రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, జనవరి 2018, సోమవారం

578 : స్పెషల్ ఆర్టికల్

2017 లో వైవిధ్యం మూస మయమైన తెలుగు సినిమాలని కొత్త పుంతలు తొక్కించింది. కనీసం  పదిశాతం పెద్ద సినిమాలు నాన్ రెగ్యులర్ జానర్ కొకటి చొప్పున హిట్టయ్యాయంటే ప్రేక్షకులు మార్పుని ఆహ్వానిస్తున్నారనడానికి సంకేతం. జానపద ఫాంటసీ, చారిత్రాత్మకం, యుద్ధం, రాజకీయం, క్రీడలు, రోమాంటిక్ కామెడీ  మొదలైన ఆరు విభిన్న జానర్స్ తో వచ్చిన బిగ్ కమర్షియల్స్ ని హిట్ చేశారు ప్రేక్షకులు. 2017 ఇంకో ప్రత్యేకాకర్షణేమిటంటే, ఎనిమిదేళ్ళ తర్వాత చిరంజీవి మెగాస్టార్ గా మళ్ళీ తన  స్థానాన్ని కైవసం చేసుకోవడం, చాలా కాలం తర్వాత తిరిగి రాజశేఖర్ హీరోగా విజయం సాధించడం. అలాగే అగ్రనిర్మాత దిల్ రాజు రికార్డు స్థాయిలో ఆరు బిగ్ కమర్షియల్స్ నిర్మించి ఐదు విజయాలు సాధించడం. స్టార్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఈ సంవత్సరంకూడా ఫ్లాపుల బాధనుంచి కోలుకోలేకపోవడం  ఇంకో ఆకర్షణ. అలాగే చిరంజీవితో బాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సీనియర్ స్టార్లు నల్గురూ తమ హవా కొనసాగించుకోవడం, తాజా స్టార్ అక్కినేని అఖిల్ రీ రన్ కోసం రావడంలాంటి చమత్కారాలు కూడా జరిగాయి. అయితే ఫ్లాపుల మాటేమిటి? మొత్తం 43 మంది స్టార్లు, హీరోలు కలిసి ఎన్ని హిట్లు ఇచ్చారు? ఎన్ని ఫ్లాపులిచ్చారు?  అసలే హిట్టివ్వలేని వాళ్ళెందరు? అన్నీ హిట్లిచ్చిన వాళ్ళెవరు? ... ఒకసారి వివరాల్లోకి వెళ్లి చూద్దాం...

స్టార్లు / హీరోలు  : హిట్లు ఫ్లాపులు
         
1. చిరంజీవి:  ఖైదీ నెం -150 (హిట్), 2. బాలకృష్ణ : గౌతమీ పుత్ర శాతకర్ణి (హిట్), పైసా వసూల్ (ఫ్లాప్), 3. నాగార్జున : ఓం నమో వెంకటేశాయ (ఫ్లాప్),  రాజు గారి గది -2 (ఏవరేజ్), 4. వెంకటేష్ : గురు (హిట్), 5. రాజశేఖర్ : గరుడవేగ, (ఏవరేజ్),6. జగపతి బాబు : పటేల్ సర్ (ఫ్లాప్), 7. పవన్ కళ్యాణ్ : కాటమరాజు (ఫ్లాప్), 8. మహేష్ బాబు :  స్పైడర్ (ఫ్లాప్), 9. ఎన్టీఆర్ :  జై లవకుశ (హిట్), 10. రవితేజ :  రాజా ది  గ్రేట్ (హిట్), 11. ప్రభాస్ : బాహుబలి -2  (హిట్), 12. అల్లు అర్జున్ :  దువ్వాడ జగన్నాధం (హిట్), 

        13. గోపీచంద్ : గౌతమ్ నందా (ఫ్లాప్), ఆక్సిజన్(ఫ్లాప్), 14. నితిన్ : లై (ఫ్లాప్), 15. నరేష్ : మేడ మీద అబ్బాయి (ఫ్లాప్),  16. నాని : నేను లోకల్ (హిట్), నిన్న కోరి (హిట్), ఎం సి ఏ (హిట్), 17. శర్వానంద్ : రాధ (ఫ్లాప్), శతమానం భవతి (హిట్), మహానుభావుడు (హిట్), 18. రానా : ఘాజీ (హిట్ ),  నేనే రాజు నేనే మంత్రి, (హిట్),  19. సాయి ధరమ్ తేజ్ :  విన్నర్ (ఫ్లాప్), జవాన్ (ఫ్లాప్),  20. నాగ చైతన్య : రారండోయ్ వేడుక చూద్దాం (హిట్),  యుద్ధం శరణం (ఫ్లాప్), 21. అఖిల్ :  హలో (ఏవరేజ్),  22. రామ్ : ఉన్నది ఒకటే జీవితం (ఏవరేజ్), 12. విజయ్ దేవరకొండ : ద్వారక (ఫ్లాప్), అర్జున్ రెడ్డి (హిట్), 24. సందీప్ కిషన్ : కేరాఫ్ సూర్య (ఫ్లాప్),  25. రాజ్ తరుణ్ : అంధగాడు (ఏవరేజ్), కిట్టు ఉన్నాడు జాగ్రత్త (ఏవరేజ్), 

         26. అవసరాల శ్రీనివాస్ : బాబు బాగా బిజీ (ఫ్లాప్), అమీతుమీ (హిట్), 27. నారా రోహిత్ : కథలో రాజకుమారి (ఫ్లాప్) బాలకృష్ణుడు (ఫ్లాప్),  28. విష్ణు : మా అబ్బాయి (ఫ్లాప్) , మెంటల్ మదిలో(ఫ్లాప్), 29. మంచు విష్ణు : లక్కున్నోడు (ఫ్లాప్),  30. మంచు మనోజ్ : గుంటూరోడు (ఫ్లాప్), ఒక్కడు మిగిలాడు (ఫ్లాప్), 31. వరుణ్ తేజ్ : మిస్టర్ (ఫ్లాప్),  ఫిదా (హిట్), 32. ఆది : నెక్స్ట్ నువ్వే (ఫ్లాప్), 33. బెల్లంకొండ శ్రీనివాస్ : జయజానకీ నాయక (ఏవరేజ్), 34. సుమంత్ :  మళ్ళీరావా (ఏవరేజ్), 35. సుమంత్ అశ్విన్ : ఫ్యాషన్ డిజైనర్ (ఫ్లాప్), 36. సాయి రాం శంకర్ : నేనోరకం (ఫ్లాప్),  37. నందమూరి తారక రత్న : రాజా మీరు కేక (ఫ్లాప్), 38. సునీల్ : ఉంగరాల రాంబాబు (ఫ్లాప్)  2 కంట్రీస్ (ఫ్లాప్),  39. సప్తగిరి : సప్తగిరి ఎల్ఎల్బీ (ఫ్లాప్), 40. నిఖిల్ : కేశవ (ఎవరేజ్). 41. నారాయణమూర్తి :  హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (ఫ్లాప్) 

          1. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ : నక్షత్రం (ఫ్లాప్), 2. సందీప్ కిషన్ : నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది : శమంతక మణి (ఫ్లాప్) , 3. అల్లు శిరీష్, అవసరాల శ్రీనివాస్ : ఒక్క క్షణం (ఏవరేజ్)

          మొత్తం 43 మంది స్టార్లు / గుర్తింపు వున్న హీరోలు  62 సినిమాలు నటించారు. వీటిలో 17  హిట్టయ్యాయి, 9 ఎవరేజిగా , 36 ఫ్లాపులుగా తేలాయి. అంటే 27 శాతం హిట్టయ్యాయి. ఎవరేజిల శాతం 15 వుంటే, అపజయాల శాతం 58 వుంది. అంటే సగానికి పైగా ఫ్లాపయ్యాయి. ఇతర చిన్నా చితకా లోబడ్జెట్ సినిమాలు 94 వరకూ విడుదలయ్యాయి. ఇవి నూటికి నూరు శాతమూ అట్టర్ ఫ్లాపయ్యాయి. ఈ ఫ్లాపులు కాక పూరీ జగన్నాథ్, జయంత్ సి. పరాన్జీ, బి. జయ, సునీల్ కుమార్ రెడ్డి, విజయేంద్ర ప్రసాద్ లు ఇతరులతో తీసిన ఇంకో ఐదు సినిమాలున్నాయి. మొత్తం అందరి సినిమాలూ  కలుపుకుంటే, 161 విడుదలయ్యాయి. ఈ మొత్తంలో 17 మాత్రమే హిట్స్ అంటే 10. 5 శాతం మాత్రమే విజయం. ప్రతీ ఏటా మొత్తం నిర్మించిన సినిమాల్లో విజయాల శాతం 10 కి  అటు ఇటుగా వుంటున్నది తెలిసిందే.  ఈ యేడూ ఇదే కొనసాగింది తప్ప మార్పులేదు.  హిట్స్ అయినా, ఎవరేజీలైనా స్టార్లు / గుర్తింపు వున్న హీరోలు నటించిన సినిమాలకే దక్కాయి. ఈ కేటగిరీలో చిన్న సినిమలెక్కడాలేవు. 

          చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్, అల్లు అర్జున్ లు ఒక్కొక్కరు ఒక్కో  సినిమా నటిస్తే ఆ ఒక్కటీ హిట్టయింది. నాని మూడు నటిస్తే మూడూ హిట్టయ్యాయి. శర్వానంద్ మూడు నటిస్తే రెండు హిట్స్, ఒక ఫ్లాప్ వచ్చాయి. నటించిన ఒకటి హిట్టయి, ఒకటి ఫ్లాపయిన వాళ్ళల్లో బాలకృష్ణ, నాగచైతన్య, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, అవసరాల శ్రీనివాస్ వున్నారు. రాజశేఖర్, రామ్, నిఖిల్, అఖిల్, సుమంత్  లు ఒక్కటి నటిస్తే ఎవరేజి అయ్యాయి. నటించిన రెండూ ఎవరేజి అయిన హీరో రాజ్ తరుణ్. నటించిన ఒక్కటీ ఫ్లాపయిన వాళ్ళల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నితిన్, జగపతి బాబు, నరేష్, సందీప్ కిషన్, ఆది, సప్తగిరి, సుమంత్ అశ్విన్, సాయి రాం శంకర్, తారక రత్న, నారాయణ మూర్తి వున్నారు.  

          రెండు నటించి రెండూ హిట్టయిన ఏకైక హీరో రానా వుంటే, రెండు నటించి రెండూ ఫ్లాపయిన హీరోల్లో  గోపీచంద్, సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, సునీల్ వున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, సుధీర్ బాబులు నటించిన ‘మల్టీ స్టారర్స్’ రెండూ ఫ్లాపయ్యాయి. ఇంకో అల్లు శిరీష్, అవసరాల శ్రీనివాస్ ల  ‘మల్టీ స్టారర్’ –‘ఒక్క క్షణం’ ఎవరేజి అన్పించుకుంది.
***
          హిట్టయిన 17 లో ఐదు రెగ్యులర్ కమర్షియల్స్ ని ఆదరించారు ప్రేక్షకులు (ఖైదీ నెం -150, జై లవకుశ, రాజా ది గ్రేట్, దువ్వాడ జగన్నాథం, నేను లోకల్, ఎంసీఏ). ఒక జానపద ఫాంటసీ (బాహుబలి -2), ఒక చారిత్రాత్మకం (గౌతమీపుత్ర శాతకర్ణి), ఒక రాజకీయం (నేనే రాజు నేనే మంత్రి), ఒక యుద్ధం (ఘాజీ), ఒక క్రీడలు (గురు), రెండు ఫ్యామిలీలు (శతమానం భవతి, రారండోయ్ వేడుక చూద్దాం), మూడు రోమాంటిక్ డ్రామాలు (నిన్నుకోరి, ఫిదా, అర్జున్ రెడ్డి, మహానుభావుడు), ఒక రోమాంటిక్ కామెడీ (అమీతుమీ) వగైరాలని కూడా ఇష్టపడ్డారు. 

          ఫ్లాపయిన 36 లో 13  రెగ్యులర్ కమర్షియల్స్ వున్నాయి : పైసా వసూల్, కాటమ రాయుడు, మిస్టర్, గౌతమ్ నందా, ఆక్సిజన్, రాధ, జవాన్, విన్నర్, యుద్ధం, బాల కృష్ణుడు, మా అబ్బాయి, లక్కున్నోడు, గుంటూరోడు మొదలైనవి. మరి ఇలాటివే టెంప్లెట్స్ అయిన ఐదింటినీ  (ఖైదీ నెం -150, జై లవకుశ, రాజా ది గ్రేట్, దువ్వాడ జగన్నాథం, నేను లోకల్, ఎంసీఏ) హిట్ చేశారు ప్రేక్షకులు. మొత్తం 18 టెంప్లెట్స్  విడుదలైతే వాటిలో ఐదింటినే ఇష్టపడ్డారు ప్రేక్షకులు ఎంత హంగామా చేసినా. ఇవి ఆగుతాయా? ఆగవు, 2018 లో ఇంకా జూలు విదిలిస్తూనే వుంటాయి. 

          హిట్టయిన 17 లో జానపద ఫాంటసీ, చారిత్రాత్మకం,  రాజకీయం, యుద్ధం, క్రీడలు, రోమాంటిక్ కామెడీ – ఇవి జానర్ కొకటి చొప్పున ఆరు వచ్చినా ఆరింటినీ  హిట్ చేశారు ప్రేక్షకులు. ఇంకో రెండు కుటుంబాలు, మూడు రోమాంటిక్ డ్రామాలు ప్రేక్షకులకి నచ్చాయి. ఇలా 6 వైవిధ్య భరిత జానర్స్,  5  రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్స్, 3 మూడు రోమాంటిక్ డ్రామాలు, 2 కుటుంబాలు.... ఇంతే  2017 లో ప్రేక్షకులు సెలెక్టు చేసుకున్నా మని చెప్తున్న ఎంటర్ టైన్మెంట్ ప్యాకేజీ. 

          ఏవరేజిగా స్కోర్ చేసిన తొమ్మిదిలో మూడు యాక్షన్లు (గరుడ వేగ,  కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, కేశవ),  మూడు  రోమాంటిక్ డ్రామాలు (హలో, ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ రావా), ఒక రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ (జయజానకీ నాయక),  ఒక హార్రర్ డ్రామా (రాజుగారి గది -2) వున్నాయి. టెంప్లెట్ ని వదిలేస్తే, మిగిలిన వాటిని జానర్ మర్యాదలో పెట్టి హిట్ చేసుకుని వుండొచ్చు. జానర్ మర్యాద లోపించడం వీటిని ఎవరేజీ దగ్గరాపేసింది. హలో, మళ్ళీ రావాల్లో పిల్లల కథ ఎక్కువైపోయింది. 

          36 ఫ్లాపుల్లో పైసా వసూల్, కాటమ రాయుడు, మిస్టర్, గౌతమ్ నందా, ఆక్సిజన్, రాధ, జవాన్, విన్నర్, యుద్ధం, బాల కృష్ణుడు, మా అబ్బాయి, లక్కున్నోడు, గుంటూరోడు మొదలైన 13 రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్సే గాకుండా, ఒక భక్తి  (ఓం నమో వెంకటేశాయ), ఒక సైకో (స్పైడర్), ఒక స్పై (లై), ఒక హార్రర్ కామెడీ (నెక్స్ట్ నువ్వే), మూడు యాక్షన్లు ( పటేల్ సర్, నేనోరకం, రాజా మీరు కేక), మూడు రోమాంటిక్ కామెడీ / డ్రామాలు (ద్వారక, కేరాఫ్ సూర్య, కథలో రాజకుమారి, మెంటల్ మదిలో), ఆరు కామెడీలు (ఫ్యాషన్ డిజైనర్, మేడమీద అబ్బాయి, ఉంగరాల రాంబాబు, 2 కంట్రీస్, సప్తగిరి ఎల్ఎల్బీ), రెండు ‘మల్టీ స్టారర్’ లు (నక్షత్రం, శమంతకమణి), ఒక సామాజికం( హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య) వున్నాయి. 

          మొత్తం 62 లో 9 రీమేకులున్నాయి : ఖైదీ నెం -150 (తమిళం), కాటమరాయుడు (తమిళం), గురు (తమిళం), రాజుగారి గది -2 (తమిళం),  ఒక్కడు మిగిలాడు (తమిళం), నెక్స్ట్ నువ్వే (తమిళం), మేడమీద అబ్బాయి (మలయాళం),  2 కంట్రీస్ (మలయాళం), బాబు బాగా బిజీ (హిందీ), సప్తగిరి ఎల్ ఎల్బీ (హిందీ). వీటిలో చిరంజీవి, వెంకటేష్ ల ఖైదీ నెం -150, గురు మాత్రమే హిట్టయి, నాగార్జున  నటించిన రాజుగారి గది -2 మాత్రమే ఎవరేజ్ అయింది. మిగిలిన ఆరూ అట్టర్ ఫ్లాపయ్యాయి. తెలుగులో టాలెంట్ లేదనుకుని పక్క భాషల కేసి చూడ్డం, తెచ్చుకుని ఫ్లాప్ చేసుకోవడం. డిఫరెన్స్ ఏమిటి? తెలుగులో వున్న టాలెంటునే వాడుకుంటే రీమేక్ హక్కుల డబ్బులు మిగిలి చవకలో నష్టపోవచ్చుగా? 2017 నుంచి కూడా ఇది తెలుసుకోకపోతే 2018 దండగ!

          ద్విభాషా చిత్రంగా కేరాఫ్ సూర్య ఒకటే వచ్చి, అది ఆడకపోతే ఆ దర్శకుడు మార్పుచేర్పులు చేసి,  అయినా  ఆడకపోతే మళ్ళీ మార్పుచేర్పులు చేసి, మళ్ళీ విడుదల చేస్తానని ప్రకటించాడు. ఇలాటి దర్శకుణ్ణి ఎక్కడా చూడలేదు. యంగ్  స్టార్స్ తో మూడు ‘మల్టీ స్టారర్లు’ వస్తే ఒకటే ఎవరేజి అన్పించుకుంది, రెండు ఫ్లాపయ్యాయి. 

          అన్నిరకాల సినిమాలూ తీశారు. అయితే ఆరు నాన్ రెగ్యులర్  జానర్స్ లో తీసినవే ఫ్లాప్ కాలేదు. నాన్ రెగ్యులర్ జానర్స్ లో రెగ్యులర్ జానర్ అయిన రోమాంటిక్ కామెడీని చేర్చడమెందుకంటే, ఎన్నడూ లేనివిధంగా – దాదాపు ‘ఆహనాపెళ్ళంట’  నాటినుంచీ - ఎరుగని అచ్చమైన జానర్ మర్యాదతో కూడిన రోమాంటిక్ కామెడీగా  ‘అమీతుమీ’ మాత్రమే వచ్చింది కాబట్టి. మిగిలిన వాటిలో  రెగ్యులర్ టెంప్లెట్స్ , రోమాంటిక్ కామెడీలు / డ్రామాలు, యాక్షన్లూ  మొదలైన ఎప్పుడూ వచ్చి పడుతూ వుండే కమర్షియల్స్ లోనే హిట్లు తక్కువ, ఫ్లాపులెక్కువగా వున్నాయి. వీటికి దూరంగా నాన్ రెగ్యులర్ జానర్స్  తీస్తే ఢోకా వుండదని తేలుతోంది.  
(రేపు స్టార్ల సంగతులు)

-సికిందర్  


         
         
         
         

         







29, డిసెంబర్ 2017, శుక్రవారం

577 ; రివ్యూ!




ర్శత్వం : ఎన్‌.శంకర్
తారాగణం : సునీల్, నీషా రాజ్, షాయాజీ షిండే శ్రీనివాసరెడ్డి, సితార, ఝాన్సీ, చంద్రమోహన్, కృష్ణవాన్, రేష్ దితరులు
సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రణం:  సి.రాంప్రసాద్, మాటలు: శ్రీధర్ సీపాన
బ్యానర్ :  హాలక్ష్మి ఆర్ట్స్
నిర్మాత : ఎన్. శంకర్
విడుదల : డిసెంబర్ 29, 2017

***
          మర్షియల్ హీరో కలతో కామెడీని పరిత్యాగం చేసిన సునీల్ పరుగు ఇంకా కొనసాగుతూనే వుంది ఒక హిట్ కోసం.  హిట్ ఆయనకి  కొట్టలేని ఉట్టి  అవుతూనే వుంది. ఎందరో  నిర్మాతలు, దర్శకులు ఆయన్ని పిరమిడ్లు వేసుకుని భుజాన మోసినా హిట్టు అనే ఉట్టి  కామెడీగా గట్టి పోటీ ఇస్తూనే వుంది. ఇదంతా అనవసరమని,  తాజాగా దర్శకుడు ఎన్. శంకర్ తనే నిర్మాత అయి,  సునీల్ కోసం కాదుగానీ అవకాశాలు తగ్గిన తనకోసం రంగులరాట్నం ఎక్కారు. అమ్మా చూడాలీ... నిన్నూ నాన్నను చూడాలీ... నాన్నకు ముద్దు ఇవ్వాలి ... నీ వొడిలో నిద్దుర పోవాలీ ... అంటూ సినిమా ప్రారంభంలోనే పాట పెట్టి విజయాన్ని వేడుకున్నారు. మరి విజయం వరించిందా? ప్రేక్షకులు తరించారా? సునీల్ పరిస్థితేంటి? ఇవి ఒకసారి పరిశీలిద్దాం...

కథ 
     వెంకటాపురంలో ఉల్లాస్ (సునీల్) డబ్బుకోసం మోసాలు చేస్తూంటాడు. సులభంగా ధనవంతుడైపోవాలని  కలలు గంటాడు. వూళ్లోనే డబ్బు  పిచ్చిగల పటేల్ (సాయాజీ షిండే) అనే వడ్డీ వ్యాపారికి ఉల్లాస్ నచ్చి చెల్లెల్ని ఇవ్వాలనుకుంటాడు. అలాగేనని మాటిచ్చిన ఉల్లాస్ కి అమెరికా సంబంధం వస్తుంది. ఆ అమ్మాయి లయ (మనీషా రాజ్) చిన్నప్పటి ఫ్రెండే కావడంతో ఆమెని చేసుకుని పటేల్ కి పగ పెంచుతాడు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత  లయ తాగుబోతు అని తెలిసేసరికి,  ఏమీ చేయలేక ఆమెతో అమెరికా వెళ్లి కష్టాలు పడతాడు. ఆమెని మార్చడానికి  ప్రయత్నిస్తాడు. ఇంతలో మొదట ఉల్లాస్ డబ్బుకోసం వేరే సంబంధం చూశాడని, డబ్బు కోసమే తనని చేసుకున్నాడనీ లయకి తెలిసి విడాకుల కేస్తుంది. ఇప్పుడు ఉల్లాస్ ఏం చేశాడు? తాగుడు వల్ల ఆరోగ్యం చెడిన లయ ఏమయ్యింది? చివరికి వీళ్ళిద్దరి కాపురం నిలబడిందా?... ఇవీ మిగతా కథలో తేలే అంశాలు.

ఎలావుంది కథ 
    
      ఇదే పేరుతో రఫీ రాసి, షఫీ తీసిన మలయాళ కథ ఇది. రఫీ షఫీల రాతతీతలు ఫ్రెష్ గా వుంటాయి. 50 కోట్లు వసూలు చేసిన ఈ కామెడీని తెలుగులో రీమేక్ కి తీసుకున్నారు. తెలుగు మర్యాదలన్నీ చేసి ఐదు కోట్లకి కూడా కొరగాకుండా చేశారు. 2015 లో తీసిన మలయాళం ని 1995 నాటి తెలుగులో తీశారు. సునీల్ ని ఆ కాలంలోకి పంపి చేతులు దులుపుకున్నారు.  మళ్ళీ సునీల్ 22 ఏళ్ళు  ప్రయాణించి రావాలి. అమ్మా చూడాలీ... అని ఈ కథకి శ్రీకారం చుడుతూ సినిమా మొదట్లోనే పాడుకున్న సునీల్ పాపం పసివాడు. శంకర్ ఎక్కించిన విమానం కూలి ఎడారిలో తప్పిపోయేలా చేసింది ఈ కథతో చేసిన ప్రయత్నం. శంకర్ ఎక్కిన రంగులరాట్నం కూడా రాంలీలా మైదానంలో అదేదోలాగా మారింది. 


ఎవరెలా చేశారు?
      ప్రాస డైలాగులతో సునీల్ నవ్వించాలనుకోవడం అత్యాశ. ప్రాసల పస తీరింది. రాసిన రచయిత ఈ కాలంలో లేడు. మలయాళంలోని సున్నిత హాస్యం సునీల్ వల్ల కాదేమో. యాక్షన్ హీరోగా మారేక నటనలో అభివృద్ధి చెందడం మానేసినట్టు కన్పిస్తోంది. పాత్రలోకి ప్రవేశించకుండా,  పైపైన పేలవమైన ఎక్స్ ప్రెషన్స్ తో సరిపెట్టాడు. తన కామెడీ పాత్రకి ఎక్కడా ఒక్క ప్రేక్షకుడూ నవ్వక పోవడమన్నది - కనీసం కింది తరగతుల మాస్ సోదరులు కూడా ఔదార్యం చూపకపోవడమన్నది - తన కమర్షియల్ హీరో లక్ష్యాలని పునరాలోచించుకోవాల్సిన  అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈసారి సునీల్ గట్టిగా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. మలయాళంలో దిలీప్ నిలబెట్టిన ఒక్క సీనూ నటించ లేకపోయాడు. 


       హీరోయిన్ మనీషా రాజ్ మలయాళంలో మమతా మోహన్ దాస్ లోని టాలెంట్ లో సగం కూడా ప్రదర్శించ లేకపోయింది. అంతా  ప్లాస్టిక్ నటనే. ఇక ఇతర నటుల గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. 

          సాంకేతిక విలువల కోసం బాగా ఖర్చుపెట్టారు. మలయాళంలో  ఇంత ఖర్చు పెట్టలేదు. కేరళ నేటివిటీ ఉట్టి పడేలా,  ఒద్దికగా తక్కువ బడ్జెట్లోనే అందంగా ట్రెండీ కామెడీ తీశారు. రెండిటి సంగీత దర్శకుడు గోపీ సుందరే. కానీ ఒరిజినల్ కిచ్చిన క్వాలిటీలో సగం కూడా  తెలుగుకివ్వలేదు. ఇవ్వాలంటే పిల్ల తెమ్మెర లాంటి ఆ ఫీల్, తాజాదనం  కన్పించాలిగా . నాటు కామెడీ తీస్తే ఏమిస్తాడు. ఆర్ ఆర్ చాలా హారిబుల్ గా వుంది. ఇక రాంప్రసాద్ కెమెరా కూడా పాత ఫ్యాషన్ గా చిత్రీకరించుకొచ్చింది. రెండు మూడు ఇండోర్స్ లో తప్పితే ఎక్కడా కష్టపడినట్టు కన్పించదు. 

          మేకింగ్ చాలా  అవుట్ డేటెడ్ గా  వుండడమే గాక, చెవులు పగిలేలా నటులందరూ గట్టిగా అరిచి మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సభలా తయారు చేసిపెట్టారు. మొదటి షాట్ నుంచీ చివరి వరకూ సినిమా అంతటా అరుచుకుంటూ మాట్లాడుకోవడమే వుంటుంది. దీన్ని విజువల్ మీడియా అంటారా? 

          దర్శకుడు శంకర్ తిరిగి మేకింగ్ గురించి కొత్త పాఠాలు  నేర్చుకుని అప్డేట్ అయితే తప్ప ఇక ముందు  కష్టమే. ముందుగా తన బ్యాడ్ రైటింగ్, బ్యాడ్ డైరెక్టింగ్ గుర్తించ గలిగితే మంచిది.

సికిందర్  





         


28, డిసెంబర్ 2017, గురువారం

576 : రివ్యూ!



రచన -  ర్శత్వం: విఐ.ఆనంద్
తారాగణం: అల్లు శిరీష్, సురభి, అవరాల శ్రీనివాస్, శీరత్ పూర్, దాసరి అరుణ్ కుమార్,  జయప్రకాష్, కాశీ విశ్వనాథ్, రోహిణి, ప్రవీణ్, త్య దితరులు
సంగీతం: ణిశర్మ, ఛాయాగ్రణం: శ్యాం కె.నాయుడు, మాటలు: అబ్బూరి వి
బ్యానర్ : ల
క్ష్మీ సింహా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత
‌: క్రి చిగురుపాటి
విడుదల : డిసెంబర్ 28, 2017
***

        అల్లు శిరీష్  నిదానంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రయాణం సాగిస్తున్నాడు. ఈసారి వైవిధ్యమున్న సినిమా చేయాలనే ఉద్దేశంతో రోమాంటిక్ థ్రిల్లర్ కి సిద్ధమయ్యాడు. కొత్త ఆలోచనతో వచ్చిన దర్శకుడు విఐ ఆనంద్ కి అవకాశమిస్తూ రోమాంటిక్ థ్రిల్లర్స్ కొక కొత్త రూపు నివ్వాలని సంకల్పించాడు. ఇందుకు ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రయత్నించాడు. కమర్షియల్ గా కొత్త ప్రయోగాలూ చేయాల్సిందే. అయితే ప్రస్తుత ప్రయోగం ఏ మేరకు ఔరా అన్పించుకుంది? హౌరా ఎక్స్ ప్రెస్ లా దూసుకెళ్ళిందా? వైరల్ అయిందా? ఓసారి చూద్దాం...

కథ 
      తొలిచూపులోనే జ్యోత్స్న (సురభి) ని ప్రేమిస్తాడు జీవా (అల్లు శిరీష్). ఆమె కూడా ప్రేమిస్తుంది. జీవాకి ఫోకస్ ఎక్కువ. అనుకున్నది  సాధించే వరకూ నిద్రపోడు. ఆమెకి మనుషుల్ని పరిశీలించే ఆసక్తి ఎక్కువ. ఎదుటి ప్లాట్ లో వుంటున్న శీను (అవసరాల శ్రీనివాస్), స్వాతి (సీరత్ కపూర్) లు ఘర్షణ పడుతూండడాన్ని ఆమె గమనించి జీవాకి చూపిస్తుంది. శీను బారి నుంచి స్వాతిని కాపాడమని కోరుతుంది. జీవా  శీనుని కలుసుకుంటే,  అతను స్వాతితో తన ప్రేమ కథ చెప్తాడు. అది అచ్చం జ్యోత్స్నతో తన ప్రేమలాగే వుందన్పిస్తుంది జీవాకి. అంతేగాక,  శీనుకి జరిగే సంఘటనలే తర్వాత తనకీ  జరుగుతున్నాయని గ్రహిస్తాడు. ఒక రోజు శీను స్వాతిని  చంపేస్తాడు. ఆందోళనతో జీవా, జ్యోత్స్నాలు మహ్మద్ అస్తేకర్ (జయప్రకాష్) అనే ప్రొఫెసర్ ని కలుసుకుంటే, అతను ఇది విధి అనీ, దీనికి పారలల్ లైఫ్ థియరీ వుందనీ చెప్పుకొస్తాడు. ఇప్పుడు చూస్తే దీని ప్రకారం శీను స్వాతిని చంపినట్టే తను జ్యోత్స్నని చంపేస్తాడా?  ఇప్పుడేం చేయాలి? ఇది విధియే  అయితే దీన్నెలా ఎదుర్కొని జ్యోత్స్నని కాపాడుకోవలన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      పారలల్ లైవ్స్  - సమాంతర జీవితాల థియరీ మనుషులకే గాక విశ్వానికీ  వుంది. మనుషుల విషయాని కొస్తే వందేళ్ళ తేడాతో అమెరికా అధ్యక్షులు అబ్రహాం లింకన్, జాన్ ఎఫ్ కెనెడీలకి ఒకేలా జరిగిన సంఘటనలు నమ్మలేని నిజాలుగా వున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ కాన్సెప్ట్ తో  2010 లో ‘పారలల్ లైఫ్’ అనే కొరియన్ థ్రిల్లర్ వచ్చింది. ఇందులో ఒక జడ్జి కుటుంబం ఇవ్వాళ హత్యకి గురయినట్టే,  ముప్ఫై ఏళ్ల  క్రితం అప్పటి ఒక జడ్జి కుటుంబం హత్యకి గురయి వుంటుంది. ఇద్దరి హంతకులు ఆ జడ్జీలు శిక్ష విధించిన నేరస్థులే.  అయితే ఇప్పటి జడ్జి కుటుంబంలో కూతురు హత్యకి గురి కాకుండా మిగులుతుంది. పారలల్ లైఫ్ థియరీ ప్రకారం ఈమెని కూడా హంతకుడు  జైల్లోంచి తప్పించుకొచ్చి  చంపేస్తాడా అన్నది కథ. దీనికి లింకన్ – కెనెడీల జీవితాలే స్ఫూర్తి అని సినిమాలో స్పష్టం చేస్తారు. 

          ‘ఒక్క క్షణం’ కథకి  కూడా లింకన్ – కెనెడీల జీవితాలనే  స్పూర్తిగా చూపిస్తారు. ఐతే లింకన్ – కెనెడీల జీవితాలూ, దీని స్ఫూర్తితో కొరియన్ కథా సమాంతర జీవితాలే గానీ అవి ఒకే కాలంలో జరగవు. దీనికి భిన్నంగా ‘ఒక్క క్షణం’ లో రెండు కథలూ ఏకకాలంలో సమాంతరంగా జరుగుతాయి. పైగా ఇది ప్రేమ కథ. దీన్ని ప్రేమ వర్సెస్ విధి అన్నారు. కానీ కథా నిర్వహణలో పారలల్ లైఫ్ కాన్సెప్ట్ ని  విధివిలాసపు కథనంగా చూపడంలో విఫలమై,  రొటీన్ మర్డర్ మిస్టరీగా నడిపారు. ఎంచుకున్న కాన్సెప్ట్ లో ఏ కథని నడపాలో ఆ కథని గుర్తించి దాన్ని నడపలేకపోయారు. హీరో ఫోకస్ వున్న తెలివైన కుర్రాడన్నారు గానీ కథని కూడా ఫోకస్ లో వుంచాలని అనుకోలేదు కథకుడు. ఇంకొకటేమిటంటే, ఈ రోమాంటిక్ థ్రిల్లర్ జానర్ని రోమాంటిక్ డ్రామాగా  చేసేశారు. దీంతో రోమాన్స్ వర్సెస్ విధి అనే థ్రిల్లర్ జానర్ కథకి హుషారు కూడా లేకుండా పోయింది. గతవారం రోమాన్స్ వర్సెస్ విధి కథ ‘హలో’ హుషారైనది. థ్రిల్లర్స్ అంటే అద్భుతరస కథలు. ఇవి ఏడ్పిస్తూ వుండవు. అడ్వెంచర్స్ చేస్తూ వుంటాయి. కథలో విషాదమున్న అద్భుతరస  కథలకి ‘ముత్యాలముగ్గు’  ఎప్పుడూ మార్గదర్శిగా  వుం టుందని ఎన్నోసార్లు చెప్పుకున్నాం.  ఇందులో సంగీతది విషాద కథే. కానీ ఈ విషాద కథకి - ఆమె సమస్య తీర్చడానికి - ఆమె పిల్లలు పాల్పడేది హుషారైన - నవ్వించే – అడ్వెంచరస – అద్భుతరస కథనం!  ఇది అంత హిట్టవడానికి ఇదీ యూనిక్ సెల్లింగ్ పాయింట్- ఇది ‘ఒక్క క్షణం’ లో పూర్తిగా లోపించింది. ఏం  చెబుతున్నారో అర్ధంగాకుండా పోయింది. 

ఎవరెలా చేశారు 
       శిరీష్ తన స్థాయి మేరకు నటించాడు. ఇంకా ఇది తనకి శిక్షణా కాలమే. ఇంకెన్ని సినిమాలు  నటిస్తే శిక్షణ పూర్తవుతుందో తెలీదు. శిక్షణ కోసమన్నట్టు నటించిన ఈ థ్రిల్లర్ లో, మిగతా  భావోద్వేగాల ప్రకటన అతడి ముఖంలో ఎలా వున్నా, భావోద్రేకాలకి లోనైనప్పుడు ముఖంలో ఆ మేరకు టచప్స్ ఇవ్వాల్సింది. ఆ సమయంలో కూడా తేటగా గ్లామరస్ గా వుంటే నటిస్తున్నట్టే లేదు. చుక్క చెమట కూడా పట్టని భావోద్రేకాలు తేలిపోతాయి.  ఇక ప్రేమ సన్నివేశాలూ, కామెడీ ఇవి మామూలే. వీటితో నటుడన్పించుకోవడం సాధ్యపడదు. యాక్షన్ దృశ్యాల్లో, పాటల్లో మాత్రం అభివృద్ధి కనబర్చాడు. ఐతే ఒక కథానాయకుడుగా పాత్రని అడ్వెంచరస్ గా మారకుండా అడ్డుపడింది దారితప్పిన కథనమే. కాన్సెప్ట్ ప్రకారం తను రోమాంటిక్ థ్రిల్లర్ కథా నాయకుడై వుంటే చాలావరకూ తన లోపాలు కవరై వుండేవి. 

          ఇక హీరోయిన్ సురభికి నటించే అవకాశం దక్కిన పాత్రే ఇది – దేనికీ ఈ నటన? రోమాంటిక్ థ్రిల్లర్ కథానాయికగా విధిని ఎదుర్కొనే ధీశాలిగా, హీరోతో పాటు హుషారుగా వుండాల్సిన తను కాస్తా,  హీరోకి భారమై, అతడి హుషారుని దెబ్బ తీసి, రోమాంటిక్ డ్రామాల విషాద నాయికై ఏడుస్తూ కూర్చునే నటన దేనికి పనికొచ్చింది - తను నటించగలనని నిరూపించుకుందేమో గానీ,  ఈ పాత్ర చిత్రణ కథనే దెబ్బ తీసింది. ముగింపులో ఎంతకీ ముగియని సాగతీత ఓల్డ్ విషాద మెలోడ్రామా థ్రిల్లర్ కి అవసరమా? 

          దాసరి అరుణ్ కుమార్ విలన్ గా అవతారమెత్తి మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ పాత్రలో తను ఎక్సెలెంట్. విలన్ గానే స్థిరపడితే బెటర్. హీరో తల్లిదండ్రులుగా కాశీ విశ్వనాథ్ – రోహిణీల పాత్రల తీరు తెన్నులు థ్రిల్లర్ జానర్ మర్యాదకి అడ్డంకి. ఈ పాత్రలు లేకపోయినా వచ్చే నష్టం లేదు. 

        అవసరాల శ్రీనివాస్ ది సంక్షిప్త పాత్ర. ఒకసారి దోషిగా, ఇంకోసారి  నిర్దోషిగా కథనం ద్వారా అన్పిస్తూ ఆసక్తి రేపుతాడు. సీరత్ కపూర్ ది విషాద పాత్ర. జరిగిన ఒక ఘోరానికి తనే బాధ్యురాలని కుమిలిపోతూ జీవితాన్ని దుర్భరం చేసుకునే పాత్రలో బాగా నటించింది గానీ, ఈ పాత్రని అంతలా పొడిగిస్తూ దేన్ని దెబ్బతీస్తున్నాడో తెలుసుకోలేదు  కథకుడు. ఇది ఈ పాత్ర కథ కాదు. ఈ పాత్రకి అసలేం  జరిగిందన్నదీ కథకి అవసరమే  లేదు. కథని గుర్తించకపోతే ఇంతే. కేవలం సీరత్ – అవసరాల పాత్రల వల్ల హీరో హీరోయిన్లకి ఏం జరుగుతుందన్నదే గుర్తించాల్సిన కథ! నడపాల్సిన కథ! అంతే గానీ,  సీరన్ పాత్ర ఎలా చనిపోయిందని ఆ మిస్టరీ అంతా  విప్పుతూ,  సెకండాఫ్ అంతా గడిపే కథ కానేకాదు!!

          పోతే సహాయ పాత్రలుగా ఎక్కడ పడితే అక్కడ కమెడియన్లు కనిపించడం జానర్ మర్యాదని దెబ్బతీసింది. కనీసం అరడజను మంది కమెడియన్లు వచ్చిపోతూంటారు. కథనాన్ని రసాభాస చేస్తూంటారు. ఈ కొత్త కాన్సెప్ట్ లో మూస ఫార్ములా చూస్తున్నట్టు చేస్తారు. 

          పాటల గురించి చెప్పుకోవడం అంతగా అవసరం లేదు. రెండు వారాలు జీవిత కాలం వుండే సినిమాలకి పది కాలాలు నిల్వవుండే పాటలు వుండవు, రావు, అవసరం లేదు కూడా. కాబట్టి చెప్పుకోవాల్సింది కేవలం సన్నివేశాలకి నేపధ్య సంగీతాల గురించే ఇప్పుడు. ఈ విషయంలో మణిశర్మ మరోసారి ప్రతిభ చూపెట్టారు కథ ఎలా మారిపోయినా, ఏం కథ నడుస్తున్నా. శ్యాం కె నాయుడు కెమెరా వర్క్ ఎప్పటిలా పర్ఫెక్ట్. అబ్బూరి రవి మారుతూపోయే కథకి మారిపోయే మాటలే తను మారిపోతూ రాశారు. 

చివరికేమిటి 
        పారలల్ లైఫ్ థియరీ ప్రకారం వుండాల్సిన కథ, దానికి తగ్గ స్క్రీన్ ప్లే లేవు. పారలల్ లైఫ్ థియరీలో ముగిసిపోయిన ఒకరి జీవితంలాగే ఇంకొకరి జీవితం నడుస్తుంది. కాబట్టి రెండిటి కాలాలు వేర్వేరుగా వుంటాయి. ఒకవేళ ఒకే కాలంలో జరుగుతున్నట్టు చిత్రించాలన్నా, ఇద్దరి జీవితాల్లో ఒకే విలన్ వుండకూడదు. అప్పుడది పారలల్ లైఫ్ థియరీ అవదు. 

          రెండోది, ఒకరి జీవితాన్ని ముగించి ఆ జీవితంలాగే ఇంకొకరి జీవితం నడపడం పారలల్ లైఫ్  కథ కొనసాగడానికి అవకాశాన్నిస్తుంది. అంతేగానీ, ముందు ముగిసిన జీవితం ఎలా ముగిసిందని తవ్వడం చేస్తే పారలల్ లైఫ్ కథ అవదు. మర్డర్ మిస్టరీ కథగా మారిపోతుంది. 

          సీరత్ పాత్ర చనిపోయింది, అవసరాల పాత్ర చంపిందని జైలుకి పోయింది. అంటే పారలల్ లైఫ్ ని చూపిస్తూ ఆ పాత్రల కథ ముగిసింది. కేవలం పారలల్ లైఫ్ ని చూపించడానికే ఆ పాత్రలుండాలి. అసలేం జరిగింది, అవసరాల పాత్రే చంపిందా అంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తే – ఇప్పుడు పారలల్ లైఫ్ ట్రాక్ లో వున్న శిరీష్ – సురభి పాత్రల కథ చెప్పడానికి వుండదు. ఇదే జరిగింది. కథని గుర్తించకపోవడం. సీరత్ – అవసరాల పాత్రల బ్యాక్ డ్రాప్ లో శిరీష్ – సురభి పాత్రల పారలల్ లైఫ్ ప్రమాదభరిత  అసలు కథని చెప్పే అవకాశాన్ని కోల్పోవడం. బ్యాక్ డ్రాప్ పాత్రయిన  అయిన సీరత్ పాత్రనే మళ్ళీ లాక్కొచ్చి ప్రధాన కథ చెయ్యడం!  చెప్పాల్సిన కథని గుర్తించలేక - కథని గుర్తించలేక - కథని గుర్తించలేకా  – పూర్తిగా చేతులెత్తేయడం!!

          ఈ మర్డర్ మిస్టరీలో పాతమూస ఆస్పత్రి మెడికల్ మాఫియా – ఘోరఖ్ పూర్ ఆస్పత్రి పిల్లల ఉదంతపు ఉటంకింపు, ఆ తాలూకు కుట్రని ఛేదించి ఆస్పత్రి బాగోతాన్ని బట్టబయలు చేయడం...సీరత్ పాత్ర ఎందుకు చనిపోయిందో ఇలా వెల్లడించడం, ఈమెలాగే ఇక సురభి పాత్రెలా చనిపోతుందో చూడండని- తెలుగు సినిమా ఫార్ములా ప్రకారం - క్లయిమాక్స్ లో విలన్ ఆమెని  అపహరించడం – ఏమిటీ కథ!

          ఫస్టాఫ్ దాదాపు ఇంటర్వల్ వరకూ  నిజంగా బోరు. హీరోహీరోయిన్ల ప్రేమకథ చాలాపాత మూస. జానర్ మర్యాదలో వుండదు. ప్రొఫెసర్ని కలిశాక  ఇంటర్వెల్లో వచ్చే మలుపు చాలా బలమైన మలుపు. ఇక పారలల్ లైఫ్ లో హీరోకూడా  హీరోయిన్ని చంపే స్తాడా అన్న ప్రశ్నకి,  నిజంగా ప్రేక్షకులు సీట్లలోంచి  లేవలేకపోయారు విశ్రాంతికి.

          ఆ తర్వాత సెకండాఫ్ లో మొదటి ఇరవై నిమిషాలే ఆ ప్రశ్న ప్రకారం కథ నడుస్తుంది. ఎప్పుడైతే సీరత్ పాత్రలాగే సురభి పాత్ర ఆత్మహత్యాయత్నం చేస్తుందో – ఇక ఆ పైన కథే మారిపోతుంది.  పూర్తిగా సురభిపాత్ర మర్డర్ మిస్టరీ అయి  -  ఇక హీరోహీరోయిన్ల పారలల్ లైఫూ, దానితాలూకు మనం ఆసక్తితో ఎదురుచూసే విధితో చెలగాటాలూ వుండవ్! పైగా  మర్డర్ మిస్టరీలో ఎన్నో చిక్కుముళ్ళు, మలుపులూ. టోటల్ గా ఇది సెకండాఫ్ సిండ్రోమ్  పాలబడ్డ మరో స్క్రీన్ ప్లే.  


సికిందర్









         






575 : రైటర్స్ కార్నర్




(నాలుగో మెట్టు)
          రాస్తున్నప్పుడే తిరగ రాస్తూ వుండడం అలవాటు చేసుకోవాలి. ఏక బిగిన మొత్తం కథంతా రాసుకుపోవాలనుకోవడం నాన్సెన్స్. ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడండి. ఫ్లాష్ రైటింగ్ అనేదాన్ని మర్చిపోండి. ఫ్లాష్ రైటింగ్ తో  ఫస్ట్ డ్రాఫ్ట్ రాసుకుంటూ పోవడం చేస్తే  ఓ పెద్ద గొయ్యి తవ్వుకుని అందులో పడ్డట్టే. మళ్ళీ అందులోంచి బయటికి రాలేరు. నిజంగా మీరొక ప్రొఫెషనల్ లాగా రాయడం నేర్చుకోవాలనుకుంటే ఈ పని చేయకండి. ఫ్లాష్ రైటింగ్ మీకే మాత్రం మేలు చేయదని గ్రహించండి. 

         
మన్వయం చేసుకుంటూ రాసుకుపోవడం చాలా మేలు చేస్తుంది. రాస్తూనే  తిరగ రాస్తూ పోవడమనే వ్యూహం తర్వాత వారాల తరబడి చేయాల్సిన పనిని తగ్గిస్తుంది. అంతే కాదు,  కేవలం మూడు డ్రాఫ్టులే రాసి ముగించవచ్చు. ఏకబిగిన మొత్తం ఒకేసారి రాసుకుంటూ పోతే తర్వాత వంద సార్లు దాన్ని తిరగ రాయాల్సి వుంటుంది. ఈ తేడా గమనించాలి. రాస్తూనే  తిరగ రాస్తూపోవడం వల్ల  కేవలం ఫస్ట్ డ్రాఫ్ట్,  రీరైట్ డ్రాఫ్ట్,  పాలిష్ డ్రాఫ్ట్ - ఈ మూడింటితో పనైపోతుంది. రాస్తూ తిరగరాయడం వల్ల  చాలా టైము కూడా ఆదా అవుతుంది. ఎలాగో ఈ కింద చూద్దాం -

          మొదటి రోజు – పది పేజీలు  రాస్తారు.
          రెండో రోజు – ఆ పది పేజీలు చదువుకుంటారు. మార్పుచేర్పులు చేసుకుంటారు. ఇంకో పది  పేజీలు  రాస్తారు.
          మూడో రోజు –  ఆ ఇరవై పేజీలూ చదువుకుంటారు. మార్పుచేర్పులు చేసుకుని ఇంకో పది  పేజీలు  రాస్తారు.

          ఇలా పూర్తయ్యే వరకూ చేసుకుపోతారు. ఇలా చేయడం వల్ల  కలిగే ప్రయోజనాలేమిటంటే, ప్రతీ రోజూ వెనకటి కథ పునశ్చరణ అవుతుంది. కథాక్రమం, పాత్ర చిత్రణలు, ప్లాట్ పాయింట్లు మీ మైండ్ లో ఎప్పుడూ లైవ్ గా వుంటాయి. అలాగే లోటుపాట్లు తగ్గడం గమనిస్తారు. అంతేకాదు లోపాలు, తప్పులు, పొరపాట్లూ తగ్గిపోవడం గమనిస్తారు. రాయడానికి కూర్చున్న ప్రతీసారీ అంతవరకూ రాసిన కథని అనుభవంలోకి తెచ్చుకుంటూ వుంటారు. కథని ప్రతీరోజూ అనువభవిస్తూంటారు. మీరెప్పుడో రాసిన మొదటి సీను నుంచి తెగిపోరు. ప్రతీరోజూ అంతకి ముందు రోజుల్లో రాసిన సీన్లన్నీ వరస క్రమంలో రీలులా తిరుగుతూంటాయి కళ్ళ ముందు. చాలా అద్భుతంగా వుంటుంది ఈ పని విధానం. ప్రయత్నిస్తే మీకే తెలుస్తుంది. ప్రొడక్టివిటీ కూడా పదిరెట్లు పెరుగుతుంది.

 
కెన్  మియమోటో  
(రేపు చివరి ఐదో మెట్టు)