరకే ఈ వ్యాసాల ఉద్దేశంగా కనబడుతుంది. విమర్శనాత్మక దృష్టితో వాటి లోతైన విశ్లేషణ కన్నా, తులనాత్మక విశ్లేషణ కొంత కన్పిస్తుంది. రెండు మూడు భాషల్లో వచ్చిన పునర్జన్మల సినిమాలని పోల్చడం, జేమ్స్ బాండ్  సినిమాలని పోల్చడం వగైరా. 

          పునర్జన్మల సినిమాలకి సంబంధించి ఇవెందుకు హిట్ ఫార్ములా అయ్యాయో మనోవిశ్లేషణ చేశారు. పునర్జన్మలు ఒక నమ్మకం కాదనీ వాటిని శాస్త్రీయంగా నిరూపించేందుకు పారాసైకాలజీ, జెనెటిక్స్, బయోకెమిస్ట్రీ తదితర రంగాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయనీ వివరించారు. ఇవే కాక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే టెక్నిక్ తో ఇప్పటికిప్పుడు మనిషిని గత జన్మలోకి తీసికెళ్ళే నిపుణుడుగా డాక్టర్ బ్రియాన్ వీస్ వున్న విషయం మనకి తెలిసిందే. అయితే కొన్ని నమ్మకాలకి ప్రేక్షకులకి నిరూపణలతో నిమిత్తముండదేమో. దేవుళ్ళతో భక్తి సినిమాలు, దెయ్యాలతో హార్రర్ సినిమాలూ ఎలా చూస్తారో పునర్జన్మ సినిమాలూ అంతే. వీటి నాటకీయ విలువలే, పలాయన వాద చిత్రణలే ప్రేక్షకులకి సత్కాలక్షేప వినోద సాధనాలవుతున్నాయేమో ఆలోచించాలి.

 
          ఇక్కడ వ్యాసకర్త ఇచ్చిన శాస్త్రీయ సమాచారం విలువైనదే. అయితే పాఠకులు క్షమిస్తే, కొంత బేసిక్ సినిమా శాస్త్రాన్ని ఇక్కడ జోడించడం అవశ్యం కావచ్చు. క్లుప్తంగా చెప్పుకుంటే, వెండితెర మీద సినిమా ప్రదర్శనంటే ఏమిటి? ప్రేక్షకుల మానసిక లోకాన్ని ఆవిష్కరించడమే. ప్రేక్షకుల కాన్షస్ మైండ్ తో వాళ్ళ సబ్ కాన్షస్ మైండ్ కి లడాయి పెట్టడమే. దీన్నే కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లే అన్నారు. చిన్మయానంద స్వామి ప్రకారం కురుక్షేత్రం ఎక్కడో జరగలేదు. మనిషి మస్తిష్కంలోనే నూరు మంది కౌరవులనే నెగెటివ్ భావాలతో, ఐదు మంది పాండవులనే పాజిటివ్ ఫీలింగ్స్ జరిపే నిత్య సంఘర్షణే మనిషి మానసిక లోకంలో జరిగే కురుక్షేత్రం. పురాణాలన్నీ సైకో ఎనాలిసిస్ లే. మనసు గురించి చెప్పేవే. ఈ విశ్వమే దేవుడి మనసు. మనస్సు తప్ప ఇంకేమీ లేదు ఎక్కడా. దురదృష్టవశాత్తూ మనసే మనిషికి శత్రువైంది. ఈ మనస్సుని మధించడమే వెండితెర మీద సినిమా చేసే పని.


          పైన చెప్పుకున్న లడాయికి  ప్రేక్షకుల ఇగో కథానాయకుడుగా వుంటుంది. ఇతర పాత్రలు ప్రేక్షకుల వివిధ భావోద్వేగాలకి ప్రతిరూపాలుగా వుంటాయి. సినిమా కథంటే ఏమిటి? అన్న ప్రశ్న వేసుకుని,  ఇరవై ఏళ్ళూ అజ్ఞాతంలో కెళ్ళిపోయి పరిశోధన చేసిన స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ కనుగొన్న వాస్తవాలివి. ఇలా గొప్ప సినిమాలు కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేగానే ఉంటున్నాయని తేల్చాడు. లేనివి మామూలు సినిమాలుగా మిగిలిపోతున్నాయన్నాడు. అంతరాత్మ (సబ్ కాన్షస్ మైండ్) తో కాన్షస్ ఇగో  జరిపే పోరాటమే సినిమా కథ అన్నాడు. ఈ పోరాటంలో జీవిత సత్యాలు తెలుసుకున్న ఇగో, చివరాఖరికి  మెచ్యూర్డ్ ఇగోగా ఉన్నతిని పొందుతుందన్నాడు. ఇగోని ఏం చేసీ చంపడం సాధ్యం కాదు గనుక, దాన్ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుని బాగుపడ్డమే చేయగల్గింది. దీన్నే గొప్ప సినిమాలు చిత్రిస్తాయన్నాడు. ఈ బేసిక్ సినిమా సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు, ప్రేక్షకుల అన్ని నమ్మకాలూ, మూఢనమ్మకాలూ వగైరా మనోఫలకాలన్నీ  వెండి తెరమీద ఈ చట్రంలోకే వచ్చేసి నర్తిస్తాయి. జేమ్స్ బానెట్ ప్రసిద్ధ గ్రంధం ‘Stealing Fire from the Gods’ సారాంశమిది.



బాండ్ డిటెక్టివ్?
          జేమ్స్ బాండ్ సినిమాల గురించి ఎక్కువ సమాచారమిచ్చారు. జేమ్స్ బాండ్ ని సృష్టించిన రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ గురించి రాశారు. జేమ్స్ బాండ్ పాత్ర ఎలా పుట్టిందీ రాశారు. అయితే ఇది డిటెక్టివ్ జానర్  అన్నట్టుగా రాశారు. జేమ్స్ బాండ్  డిటెక్టివ్ నవలా సాహిత్యంలో ఎంత సంచలనం సృష్టించాడో, స్పై  థ్రిల్లర్ సినిమాలతో కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేశాడుఅనడం సరి కాదేమో. జేమ్స్ బాండ్ ది డిటెక్టివ్ నవలా సాహిత్యంకాక,  స్పై గూఢచార సాహిత్యమే. డిటెక్టివ్ పాత్ర  స్థానికంగా నేర పరిశోధన చేస్తే, స్పై లేదా గూఢచారి పాత్ర విదేశాల్లో రహస్య కార్యకలాపాలు సాగిస్తాడనేది జగమెరిగిన సత్యం. వృత్తుల్లో ఈ తేడా వుంది. జేమ్స్ బాండ్ ఈ రెండో కోవకి చెందిన వాడు. సత్యజిత్ రే సృష్టించిన ఫెలూదా పాత్ర జేమ్స్ బాండ్ పాత్ర అనడం కూడా సరికాదేమో. అది పక్కా డిటెక్టివ్ పాత్రే. అలాగే జంధ్యాల తీసిన చంటబ్బాయ్లో చిరంజీవి ప్రైవేట్ డిటెక్టివే తప్ప, జేమ్స్ బాండ్ పాత్ర కాదు. హాస్యం కోసం, ప్రేక్షకులకి అర్ధం అవడం కోసం ఆ పాత్ర జేమ్స్ పాండ్అని పలుకుతుంది. పాత్రపేరు పాండు రంగా రావు అయినందుకు. ఇక రాజ్ కపూర్ నటించిన జాసూస్’, ‘దో జాసూస్లు కూడా బాండ్ సినిమాలు / పాత్రలు కావు, అవి డిటెక్టివ్ సినిమాలే, డిటెక్టివ్ పాత్రలే. జాసూస్ అంటేనే పత్తేదారు లేదా డిటెక్టివ్ అని అర్ధం. జేమ్స్ బాండ్ స్పై జానర్ గురించిన వ్యాసంలో, డిటెక్టివ్ జానర్ సినిమాలని స్పై జానర్ కింద పేర్కొంటూ కలిపి రాసేశారు.  తెలుగులో డిటెక్టివ్ యుగంధర్ సృష్టికర్త కొమ్మూరి సాంబశివరావు, షాడో సృష్టికర్త మధుబాబు, జేమ్స్ బాండ్ స్ఫూర్తితో రాయడం మొదలెట్టినట్టు తెలియజేశారు. కానీ జేమ్స్ బాండ్ పుట్టక ముందే యుగంధర్ పాత్రని సృష్టించి నవలలు రాయడం మొదలెట్టారు కొమ్మూరి. మధు బాబు షాడో పాత్ర మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేస్తూ, తెలుగు డిటెక్టివ్ సాహిత్యాన్ని అటకెక్కిస్తూ, ఆధునికంగా పుట్టిన స్పై పాత్ర. దీనికి జేమ్స్ బాండ్ స్ఫూర్తి కాదు. కొమ్మూరి సాంబశివరావు పేరుని సాంబశివరావు అనకుండా, కొమ్మూరి సాంబశివరావు అని పూర్తి  పేరు రాసివుంటే గౌరవంగా వుండేది.


          ఇక తెలుగులో మొదటి జేమ్స్ బాండ్ సినిమా హీరో కృష్ణ నటించిన గూఢచారి 116’  అన్నారు కానీ దర్శకుడు కెఎస్ఆర్ దాస్ కాదు, ఎం మల్లిఖార్జునరావు. ఆ తర్వాత హీరో కృష్ణ 1978 లో జేమ్స్ బాండ్ గా ఏజెంట్ గోపీలో నటించారన్నారు. కానీ గూఢచారి 116తర్వాత జేమ్స్ బాండ్ 777లో, ‘ఏజెంట్ గోపీతర్వాత మరో రెండు బాండ్ సినిమాలు రహస్య గూఢచారి’, ‘గూఢ చారి 117లలో నటించారు హీరో కృష్ణ. ఇన్ని బాండ్ సినిమాల్లో నటించినందుకే ఆయన ఆంధ్రా జేమ్స్ బాండ్ అయ్యారు. చిరంజీవి నటించిన బాండ్ సినిమాల్ని పేర్కొనడం బావుంది గానీ, కృష్ణం రాజు నటించిన అందడు ఆగడుకూడా పేర్కొని వుండాల్సింది.


          ఇక రామాయణ సినిమాల విషయానికొస్తే ఇవి ఎన్ని రకాలుగా వచ్చాయో వర్గాలుగా విభజించి చక్కగా పేర్కొన్నారు. ఇంకా ఈ జాబితాలో  ఇంద్రజిత్, పాదుకా పట్టాభిషేకంతో బాటు బాపు దర్శకత్వంలో సీతాకళ్యాణంకూడా చేర్చాలి. 1972 లో బాపు దర్శకత్వంలో శోభన్ బాబు, చంద్రకళ జంటగా ఓ సినిమా వచ్చిందన్నారు. అ సినిమా పేరు సంపూర్ణ రామాయణంఅని రాయాల్సింది.

మాండలికం ముచ్చట్లు
          హిందీలో ఎన్ని మాండలికాలున్నాయో (12) వాటి గురించి వివరంగా సేకరించి తెలియజేశారు. ఈ మాండలికాలు ప్రధాన స్రవంతి హిందీ సినిమాల్లోకి ఎలా ప్రవేశించాయో విపులంగా రాశారు. ఈ మాండలిక వాడకం1961 లో  గంగా జమునతో ప్రారంభమై,  ఆ తర్వాత 1970 లలో రివెంజి సినిమాల వెల్లువలో కొట్టుకు పోయి2000 లలో ప్రకాష్ ఝా, విశాల్ భరద్వాజ్ తదితర దర్శకులతో తిరిగి మాండలిక ప్రయోగాలు  జరుగుతున్నట్టు చెప్పుకొచ్చారు.  కానీ 1970 లలో హిందీ బందిపోటు సినిమాల వెల్లువలో మాండలికం బాగానే వెల్లివిరిసింది. ఇక 1975 లో షోలేలో గబ్బర్ సింగ్ మాట్లాడిన ఖరీబోలీ యాస గురించి చెప్పాల్సిన పనిలేదు.

          తెలుగు సినిమా టైటిల్స్ పరిణామ క్రమం గురించి, తెలుగు సినిమాల్లో సంభాషణల చమత్కారం గురించీ, ఊత పదాల గురించీ పాతాళ భైరవిదగ్గర్నుంచీ కొన్ని  సినిమాలని సరదాగా ఉదహరించారు. ముత్యాల ముగ్గులో రావుగోపాల రావు పొడవైన డైలాగుల గురించి రాశారు గానీ, ‘అలోవలోవలోఅనే ఊతపదం, ‘యాభైలో సగం పన్నెండున్నరఅనే బాగా పేలిన డైలాగు కూడా వున్నాయి.

          సినిమా కథలు ఎన్ని రకలుగా కాపీ చేస్తారో ఒక జనరల్ వ్యాసం రాశారు. ఇది రాసే నాటికే బాలీవుడ్ లో  హాలీవుడ్ కంపెనీలు శాఖలు ఏర్పాటు చేసుకుని, హాలీవుడ్ నుంచి కాపీ కొడుతున్న నిర్మాతలకి నోటీసులు పంపడం ప్రారంభించడంతో అప్రమత్తమై, బాలీవుడ్ లో కాపీలు  కొట్టడం మానేశారు. ఈ కొసమెరుపు రాసి ఉండాల్సింది. ఇక స్వామీ రారాఅనే మొదటి సినిమా తీసిన దర్శకుడు సుధీర్ వర్మ,  ‘నాకు నచ్చిన సినిమాలన్నిటినీ కాపీ కొడతానుఅని టైటిల్స్ కి ముందు వేశారని పేర్కొన్నారు. నిజానికి ఈ లైను కూడా దర్శకుడు కాపీ కొట్టిందే. స్వామీరారాని హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరాంటినో తీసిన కల్ట్ ఫిలిం పల్ప్ ఫిక్షన్కి ప్రభావితుడై తీశాడు. క్వెంటిన్ టరాంటినో  ప్రసిద్ధ కొటేషన్ ఒకటుంది - 
“I steal from every single movie ever made. అని. దీన్ని కాపీ కొట్టి తెలుగులో తన కొటేషనుగా వేసుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత ఈ దర్శకుడు కనిపించడం మానేశాడు. టరాంటినోలా కాపీ కొడతానని గొప్పగా చెప్పుకోవాలంటే తనూ టరాంటినో స్థాయికి ఎదిగితేనే కదా - ఫర్వా లేదనుకుని ధైర్యం చేసి నిర్మాతలు సినిమాలిస్తారు. ఓవరాక్షన్ చేస్తే ఇలాగే వుంటుంది.

          హిందీ సినిమాలు ఎలా మార్పు చెందుతూ వచ్చాయో పేర్కొన్న వ్యాసంలో, అమితాబ్ బచ్చన్ కెరీర్ గ్రాఫ్ తలకిందులుగా వుంది.  “ ‘షోలే’ (1975) తో మొదలైన అమితాబ్ జైత్ర యాత్ర,  ‘జంజీర్’, ‘దీవార్లతో దూసు కెళ్ళి... అంటూ రాసు కొచ్చారు. నిజానికి జంజీర్’ (1973) తో మొదలైన అమితాబ్ జైత్ర యాత్ర, ‘మజ్బూర్’ (1974), ‘దీవార్’ (1975), షోలే (1975) లతో దూసుకెళ్లింది...అని వుండాలి.


సాంఘిక సంక్షోభాల్లో విజయాలు 

          సమాజం సంక్షుభితంగా వున్నప్పుడు సినిమాలు విజయాలు సాధిస్తాయని సూత్రీకరణ చేశారు. దూకుడుసినిమా ఘనవిజయం సాధించడానికి ఆ సమయంలో తెలంగాణా ఉద్యమంతో సంక్షుభిత వాతావరణం  ఏర్పడడం కారణమే తప్ప మరొకటి కాదన్నారు. అలాటి  సంక్షోభ సమయాల్లో మనిషి ఎలాటి  మానసిక స్థితికి లోనవుతాడో మానసిక శాస్త్ర ఆధారాలు చూపారు. ఉద్యమాలు భావోద్వేగాలతో వుంటాయి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో కూడిన భావోద్వేగాల తెలంగాణా ఉద్యమ సమయంలో, ఆంధ్రా సినిమాకి తెలంగాణాలో కూడా ఘనవిజయం లభించిందంటే, తెలంగాణా భావోద్వేగాలు పనిచేయకుండా వుండాలి. వ్యాసకర్త వివరించిన వ్యక్తిగత భావోద్రేకాలు తోడ్పడి వుండాలి. అంటే తెలంగాణా ప్రేక్షకులు తెలంగాణా ఉద్యమంతో విసిగి వేసారి వుండాలి. ఈ విసుగుతో సినిమాని విజయవంతం చేసి ఉపశమనం పొంది వుండాలి.

          ఇదే ఉద్యమం తీవ్రంగా వున్న  సమయంలో నితిన్ నటించిన సీతా రాముల కళ్యాణం- లంకలో’  విడుదలైప్పుడు, ఆంధ్రా ప్రాంత విద్యార్థులు తెలంగాణా సోదరుడి సినిమాని ఆహ్వానిద్దాంఅని థియేటర్ల దగ్గర ప్రేక్షకులకి గులాబీలు పంచారు. అయినా ఆ సినిమా ఆడలేదు. 1969 తెలంగాణా ఉద్యమ కాలంలో,  కృష్ణ - విజయనిర్మల నటంచిన లవ్ ఇన్ ఆంధ్రవిడుదలైతే ఆంధ్రాలోనే అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ దృష్టాంతాల రీత్యా వ్యాసకర్త సూత్రీకరణ సంతృప్తికరంగా అన్పించడం లేదు.

          ఇకపోతే తెలంగాణా సినిమాలు ఎన్నిరకాలుగా వున్నాయో వర్గీకరణ చేసి, ఆ ఎనిమిది రకాల సినిమాల్ని పేర్కొన్నారు. అ యితే ఓ రెండు సినిమాలకి తప్ప,  మిగతా  వాటిలో కూడా నటీనటులెవరో పేర్కొనలేదు. పేర్కొని వుంటే సమాచారం సమగ్రంగా వుండేది.

          ఇలా విభిన్న అంశాలపై తన సునిశిత దృష్టిని సారించారు వ్యాసకర్త. ఈ వ్యాసాలు చదివితే సినిమా జర్నలిస్టుగా ఆయన పరిపూర్ణంగా అర్ధమవుతారు. అయితే అవసరమైన చోటల్లా సంబంధిత సినిమా నిపుణుల్ని సంప్రదించి, వారి అభిప్రాయాలని కూడ జతపర్చి వుంటే ఆయన  జర్నలిజం మరింత ప్రకాశించేది. ఈ వ్యాసాలు 2013 వరకూ రాసినవి. ఇన్నేళ్ళ విరామం తర్వాత వీటిని పుస్తకంగా వేయాలంటే, కొత్త సమాచారంతో  అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా  వుంది.

సికిందర్
(‘పాలపిట్ట’, మే 2019 సంచిక) 


867 : స్క్రీన్ ప్లే సంగతులు -1


  (‘సాహో’ లైన్ ‘లార్గో వించ్’ నుంచి కాపీ అని వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కొందరు టాలీవుడ్ మిత్రులు ‘సాహో’ లో ఎండ్ సస్పెన్ తో మిడిల్ మటాష్  స్క్రీన్ ప్లే చేశారని ఫోన్లు చేసి చెప్పేస్తున్నారు. తాజాగా సిఎస్ అనే ఇంకో మిత్రుడు, ఇంకో అడుగు ముందుకేస్తూ రీసెర్చి చేసి, అసలు ‘సాహో’ స్క్రీన్ ప్లే, కథనం ఇదే దర్శకుడు తీసిన తొలి మూవీ, ‘రన్ రాజా రన్’ నుంచే దించేశాడని విశ్లేషణ రాసి పంపారు. ‘రన్ రాజా రన్’ లోని రోమాన్సు, ‘సాహో’లో యాక్షన్ గా ఎలా మారిందో వివరించారు. ఇంకా ‘రన్ రాజా రన్’ లోని పాత్రలే, వాటితో వున్న కథనాలే  ‘సాహో’ లో ఎలా మార్చి తీశాడో చెప్పారు. ఈ విశ్లేషణ చదవండి. చివర ‘రన్ రాజా  రన్’ కి అప్పట్లో పోస్టు చేసిన బ్లాగు రివ్యూ లింక్ ఇచ్చాం, అది కూడా చదవండి)

         న్ రాజా రన్సినిమానే మళ్ళీ  ‘సాహో’ గా తీసిన సుజీత్. అదేంటి? ‘లార్గో వించ్’ నుండి ‘సాహో’ కు లైన్ తీసుకున్నారని అంటున్నారే?  మరి 'రన్ రాజా రన్' కు పోలిక ఏమిటి? ఎందుకో చూద్దాం...

          న్ రాజా రన్' సినిమాలో  కథ ఏమిటో, అసలేం జరుగుతుందో చివరి ఇరవై నిమిషాల వరకూ తెలీదు.  మరి అంత వరకూ జరిగింది ఏమిటి?  ఒక పక్క, శర్వానంద్ కూరగాయల షాపు నడుపుకుంటూ డిజైనర్ డ్రెస్సులు వేసుకుని తెలుగు సినిమా హీరోలా ఏ పనీ పాట లేకుండా హీరోయిన్ తో అచ్చిక బుచ్చికలు, ఇంకో పక్క నగరంలో జరుగుతున్న కిడ్నాపులు, కిడ్నాపర్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్న కమీషనర్ సంపత్ రాజ్, అతను వేసే చెత్త పథకాలు. సినిమా మొదలైన గంటా యాభై నిముషాలు వరకూ జరిగింది ఇంతే.  

          హీరో సమస్య ఏమిటి
, అతని గోల్ ఏమిటి, విలన్ ఎవరు, వాడి గోల్ ఏమిటి? ఇలా ఏమీ తెలీకుండా గూగుల్ లో వెతికితే  వచ్చే జోకులతో టైమ్ పాస్ తప్ప, దాదాపు ఒక గంటా యాభై నిముషాల సినిమాలో కథ ప్రసక్తే లేదు. ఇంటర్వల్లో హీరో హీరోయిన్ ను కిడ్నాప్ చేయడం ట్విస్ట్ అట! నాకు బోర్ కొట్టి ఇక వెళ్ళి పోదాము అనుకున్న టైమ్ లో, చివరి ఇరవై నిమిషాలూ ట్విస్టుమీద ట్విస్టులు.  



      ఒకప్పుడు కిడ్నాపులు (డబ్బు కోసం) చేసింది ఇప్పటి కమీషనరు సంపత్ రాజ్ అనీ, అప్పటి ఆ కిడ్నాపు నేరాన్ని మన హీరో నాన్న మీద వేసి జైలుకు పంపాడనీఇప్పటి కిడ్నాపులు చేసేది మన హీరో అనీఇది సంపత్ రాజ్ ను జైలుకు పంపడాని కి మన హీరో వేసిన అతి తెలివైన (!) పథకం అనీ. ఇవి కాకహీరోయిన్ హీరో ను ప్రేమించలేదనీ, జస్ట్ బక్రా గా సెలెక్ట్ చేసుకుందనీ, అయితే అంత కంటే ముదురైన మన హీరో ఆమెను బక్రాను చేయడానికే తాను బక్రాగా నటించాననీ, ఇలా వంశీ తీసిన  ‘అన్వేషణ’ సినిమా చివరలో రాళ్ళ పల్లి అన్ని రహస్యాలు  ఒక్క సారి గా గుక్క తిప్పుకోకుండా చెప్పినట్టు, డైరెక్టర్ మనకు చెప్తాడు- చూసారా నా స్క్రీన్ ప్లే అన్నట్టు. 

          చివరలో సస్పెన్స్ విప్పడానికి ఇదేమీ ‘అన్వేషణ’ లా సస్పెన్స్ థ్రిల్లర్ కాదు. ‘అన్వేషణ’ లో ఆ సస్పెన్స్ మొదటినుండీ బిల్డ్అప్ అవుతుంది
.

           
చివరి నిమిషం వరకూ ఏదో సోది చెబుతూ, చివరలో వాటికి కారణాలు చెబుతూ, ఇదీ అసలు కథ అని అప్పుడు రివీల్ చేయడం ఒక రకమైన మోసమే. డైరెక్టర్ ఉద్దేశం  ప్రకారం ఇది నాన్న కోసం కొడుకు రివెంజ్ తీర్చుకునే కథ. అయితే ఇది స్ట్రక్చర్ లో లేని సినిమా. అయినా కూడా ‘రన్ రాజా రన్’ సక్సెస్ అయిందంటే దానికి వేరే కారణాలు ఉండొచ్చు. కొంత మంది యువతకు నచ్చే హీరో హీరోయిన్ మధ్య వచ్చే పిచ్చి కామెడీ సీన్లు కావచ్చు , ఇంకొంత మందికి నచ్చే పాచి పోయిన 'మామను తిప్పలు పెట్టే అల్లుడు' కామెడీ సీన్లు కావచ్చు, లేదా శర్వానంద్ తన కుబుసాన్ని విడిచి రవితేజ మాస్కును తొడుక్కుని వేసే వెకిలి వేషాల సీన్లు కావచ్చు, రిలీజ్ అయిన టైమ్ కావచ్చు. ఇంకా అనేకం కావచ్చు. Sujeeth just got away.

       ‘రన్ రాజా రన్’ సినిమా సక్సెస్ అయినందుకు సుజీత్ కు ఆ ఫార్మాట్ పై నమ్మకం పెరిగింది. అందుకే సరిగ్గా అదే ఫార్మాట్ లో ‘సాహో’ రాశాడు. ‘సాహో’ లో కూడా చివరి ఇరవై నిమిషాల వరకూ ఏం జరుగుతుందో తెలీదు. ఇక్కడ స్టార్ హీరో కాబట్టి గూగుల్ జోక్స్ తో వర్క్ అవదు కాబట్టి, యాక్షన్ సీన్స్ తో టైమ్ పాస్ చేశాడు.
        

             ఇంటర్వల్లో హీరోనే దొంగ అని ఒక ట్విస్ట్ (‘రన్ రాజా రన్’ లో హీరో హీరోయిన్ ను కిడ్నాప్ చేసినట్టు). ఇక చివరి ఇరవై నిమిషాల్లో...ఇది నాన్న కోసం కొడుకు రివెంజ్ తీర్చుకునే కథ (రన్ రాజా రన్ లాగా). హీరో చేసే ప్రతీ పని వెనుక పెద్ద ప్లాన్ ఉంది (రన్ రాజా రన్ లాగా). హీరోయిన్ హీరో ను ప్రేమించినట్టు నటించింది బట్ చివరికి ప్రేమలో పడింది (రన్ రాజా రన్ లాగా).  ఇకపోతే  పోలీసే ఒక క్రిమినల్ (రన్ రాజా రన్ లో సంపత్ రాజ్ లాగా). ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చివరి నిమిషాల్లో రివీల్ అయ్యే ట్విస్టులు. ‘లార్గో వించ్’ లైన్ తీసుకుని, ‘రన్ రాజా రన్’ స్క్రిప్ట్ ను మళ్ళీ రాస్తే అయింది ‘సాహో’. Sujeeth got away for the first time but luck won't favour every time.

సి.ఎస్, టాలీవుడ్ 

31, ఆగస్టు 2019, శనివారం

866 : సందేహాలు - సమాధానాలు


Q :  కథ రాస్తున్నామనే భ్రమలో గాథల్ని రాయకుండా, పూర్తి స్పృహతో గాథల్ని రాయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారా? గాథ సినిమాకు పనికిరాదని మీరు చాలాసార్లు చెప్పారు. కానీ గాథల్లో మెజారిటీ ప్లాప్స్ వున్నా, ఫారెస్ట్ గంప్, ప్రేమమ్ లాంటి విజయవంతమైనవి కూడా వున్నాయి కదా. ఒక వేళ మహానటి’ సినిమా బయోపిక్ కాకపోయి వుంటే, అది కూడా గాథ కిందకు వస్తుందా? తెలియజేయగలరు.
ఎపి, AD
A :  ‘మహానటి’ లో చూపించిన సావిత్రి గారి జీవితమంతా గాథే. ఈ గాథకి ‘సిటిజన్ కేన్’  లోని రోజ్ బడ్ ప్లాట్ డివైస్ టైపులో ‘శంకరయ్య ఎవరు?’ అనే జర్నలిస్టుల (సమంత, విజయ్ దేవరకొండ) ఇన్వెస్టిగేషన్ ‘కథ’ తో కవరింగ్ ఇవ్వడంతో, ‘మహానటి’ కి గాథగా ఎదుర్కొనే బాక్సాఫీసు ప్రమాదం తప్పింది. కథంటే స్ట్రక్చర్ కాబట్టి జర్నలిస్టుల ఇన్వెస్టిగేషన్ పార్టుని గమనిస్తే, త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో వుంటుంది. అందులో బిగినింగ్, మిడిల్, ఎండ్ వుంటాయి, ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ వుంటాయి. గోల్ వుంటుంది. సంఘర్షణ వుంటుంది. చివరికి ఫలప్రాప్తీ వుంటుంది. ఇవే సావిత్రి గారి పార్టుకి వుండవు. సావిత్రి గారి పార్టుని గాథగానే చెప్పాలి తప్ప కథగా కుదరదు. అందుకని ఈ గాథని జర్నలిస్టుల కథతో కవరింగ్ ఇచ్చి కాపాడారు. ఇంకోటి గమనిస్తే గాథంతా ఫ్లాష్ బ్యాక్సే, కథ వచ్చేసి వర్తమానం. సమస్య ఎక్కడొస్తోందంటే ఏది స్ట్రక్చర్, ఏది కాదు పట్టుకోవడం దగ్గరే వస్తోంది. జర్నలిస్టుల కథలో ప్లాట్ పాయింట్స్ పట్టుకోండి చూద్దాం. 

          గాథ ఎలా రాయాలో చెప్పలేం. గాథకి స్ట్రక్చర్, శాస్త్రం, నియమాలు లేవు. కథకే వున్నాయి. కాబట్టి గాథలే రాయాలనుకుంటే ఎలా అన్పిస్తే అలా రాసుకోవడమే. బొమ్మ ఆడేదా పోయేదా దైవాధీనం. ఎందుకొచ్చిన బాధ. ఈ కమర్షియల్ సినిమాల కాలంలో ఉదాత్త గాథలకి అభిరుచిగల ప్రేక్షకులేరీ?

          కానీ జరుగుతున్నదేమిటంటే రాస్తున్నది కథలనుకుని గాథలే రాసుకుని తీయడం. స్టార్ సినిమాల్ని కూడా కమర్షియల్ ముసుగేసిన గాథలుగా తీసి ఫ్లాప్ చేసుకోవడం. చాలా కాలం అసలు స్ట్రక్చర్ ని ఎందుకు వ్యతిరేకిస్తారో, ఎందుకు దాన్ని శత్రువులా చూస్తారో అర్ధమయ్యేది కాదు. తర్వాత్తర్వాత అర్ధమవుతూ వచ్చింది. రాసుకునేది కథలనుకుంటూ గాథలు కాబట్టి స్ట్రక్చరంటే అసహ్యమని. నూటికి నూరు పాళ్ళూ వాళ్ళు కరెక్ట్. గాథలకి స్ట్రక్చర్ వుండదుగా. ‘ఇది కథ కాదు గాథ, తర్వాత మీకు తీరని వ్యధ’ అన్నా కూడా కథకీ గాథకీ తేడా కూడా తెలీదు కాబట్టి, ఇంకా పట్టులకి పోయి గాథే  రాసుకోవడం!

      మెజారిటీగా వున్న ఈ వర్గం స్ట్రక్చర్ ని వ్యతిరేకించడం పూర్తి న్యాయం, హక్కు. మనం గౌరవించాల్సిందే. వీళ్ళ తప్పుకాదు. 2000 – 2005 మధ్య వెల్లువెత్తిన మిడిల్ మటాష్ రోమాంటిక్ కామెడీల ట్రెండ్ లో వీళ్ళకెవరో వేసిన జ్ఞాన గుళిక తప్పు. ఆ గుళికే తరం తర్వాత తరానికి  సరఫరా అవుతోంది.

          ఈ వర్గాన్ని పక్కనపెట్టి మాట్లాడుకుంటే, స్ట్రక్చర్ వుండని గాథలకి వివిధ టెక్నిక్స్ తో సపోర్టు నివ్వొచ్చు. ఇది చాలా లోతైన అవగాహనని డిమాండ్ చేసే క్రియేటివ్ ఇంజనీరింగ్. ‘మహానటి’ లో జర్నలిస్టుల కథతో సపోర్టు నిచ్చినట్టు. అన్నిటికీ ఒకే టెక్నిక్ వుండదు. ఆ టెక్నిక్ ఏమిటనేది ఏ గాథకా గాథ చూసి నిర్ణయించాల్సి వుంటుంది. ఇక ‘ఫారెస్ట్ గంప్’ గాథ అని ఎవరన్నారు?  అది కథే. ఆ కథ ఫ్లాష్ బ్యాక్స్ రూపంలో వచ్చి పోతూంటుంది. ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ కథ చెబుతున్న హీరోతో వర్తమానంలో గాథ వుంటుంది. ‘మహానటి’ కి రివర్స్ అన్నమాట. ‘మహానటి’ లో ఫ్లాష్ బ్యాక్స్ తో వున్నగాథకి వర్తమానంలో కథతో సపోర్టునిచ్చారు, అదే ‘ఫారెస్ట్ గంప్’ లో కథని ఫ్లాష్ బ్యాక్స్ తో సపోర్టుగా పెట్టి, వర్తమానంలో గాథ చెప్పారు. ఇవి చూస్తూంటే కథని సపోర్టుగా పెట్టక పోతే గాథ నిలబడదేమో నన్పించక మానదు.

          ఫారెస్ట్ గంప్’ ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్స్ లో, ‘నీకు ప్రేమంటే తెలీదు, నన్నిక కలవకు’ అని హీరోయిన్ వెళ్ళిపోవడం. సిడ్ ఫీల్డ్ లెక్కల్లో పించ్ పాయింట్ వన్ వచ్చేసి, హీరోయిన్ కి రాసిన ఉత్తరాలన్నీ ఆమె అడ్రసులో లేకపోవడంతో తిరిగి రావడం. మిడ్ పాయింట్ వచ్చేసి, హీరోయిన్ తనని టార్చర్ పెట్టే బాయ్ ఫ్రెండ్ తోనే తిరగడం, ‘నేనెప్పటికీ నీ దాన్నే ఫారెస్ట్’  అని హీరోతో అనడం.

          ఇక పించ్ పాయింట్ టూ- చనిపోయిన ఫ్రెండ్ కిచ్చిన మాట ప్రకారం హీరో ఫిషింగ్ బోటు కొనుక్కోవడం, ప్లాట్ పాయింట్ టూ - ఫిషింగ్ తో డబ్బు సంపాదిస్తూ వుండగా మదర్ చనిపోవడం. మదర్ లేక, హీరోయిన్ లేక పిచ్చి పట్టిన వాడిలా తిరగడం.

          ఇక క్లయిమాక్స్ చూస్తే, ఆఖరికి హీరోయిన్ తనే పిలుస్తుంది హీరోని రమ్మని. వెళ్తే వాళ్ళకి పుట్టిన కొడుకుతో మరణశయ్యపై వుంటుంది. పెళ్లి చేసుకోమంటుంది. చేసుకుంటాడు. కన్ను మూస్తుంది...వాళ్ళ మధ్య కథకి కాన్ఫ్లిక్ట్ ఇలా ముగుస్తుంది. అంటే ఫ్లాష్ బ్యాక్స్ లో వున్న కథ, వర్తమానంలో నడుస్తున్న గాథ లోకి ప్రవహించి ముగిసిందన్నమాట. ఇలా కథా గాథా రెండూ 
ఐక్యమైపోయాయి.

      గాథల్లో హీరోకి గోల్ వుండదు. వాడొక సినిమా వ్యాపారానికి పనికి రాని శుద్ధ వేస్టు పాసివ్ క్యారక్టర్. వాడికి మంచైనా చెడైనా విధివశాత్తే జరుగుతాయి. ప్రయత్నపూర్వకంగా జరగవు. కర్మ చేయడు. అదృష్టాన్ని విధికి వదిలేస్తాడు. నిన్న ‘సంచిక’ వెబ్ సైట్ కోసం ‘ఆదిశంకరాచార్య’ సంస్కృత మూవీ చూస్తూంటే, అందులో శంకరాచార్య, ‘కర్మ చేయడం వ్యర్థం, జ్ఞానాన్ని పొందాక’ అంటాడు. మన కర్మ చేయని పాసివ్ క్యారక్టరేమో జ్ఞానాన్ని కూడా పొందడు. లేజీ ఫెలో. అందుకని వాడికోసం, అంటే వాడు పట్టించుకోని వాడి గాథ కోసం, మనమే ఒక డ్రమెటిక్ క్వశ్చన్ ని ఏర్పాటు చేయాలంటారు నిపుణులు. ఆ డ్రమెటిక్ క్వశ్చన్ ప్రేక్షకులకి తెలిసేలా చేస్తే, దాని కోసమైనా స్ట్రక్చర్ లేని, గోల్ వుండని గాథని చూస్తారు ప్రేక్షకులు. అంటే ‘ఫారెస్ట్ గంప్’ లో చూస్తే, ఆ హీరో హీరోయిన్ని పొందుతాడా లేదా అన్నదే డ్రమెటిక్ క్వశ్చన్ అవుతుంది. 

          పూర్వం ‘పెదరాయుడు’ అతి పెద్ద హిట్టయిన గాథ. తమిళ రీమేక్. ఆ గాథకి ‘సోల్’ ఆయువు పట్టు, టెక్నిక్, క్రియేటివ్ ఇంజనీరింగ్ వగైరా. ఈ ‘సోల్’ చెదరకుండా దర్శకుడు రవిరాజా పినిశెట్టి జాగ్రత్తగా తెలుగు ప్రేక్షకులకి అందించి పరవశింపజేశారు. ఇప్పుడు ‘సోల్’ నెవరు పట్టించుకుంటారు. గిట్టుబాటు ధరకి హోల్ సేల్ గా బయ్యర్లకి అంటగట్టడమే.

          ‘ప్రేమం’ గాథగా హిట్టయిందంటే దానికో క్రియేటివ్ ఇంజనీరింగ్ వుంటుంది. ఆ క్రియేటివ్ ఇంజనీరింగ్ యూత్ అప్పీల్ తో కావచ్చు, తెలుగులోలేని, మలయాళంలో వున్న నేటివిటీతో కావొచ్చు. మలయాళంలో నేటివిటీ ఎంతబలంగా  వుందంటే, సినిమాలో చూపించిన వూళ్ళో హీరోహీరోయిన్లు ప్రేమలో పడ్డ చోటు టూరిస్టు కేంద్రమైపోయింది. బస్సులు కట్టుకుని స్టూడెంట్స్ వెళ్లి చూసొచ్చేంత లాండ్ మార్క్ అయింది. ఇది తెలుగులో సాధ్యమైందా ఎప్పుడైనా?

          అందుకని వర్ధమాన రచయితలకీ, దర్శకులకీ రాబర్ట్ మెక్ కీ ఒకటే మాట చెప్తాడు- మామూలు కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకోనంత వరకూ కళాత్మక సినిమాల జోలికి పోవద్దని. గాథలు కళాత్మకతనే డిమాండ్ చేస్తాయి. పుట్టు కళాత్మకత వుంటే ప్రయత్నించ వచ్చు. పెట్టు కళాత్మకతకి టైం తీసుకుని ట్రైనింగు పొందాలి. తొందరపడి నిర్మాతల్ని పట్టి పల్లార్చకూడదు.
  
 Q :  ‘పెళ్ళి సందడి’ ప్లాట్ పాయింట్స్, రివ్యూ చెప్తారా?
ఎన్, కన్నయ్య, రైటర్

A :  
       అన్ని సినిమాల ప్లాట్ పాయింట్స్ గుర్తుండవు. మీరా సినిమా కథ చెప్తే ప్లాట్ పాయింట్స్ ఎక్కడున్నాయో చెప్పొచ్చు. వికీపీడియాలో కథ వుంటే చెప్పొచ్చు. ‘పెళ్లి సందడి’ ని అప్పట్లో విజయవాడలో, వరంగల్లో రెండు సార్లు చూశాం. అప్పట్లో స్ట్రక్చర్ తెలీని అమాయకులం. 2000 లో వృత్తికి అవసరమేర్పడి సిడ్ ఫీల్డ్ ని చదువుతున్నాకే తెలిసింది. మీరు ప్లాట్ పాయింట్స్ అంటూ టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ‘పెళ్లి సందడి’ చూసిన మీకు ప్లాట్ పాయింట్స్ ఎక్కడున్నాయో తెలిసి పోయే వుండాలి. అయితే అత్యధికులు ప్లాట్ పాయింట్స్ చెప్పలేని పరిస్థితిలో వుంటున్నారు. తాజాగా చూసిన  ‘సాహో’ ప్లాట్ పాయింట్స్ చెప్పమంటే చెప్పలేరు. ప్లాట్ పాయింట్స్ ని ఎలా గుర్తించాలో అస్సలు తెలుసుకోవడం లేదు. వాళ్ళు రాసుకుంటున్న కథల్లోనే  ప్లాట్ పాయింట్స్ కాదు కదా, కాన్ఫ్లిక్ట్ ఏమిటో చెప్పమంటే కూడా చెప్పలేకపోతున్నారు. ఇంకెందుకు తెలుసుకోవడం. స్క్రీన్ ప్లే వ్యాసాలు చదవడం. ‘పెళ్ళి సందడి’ ప్లాట్ పాయింట్స్ తెలుసుకున్నంత మాత్రాన ఏం ఉపయోగం. అసలంటూ కథ ఎలా డెవలప్ అయి, ఏ ఘట్టంలో, ఏఏ అంశాలతో ప్లాట్ పాయింట్స్ ఏర్పడతాయో సాంకేతికాల్ని అర్ధంజేసుకోగల్గాలిగా. కాబట్టి ఇవన్నీ పక్కనబెట్టి, అలవాటుగా ఎలా రాసుకుంటున్నారో అలాగే రాసుకుని తీసుకుంటే సరిపోతుంది, నాలెడ్జి అంటూ సమయం వృధా చేసుకోకుండా.


సికిందర్

28, ఆగస్టు 2019, బుధవారం

865 : టిప్స్



      “మానవ స్వభావం గురించి మనకు తెలిసిందల్లా ఒక్కటే, ఆ స్వభావం మార్పుకి లోనవుతుందని. మానవ స్వభావంలో మార్పు మాత్రమే వూహించి చెప్పగల లక్షణం. విఫలమయ్యే వ్యవస్థలు ఎదుగుదల, పురోభివృద్ధిలపై ఆధారపడక మానవ స్వభావం శాశ్వతమని నమ్మినందు వల్ల విఫలమవుతాయి.”
ఆస్కార్ వైల్డ్
          
పై కొటేషన్ తో క్యారెక్టర్ గ్రోత్ అధ్యాయం ప్రారంభిస్తాడు లాజోస్ ఏగ్రీ. ఈ పుస్తకం నాటకాల గురించి రాసినా సినిమాలకి కూడా ఉపయోగపడుతుందని గత వ్యాసంలో చెప్పుకున్నాం. అయితే నాటకాలంటే ఇప్పుడు సినిమా వాళ్లకి పడదు. అదేదో లో - కేటగిరీ యాక్టివిటీ అనుకుంటారు. ఆఫ్టరాల్ నాటకాలేమిటి, నాటకాలకంటే సినిమాలు గొప్పని, మేం సినిమా వాళ్ళం చాలా గొప్పోళ్ళమని స్టయిల్ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తూంటారు. సినిమాలు పుట్టిందే నాటక కళ లోంచి. ఈ విషయం తెలీక బ్రేక్ డాన్సులు. ఇదిప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సివస్తోందంటే, ఈ పుస్తకంలో అనేక నాటకాల్లోంచి తీసుకున్న ఉదాహరణలున్నాయి. ఇవి చూసి ఛీ యాక్ థూ అనుకుంటారేమోనని...

          వాంతి చేసుకున్నా విషయం మారదు. అందుకని విషయం లోకెళ్దాం.
          ఏగ్రీ ఇలా అంటాడు – “మీరు ఏ మాధ్యమం కోసం రాసినా, మీ పాత్రలు మీకు క్షుణ్ణంగా తెలిసి వుండాలి. ఈ రోజు వున్న విధంగానే కాదు, కొన్నేళ్ళ తర్వాత కూడా మీ పాత్రలెలా వుంటాయో మీకు తెలిసి వుండాలి. మానవ జాతి సహా ప్రకృతిలో ప్రతీదీ మార్పుకు లోనవుతుంది.  పదేళ్ళ క్రితం ధైర్యశాలిగా వున్న వ్యక్తి  ఈ రోజు పిరికిపందగా  వుండొచ్చు. కారణాలనేకం. వయస్సు, ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితి వగైరా.

          “మీకు తెలిసిన వ్యక్తెవరో ఇన్నేళ్ళలో అస్సలు మార్పుకు లోనవలేదని మీకన్పిస్తూండవచ్చు. కానీ అలాటి వ్యక్తెవరూ వుండే అవకాశంలేదు. మనిషి తన రాజకీయ, మత విశ్వాసాలని చెక్కు చెదరకుండా ఏళ్ల తరబడీ కాపాడుకుంటూ రావొచ్చు. కానీ సూక్ష్మ పరిశీలనలో వాటిపట్ల అతడి నిబద్ధత బలంగానో బలహీనంగానో మారడాన్ని గమనించ గలం. రాళ్ళు రప్పలు కూడా మార్పుకు లోనవుతాయి. వాటి క్రమానుగత విచ్ఛిన్నం  అగోచరంగా వున్నప్పటికీ. సూర్యుడు, సౌర వ్యవస్థ, విశ్వం సైతం. దేశాలు పుడతాయి, కౌమారంలోకి ప్రవేశిస్తాయి, యౌవనాన్ని సంతరించుకుంటాయి, వృద్ధాప్యంలోకి అడుగెడతాయి, మరణిస్తాయి. హింసాత్మకంగానో, నైమిత్తికంగానో.

          “మరి ఈ సమస్త పరిణామ తాటస్థ్యంలో మనిషొక్కడే మారకుండా ఎలా వుంటాడు? ఎలా వుంటాడంటే బ్యాడ్ రైటింగ్ వల్ల వుంటాడు. పాత్రలు ప్రకృతి సూత్రాల్నిధిక్కరించే సామ్రాజ్యం ఒకే ఒక్కటి వుంటుంది - అది బ్యాడ్ రైటింగ్ సామ్రాజ్యం. కథానికలో, నవల్లో, నాటకంలో మొదట్లో ఎలా వున్న పాత్ర ముగింపులో అలాగే వుందంటే ఆ కథానిక, నవల, నాటకం చాలా బ్యాడ్ అన్నమాట ( ‘రణరంగం’ లో ఎలా మొదలైన హీరో అలాగే (అ) శుభం వేసుకోడాన్నిగమనించాం - వ్యాసకర్త).

          
ఇక ఈ అధ్యాయంలో అక్కడక్కడా కొన్ని ముఖ్యమైన అంశాల్ని టిప్స్ గా మార్చుకుని చూద్దాం...
         

          1. కాన్ఫ్లిక్ట్ తోనే పాత్రేమిటో బయటపడుతుంది. కాన్ఫ్లిక్ట్ పాత్ర తీసుకున్ననిర్ణయం ఫలితంగా పుడుతుంది. నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే, కథకి ఏర్పాటు చేసిన పాయింటు కారణంగా తీసుకోవాల్సి వస్తుంది. పాత్ర నిర్ణయం తప్పకుండా ఎదుటి పాత్ర ఇంకో నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ఈ ఎదుటి పాత్ర ప్రత్యర్ధి పాత్ర. ఇలా ఒకరి నిర్ణయం ఇంకొకరి ప్రతి నిర్ణయానికి దారితీస్తూ కథ ముందుకు నడుస్తుంది. ఈ పరంపర కథకి తీసుకున్న పాయింటుని ప్రూవ్ చేసే అంతిమ మజిలీ దాకా సాగుతుంది.          

          2. ఏ గొప్ప నాటకాలని చూసినా, కాన్ఫ్లిక్ట్ వల్ల పాత్రలకి సంభవించే నిరంతర మార్పు, అభివృద్ధి గమనించవచ్చు. షేక్స్ పియర్ ‘మర్చంట్ ఆఫ్ వెనిస్’, మోలియర్ ‘టర్టఫ్’ మొదలైనవి. ‘ఒథెల్లో’ ప్రేమతో ప్రారంభమవుతుంది, అసూయ, హత్య, ఆత్మహత్యలతో  ముగుస్తుంది. ‘హెడ్డా గబ్లర్’ ఇగోతో ప్రారంభమవుతుంది, ఆత్మహత్యతో ముగుస్తుంది. ‘మాక్బెత్’ ఆశయంతో మొదలై హత్యతో ముగుస్తుంది. ‘ఎక్స్ కర్సన్’  కలల్నినిజం చేసుకోవడానికి మొదలై, నిజాలు తెలుసుకోవడంతో ముగుస్తుంది. ‘హామ్లెట్’ అనుమానంతో మొదలై హత్యతో ముగుస్తుంది. ‘కెరీర్’ నిరాశతో మొదలై విజయంతో ముగుస్తుంది. ‘డెడ్ ఎండ్’ పేదరికంతో మొదలై నేరంతో ముగుస్తుంది...          

          3. బలహీన పాత్ర ఉద్దేశించిన కాన్ఫ్లిక్ట్ ని కొనసాగించలేదు. పోటీల్లేక పోతే ఆటల్లేవు, కాన్ఫ్లిక్ట్ లేకపోతే కథ లేదు. కౌంటర్ పాయింటు లేకపోతే సమతుల్యం లేదు. బలహీన పాత్రతో మొదలుపెడితో కాన్ఫ్లిక్ట్ తో బలమైన పాత్రగా మార్చాలి. బలమైన పాత్రని కాన్ఫ్లిక్ట్ తో బలహీనపడ్డ పాత్రగా మార్చవచ్చు. ఐతే బలహీనపడ్డప్పటికీ ఆ అవమానాన్ని భరించగల్గే స్టామినాతో పాత్ర వుండాలి.          

         4. ఒక ఉదాహరణ : ఓనీల్ రాసిన ‘మౌర్నింగ్ బికమ్స్ ఎలెక్ట్రా’ నాటకం (1947 లో హాలీవుడ్ మూవీగా వచ్చింది). ఇందులో కథానాయకుడు బ్రాంట్ కీ, కథానాయిక లెవీనియాకీ మధ్య సన్నివేశం. బ్రాంట్ పనిమనిషికీ, సంపన్నుడైన మానన్ అనే అతడికీ పుట్టిన అక్రమసంతానం. కులం చెడ్డ వాడు. తల్లి తననెక్కడో దూరంగా తీసికెళ్ళి పెంచింది. ఇప్పుడతను తిరిగొచ్చేశాడు మారుపేరు పెట్టుకుని. తల్లితోబాటు తనూ పొందిన అవమానాలకి ప్రతీకారం తీర్చుకోవడానికి. ఇప్పుడతను కెప్టెన్. లెవీనియా తల్లితో సంబంధం పెట్టుకుని, ఇది కప్పి పుచ్చడానికి లెవీనియాతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. ఐతే బ్రాంట్ తో జాగ్రత్త అని లెవీనియా ఇంట్లో పనివాడు ఆమెని హెచ్చరించాడు. 

           ఈ నేపథ్యంలో ఇప్పుడతను లెవీనియా చేయందుకోబోతే ఆమె దూరం జరిగిపోయి కోపంతో అరుస్తుంది ; “డోంట్ టచ్ మీ! డోంట్ యూ డేర్! యూ లయర్! యూ!”

          అతను అర్ధంగాక వెనకడుగేస్తే, ఈ అవకాశం తీసుకునామె పని వాడిచ్చిన సలహా మేరకు బ్రాంట్ ని వెక్కిరింపుగా, అసహ్యంగా చూస్తుంది.

          బ్రాంట్ స్థాణువైపోయి అంటాడు : “ఏంటది? (అని అరిచి, తన తల్లిని అవమానపరు స్తున్నట్టున్న ఆమె వెక్కిరింపుకి రెచ్చి పోతూ అంటాడు) : జాగ్రత్త! నువ్వు ఆడదానివని కూడా చూడను...నేనుండగా ఏ మానన్ గాడి వల్లా మా అమ్మకి అవమానం జరగనివ్వను-”

          లెవీనియా ఇప్పుడు తనకి నిజం తెలిసిపోయిందన్న షాక్ తో అంటుంది : “ఐతే నిజమేనన్న మాట... నువ్వామె కొడుకువే నన్న మాట...”

          బ్రాంట్ అతికష్టంగా కంట్రోలు చేసుకుంటూ : “ఐతే ఏంటట? గర్వంగావుంది నాకు! నాకు అవమానకరంగా వుందల్లా నా వొంట్లో ఆ మానన్ గాడి రక్తం ప్రవహించడమే. అందుకే నువ్వు నేను ముట్టుకోబోతే సహించలేక పోయావ్ కదూ, అంతేనా?”

          అంటే ఇక్కడ పాత్రకి బలహీనపడే, కుంగుబాటుకి లోనయ్యే వాస్తవ పరిస్థితి ఎదురైనప్పటికీ, పాత్ర గిల్టీ ఫీలవకుండా ఎదురుతిరిగి బలం నిరూపించుకుంటోంది (తెలుగు సినిమాల్లో తప్పకుండా వుండే మన అభిమాన, ప్రీతిపాత్రమైన పాసివ్ పాత్రయితే - “లతా! ఇంత మాటన్నావా? సర్లే...ఔన్లే... కానీయ్...నాకిలా రాసిపెట్టుంది...” అని కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, తెగ మందు కొడతాడు. సినిమా విడుదలయ్యాక బయ్యర్లచేత హాహాకారాలు పెట్టిస్తాడు - వ్యాసకర్త).          


          బ్రాంట్, లెవీనియాల  సంవాదం చూస్తే, వీళ్ళు కాన్ఫ్లిక్ట్ ని రక్తి కట్టిస్తూ కథని బలంగా ముందుకు తీసికెళ్ళిపోతారని నమ్మకం కలుగుతుంది.

          
5. ఇర్విన్ షా నాటకం ‘బరీ ది డెడ్’ (1936) లో, అమరుడైన సైనికుడి భార్య మార్తా అంటుంది : “ ఇల్లన్నాక పిల్లలుండాలి. అది పరిశుభ్రమైన అందమైన ఇల్లుగా వుండాలి. నాకెందుకు పిల్లలుండకూడదు? వాళ్ళకి లేరా? క్యాలెండర్లో పేజీ చింపిన ప్రతీసారీ వాళ్ళెవరూ తల్లడిల్లిపోరే? ఎంచక్కా ముచ్చటైన అంబులెన్సుల్లో అద్భుతమైన హాస్పిటల్స్ కెళ్ళి మెత్తటి పరుపుల మీద అందమైన పిల్లల్ని కంటున్నారే? వాళ్ళల్లో దేవుడు అంతగా ఇష్టపడుతున్నదేంటో అంతలా పిల్లల్నిచ్చేస్తున్నాడు?”

          వెబ్ స్టర్ (ఒక సైనికుడు) : “వాళ్ళు మెకానిక్కుల్ని పెళ్లి చేసుకోలేదు”

          మార్తా అంటుంది : “ కాదు! వాళ్ళు పద్డెనిమిదిన్నర డాలర్లతో లేరు. నువ్వున్నావ్. ఇరవై డాలర్ల పెన్షన్ కి యుద్ధంలో నీ చావుని ఆఫర్ చేస్తున్నావ్. ఆ పెన్షన్ తీసుకుని నేను పొద్దంతా బ్రెడ్ కోసం క్యూలో నించుంటా. బటర్ రుచెలా వుంటుందో మర్చేపోయా. నా బూట్లలో వాన నీళ్ళు చీకాకు పెడుతున్నాతడుస్తూ గంటల కొద్దీ ఓ ఇంత మటన్ ముక్క కోసం లైన్లో  నిలబడతా. రాత్రెప్పుడో  ఇంటికి పోతా. ఎవ్వరూ వుండి చావరు మాట్లాడ్డానికి. బొద్దింకని చూస్తూ అలా కూర్చుంటా గుడ్డి వెల్తుర్లో. గరవ్నమెంటోళ్లు కరెంటు పొదుపు చెయ్యాలిటగా? నాకివన్నీ అంటగట్టి నువ్వెళ్ళిపోతావ్. నాకు మాట్లాడే మనిషి లేకుండా చేసే యుద్ధం నాకెందుకు. నీ ప్రాణాలు పోగొట్టే యుద్ధం 
నీకెందుకు...”


ఇర్విన్ షా నాటకంబరీ ది డెడ్లో దృశ్యం
       వెబ్ స్టర్ అంటాడు : ‘అందుకే నేనిప్పుడు మనసు మార్చుకున్నా మార్తా”
          మార్తా అంటుంది : “ఇప్పుడా? దేనికిప్పుడు? ఓనెల, ఓ ఏడాది, ఓ పదేళ్ళ క్రితం ఎందుక్కాలేదు? అప్పుడెందుకు మనసు మార్చుకుని నో అనలేదు వాళ్ళతో? ఇప్పుడు చావొచ్చాకానా? నీ జీతమెంత? వారానికి పద్దెనిమిదన్నర డాలర్లా? ఈ చిల్లర కోసం నో అన్లేక, చావు ఎదుట నించున్నాక నో అంటావా పిచ్చి వాడా!”

          వెబ్ స్టర్ : “అప్పుడు నాకు తట్టలేదు -”

          మార్తా : “నువ్వంతే! ముంచుకొచ్చేదాకా రాయిలా కూర్చుంటావ్. ఆల్ రైట్, ఇప్పుడు నో అను. నో అనే టైమొచ్చింది. మీ పద్డెనిమిదిన్నర డాలర్ల బెగ్గర్స్ అందరికీ చెప్పు! వాళ్ళ పెళ్ళాల కోసం, పిల్లలకోసం నో అనమను! నో అనమను! చెప్పు వాళ్ళకి, చెప్పూ!!” కేకేసి పడిపోతుంది.

          ఈ పాత్రలు కూడా పోరాడే శక్తితో కదం తొక్కుతున్నాయి. ఏం చేసినా ఎదుటి వాళ్ళు తమతో తలపడేలా చేస్తాయి. గొప్ప నాటకాలు వేటిలో చూసినా, పాత్రలు తమ మధ్య వున్న సమస్యతో ఓడేదాకానో గెలిచేదాకానో చెలరేగుతూనే వుంటాయి. చెహోవ్ రాసిన పాత్రలు కూడా పాసివ్ గా వున్నా శక్తిమంతంగా వుంటాయి. ఆ పాత్రల్లో పోగుబడిన దుర్భర పరిస్థితుల ప్రాబల్యం వాటిని చెక్కుచెదరనీయవు (మన పాసివ్ మేకర్లకి పాసివ్ గా ఎంత ఏడ్పిస్తే అంత తెలుగు తుత్తి. ఈ తెలుగు తుత్తి రిలీజుకి తీరిపోతుంది. ముప్ఫై నలభై కోట్లు నేలపాలై బయ్యర్లు రాళ్ళుచ్చుకు వస్తూంటే ఇంకో సినిమాలో చూసుకుందామని వేడికోళ్ళు. ఆ ఇంకో సినిమా మళ్ళీ యాక్టివా, పాసివా మేకర్లకీ తెలీదు, బయ్యర్లకీ తెలీదు. మళ్లీ రాళ్ళూ వేడికోళ్ళూ. ఎక్కడో హాలీవుడ్ లో మూడు ఆస్కార్ల రచయిత విలియం గోల్డ్ మాన్ అననే అన్నాడు -సినిమా వాళ్లకి ఏమీ తెలిసి చావదని -వ్యాసకర్త). 


          
6. న్యూయార్క్ టైమ్స్ లో ఈ ఆర్టికల్ వచ్చింది...500 హత్యల్ని అధ్యయనం చేస్తే, ఆ హత్యల వెనుక కారణాలు ఆశ్చర్య పర్చాయని మెట్రో పాలిటన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పేర్కొంది... ఒక భర్త డిన్నర్ లేటు చేసిందని భార్యని కొట్టి చంపాడు. ఒక ఫ్రెండ్ పాతిక సెంట్ల తగాదాలో ఫ్రెండ్ ని చంపేశాడు. శాండ్ విచ్ దగ్గర మాటామాటా పెరిగి, రెస్టారెంట్ ఓనర్ కస్టమర్ ని కాల్చి చంపాడు. తాగుడు మానమని చెప్పిన తల్లిని ఒకడు పొడిచి చంపాడు. బాక్స్ లో ఎవరు ముందు కాయిన్ వేసి పియానో వాయించాలన్నదగ్గర గొంతు పిసికి ఒకడ్ని చంపేశాడింకొకడు.

          వీళ్ళంతా పిచ్చివాళ్ళా? స్వల్ప కారణానికే ప్రాణాలు తీసేంత హంతకులుగా ఎలా మారిపోయారు?

(ఇంకా వుంది
)
సికిందర్