రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, జనవరి 2018, శనివారం

585 : స్క్రీన్ ప్లే సంగతులు


  
మిళనాడు సేలంలోని మోడరన్ థియేటర్స్ లిమిటెడ్ పేరు  తెలియని వాళ్ళుండరు. దీని అధినేత రామప్ప సుందరం తండ్రి ప్రవేశ పెట్టిన  లో-బడ్జెట్ సినిమాల మేకింగ్ ని తు. . తప్పక పాటించిన వాడు.  సీనియర్ సుందరం (1907-63) రచయితల్ని సంస్థకి గొప్ప ఎస్సెట్స్ గా పరిగణించిఉద్యోగ ప్రాతిపదికన నియమిం
చుకుని
రాయించుకునే వాడు. రచయితల్లో కరుణానిధితో మొదలుకొని భారతీ దాసన్ఆశై తంబీల వరకూ ఎందరో వున్నారు. అతను తన చిన్న తరహా సినిమాలకంటూ కొన్ని నిర్దిష్ట ప్రమాణాల్ని స్థిరీకరించాడు. సూటిగా స్పష్టంగా ఉండే కథపరుగులెత్తే కథనంషార్ప్ టేకింగ్సూపర్ ఫాస్ట్ యాక్షన్ సీన్స్క్యాచీ సంగీతంనృత్యాలూ హాస్యం వగైరా. ఇలా తండ్రి సాంప్రదాయాన్నే తుదివరకూ కొనసాగించిన జూనియర్  సుందరం కూడాతనెలా సక్సెసయ్యాడో చెప్పడానికి ఎస్వీ రంగారావుని రౌడీగా చూపిస్తూ ‘మొనగాళ్ళకి మొనగాడు’, గుమ్మడి ని విలన్ గా  చేసి ‘నేనూ మనిషినే’ …రెండు విజయవంతమైన ప్రయోగాలూ  చాలు!  
           మల్లీశ్వరి చూద్దాం : మల్లీశ్వరి’ చరిత్రకి కల్పనని జోడించిన అపురూప సంగీతభరిత ప్రేమ కథగా పండిత పామరులందర్నీ అలరిస్తోంది నేటికీ. మరో కీర్తి కూడా దీని సొంతమైంది. స్క్రీన్ ప్లే పరంగా  అతికొద్ది పాత క్లాసిక్స్ లాగే ఇది కూడా ఒక పాఠ్యాంశమవుతుందని గుర్తించారు. అయితే పాఠ్యాంశాన్ని ఎవరెంత తమ తమ సినిమాల్లో వినియోగించుకున్నారో తెలీదు గానీఇప్పుడు మాత్రం సినిమాలు పూర్తిగా రూపు రేఖలు మార్చుకుంటున్న కాలంలో –కనీసం చిన్న సినిమాలకి సంబంధించి – ఒక ప్రత్యామ్నాయ స్క్రీన్ ప్లే నమూనా అవసరం ఎంతైనా వుంది. అవసరాన్ని ‘మల్లీశ్వరి’ మహాద్భుతంగా తీర్చగలదని బాక్సాఫీసుని గుద్ది మరీ చెప్పొచ్చు.

          ఓంకారలవ్ ఆజ్ కల్లండన్ డ్రీమ్స్ లాంటి హిందీ  సినిమాల్ని చూస్తే ఒక మార్పు కన్పిస్తుంది. వీటిలో గజినీవాంటెడ్ లలో లాంటి రొటీన్ మసాలా విలన్లు కన్పించరు. హిందీ మల్టీప్లెక్స్ఓవర్సీస్ ప్రేక్షకులు ఇప్పుడు సినిమాల్ని కాలక్షేప బఠానీల కన్నా తేలిగ్గా తీసుకోవడంతోపై మూడు చిత్రాల్లో కేవలం పరిస్థితులుపాత్రల మనస్తత్వాలు అనే రెండు ఎలిమెంట్స్ మాత్రమే కథలకి విలన్లుగా కన్పిస్తున్నాయి. ఇవే వాటి విజయాలకి సరిపోతున్నాయి.  

         
ఇదే ఇప్పుడు గనుక తెలుగు సినిమాల్లోనూ జరిగితేప్రేమ కథల్లో కూడా విలన్ తో పొడిపించు కోవడాలురక్తాలు పారించు కోవడాలూ ఇక వుండవు. అసలు విలన్ పాత్రే వుండదు. ‘మల్లీశ్వరి’ కొస్తే, చరిత్ర ప్రకారం రాణివాసంలో పడతులకేసి పరాయి మగాడు కన్నెత్తి చూస్తే శిరఛ్ఛేదం తప్పదు. అంటే అంటే నాగరాజు పాత్ర తల తెగిపడే పరిస్థితి అన్నమాట. ఇక్కడే స్క్రీన్ ప్లే లో విలన్ పాత్ర ఉనికిని శుభ్రంగా చేరిపేస్తోందీ సినిమా. మరి విలన్ పాత్ర లేకపోతే కథెలా నడవాలినాగరాజు ఆడిన వేళాకోళమే అతడి పాలిట విలన్ అవుతుంది ఈ కథలో. తెర మీద నడిచే సినిమా అంతా కూడా మన మానసిక ప్రపంచంలోని భావోద్వేగాల సమాహారమే అనుకుంటే – అంటే మన సబ్ కాన్షస్ మైండ్ తో కాన్షస్ మైండ్ ఆడే ఆట!  కచ్చితమైన స్క్రీన్న్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటేసినిమా కథని సినిమాకథ అనరు. స్టోరీ మైండ్ అంటారు. దృష్టితోనే స్క్రీన్ ప్లే ని నిర్వచిస్తారు.

         
స్టోరీ మైండ్ లో నాగరాజు కాన్షస్ మైండ్ లాంటి వాడు. అంటే ఇగో అన్నమాట. తన ఇగో తన సబ్ కాన్షస్ మైండ్ తో,  లేదా అంతరంగంతో చెలగాట మాడుతుంది ఈ కథలో ఒక వేళాకోళం చేసేసి. మరి అంతరంగానికి తెర మీద కన్పించే భౌతిక రూపం ఎవరు దేవరాయాలి పాత్రే. దీంతోనే తలపడాలి తను, ఇక వేరే విలన్ అవసరం లేదు!

***
    సహజత్వానికి దగ్గరగా తీసికెళ్ళిన విషాదభరిత సినిమా ‘మనుషులు మారాలి’.  అయితే మరీ ఆర్ట్ సినిమా లాంటి సహజత్వంతో కాకకాస్త నాటకీయతచలం- కెవి చలం- రమాప్రభలతో ఇంకాస్త హాస్యం, మంచి పాటలు, ఇంకా చురకత్తి లాంటి నాగభూషణం చెణుకులతో- ఇంకా ఇతర మసాలా దినుసులూ  దట్టించిఅన్ని వర్గాల ప్రేక్షకులూ బ్రహ్మ రధం పట్టేలా తీశారు. పైగా బ్లాక్ అండ్ వైట్ లో చాలా మంచి షాట్లు తీశారు దర్శకుడు వి. మధుసూదన రావు.  ఇందులో సృజనాత్మకత ఏమిటంటే, ఒక విశిష్ట శిల్పం స్క్రీన్ ప్లే కి కన్పిస్తుంది. కథ పాత్రల చేతులు మారుతూ పోతూంటుంది. అసలు ట్రాజడీల్లో కథే పాత్రల్ని నడిపిస్తుంది. ట్రాజడీల్లో పాత్రలు గొప్ప కాదుఅవి బలిపశువులు. అప్పుడే ట్రాజడీ. కాబట్టి ట్రాజడీల్ని పాత్రలు నడపవు. కథే  పాసివ్ పాత్రల్ని నడిపిస్తుంది. ‘దేవదాసు’ తీసుకున్నా, ‘శంకరాభరణం’  తీసుకున్నా ఇంతే. అలా ‘మనుషులు మారాలి’  గుమ్మడి ట్రాకుతో ప్రారంభమౌతుంది. తర్వాత శారద తర్వాత శోభన్ఇంకా తర్వాత తిరిగి శారదఆఖరికి పిల్లలూ.. ఇలా అధ్యాయాల వారీగా అధ్యాయానికా అధ్యాయం విస్పష్ట  విభజన జరిగిన ట్రాకులతో నడుస్తుంది. ఇబ్బందిపడకుండా కథని ఫాలో అవడాన్ని సులభతరం చేసింది విధానం. కథలు చెప్పడం లో గ్రేట్ మాస్టర్లు కాలంలోనే వున్నారు.

          సెకండాఫ్ లోచనిపోయే శోభన్ పాత్ర హేండాఫ్ పాత్రలా వుంటుంది. అంటేకథలో తను చేయాల్సిన కార్యం ముగించుకుని రెపరెపలాడే కథ అనే పతాకాన్నిరెండో ముఖ్య పాత్రకి అప్పగించి  తను నిష్క్రమించడ మన్నమాట. ఇలా శోభన్ నుంచి   పతాకాన్ని అందుకున్న శారద,  దాంతో ముగింపు దిశగా సాగిపోతారు. ‘రాబోయే కష్టాలకి భయపడి రావాల్సిన హక్కుల్ని వదులుకోవడం పిరికితనం’ అని శోభన్ సిద్ధాంతంసమ్మె చేస్తాడు, వాళ్ళు లాకౌట్ ప్రకటిస్తే నిరాహార దీక్ష చేస్తాడు, ప్రభుత్వమే పూనుకుని  ఫ్యాక్టరీ తెరిపిస్తూంటే నిస్సహాయుడై పోతాడు, లంచం ఎరజూపితే తిప్పికొడతాడు, రాత్రి యాజమాన్యం పంపిన గూండాల చేతిలో హతమైపోతాడు.

         
ఒక్క యంత్రాలు తెచ్చి పెట్టుకుని నాగభూషణం సృష్టించిన పరిస్థితి ఇది. యంత్రాలు మంచివేవాటితో యాజమాన్యాల వైఖరే ప్రశ్నార్ధకమవుతోంది. మహాభారతంలో దుర్యోధనుడుకర్ణుడుయుధిష్టరుడుధృతరాష్ట్రుడుఅశ్వత్థామ లాంటి వాళ్ళందరూ కలిసేవాల్ స్ట్రీట్ ని కుప్ప కూల్చిపెట్టుబడిదారీ వ్యవస్థని నేలకు దించారని ఆర్ధిక నిపుణుడుకాలమిస్టు గురుచరణ్ దాస్ ఒక  ఆర్టికల్ రాశారు. సినిమాలో కూడా నాగభూషణం దుర్యోధనుడైతేరావికొండలరావు యుధిష్టరుడుహరనాథ్ కర్ణుడు లాంటి వాళ్ళే. ముగ్గురి నిర్వాకమే కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చింది- నాటికైనా సినిమా హెచ్చరికకనువిప్పు.


***
      నాటకాల రాయుడు’లో 
ఆద్యంతం నాగభూషణం చాలా యాక్టివ్ గాచలాకీగా రక్తి కట్టించే  నవ్వుల ప్రపంచంలో తీరని విషాదం కూడా వుందినాగభూషణం అతడి కుటుంబపు పరిస్థితుల అనులోమవిలోమ సంబంధంరేఖా గణితం  సినిమా కథా కథనాలకి బలమైన వెన్నెముక గా నిలుస్తాయిఎలాగంటే అతనెక్కడో మహా నగరంలో పైపైకి ఎదుగుతూ వుంటేఅటు వూళ్ళో కుటుంబం నానాటికీ దిగజారి పోతూ వుంటుందితను చాలా చాలా గొప్ప వాడైపోయేసరికి కుటుంబంలో  మరణం సంభవించిఇంకో జననం తో ముక్కలైభిక్షాటన చేసే దౌర్భాగ్యంఇప్పటి సినిమాల్లో కొరవడిన కరకు వాస్తవ జీవిత మంతా ఇందులో జడలు విప్పుకుంటుంది.   తల్లి ఆశీర్వాద బలంతోనే  తానిలా గొప్ప వాణ్ణయి పోయాననుకుని మురిసిపోతాడు. తల్లి ఎప్పుడో గతించిన విషయం కూడా తెలీదు! కుటుంబంలో పెళ్ళి శుభకార్యానికి  డబ్బెప్పుడూ నిలవదు. మొదటిసారి డబ్బు దొంగల పాలవగానేఅంతవరకూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చిన కుటుంబం ఒక్కసారి భగ్గుమనేస్తుంది. కలలో కూడా ఊహించని కటువైన మాటలు పేలతాయి వాళ్ళ మధ్య. పరస్పర దూషణలుదెప్పి పొడుపులు తనకి కూడా తగిలి కుమిలికుమిలి పోతుందా పెళ్లి కున్నఅమ్మాయి. దర్శకుడు సంజీవి దృశ్యాన్ని నాగయ్యహేమలతసత్యనారాయణఅనిత లతో అత్యంత బలంగా సృష్టించాడు. సినిమాకి ఇదే హైలైట్.

***
         ‘బందిపోటు’ కొస్తే, అనగనగా గాంధార రాజ్యంలో సత్యసేన భూపతి అనే అశక్తుడైన మహారాజు. మందారమాల అనే మహా అహంకారియైన కూతురు. శూరసింహుడనే దుష్ట సేనాపతి. ఇతను రాజుగారి బావమరిది కూడా. రాజ్యం మీదా రాజకన్య మీదా కన్నేసి రాజు గార్ని బద్నాం చేస్తూంటాడు. పంట లెత్తుకుపోవడంబల్లేలకి పసి పిల్లల్ని మిడుతల్లా గుచ్చి ఆనందించడం, ఆడవాళ్ళని చెరచడం, మగవాళ్ళని చంపడం వంటి అకృత్యాలతో రాజుకి చాలా చెడ్డ పేరు తెస్తూంటాడు.అసహాయ శూరుడనే వాడు ఇతడి లేటెస్ట్ బాధితుడు. ఇతను ముసుగు దొంగలా ఖజానాని దోచి పేదలకి పంచి పెడుతూంటాడు. కీచక రాజభటుల్ని వధిస్తూంటాడు. అవకాశంతో  శూర సింహుడు  తన దురాగతాల్ని ఇతడికే అంటగట్టి, రాజుకి ఫిర్యాదు చేస్తూంటాడు. ఒకసారి నరసింహ అనే యువ రైతు అసహాయ శూరుడ్ని అటకాయిస్తే, ఇతను తన చిన్నాన్నే అని తెలిసిపోతుంది. అటు రాజుకి కూడా రహస్యం తెలిసిపోయి, అసహాయ శూరుడ్ని విచారణకి తన ఎదుట ప్రవేశ పెట్టాల్సిందిగా అతడి అన్న ధర్మ నాయకుణ్ణి ఆదేశిస్తాడు

         ఈలోపు నిజాలు బయట పడకూడదని శూర సింహుడు అసహాయ శూరుడ్ని చంపించేస్తాడు. అఘాయిత్యానికి గుండె పగిలి చస్తాడు ధర్మనాయకుడు. కుటుంబంలో ఒకేసారి ఇలా ఉత్పాతాలకి నరసింహ ఖిన్నుడై, తేరుకుని శూర సింహుడి మీద పగబడ్తాడు.

          అరగంట లోపే సెటప్ చేసిన కథా ప్రారంభం (స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం) చాలా పకడ్బందీ స్క్రిప్టింగ్ ప్రణాళిక అనొచ్చు. సెటప్ డైనమిక్స్ కి భాగం వరకూ కత్తిరించి రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు ఆసక్తి వున్న సినిమా రచయితలెవరైనా. చాలా అందమైన దృశ్య మాలిక ఇది. జానపద సినిమాలు ఉత్త నేలబారువి అనేవాళ్ళకి చెంప పెట్టు సృజనాత్మకత ఇది. ఇక్కడి దాకా కథని, పాత్రల్ని పరిచయం చేసిన తీరూ, మల్చిన తీరూ, సమస్యని స్థాపించి (ప్లాట్ పాయింట్ వన్) కథానాయకుడ్ని కార్యోన్ముఖుడ్ని చేసిన పద్ధతీఅదీ కేవలం అరగంట సమయంలో క్రియేటివ్ ఛాలెంజియే అనాలి మూడో తరగతి వరకే చదివిన విఠలాచార్య నుంచి!!

సికిందర్ 

12, జనవరి 2018, శుక్రవారం

584 : రివ్యూ!

స్క్రీన్ ప్లే – దర్శకత్వం :  కె ఎస్ రవికుమార్
తారాగణం : బాలకృష్ణ, తార, రిప్రియ, టాషా దోషి, ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్డి, మురళీమోహన్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ప్రభాకర్ దితరులు
కథ- మాటలు : ఎం.త్నం, సంగీతం : చిరంతన్ ట్, ఛాయాగ్రణం : రాంప్రసాద్
బ్యానర్  : సి.కె.ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : సి. కళ్యాణ్
విడుదల : జనవరి 12, 2018
***
          నందమూరి బాలకృష్ణ – సంక్రాంతి కాంబినేషన్  కొత్తేమీ కాదు. కాకపోతే 1999 నుంచి 2017 వరకూ 18 ఏళ్ళలో  నటించిన సినిమాలు ఏడే సంక్రాంతికి వచ్చాయి. వాటిలో నాలుగు హిట్టయ్యాయి. 2016 సంక్రాంతికి ‘డిక్టేటర్’ ఎంత ఫ్లాపయ్యిందో, 2017 సంక్రాంతికి ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అంత హిట్టయ్యాక ఇప్పుడు ‘జై సింహా’ తో పండగ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? ‘శాతకర్ణి’ లాంటి చారిత్రికాలో, ‘శ్రీ రామరాజ్యం’ లాంటి పౌరాణికాలో నటించకపోతే ఆయన నటించేదొక్కటే - 1999 ‘సమరసింహా రెడ్డి’ నుంచి మారిన ఆయన బాక్సాఫీసు ఫార్ములా ప్రకారం ఫ్యామిలీ యాక్షన్లు నటిస్తారు. మరీ ‘డిక్టేటర్’,  ‘పైసా వసూల్’ లాంటి మాఫియాలు నటిస్తే దెబ్బతింటారు. తిరిగి ఇప్పుడు ‘జై సింహా’ అనే ఫ్యామిలీ యాక్షన్ కే వచ్చి సక్సెస్ అయ్యారా? నిర్మాత సి కళ్యాణ్, తమిళ సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ లు బాలకృష్ణకి ఏ ప్యాకేజీ ఇచ్చి పండగ చేసుకుందామనుకున్నారు? ....ఒకసారి చూద్దాం...

కథ 
      వైజాగ్ ఆస్పత్రిలో ప్రసవించిన బిడ్డ కనపడక బావురుమంటుంది గౌరీ (నయనతార). బిడ్డతో రైలెక్కేస్తాడు నర్సింహా (బాలకృష్ణ). కొన్ని వూళ్ళు తిరిగి, ఏ వూళ్ళోనూ రౌడీలూ గూండాలతో బిడ్డకి భద్రత లేక,  చివరికి తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఆలయ ధర్మకర్త ( మురళీమోహన్ ) దగ్గర కారుడ్రైవర్ గా చేరతాడు. ఆయనకి ధాన్య (నటాషా దోషి) అనే కూతురుంటుంది.  డ్రగ్స్ బానిస అయిన ఈమె కారు యాక్సిడెంట్ చేస్తుంది.  ఈ యాక్సిడెంట్ లో కనియప్పన్ (ప్రభాకర్) అనే లోకల్ గూండా తమ్ముడు గాయపడతాడు. దీంతో కనియప్పన్ దాడికొస్తే, యాక్సిడెంట్ తన మీదేసుకుని వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటాడు నర్సింహా. వూళ్ళో ఒక ఏఎస్పీ వుంటాడు. ఇతను అలయ పూజారీని అవమానించడంతో పూజారులంతా ఆందోళనకి దిగుతారు. వాళ్ళని హింసించి ఫైరింగ్ చేయబోతే, నర్సింహా అడ్డుకుని క్షమాపణ చెప్పిస్తాడు. దీంతో నర్సింహా మీద పగ పెంచుకుంటాడు ఏఎస్పీ. ఇటు ధాన్య నర్సింహాని  ప్రేమిస్తుంది. ఇంతలో గాయపడిన తమ్ముడు చనిపోవడంతో నర్సింహాని  చంపెయ్యాలని వస్తాడు కనియప్పన్. ఈ పోరాటంలో గౌరీ వచ్చేస్తుంది. నర్సింహా దగ్గర్నుంచి బిడ్డని లాక్కుని,  మళ్ళీ మొహం చూపించ వద్దని వెళ్ళిపోతుంది. ఎవరీ గౌరీ? నర్సింహాకీ, గౌరీకీ మధ్య అసలేం జరిగింది? దీన్ని నర్సింహా ఎలా పరిష్కరించుకున్నాడు? ... అన్నదే మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ముందే చెప్పుకున్నట్టు ఇది ఫార్ములా @ 1999 ‘సమరసింహా రెడ్డి’ జానర్ కథ.  కాకపోతే ఫ్యాక్షన్ లేని ఫ్యామిలీ యాక్షన్. ఇద్దరు హీరోయిన్లు, పుట్టిన బిడ్డ,  భగ్నప్రేమ అనే రొటీన్ పాత ఫ్యామిలీ కథనే,  దీంతో సంబంధంలేని యాక్షన్ సబ్ ప్లాట్ తో కలిపి నడిపించే ప్రయత్నం చేశారు. బాలకృష్ణతో కథ అనగానే ఆయనకి  ప్రొఫెషనల్ బ్యాగేజీని కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆయనతో  1999 నుంచీ మారని అవే తరహా కథలొస్తున్నాయి. ఆ కథల్ని కూడా  అదే టైం జోన్ లో అలాగే పెట్టి చూపిస్తున్నారు. ప్రస్తుత కథకి టెంప్లెట్ 1999 నాటిదే అయినా,  ఫ్యామిలీ కంటెంట్ వచ్చేసి ఇంకా పురాతనమైనది. ఇది బాలకృష్ణకి కురచ అయిపోయింది. అయితే పండగ కథ (సినిమా) కాబట్టి ఇంత చాలు.

ఎవరెలా చేశారు 
      సీనియర్ స్టార్లు వాళ్ళ కాలంలో పాపులర్ చేసుకున్న పాత్రలు, కథలు వాళ్ళకొక బ్రాండ్ ఇమేజీ. ఆ బ్రాండ్ ఇమేజీతో వాళ్ళుండి పోతే ఎవరికీ అభ్యంతర ముండాల్సిన అవసరం లేదు. ఆ బ్రాండ్ ఇమేజీని నేటి యువస్టార్లు నిలువునా  పూసుకుని నటిస్తేనే ఎబ్బెట్టుగా వుంటుంది కాలం చెల్లిపోయి. అయినా ఎంత మంది యువస్టార్లు అలాటివే  సినిమాలు, పాత్రలు నటించడం లేదు ఇవ్వాళ ?  యువస్టార్ల హిట్టు ఫ్లాపులన్నీ,  సీనియర్ స్టార్లయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు వాళ్ళ కాలంలో పాపులర్ చేసుకున్న టెంప్లెట్సే. ఇందులో ఎలాంటి సందేహమూ పెట్టుకోనక్కర్లేదు. అలాంటప్పుడు ఇప్పుడు బాలకృష్ణ వచ్చేసి తన గేమే తాను ఆడుకుంటే వేలెత్తి చూపాల్సిన పనిలేదు. బాలకృష్ణ సినిమాలెలా వుంటాయో  తెలిసే వెళ్తారు ప్రేక్షకులు. ఆ టైటిల్సే చెప్తాయి.

          చూడాల్సింది వయసు పెరిగిన బాలయ్య ఇప్పుడెలా నటిస్తున్నారనేది. ఆయన బ్రహ్మాండంగానే  నటిస్తున్నారు. ‘సమరసింహా రెడ్డి’ @ 1999 లేకపోతే ఆయనొక తనదైన కొత్త బ్రాండ్  నటనని ప్రారంభించుకునే వారు కాదు. అదే ‘ముద్దుల మేనల్లుడు’ లు, ‘మంగమ్మగారి మనవడు’ ల టైపు నటనలతో వుండిపోయేవారు. ట్రేడ్ మార్క్ @ 1999 ఆయనకి పెద్ద ఎసెట్. ఇప్పుడొచ్చేసి  ఇంకో పరిణామక్రమంలో ఆయన్ని వూహించలేం. కాబట్టి ఇప్పుడు వున్న రౌద్ర రస పోషణకి, భగ్న ప్రేమికుడి టచ్ ఇచ్చారు. బాగానే వుంది కానీ, ముగింపు భగ్న ప్రేమికుడి త్యాగంగా కాకుండా వుండాల్సింది.  పాత్ర ప్రారంభ ముగింపులు చూస్తే ఒకదానికొకటి  వ్యతిరేకంగా, మిర్రర్ ఎఫెక్ట్ తో అద్భుతంగా వున్న మాట నిజమే. కానీ ఇది క్లాస్ కథకైతే బావుటుంది, మాస్ కథకి కాదు. భగ్నప్రేమికుడి ముగింపుగా కాక, సబ్ ప్లాట్ లోని యాక్షన్ హీరో ముగింపుగా ఇచ్చివుంటే  బాక్సాఫీసు అప్పీల్ పెరిగేది. 

          ఐతే భగ్న ప్రేమికుణ్ణి తీసుకున్నా,  యాక్షన్ హీరోని తీసుకున్నా రెండూ యమ స్పీడుతో వుండడం జరిగిన ఒక పెద్ద మేలు. భగ్న ప్రేమికుడితో ముగింపు తప్పిస్తే,  ఈ రెండు షేడ్స్ ఎక్కడా బోరు కొట్టవు.  ఒకచోట - భార్య చనిపోయినప్పుడు ఆయన సైలెంట్ గా వుండడం  ప్రేక్షకులు భరించ లేకపోయారు. బాలయ్యకీ జై అంటూ ఆయన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించారు. ఆయన డైలాగులు కొడుతూనే వుండాలి, ఎగిరేసి ఎగిరేసి కొడుతూనే వుండాలి తప్ప  సైలెంట్ గా వుంటే కాదు.  

          ఫైట్స్ లో ఎంత పవర్ఫుల్లో,  పాటల్లో అంతే పవర్ చూపించారు. ఈ పాటలు చూడ్డం మాంచి ఎంటర్ టైన్మెంట్ మనకి. ముగ్గురు హీరోయిన్లతో రోమాన్సు  ఎక్కడా చప్పగా లేదు. కాకపోతే పాత మోడల్ లో వుంది. పాత మోడల్లో ఇంకా చాలా వున్నాయి – పాటలు  ఫైట్లు తప్పితే. కామెడీ అంతా పాత మోడలే. కానీ బాలకృష్ణ  మొదలెట్టింది లగాయతు చివరి వరకూ ఎక్కడా బోరు కొట్టించ లేదు, అదే సమయంలో ఓవరాక్షన్ చేయలేదు. 

          నయనతారకి మంచిపాత్రే దొరికింది.  పాత మూస ఫార్ములా పాత్రలో గ్రేస్ ఫుల్ గా నటించింది. హాస్పిటల్లో అమెకి రెండు సార్లు జరిగే అదే అనుభవం ఈ కథ మొత్తానికి రెండు మూల స్థంభాల్లాంటివి. ఇలాటి విచిత్ర కాకతాళీయాలు పాత డినైస్ రాబిన్స్ సెంటిమెంటల్ రోమాంటిక్ నవలల్లో కన్పిస్తాయి. ఈమె నవలల్లోంచి కొన్ని హిందీ సినిమాలు కూడా కాపీ కొట్టారు. 

          బాలకృష్ణకి అసిస్టెంట్ మెకానిక్ గా మంచి పర్సనాలిటీగల హరిప్రియది పెడసరి పాత్ర. డ్రగ్ బానిస పాత్రలో నటాషాది అంత స్కోపు లేని పాత్ర. బ్రహ్మానందం చాలాకాలానికి తెరపైకొచ్చి  తన మార్కు కామెడీ నిర్మొహమాటంగా ఆడుకున్నారు. ఇప్పటికీ ఆయన కొంత మంది ప్రేక్షకుల్ని బాగానే నవ్వించ గల్గుతున్నారు. ఆశుతోష్ రాణా, ప్రభాకర్ లది వాళ్ళ రొటీన్ విలనీ.

          ఈ మాస్ మసాలా ప్రొడక్షన్ విలువలు రిచ్ గా వున్నాయి. మొన్న ‘టూ కంట్రీస్’  లో పేలవమైన కెమెరా వర్క్ చేసిన సీనియర్ రాం ప్రసాద్, తిరిగి  ఇప్పుడు తన రూటు లోకొచ్చి, వైభవోపేతంగా చిత్రీకరణ చేశారు.  ఇంకో హైలైట్ చిరంతన్ భట్ మ్యూజిక్, పాటలూ  ఎంతో ఫ్రెష్ గా వున్నాయి. దృశ్యాల్ని స్పీడుగా పరుగెత్తించిన ప్రవీణ్ ఆంథోనీ ఎడిటింగ్ కూడా హైలైటే. అలాగే రామ్  - లక్ష్మణ్ యాక్షన్ సీన్స్. ఇక కథ, మాటలు అందించిన రత్నం ఓల్డ్ స్కూలుకే కట్టుబడి పనిచేశారు. కథెలా వున్నా మాటలు బాగా రాశారు. తమిళ సీనియర్ దర్శకుడు తనకాలంలోనే వుండిపోయి, ఓల్డ్ స్కూలు దర్శకత్వంతోనే సరిపుచ్చారు. కథ. సన్నివేశాలు పాతవన్న మాటేగానీ, వాటిని నడిపించడంలో మాత్రం యమ స్పీడు పాటించారు.

చివరికేమిటి 
       మరో పండగ సినిమా. ఇంతే వుంటుంది. పండగ సినిమాలు పండగని డామినేట్ చేయకూడదు. మళ్ళీ ఇంటి కెళ్ళి పండగ పూర్తి చేసుకునేట్టు, హేంగోవర్ లేకుండా అలా అలా  పైపైన ‘పానీయం’ సిప్ చేసినట్టుండాలి. ఇక్కడ  రిలీఫ్ ఏమిటంటే, ఇది మరీ బ్యాడ్ గా లేకపోవడం. కారణం,  రిచ్ ప్రొడక్షన్ విలువలతో, చిన్నచిన్న సీన్లు వేగంగా పరిగెత్తడం. ఫస్టాఫ్ పూర్తయ్యేవరకూ కళ్ళు తిప్పుకోకుండా చూసేట్టు చేయడం. మళ్ళీ సెకండాఫ్ పూర్తయ్యే దాకా తల తిప్పుకోకుండా చూసేట్టు చేయడం. ప్రతీ చిన్న సీనూ ఏదోవొక సంఘటన జరుగుతుంది, లేదా మలుపు తీసుకుంటుంది. చైన్ రియాక్షన్ లా ఇవి కథని ముందుకు తోస్తూంటాయి. ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసి ఇచ్చిన ఫ్యామిలీ ట్విస్టు చాలా అనూహ్యమైనది. అసలు గతంలో ఏం జరిగుంటుందాని ఆలోచింప జేస్తుంది. ముగింపు  కూడా ఇలాటిదే ఫ్యామిలీ ట్విస్టుతో  ఆలోచనాత్మక మైనదే... కానీ యాక్షన్ జానర్ కి లోబడకుండా పోయింది.  సినిమా ప్రారంభం, ఇంటర్వెల్, ముగింపు సీన్లు ఫ్యామిలీ బేస్డ్ గా బాగానే వున్నాయి – ఈ ప్రారంభ మధ్యమ ముగింపులు శిల్పం చెడకుండా బాగానే వున్నాయి కానీ, కమర్షియాలిటీ కోసం శిల్పాన్ని చెడగొట్టక తప్పదు.  భగ్న ప్రేమికుడి పాసివ్ ముగింపుగా గాక, యాక్షన్ హీరో వీరోచిత ముగింపు ఇచ్చివుంటే కమర్షియాలిటీ వచ్చేది.


సికిందర్


.
         
         




                  





11, జనవరి 2018, గురువారం



ధన్యవాదాలు!
పాఠకులకి, పరిశ్రమ వర్గాలకి ధన్యవాదాలు. బ్లాగులో ‘అజ్ఞాతవాసి’ రివ్యూకి దేశవిదేశాల నుంచి వెల్లువలా హిట్స్ వస్తున్నాయి.  బ్లాగు చరిత్రలో ఇది రికార్డు.  మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తాం. కొందరు కొన్ని ప్రశ్నలు, వివరణలు అడిగారు. వాటికి త్వరలో  సమాధానం ఇవ్వగలమని తెలియజేస్తున్నాం.
సికిందర్