రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, ఫిబ్రవరి 2018, శనివారం

602 : రివ్యూ!


దర్శకత్వం: మదన్
తారాగణం:  మోహన్ బాబు, విష్ణు, నిఖిలా విమల్, శ్రియ, అనసూయ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, శివప్రసాద్, నాగినీడు, బ్రహ్మానందం, అలీ, రఘుబాబు, సత్యం రాజేష్, రాజా రవీంద్ర తదితరులు  
కథా విస్తరణ : పరుచూరి బ్రదర్స్, కథ – మాటలు : డైమాండ్ రత్న బాబు, సంగీతం: ఎస్.ఎస్.తమన్, ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి
బ్యానర్ : లక్ష్మీ  ప్రన్న పిక్చర్స్
నిర్మాత:  మోహన్ బాబు
విడుదల : ఫిబ్రవరి 9, 2018
***
     
లెక్షన్ కింగ్ మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తూ నిర్మాతగా ఓ ఫ్యామిలీ డ్రామా / థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ద్విపాత్రాభినయాలు, నిర్మాణాలూ ఆయనకి కొట్టిన పిండే. 40 ఏళ్లుగా తన ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు. కాకపోతే ఈ తరం ప్రేక్షకులకి తన బయోడేటా ఇచ్చుకోవాల్సి వుంటుంది గనుక,  అది  కూడా ఎన్నో పరిచయ సీన్లతో నెరవేర్చి, పాతా కొత్తా ప్రేక్షకులని సంతృప్తిపర్చే ఒక  టూ ఇన్ వన్ ప్యాకేజీలా సమర్పించే సంకల్పంతో,  దర్శకుడు మదన్ తో కలిసి ఈ ప్రయత్నం చేశారు. దర్శకుడు మదన్ ‘పెళ్ళయిన కొత్తలో’, ‘ఆ నల్గురు’ వంటి ఫ్యామిలీ డ్రామాలతో పరిచితుడే. కాకపోతే రెండేళ్ళ  గ్యాప్ తర్వాత వస్తున్నారు. మోహన్ బాబు కూడా మూడేళ్ళ తర్వాత కన్పిస్తున్నారు. ఈ విరామంలో వీళ్ళిద్దరూ కాలానుగుణంగా అప్డేట్ అయ్యారా? లేక ప్రేక్షకులకంటే వెనుకబడి వున్నారా? ‘గాయత్రి’ తో చివరి కేం సాధించారు?... వీటికి సమాధానాలు అన్వేషిద్దాం. 

కథ 
      దాసరి శివాజీ (మోహన్ బాబు) స్టేజి నటుడు. ప్రసవంలోనే భార్య శారద (శ్రియ) ని కోల్పోతాడు. కూతురు  గాయత్రి ( నిఖిలా విమల్) కూడా పుట్టగానే కన్పించకుండా పోతుంది. ఇరవై ఏళ్లుగా కూతుర్ని  అన్వేషిస్తూ, మరో పక్క భార్యా కూతుళ్ళ జ్ఞాపకంగా అనాధాశ్రమాన్ని నడుపుతూంటాడు. దీని ఖర్చుల కోసం జైలు కెళ్ళి వస్తూంటాడు. స్టేజి నటుడుగా మారు వేషాలెయ్యడంలో దిట్ట. దీంతో జైలు శిక్షలు పడ్డ పెద్ద మనుషుల స్థానంలో డబ్బులు తీసుకుని,  వాళ్ళలాగా తనే వెళ్లి శిక్షాకాలం పూర్తి చేసి వస్తూంటాడు. 

         ఒకరోజు ఒకమ్మాయిని దుండగుల బారి నుంచి కాపాడుతాడు. ఆ అమ్మాయే  కూతురు గాయత్రీ అని తెలుసుకుని ఆమెని కలవబోతే, ఆమెకి తన మీద దురభిప్రాయాలున్నాయని తెలుసుకుని కలవకుండా వెళ్ళిపోతాడు. తీవ్ర క్షోభతో గడుపుతూంటాడు. ఇంతలో  గాయత్రి పటేల్ (మోహన్ బాబు డబుల్) అనే ఘరానా మనిషికి ఒక కేసులో శిక్ష పడుతుంది. అచ్చం తనలాగే వున్న ఇతడి బదులు తను జైలు కెళ్ళి రావడానికి ఒప్పుకుంటాడు డబ్బు కోసం. అలా జైలుకెళ్ళి ఇరుక్కుంటాడు. గాయత్రీ పటేల్ ఆడుతున్న గేమ్ లో పావు అయిపోతాడు. ఇప్పుడు ఉరిశిక్ష నుంచి ఎవరు తనని కాపాడాలి? కూతురు కాపాడుతుందా? ఎలా కాపాడుతుంది? ఇదే మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ఐడియాపరంగా  కథ 1980 నాటిది అనుకోలేం. 1930 ల నాటి ఐడియాతో  ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ ని 2017 లో కాలానికి తగ్గట్టు ఆధునికంగా మార్చి తీశారు. ఐడియాలు పాతబడవు. వాటికి కాలం చెల్లిన కథనాలు చేస్తేనే పాడవుతాయి. ‘గాయత్రి’  ఐడియాకి  ఆధునికంగా కథనం చేయకపోవడం వల్ల, మొత్తం కథే  1980 ల నాటి పాత వాసనలతో   నిండిపోయింది. ఈ కథా విస్తరణ పరుచూరి బ్రదర్స్ చేశారు. వాళ్లకి మనం చెప్పేంత వాళ్ళం కాము. కానీ కథ నందించిన మాటల రచయిత డైమండ్ రత్నబాబుకి చెప్ప వచ్చు. ఈ కథ ఫ్యామిలీ డ్రామా జానరా, లేక ఫ్యామిలీ థ్రిల్లర్ జానరా? లేక రెండూనా?  రెండూ కావడానికి వీల్లేదు. ఒక ఒరలో విడివిగా, దేనికదిగా రెండూ ఇమడవు. జానర్ల మిశ్రమంలో ఒక ప్రధాన జానరే  కథ చెప్తుంది. మిగతా జానర్లు అనుబంధంగా సాగుతాయి. ఒక ప్రధాన జానర్ గా నడిచే కథ ఆకస్మికంగా ఇంకో ప్రధాన జానర్ గా మారిపోదు. ‘గాయత్రీ’ లోలాగా ఫ్యామిలీ డ్రామా జానర్ కాస్తా ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్ గా మారిపోదు. ఇదే ‘గాయత్రి’ కథతో  వచ్చిన ఇబ్బంది. పూర్తి రసభంగం. సరీగ్గా టబు – గోవిందాల ఫ్లాపయిన ‘హవా’ తో వచ్చిన ఇబ్బంది లాంటిది. సైకో హార్రర్ కాస్తా,  కూతురితో తల్లి సెంటిమెంటల్ డ్రామాగా మారిపోయిన వైనం. 

           కృష్ణ, కాంచనలతో జడ్జి పాత్రలో గుమ్మడి విలన్ గా నటించిన, ‘నేనూమనిషినే’ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ థ్రిల్లర్ అనే రెండు జానర్లు గా లేదు. అది ఫ్యామిలీ థ్రిల్లర్ జానరే. ఆ ఫ్యామిలీ డ్రామా అనేది కేవలం థ్రిల్లర్ లో ఇమిడిన పరిమిత ఎమోషనే. ఒక పోలీసు అధికారి తమ్ముడు, ఆ తమ్ముడి కాబోయే భార్య- వీళ్ళతో  కిల్లర్ జడ్జిగా  గుమ్మడి రక్తి కట్టించే అనుబంధాల ఎమోషనల్ సస్పెన్స్ – ఫ్యామిలీ థ్రిల్లర్! 

          ఇంకా ఇలాటి ఫ్యామిలీ థ్రిల్లర్లు  హిందీలో, ఇంగ్లీషులో చాలా వున్నాయి. అవి చూసి వుండాల్సింది. ముందుగా కావలసిన జానర్ ని నిర్ణయించుకుని,  ఆ జానర్ మర్యాదకి బాగా కట్టుబడి,  ఈ నాటికి తగ్గ ఆధునిక కథనం చేయకపోవడం వల్ల అవుట్ డేటెడ్ కథగా పేరొచ్చింది  ‘గాయత్రి’ కి.  ఆధునిక కథనం  చేస్తే మోహన్ బాబు ఇమడరనా? ‘పింక్’ లో అమితాబ్ బచ్చన్ చక్కగా ఇమిడారు. అమితాబ్ లేకపోతే అమ్మాయిల సమస్యతో ఆధునిక కోర్టు డ్రామా థ్రిల్లర్ ‘పింక్’ లేదు. ‘గాయత్రి’ కథంతా చూసి బయటి కొస్తోంటే,  తెలుగు సినిమాల వ్యాపార యుగం - 1 నాటి కథాకథనాలు చూసిన ఫీల్ తో అడుగులు భారంగా పడసాగాయి. 2000 నుంచి నడుస్తోంది వ్యాపార యుగం – 2 కదా?  

          సినిమాకి కావాల్సింది ప్రాథమికంగా మార్కెట్ యాస్పెక్ట్,  దాంతో క్రియేటివ్ యాస్పెక్ట్ అనే  రెండూ. ఇవి కన్పించట్లేదు. మార్కెట్ యాస్పెక్ట్ లో దీనికి యూత్ అప్పీల్ లేదు. యూత్ అప్పీల్ వుండడానికి తండ్రీ కూతుళ్ళ  ఈ కథలో కీలకమైన మెడిసిన్ చదివే కూతురి పాత్ర వుంది. యూత్ అప్పీల్ కి ఈ మెడిసిన్ చదవడమొక్కటే కనెక్ట్ అయ్యే అంశంగా వుంది.  మిగతా ఏ విషయంలోనూ నేటి తరానికి పరిచయమేలేని 1980 నాటి ఓల్డ్ మోడల్ పాత్రే. నేటి తరానికి,  అందునా గర్ల్స్ కి ఎక్కడా కనెక్ట్ అవని పరాయి పాత్ర. ‘పింక్’ తో ఈ పరిస్థితి లేదు. అందులోని హీరోయిన్ నవతరానికి ప్రతినిధిలా కనపడింది కాబట్టే, తెలుగమ్మాయిలు సైతం  దాన్ని విరగబడి చూశారు.  అదే ‘గాయత్రి’ టైటిల్ చూసి,  ‘గాయత్రి’కి వచ్చిన నల్గురైదుగురు తెలుగమ్మాయిలు ముక్కున వేలేసుకుని గబగబా వెళ్లి పోయారు.

ఎవరెలా చేశారు
      ఇది పూర్తిగా మోహన్ బాబు వన్ బై టూ మాన్ షో. ఒక శివాజీ,  ఒక గాయత్రీ పటేల్ షో. ఆయన గురించి కొత్తగా చెప్పుకునేదేముంది? డీసెంట్ గా రెండు పాత్రల్ని పోషించారు.  శివాజీగా ఎంతో కదిలించే విధంగానూ నటించారు. భర్తగా ఆయనకి నటించే అవకాశం లేదు. తన యుక్త వయసులో భర్త పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో విష్ణు కిచ్చారు. అక్కడ్నించీ తను కూతురి అన్వేషణలో వున్న తండ్రిగా ఒక పాత్ర,  విలన్ గా ఇంకో  పాత్రా  నటించారు. విలన్ గాయత్రీ పటేల్ గా ఎదురుచూడని  హాట్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు. ఎవరైనా అలా కళ్ళప్పగించి చూస్తూ వుండి  పోవాల్సిందే. ఇలాటి మెస్మరైజింగ్ మేకోవర్ యువ స్టార్స్ ఎవరికీ సాధ్యం కాలేదంటే అతిశయోక్తి కాదు. హేర్ స్టయిలే ఆయనకి అపూర్వంగా అంత హాట్ లుక్ నిచ్చింది. పలికే డైలాగులతో మరింత టెర్రిఫిక్. 

          శివాజీ సౌమ్యుడిగా ఒక పేజీ మీద  కన్పిస్తాడని ఇతర పాత్రలు చెప్పుకుంటాయి. అదే పేజీ తిప్పితే రెండో పేజీ వేరేగా  వుంటుందని జాగ్రత్త చెప్పుకుంటారు. పాత్రకి హై పాయింట్ ప్లాట్ పాయింట్  వన్ ఘట్టం, దాన్ని అనుసరించి పాట. కూతురెవరో తెలిసిందన్న ఆనందంతో ప్రదర్శించిన నటన కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తాయి. దీని వెంటనే అదే ఆనందంతో వచ్చే పాట ఒక బలమైన సెంటిమెంటల్ నాటకీయత. అసలీ రెండిటితో ప్లాట్ పాయింట్ వన్ ఒక అపూర్వ ప్రయోగమనే అనాలి. దీని విషయం తర్వాత చూద్దాం. 

          ఫ్లాష్ బ్యాక్ లో యువ శివాజీగా విష్ణు పౌరాణిక డైలాగులు పలికే ఒక దృశ్యం మొదటిసారిగా అతడికా టాలెంట్ వుందన్న సంగతిని బయట పెడుతుంది. శివాజీగా  పౌరాణిక డైలాగులతో మోహన్ బాబు వెండి తెరని చించెయ్యడం ఒకెత్తు. విష్ణు తక్కువేం కాదు. అయితే ఇతరంగా చూస్తె పాత్రలో బాగానే నటించినా, పాతకాలం పాత్ర కావడంతో తను గుర్తుండడానికి స్కోపు లేకుండా పోయింది. శ్రియతో ప్రేమ గానీ, చేసే కాపురంగానీ   పాత  సినిమా చూస్తున్నట్టు వున్నాయి. శ్రియతో ‘ఒక నువ్వూ ఒక నేనూ ఒకటయ్యాం మనం’ డ్యూయెట్ మాత్రం సినిమాకి హైలైట్.

          శ్రియ కూడా పాత విశ్వనాథ్ సినిమా హీరోయిన్ లా కన్పిస్తుంది. ఇరవై ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ ఇది. ఆనాడు కూడా సినిమాల్లో హీరోయిన్లు ఇలాటి వేష భాషలతో  కన్పించరు. ఇరవై ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి 40 ఏళ్ల నాటి పాత్రలు  దృశ్యాలు సంగతులు చూపించారు. శ్రియది చనిపోయే పాత్రయినప్పుడు,  దానికుండే డైనమిక్స్ తో కూడా పాత్రచిత్రణ చేయలేదు. యాక్టివ్ పాత్ర చనిపోతే డైనమిక్స్ వుంటాయి. ఆ పాత్ర గుర్తుంటుంది. పాసివ్  పాత్ర పాసివ్ గానే చనిపోతే ప్రభావమే వుండదు. ‘మనం’ లో శ్రియ ని ఇంకా పూర్వపు ఫ్లాష్ బ్యాక్ లో ఎంతో యాక్టివ్ గా చూపించారు గుర్తుండి పోయేలా. 

          కూతురి పాత్రలో హీరోయిన్ నిఖిలా విమల్ మంచి భావప్రకటనా సామర్ధ్యమున్న నటి. కానీ చేయడానికి పాత్రగా ఏమీ లేదు. కారణం, తండ్రీ కూతుళ్ళ కథ ఒక భావోద్వేగ భరిత పతాక స్థాయికి చేరకముందే, గాయత్రీ పటేల్ పాత్ర అడ్డురావడం, కథని అతను తన వైపు తిప్పుకోవడం. పైగా పాత్రకి నేటి తరాన్ని ఆకర్షించే లక్షణాలేవీ కూడా కన్పించవు. శ్రియ పాత్రకి లాగే పాసివ్ గా, సాత్వికంగా కన్పించే పాత్ర. పైగా ఫస్టాఫ్ లో శివాజీ డామినేషన్ -  సెకండాఫ్ లో గాయత్రీ పటేల్ డామినేషన్ ల  మధ్య తనకి సీన్లు కూడా తక్కువే. క్లయిమాక్స్ లో తప్పదు కాబట్టి కొంత హడావిడీ.

          టీవీ జర్నలిస్టుగా అనసూయ మరో ‘క్షణం’ తడాఖా చూపించాలనుకుంటే కుదర్లేదు. అసలీ కథంతా శివాజీ డబుల్ గా వ్యవహరిస్తూ,  నేరస్తుల బదులు తను జైలుకెళ్ళి వస్తున్నాడన్న  ఆమె ఇన్వెస్టిగేషన్ పరంగా ఛానెల్ బాస్ (రఘుబాబు)కి చెప్పుకురావడంగా వుంటుంది. క్లయిమాక్స్ లో ఆమె స్థానాన్ని కూతురి పాత్ర ఆక్రమించడంతో ఆమె అంతంత మాత్రంగా  మిగిలిపోతుంది. అయితే ఒక జర్నలిస్టుగా ఎక్కడా నవ్వకుండా, ప్లెజెంట్ గా వుండకుండా అంత సీరియస్ గా  వుండాల్సిన అవసరమేమిటో అర్ధంగాదు. 

          జడ్జిగా ఒక సీనులో కోట, లాయర్ గా రెండు సీన్లలో తనికెళ్ళ, జైలర్ గా కొన్ని సీన్లలో నాగినీడు, శివాజీ పాత్ర స్నేహితుడిగా శివ ప్రసాద్ కన్పిస్తారు. బ్రహ్మానందం, అలీ, సత్యం రాజేష్ ల కామెడీ కాలం చెల్లిన కామెడీ. నవ్వేం రాదు. సహాయపాత్రల తారాగణం ఎంపికలో  కూడా యూత్  అప్పీల్ లేదు. నిఖిలా విమల్, అనసూయలు తప్ప ఇంకో యువనటీ,  యువ నటుడూ లేరు. 

          డైమండ్ రత్నం రాసిన డైలాగులు బావున్నాయి. నేటి రాజకీయాల మీద భిన్నమైన డైలాగులు రాశారు. రాజకీయాల మీద నేటికి వర్తింప జేసి  డైలాగులు రాయాలన్న సామా జిక స్పృహ గల తను, కథని మాత్రం నేటికి వర్తించని విధివిధానాలతో రాసేశారు. 

          సాంకేతిక ప్రమాణాలు బావున్నాయి. సర్వేష్  మురారీ మరోసారి నీరెండ లాంటి తన సినిమాటోగ్రఫీ చమక్కులు చూపించారు. పాటల చిత్రీకరణలో మరీ అద్భుతం. పాటలకొస్తే, ఆశ్చర్యకరంగా తమన్ ఒక నిజమైన మ్యూజికల్ అనుభావాన్నిచ్చారు. నేపధ్య సంగీతమైతే సన్నివేశాలనే ఎలివేట్ చేసింది. 

          అయితే మదన్ దర్శకత్వమే పాత స్కూలు దర్శకత్వంలా వుంది. ఉన్న కథనంతో కూడా వేగం లేదు. ఫస్టాఫ్ దాదాపూ విషయం లేకుండానే మోహన్ బాబు టాలెంట్ ని చూపించే రిపీట్ దృశ్యాలతో నింపేశారు. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ సహా, మిగతా యాక్షన్ స్టోరీ అదే పాత పోకడలతో నడిపారు. ఇందులో ఫాలోకాలేని ఎన్నో ట్విస్టులు పెట్టారు. తండ్రీ కూతుళ్ళ అసలు కథ సెకండాఫ్ లో వదిలేసి గాయత్రీ పటేల్ మీద పడ్డారు. ముందు స్ట్రక్చర్ చూసుకోవడం ముఖ్యం, చూసుకోకుండా జర్నలిస్టు చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో ప్రధాన కథ, అందులో మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ కథ, ఈ రెండిటికీ కవరింగ్ లెటర్ లాగా ప్రస్తుత కథా -కఫ్యూజింగ్ క్రియేటివిటీతో  ఏమేమో చేశారు. వీటి గురించి రేపు స్క్రీన్ ప్లే సంగతులు లో చూద్దాం.


సికిందర్  



 










9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

601 : మాయా లోకం



హీరో : నీ దగ్గర టెంప్లెట్  ఏమైనా నిల్వ వుందేంటి? 

డైరెక్టర్ : వున్నాయండి రెండు మూడు... 
హీరో :  ఏ సైజువి? రెండుగంటలా? రెండున్నర గంటలా?
డైరెక్టర్ : మీకు సరిపోయే సైజు రెండుంపావు గంటలది వుందండి. 
హీరో :  పట్రా, వేసుకుని చూస్తా...అవునూ, మనం తెలుగు వాళ్ళం స్క్రీన్ ప్లేలు వాడడం మాని పారే సి,  అచ్చు గుద్దినట్టు ఒకే మోడల్ టెంప్లెట్లే వాడేస్తున్నామని ఎవరైనా పసిగట్టా
రంటావా? 
డైరెక్టర్ : సమస్యే లేదు. అమాయకులేం పసిగడతారండీ, భలేవారు – గాడిదకీ గుర్రానికీ తేడా ఎక్కడ తెలుసండీ? 
హీరో :  ఓకే, ఐతే మనం గాడిదల్నే తోలుతున్నామన్న మాట... 
డైరెక్టర్ : అందుకే అవి ఎనక్కాల్తో తంతున్నాయండీ.
హీరో : అయినా సిగ్గు లేకుండా వాటి వెంటే పడుతున్నామంటావా?
డైరెక్టర్ : నిస్సిగ్గుగా!
హీరో :  ఈ తన్నించుకోవడంలో తేడా లేమైనా వున్నాయా? అంటే మెత్త మెత్తగా అనీ...హోల్మొత్తంగా అనీ ...? 
డైరెక్టర్ : అది చూసే అమాయక ప్రేక్షకుల్ని బట్టి వుంటుందండి. దేన్ని ఎలా ఎప్పడు తంతారో  వాళ్ళకే తెలీదు. ఒక్కో టెంప్లెట్ ని ముద్దుముద్దుగా తన్ని సెల్ఫీలు తీసుకుంటారు. ఒక్కో టెంప్లెట్ ని ఎడాపెడా తన్ని అక్కడే సఫా చేసిపోతారు. 
హీరో :  ఐతే ఇప్పుడు చెప్తున్నా జాగ్రత్తగా విను...టెంప్లెట్ లో సెల్ఫీ టెంప్లెట్ అనేది నాక్కావాలి. సఫా టెంప్లెట్ అవతలోడికివ్వు...
డైరెక్టర్ :  టెంప్లెట్ లో  సెల్ఫీ  టెంప్లెట్టా? అది చాలా కష్టమండి... 
హీరో : కష్ట పడ్డం నేర్చుకో. స్క్రీన్ ప్లేలు మానిపారేసి కష్టపడ్డ మంటే ఏంటో తెలీక  గాలికి తిరుగుతున్నావ్. ఇంకెంత కాలం నిన్ను భరించాలి. సెల్ఫీ టెంప్లెట్ తో వచ్చి కనపడు. అమాయకులు కనిపెట్టేసే లోగా కనపడు. వాళ్ళు స్క్రీన్ ప్లేలో ...స్క్రీన్ ప్లేయమ్మా ...అని అరిచి గీ పెట్టడం నేర్చుకునే లోగా, సెల్ఫీ టెంప్లెట్స్ లాలీ పాప్స్ నోట్లో పెట్టేయ్. సీయూ విత్ ఏ సూపర్ హిట్ సెల్ఫీ టెంప్లెట్. ఐ డోంట్ వాంట్ ఎనీ గాడిద తన్నులూ ఎనీ మోర్...

***

600 : రివ్యూ!

టెంప్లెట్ - దర్శకత్వం: వి.వి.వినాయక్
తారాగణం: సాయిధరమ్తేజ్, లావణ్యా త్రిపాఠీ, నాజర్, బ్రహ్మానందం, పోసాని, కాశీ విశ్వనాథ్, షాయాజీ షిండే, రాహుల్దేవ్, దేవ్గిల్ తదితరులు
కథ
, మాటలు: ఆకుల శివ సంగీతం: థమన్, ఛాయాగ్రణం: ఎస్‌.వి. విశ్వేశ్వర్
బ్యానర్ : సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి
నిర్మాత: సి.కళ్యాణ్
విడుదల : ఫిబ్రవరి 9, 2018

***
        సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గత ‘జవాన్’ తో కూడా విఫలమై ఇక ‘ఇంటిలిజెంట్’ తో ఇంటలిజెంట్ ప్రయత్నం చేద్దామని వినాయక్ అండ చూసుకుని వచ్చేశాడు. టాప్ దర్శకుడు వివి వినాయక్ సుప్రీం హీరోకి సూపర్ సక్సెస్ ఇద్దామని మరోసారి తన హిట్ ఫార్ములాకి శ్రీకారం చుట్టారు. ‘జై సింహా’ తీసిన సి కళ్యాణ్ కూడా వెంటనే వీళ్ళిద్దరి సినిమా నిర్మించేశారు. ఒక చూడ ముచ్చటైన కాంబినేషన్ కుదిరింది. బడ్జెట్ కూడా భారీగానే వుంది. ప్రేక్షకుల్ని ఎంతో వినోదింప జేయాలనే ఉద్దేశంతో ఇంత బడ్జెట్ కి సాహసించి వుంటారు. మరి ఇదంతా వర్కౌట్ అయిందా? ఈ హాట్ హాట్ గా అమ్ముడు బోయే కాంబినేషన్, హై బడ్జెట్,   ప్రేక్షకులకి ఒక అద్భుత ఆనందాన్ని ఇచ్చేట్టు వున్నాయా? ప్రేక్షకులేం ఆశిస్తారు? ఆశించినట్టు ఈ చూడ ముచ్చటైన కాంబినేషన్ చూడ ముచ్చటైన చలన చిత్రాన్నిచ్చినా? చలనం లేని బద్దకాన్ని ప్రదర్శించిందా?....ఓసారి లుక్కేద్దాం!

కథ
        చిన్నప్పట్నించీ తేజ (సుప్రీం హీరో) చాలా బుద్ధిమంతుడు. తల్లి దండ్రుల మాట వినే  ఎంతో వినయసంపన్నుడు. జీవితంలో చక్కగా ఎదిగి తమ ఆశలు నేరవేరుస్తాడని మధ్యతరగతి జీవులైన ఆ తల్లిదండ్రులు మంచి నమ్మకంతో వుంటారు. తల్లికి సంగీతంలో మంచి ప్రవేశం కూడా వుంటుంది. బుల్లి తేజ స్కూల్లో తోటి పిల్లవాడికి సాయం చేయడమంటే ఏమిటో కూడా చక్కగా నేర్పుతాడు. ఇక గొప్ప సంఘ సేవకుడూ,  సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానీ అయిన నందకిషోర్ (నాజర్) స్కూలుని సందర్శించి,  ఫస్ట్ వచ్చిన తేజకి బహుమతిని అందిస్తాడు. నువ్వేమవుతావు బాబూ అని గారంగా అడిగితే, సాఫ్ట్ వేర్  ఇంజనీర్ నవుతానని ఎంతో గొప్పగా చెప్తాడు బుల్లి తేజ. ముచ్చటేసి, ముద్దు చేసి,  బుల్లి తేజని తనే చదివిస్తాడు నందకిషోర్. బుల్లి తేజ బడా తేజగా మారి,  సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా నందకిసోర్ కంపెనీలోనే చేరి కన్నకలలు నిజం చేసుకుంటాడు. ఇలా వొక అద్బుతమైన చిన్ననాటి కథ ఆవిష్కృతమవుతుంది. ఇంకా ఈ చిన్నప్పటి చాక్లెట్ కథలేమిటని అనుకోవద్దు. తెలుగు సినిమాలు చూస్తూ ఈ చాక్లెట్ చేష్టలు భరించాల్సిందే. నీతికథలు తెలుసుకోవాల్సిందే.  

          ఇప్పుడు సాఫ్ట్ వేర్ తేజ మిత్రుడి కోసం గూండాలతో ఫైట్ చేసి పాట వేసుకుంటాడు. కామెడీ చేస్తాడు. అప్పుడు స్కూటీ మీద వస్తూ ఓ అందమైన అమ్మాయి (లావణ్యా త్రిపాఠీ)  పరిచయమవుతుంది. ముందు అతన్ని అపార్ధంచేసుకుని పోలీసులకి పట్టించినా, తర్వాత అతడికి  ఆడవాళ్ళ పట్ల అపారమైన గౌరవ మర్యాదలున్నాయని గ్రహించి ప్రేమలో పడుతుంది. తీరా ఈమె తన బాస్ కూతురేనని తెలుస్తుంది తేజకి. ఇంతలో బాస్ నందకిషోర్ కి మాఫియా బెదిరింపులొస్తాయి. నందకిషోర్ తన ఉద్యోగులకి రకరకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ తమకి ఇబ్బందులు తెస్తున్నాడని,  మిగతా సాఫ్ట్ వేర్ కంపెనీలు విక్కీ భాయ్ (రాహుల్ దేవ్)  అనే మాఫియా నాశ్రయించాయి. ఆ మాఫియా బెదిరింపులకి తట్టుకోలేక ఇప్పుడు నంద కిషోర్ ఆత్మహత్య చేసుకుంటాడు, కంపెనీని విక్కీ భాయ్ తమ్ముడి (దేవ్ గిల్) కి రాసేసి. 

          నంద కిషోర్ నిజంగానే ఆత్మ హత్య చేసుకున్నాడా? నిజంగానే కంపెనీని రాసేశాడా? ఇప్పుడు తేజ ఏం చేశాడు? ఇది అబద్ధమని నిరూపించి కంపెనీని ఎలా కాపాడుకున్నాడు? దుర్మార్గుల్ని ఎలా శిక్షించాడు?....ఇవి తెలుసుకోవాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే. 

ఎలావుంది కథ?
       ఇంకా ఇలా 1980 ల నాటి కథలే  వర్కౌట్ కావు, ఇంకా అప్డేట్ అవ్వాలి. అనిచర్వనీయంగా 1950 ల నాటికి అప్డేట్ అయి, అలాటి  సినిమాలు తీస్తే తెలుగు సినిమాలు ఎంతైనా బతికి బాగుపడతాయి. నిర్మాతలూ బయ్యర్లూ పది కాలాలు బాగుంటారు. కాబట్టి స్టార్లూ డైరెక్టర్లూ తమ కళాతృష్ణని ఇంకా ముందుకు, అంటే 1950 ల నాటి కెళ్ళి  తీర్చుకోవాలి. అవి కూడా ఇలాగే టెంప్లెట్ లో పెట్టి తీస్తే ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి. ఎంత ముందు కెళ్ళినా టెంప్లెట్ అనేది మర్చిపోవద్దు. టెంప్లెట్ తో టాలీవుడ్ మనోభావాలు చాలా ముడిపడి వున్నాయి. అసలే ఇది మనోభావాల కాలం. సుప్రీం హీరో తనకి పాత మూస తప్ప ‘ఔటాఫ్ బాక్స్’ కథలు విన్పించే వాళ్ళే  రావడం లేదని వాపోయాడు. వాళ్లకి  ఇక  ‘ఔటాఫ్ బాక్సాఫీసు’ కథలే 1950 ల నాటివి చెప్పాలని మొట్టి కాయేయాలి. ఎంత ‘ఔటాఫ్ బాక్సాఫీసు’ కథైతే అంత ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఇస్తామని నోట్లు చూపించాలి. 

ఎవరెలా చేశారు 
       సుప్రీం హీరో చాలా విసుగ్గా చేసిన సినిమా ఇదే. ఫలితం ముందే తెలుసు కాబట్టి, ఇంకా హీనంగా కూడా చేయవచ్చని అతడికి తెలుసు. కానీ దయతల్చి వదిలేశాడు. తేజగా వున్న తను కాస్తా,  మాఫియా విక్కీ భాయ్ అంతు  చూసే ధర్మా భాయ్ గా మారేక, నేనే ధర్మా భాయ్ అని అరవడంలో కూడా పక్షపాతం  చూపించాడు. ఫైట్స్ చేసే టప్పుడు మాత్రం సహజంగానే వీర ప్రతాపం చూపించాడు, విసుగులోంచి విముక్తి కోసమన్నట్టు. ‘అజ్ఞాత వాసి’  లో కంపెనీ హాం ఫట్ అయ్యే పరిస్థితిని  ఒక మెగా హీరోగా పవర్ స్టార్ ఎంత బాగా చక్కదిద్దలేదో, దాన్ని అధిగమించి మాత్రం ఇంకో మెగా హీరో అయిన తను సుప్రీం హీరో,  మాఫియాల్ని ఎడా పెడా బాదుతూ చక్కదిద్దాడు. ఇక విసుగు లేకుండా బాదుడే సినిమా అన్నట్టు డిసైడ్ అయిపోయాడు. ప్రేక్షకులాశించే కామెడీ, లవ్ అయితే తనకి పెట్టనే లేదు దర్శకుడు. పాటలూ మొక్కుబడే. థమన్ కూడా సరీగ్గా పట్టించుకోలేదు ‘ఇంటిలిజెంట్’ ని. 

         హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ చక్కగా సుప్రీం హీరోని ఫాలోయిపోయింది విసుగు విషయంలో.  ఎక్కడా రోమాన్సే లేని ఈమె ఎందుకుందో తెలియని పరిస్థితి. ఇక బ్రహ్మానందం కామెడీ అయితే ‘చప్ప’ నవసరం లేదు. నాజర్, పోసాని, కాశీ విశ్వనాథ్, షాయాజీ షిండే, రాహుల్ దేవ్, దేవ్గిల్, జయప్రకాష్ రెడ్డి, ఆశీష్ విద్యార్థి, పృథ్వీ, సప్తగిరి, రాహుల్ రామ కృష్ణ, తాగుబోతు రమేష్, నల్ల వేణు, విద్యుల్లేఖా రామన్...ఇలా భారీ తారాతోరణం నలుచెరగులా వ్యాపించి వుంటారు వాపోతూ – ఆకుల శివ తప్ప. ఈ కథ, మాటలు ఎంతో కసిగా రాసింది తనే కాబట్టి,  ఆ మాత్రం మాఫియా కిల్లర్ గా షంషేర్ గా నటించకపోతే మాట వస్తుంది. ఈ సినిమాతో ఫైనల్ గా తేలిందేమంటే, ఆకులశివ తనకున్న వాయిస్ తో బెస్ట్ యాక్టర్ అవుతాడని! 

చివరికేమిటి 
       ఇది వినాయక్ దర్శకత్వం వహించినట్టులేదు. చాలా అలసట కన్పిస్తోంది. ఆయన అలసిపోయారు. లేకపోతే సీన్లు ఇంత నీరసంగా వుండవు. టెంప్లెట్ లో పెట్టిన కథా కథనాలు కూడా అవుట్ డేటెడ్ గా, ‘బి’ గ్రేడ్ ప్రమాణాలతో వుండవు. తీసిన షాట్లు ఇదివరకటిలా లేవు. అసలు ఇలాటి సినిమా తీయవచ్చని ఎలా అనుకున్నారో తెలీదు. ఇదొక కథ అని ఎలా అనిపించిందో అంతకన్నా తెలీదు. ఇంటర్వెల్ వరకూ ఓపిక పట్టి చూశాక, ఏ ప్రేక్షకుడైనా ఇంకా సెకండాఫ్ చూడాలని ఎందుకనుకోవాలో ఆయనే చెప్పాలి. మొదటి సీను నుంచీ కథ చెప్పేసుకుంటూ పోతున్నారు ప్రేక్షకులు. వినాయకంటే క్లాస్ నుంచీ మాస్ దాకా ఒక నమ్మకం వుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకున్నారు. కోటిన్నర బడ్జెట్ తో,  చిన్నా చితకా వాళ్ళతో ఇలాటి సినిమాలు అనేకం వస్తూంటాయి. దీనికి పదుల కోట్ల బడ్జెట్ ఎందుకో అర్ధంగాదు. ఇవన్నీ కలుపుకుని వినాయక్ ఈసారి ఒక సూపర్ డూపర్ ఫ్లాప్ తీయడంలో ఘన విజయం సాధించారు.

సికిందర్
         
         

         



7, ఫిబ్రవరి 2018, బుధవారం

599 : స్ట్రక్చర్ సంగతులు

Sorry, some unexpected brief assignments
have  caused interruption in the blog affairs.
Here is the promised article now…



రోమాంటిక్ డ్రామాలు రోగం, రోమాంటిక్ కామెడీలు భోగం! 


    విద్యా బాలన్ నటించిన బేగం జాన్లో అధికారులు దేశ విభజన రేఖ గీస్తున్నప్పుడు, ఆ వేశ్యా గృహం సరీగ్గా విభజన రేఖ మీది కొస్తుంది. విభజించడానికి వీల్లేదని వేశ్యలంతా తిరగబడి పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఛలోలో 1953 లో తమిళ నాడు లోంచి ఆంధ్ర ప్రాంతాన్ని విడదీస్తున్నప్పుడు విభజన రేఖ పక్కపక్కనే తమిళ తెలుగు గ్రామాల మధ్యగా పోతుంది. ఠాఠ్, మమ్మల్ని విడదీయడానికి  వీల్లేదంటే వీల్లేదని,  కలసి వుంటే కలదు సుఖమని  డైలాగు కొట్టి రెండూళ్ళ ప్రజలు అడ్డుకుంటారు. మళ్ళీ రాజీ కుదిరి విభజనకి ఒప్పుకుంటారు. అంతలోనే తెల్లారే గొడవలు మొదలై మధ్యలో కంచె కట్టేసుకుని శత్రువుల్లా విడి పోతారు. ఈ కథా పూర్వ స్థితి కథాకాలంలోనూ కొనసాగుతూనే  వుంటుంది.

          లో’ లోనే ఇంటర్వెల్ కొచ్చేసరికి ఠాఠ్, మమ్మల్ని కలిపి వుంచడానికి వీల్లేదంటే వీల్లేదని, విడిపోతేనే ఎవరికివారే యమునా తీరే అని,  ఫస్టాఫ్ – సెకండాఫ్ లు పంచాయితీ తేలక పంచనామా పెట్టుకుంటాయి. పంచనామా దేనికి జరుగుతుంది? మృతదేహానికి జరుగుతుంది. 

          ఇదంతా కాకుండా, ‘రెఫ్యూజీ’ లో అభిషేక్ బచ్చన్ పాకిస్తాన్ లో ప్రేమిస్తున్న కరీనా కపూర్ దగ్గరికి సరిహద్దులే లేనట్టు ఎడాపెడా రాకపోకలు సాగిస్తూంటాడు, బెజవాడ – కోదాడల మధ్య ఫ్రీగా షోకిల్లాలాగా తిరిగేస్తున్నట్టు.  ‘ఛలో’  స్క్రీన్ ప్లేకి వుండా ల్సింది ఇదీ! నిజానికి ఇదే వుంది – ఇంటర్వెల్  ఏదో బ్యాంగ్ ఇస్తూ  ఆగదు. యాక్షన్ సీను మధ్యలో ఆగుతుంది. సెకండాఫ్ లో అది కంటిన్యూ అవుతుంది. ఇలా ఫస్టాఫ్ - సెకండాఫ్ లని కలిపి వుంచే వంతెన వేసిన  ఒకే ఇంటర్వెల్  సీను తర్వాత కూడా అవి విడిపోయాయి. ఇది క్రియేటివిటీ దెబ్బ. క్రియేటివిటీకి స్ట్రక్చర్ అనే రేఖాగణితం లేకపోతే  ఆ దెబ్బతో పంచాయితీ తెగక పంచనామాలే జరుగుతాయి. ఇప్పుడు  రివ్యూలు రాయడానికి ఈ కొత్త దర్శకుడు ఒక కొత్త పదకోశాన్ని అందించడం బావుంది. ఇక పంచాయితీ లుండవ్, పంచనామాలే – అని హీరోకి  విలన్ వార్నింగ్ ఇచ్చే డైలాగు. అలాంటప్పుడు  హీరో పంగనామాలు పెట్టే ఆలోచనలు చెయ్యాలి. ఇదే చెయ్యలేకపోయాడు, తనకి వెన్నెముక (స్ట్రక్చర్) లేక.


           క్రియేటివిటీ కేవలం ఊహే, స్ట్రక్చర్ వాస్తవం.  ‘ఛలో’  సమస్యంతా ఐడియా దగ్గరే వుంది. అసలు ఐడియాని సరీగ్గా కనిపెట్టలేదు. దాంతో ఫస్టాఫ్ సెకండాఫ్ లని కలిపి వుంచే ఎమోషనల్ థ్రెడ్ పుట్టకుండానే పోయింది. దాంతో కథతో సంబంధం లేకుండా సెకండాఫ్ దారితప్పి తిరిగింది. సమగ్ర ఐడియా ఎప్పుడైనా - ఇలా జరిగితే? అన్న ప్రశ్నలోంచే పుడుతుంది. హాలీవుడ్ లో ఇలాగే  పుట్టిస్తారు. What if? -  ఇలా జరిగితే? అన్న  ప్రశ్న హై పాయింటుని ప్రేరేపించాల్సి వుంటుంది. నగరంలో పెద్ద పులి వచ్చి పడితే?... ఇద్దరు ప్రేమికులు తమ చూడరాని ఫోటోలున్న సెల్ ఫోన్ పోగొట్టుకుంటే? ... ఇలా హైపాయింటుతో కూడిన ఐడియా కథకి లభించినప్పుడు కథలు ఆసక్తి కరంగా మారిపోయే అవకాశ ముంటుంది. ఊహల్లోంచి మొదట హై పాయింటే తట్టాలి తప్ప, కథనే  వూహించే ప్రయత్నం చేయడం దండగ.  హై పాయింటు తెలిస్తే, అప్పుడు స్ట్రక్చర్ లో కథ దానికదే వచ్చేస్తుంది

          ఛలోలో హీరోకి పెట్టుకున్న సమస్య  - అతడి ప్రేమ ఫలించాలంటే రెండూళ్ల  మధ్య అడ్డు గోడల్ని పడగొట్టాలనేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఇది సరిపోతుందా? ఇది హైపాయింటేనా? ఒకప్పటి కాలంలో చెల్లుబాటైన రొటీన్ పాత పాయింటుకి నేడు మార్కెట్ అప్పీల్ వుంటుందా?  నేటి గ్లోబల్ యుగంలో వర్కౌటయ్యే, ఆకట్టుకునే  ప్లేలు రెండే రెండు  - రోమాన్స్, లేదా ఎకనమిక్స్. కథలో ప్లే చేస్తే రోమాన్స్ ప్లే చేయాలి, లేదా  ఎకనమిక్స్ ప్లే చేయాలి.   రెండిటితో ముడి పడి  వుండే ఎమోషన్స్ తప్ప వేరేవి వర్కౌటయ్యే పరిస్థితి లేదు ప్రస్తుత గ్లోకల్వాతావరణ పరిస్థితుల్లో మానసంబంధాల దృష్ట్యా. ఇదికాని ఇంకే పాత చాదస్తాలూ  ఇంకా పని చెయ్యవు. ఇలా వున్న పాత ముసలి వాళ్ళ కథలో హీరో అనే వాడు ఖచ్చితంగా జనరేషన్ గ్యాప్ ఫీలవకుండా వుండలేడు. అప్పుడు ఇలా వున్న కథలోనే  తనదైన ఇంకో కొత్త రక్తపు  కథని ప్లే చేస్తేనే ముసలి వాళ్లకి చెక్ పెట్టినట్టు, తను అప్డేట్ అయినట్టు. కాలంలో ఇవ్వాల్టి యూత్ కి తగ్గట్టు హీరోగా తను  వున్నట్టూ. 


          పాత మూసగా రెండూళ్ల మధ్య పగల్ని  చల్లార్చినంత మాత్రానా హీరోయిన్ తండ్రి ప్రేమకి ఒప్పుకుంటాడని  హీరో ఎలా నమ్మగలడు? అసలు పగలు చల్లార్చడం ఏదో కాలక్షేపంగా సినిమా కోసమని తప్ప,  వాస్తవంలో ఎవరికైనా సాధ్యమా?  హీరోయిన్ తండ్రికి పగలు సామాజిక హోదానిస్తున్నాయి. అవుంటేనే మంది నేసుకుని పెద్దమనిషిలా చెలామణి ఆవుతాడు. వాటినెలా వదులుకుంటాడు? ఎందర్నో చంపినవాడు హీరోని చంపెయ్యడం లెక్కా

          పగలతో అతడికున్న మూర్ఖత్వం వదలాలంటే అంతకి మించిన సమాంతర సమస్య తో హై పాయింటు హీరో సృష్టించాలి.  వూరి గొడవల్ని సబ్ ప్లాట్ కింద నెట్టేసి, తను మెయిన్ ప్లాట్ సృష్టించాలి.  వూళ్ళ మధ్య పగలు వేరు, సొంత కుటుంబ ప్రతిష్ఠ వేరు. అందుకని హీరోయిన్ తో ముడి పెట్టి కుటుంబ ప్రతిష్ఠ మీద హీరో దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే, కూతురితో కుటుంబ పరువుపోయే సమస్యే  ప్రధానమైపోయి, వూళ్ళ మధ్య పగలు అప్రధానమైపోయే అవకాశముంది  హీరోయిన్ తండ్రికి. ఇప్పుడే కథకి ముఖ్యావసరమైన  రోమాంటిక్ ఫ్లేవర్ కూడా పోరాటంలో కొనసాగుతూ,  యూత్ అప్పీల్  పరిపుష్టమవుతుంది. 

          ఆఫ్టరాల్ హీరో అంటే ఎవరు? యాక్టివ్ గా  వుంటూ రోమాంటిక్  గానో, ఎకనమికల్ గానో కొత్త కొత్త సంఘటనల్ని క్యాలిక్యులేటివ్ గా కనిపెట్టి సృష్టించి, తద్వారా మోత మోగిస్తూ కలర్ ఫుల్ క్యారక్టర్ గా ఎదిగే వాడేగా? కథని ఎక్కడో తీసికెళ్ళి ఆకాశానికి తాటించే వాడేగా

          ఇది  కథకుడికి తట్టలేదని కాదు, తట్టింది ఆలస్యంగా చిట్ట చివరికి. అదీ హీరోతో కాదు, రాంగ్ గా రెండూళ్ల పంచాయితీలు తీర్చే పెద్ద మనిషితో! హీరో ఖాతాలో పడాల్సిన క్యారెక్టర్ గ్రోత్ ఎలిమెంటు, తురుపు ముక్క, శుభ్రంగా ఎవరో పెద్ద మనిషి  జోలెలో  పడిపోయింది.  ఇంకొకటేమిటంటే,   పెద్ద మనిషే కథకి  ప్రధాన ప్రత్యర్ధి అవుతాడని కూడా  కథకుడు గుర్తించలేదు. అసలీ యాక్షన్ కామెడీ కథలో బలాబలాల సమీకరణ అనే బేసిక్స్ నే పట్టించుకోలేదు కథకుడు. హీరోకి సరైన ప్రత్యర్దులే లేరు. అంత కర్కోటకుడుగా పరిచయమయ్యే హీరోయిన్ తండ్రి కూడా క్యారెక్టరైజేషన్ ని వదులుకుని చల్లబడిపోతాడు. 
          ఓసారి ఫస్టాఫ్ సెకండాఫ్ కథ చూసుకుంటూ పోతే ఇవన్నీ ఎలా జరిగాయో తెలుస్తుంది.

పంచాయితీ!

ఫస్టాఫ్ : 
          బిగినింగ్ : హరి (నాగశౌర్య) కి చిన్నప్పట్నుంచీ ఎవరైనా గొడవలు పడుతూంటే చూసి ఎంజాయ్ చేయడం అలవాటు. నాల్గు తన్ని తన్నించుకోవడంలో ఆనందం.  ఇది భరించలేక తండ్రి (నరేష్) ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఆంధ్రా తమిళనాడు సరిహద్దులో తిరుప్పురం అనే వూరుకి పంపేస్తాడు. పక్కనే తెలుగు వూరు వుంటుంది. తెలుగు వాళ్ళకీ,  తమిళులకీ పడక కొట్టుకుంటూ వుంటారు. రెండూళ్ళ మధ్య కంచె వేసుకుని, దాటి వస్తే చంపేస్తూంటారు. తమిళ వూరి పెద్ద వైరముత్తు, తెలుగు వూరి పెద్ద కేశవ. తెలీక తమిళ వూళ్ళో దిగిన హీరో,  వైరముత్తు మనుషులు   చంపడానికి వెంటపడితే పారిపోయి తెలుగూళ్ళో వచ్చి పడతాడు . రెండూళ్ళ కి కలిపి వున్న ఉమ్మడి కాలేజీలో చేరతాడు. రెండూళ్ళ గొడవలు తీర్చడానికి పంచాయితీ పెద్ద వుంటాడు. ఇతను కాలేజీలో గొడవలని పూర్తిగా నిషేధిస్తాడు. రెండూళ్ళ విద్యార్ధులందరూ  ఇక్కడే  చదువుకుంటూ వుంటారు.  

          ఇక్కడ కార్తీక (రశ్మిక) ని  చూడగానే ప్రేమలో పడిపోతాడు హీరో. ఆమె కూడా ప్రేమిస్తుంది. క్రమంలో కార్తీక తండ్రి కేశవ భోజనానికి పిలుస్తాడు. తనని అల్లుడిగా స్వీకరిస్తున్నాడనుకుని ఆనందించి  కార్తీక ఇల్లు వెతుక్కుంటూ వెళ్తాడు హరి.

          ప్లాట్ పాయింట్ వన్ :  అక్కడ కార్తీక వుంటుంది, వైరముత్తు కూడా వుంటాడు. కార్తీక వైరముత్తు కూతురు. ఈమె ఎం కార్తీక అయితే కేశవ కూతురు ఎల్ కార్తీక. హరి కన్ఫ్యూజన్ లో భోజనానికి వైరముత్తు ఇంటికెళ్ళి పోయాడు. కార్తీక తమిళ అమ్మాయని ఇప్పుడు తెలుస్తుంది. వైరముత్తు  తెలుగు వాడైన హరికి కత్తులు కటార్లతో  ‘భోజనంవడ్డించడానికి రెడీ అవుతాడు... ఇంటర్వెల్.

సెకండాఫ్ : 
      మిడిల్ : వైరముత్తు భారీ స్థాయిలో భోజనంవడ్డిస్తూంటే హరి ఫ్రెండ్ ని ఇరికించి హాస్టల్ కి పారిపోతాడు. ఇటు వీరముత్తు కూతుర్ని కాలేజీ మానెయ్యమంటే, పరీక్షల్లో ఫస్ట్ వచ్చానని ఒప్పించుకుంటుంది కార్తీక. కానీ తండ్రి భయంతో  ప్రేమించలేనని హరికి చెప్పేస్తుంది. ఇక ప్రేమ ఫలించాలంటే రెండూళ్ళ కలపాలన్న నిర్ణయానికొస్తాడు హరి. వైరముత్తు హరి మీద పంచాయితీ పెట్టిస్తే,  ఇక్కడి విషయాల్లో జోక్యం చేసుకుంటే ప్రాణాలుండవని హెచ్చరిస్తాడు పంచాయితీ పెద్ద. ఇక కూతురికి సంబంధం చూడ్డం మొదలెడతాడు వైరముత్తు. హరికి ఇటు వూళ్ళ మధ్య గొడవలకి ఫ్లాష్ బ్యాక్ లో కారణం తెలుస్తుంది. 

          ప్లాట్ పాయింట్ టూ :  తండ్రి కూడా పాత భూ రికార్డులు తెచ్చివ్వడంతో, వాటితో పంచాయితీ పెద్ద బండారం బయట పెడతాడు హరి. 
          ఎండ్ :  పంచాయితీ పెద్దే  గొడవల్ని పెంచి పోషించాడని తెలుసుకున్న ప్రజలు ఒక్కటవుతారు.  హరి కార్తీకని పెళ్లి చేసుకుంటాడు.

పంచనామా!

          స్వాభావికంగా కథ పూర్తిస్థాయి రోమాంటిక్ కామెడీ యాక్షన్ జానర్ లో వుండాల్సింది. కానీ  కొన్ని జానర్ మర్యాదలు తప్పి, సగం నుంచి మొత్తంగా జానరే  మారిపోయి, ఫక్తు రోమాంటిక్ డ్రామా జానర్ గా సాగుతుంది. ఇది రాంగ్ క్రియేటివ్ యాస్పెక్ట్.  బాక్సాఫీసు భరోసా  పూర్తి  స్థాయి రోమాంటిక్ కామెడీలకే  వుంటుంది గానీ, యూత్ అప్పీల్ సన్నగిల్లే రోమాంటిక్ డ్రామాలకి కాదు. రోమాంటిక్ కామెడీ అంటే ఆద్యంతం హుషారుగా ఉరక కలేసే కథ. ఇందులో హీరోహీరోయిన్లు ఎప్పుడూ విడిపోవడమంటూ జరగదు. కలిసి వుండడానికి అడ్డు పడే శక్తుల్నే కామెడీగా  తమాషాగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూంటారు. ఇద్దరూ యాక్టివ్ పాత్రలై వుంటారు. ఇందులో పెద్ద వయసు పాత్రలకి అంతగా ప్రాధాన్యముండదు. ఎందుకంటే జానర్ యువశక్తికి గుర్తుగా,  హీరోహీరోయిన్ల సాధికారికతని చూపిస్తుంది. తాము ఇరుక్కున్న  సమస్య లోంచి తామే బయటపడే  శక్తి యుక్తుల్ని ప్రదర్శిస్తుంది. స్వశక్తి పట్ల యూత్ ని మోటివేట్ చేసేవే రోమాంటిక్ కామెడీలు. ఇందులో పెద్ద వయసు పాత్రలు హెల్ప్ చేసినా, బుద్ధి చెప్పి మార్చినా, జానర్ తప్పి నష్ట దాయకంగా రోమాంటిక్ డ్రామా జానర్ లోకి జారిపోతుంది. రోమాంటిక్ డ్రామాలు చేతకాని  హీరోహీరోయిన్ల ఏడ్పు కథలు. వాళ్ళవి పెద్ద వాళ్ళమీద ఆధారపడే పాసివ్ పాత్రలు. పెద్ద వాళ్ళ అదిలింపులు, విడదీయడాలు, కలపడాలూ వుంటాయి పాత వాసనేస్తూ. ఇందులో హీరోహీరోయిన్లు మధ్యలో విడిపోతారు. ఎమోషన్ పేరుతో కథనంలో విషాద ఛాయలు అలుముకుని వుంటాయి బాక్సాఫీసు డిమాండ్ కి వ్యతిరేకంగా.

          ఇలా రోమాంటిక్ యాక్షన్ కామెడీ జానర్ కథ ఐడియా స్థాయిలోనే ఏకసూత్రత లేక సగం దెబ్బతింది. ఇక స్క్రీన్ ప్లేలో టెంప్లెట్సే ఎక్కువున్నాయి. కథనంలో టెంప్లెట్స్ గురించి చెప్పుకోవాలంటే కొన్నే శాశ్వత వాడకానికి పనికొచ్చేవి. హీరోహీరోయిన్లు ప్రేమలో పడడమనే టెంప్లెట్ శాశ్వతం. ప్రేమలో సమస్య పుట్టడమనే టెంప్లెట్ శాశ్వతం. ఇవి లేకపోతే కథ వుండదు. కానీ సమస్య పుట్టాక హీరోయిన్ తండ్రి వేరే సంబంధం చూడ్డమనే,  పేరే పెళ్లి చూపులు జరగడమనే, హీరోయిన్ ఏడుస్తూ కూర్చోవడమనే టెంప్లెట్స్ కి శాశ్వత తత్వమనేది లేదు. ఇంకో కాలంలో అవి పాత బడిపోతాయి. అన్ని కాలాల్లో మానవ ప్రవర్తన ఒకేలా వుండదు. పాత టెంప్లెట్స్ లేకపోతే కథకే ప్రమాదమూ రాదు.  అలాగే హీరోని చిన్నప్పటి కథ సహా చూపించే టెంప్లెట్ కూడా ఇప్పుడు కాలం చెల్లిన టెంప్లెట్టే.       

          ‘మెంటల్ మదిలోలాగే మళ్ళీ స్క్రీన్ ప్లే కూడా బిగినింగ్ విభాగం ప్రారంభం చైతన్యవంతంగా వుండక,  చల్లారిన పదార్దంలా వుంటుంది. ఎదిగిన హీరో ఫలానా ఇలాటి వాడని చెప్పడానికి అరిగిపోయిన టెంప్లెట్ ని వాడుతూ,   చిన్నప్పట్నుంచీ అంతా నీరసంగా చూపించుకొస్తారు. హీరోని లైవ్ గా ప్రెజెంట్ చేసి, చేష్టలేవో ఇప్పుడే చూపిస్తూ,  చిన్నప్నట్నుంచీ ఇతను ఇంతేనని ఒక మాట చెప్పేస్తే పోయేదానికి - ప్రేక్షకులకి ఇంకా స్పూన్ ఫీడింగ్ చేసే కాలంలోనే వున్నారు యువదర్శకులు చాదస్తంగా. కొన్ని లక్షలు వెచ్చించి మార్కెట్ యాస్పెక్ట్ కీ, బాక్సాఫీసు అప్పీల్ కీ   మాత్రం కలిసిరాని   చిన్నప్పటి దృశ్యాలు షూట్ చేయడం అంతా వృధాయే. క్యారెక్టర్ ఏంటోమొదటే అంతా విప్పి చెప్పేసి, రసం పిండేసిన చెరుకు గడలా చేసి పడేస్తే, ఇక ఏం సస్పెన్స్ వుంటుందని ఆసక్తితో చూడడానికి

          బిగినింగ్ లో ప్రారంభం తీసేస్తే,  మిగతా ఇంటర్వెల్ వరకూ అంతా బాగానే వుంది. కాకపోతే హీరో పేరెంట్స్ పాత్రల ఉనికి వల్ల జానర్ మర్యాద తప్పింది. హీరో దెబ్బలాడే మనస్తత్వం, పేరెంట్స్ పరిచయం, హీరోని ఇక్కడ వుంచకూడదని దెబ్బలాడుకునే తెలుగు - తమిళ వూళ్ళకి కాలేజీకి తెలిసే  పంపించడం వగైరా. దెబ్బలాడే హీరోని దెబ్బలాడుకునే వూ ళ్లోనే  పడేస్తే దెబ్బలాడడం మానేస్తాడని తండ్రి నమ్మకం. ఏడుస్తున్న పిల్లల మధ్య ఇంకో  ఏడుస్తున్న పిల్లాణ్ణి  పడేస్తే  ఏడుపాపేస్తాడని లాజిక్ కూడా చెప్తాడు. రోమాంటిక్ కామెడీ జానర్ గా ప్రారంభమైన కథనంలో,  హీరోకి మార్గ నిర్దేశం చేసే తల్లిదండ్రుల పాత్రలే పానకంలో పుడకలయ్యాయి. కథలో హీరోకి పేరెంట్స్ గోలే వుండకూడదు. దెబ్బలాడుకునే రెండూళ్ళ గురించి హీరోకే తెలిసి, ఐతే అక్కడ ఇంకా బాగా దెబ్బ లాడ వచ్చని  ఇనుమడించిన ఉత్సాహంతో తనే ప్రయాణం కట్టాలి. అదీ క్యారక్టరైజేషన్ అంటే!

          పేరెంట్స్  పాత్రల వల్ల సెకండాఫ్ జానర్ మర్యాద పూర్తిగా చెడి, ప్లాట్ పాయింట్ టూ  కూడా దెబ్బతింది అక్కడ హీరో మరింత  హీరో అవ్వాల్సింది పోయి డమ్మీ అయిపోతూ. రోమాంటిక్ కామెడీల్లో ఇలాటి పేరెంట్స్ పాత్రలు యూత్ అప్పీల్ కి ఎందుకూ కొరగాని కోన్ కిస్కా పాత్రలు. 

          ఇక రెండూళ్ళలో తమిళ ప్రత్యర్ధి వైరముత్తు, తెలుగు ప్రత్యర్ధి కేశవతో బాటు,  పంచాయితీ  తీర్చే పెద్ద కూడా వుండే సెటప్ అంతా ఓకే. అక్కడే కేశవ కూతురనుకుని హీరో వైరముత్తు కూతుర్ని ప్రేమించడం మంచి డైనమిక్సే. రెండూళ్ళ  శత్రుత్వాల నేపధ్యంలో ప్రేమలో పడడమన్నది స్ట్రక్చర్ ప్రకారం సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనకి నాంది. హీరోని కేశవ భోజనానికి పిలవడం నేరుగా ప్లాట్ పాయింట్ వన్ కి దారితీస్తుంది. అక్కడ హీరో వెళ్ళింది కేశవ అనుకుని వైరముత్తు ఇంటికే. అలా వెళ్లి ఇరుక్కున్న హీరో వైరముత్తుతో ముఖాముఖీ అవుతాడు. 

           ప్లాట్ పాయింట్ వన్ సీనుని ఇంటర్వెల్ లో ఏర్పాటు చేశారు. కాబట్టి ప్లాట్ పాయింట్ వన్,  ఇంటర్వెల్ రెండూ ఒకటే అయ్యాయి. ప్లాట్ పాయింట్ వన్ సీన్ కూడా సంపూర్ణం కాదు. వైరముత్తుకి దొరికిపోయిన హరితో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఇంటర్వెల్ పడుతుంది. అంటే ఇదే  సీను సెకండాఫ్ ప్రారంభంలో కొనసాగి ప్లాట్ పాయింట్ వన్ పూర్తవుతుంది. అప్పుడే సమస్య, గోల్ ఏర్పాటవుతాయన్న మాట. 

          ఇక్కడి వరకూ బిగినింగ్ విభాగంలో పైన చెప్పుకున్న జానర్ మర్యాదకి సంబందించిన లోపాలు తప్ప, ప్రారంభంలో చైల్డ్ స్టోరీ అనే పాత టెంప్లెట్  తప్ప, స్ట్రక్చర్ తో సమస్యల్లేవు. 

          సమస్యలు ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో మిడిల్ విభాగంలోనే జొరబడి తినేశాయి. ఇంటర్వెల్ తర్వాత నుంచి స్ట్రక్చర్ లో లేదు కథ. ముందుగా ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ ఎలా ఏర్పాటయ్యిందో చూద్దాం. ఇంటర్వెల్లో ఆపిన ప్లాట్ పాయింట్ వన్ యాక్షన్ సీను ఇప్పుడు కంటిన్యూ అయి ఫ్రెండ్ ని ఇరికించి వైరముత్తు బారి నుంచి తప్పించుకుని పారిపోతాడు హరి. 

          హీరో ఎక్కడైనా ప్లాట్ పాయింట్ వన్ నుంచి తప్పించుకుని పారిపోతాడా?  ఇది కథ చెప్పే పద్ధతేనా? స్ట్రక్చర్ వదిలేసి జంప్ అవుతాడా హీరో? క్రియేటివిటీకి స్ట్రక్చర్ తెలియనప్పుడు తప్పకుండా జంప్ అవుతాడు సుడిగుండంలోకి. ప్లాట్ పాయింట్ వన్ అంటేనే సమస్యలో పడ్డ హీరో ఇక సంఘర్షణకి సంసిద్ధమయ్యే ఘట్టం. పారిపోతే ఘట్టం నేలమట్టం అవకుండా వుంటుందా? సెకండాఫ్ కథలో సమస్య లన్నిటికీ మూలం ప్లాట్ పాయింట్ వన్ లోనే వుంది. ప్లాట్  పాయింట్ వన్ స్క్రీన్ ప్లేకి  మొదటి మూలస్థంభమని తెలిసిందే. మూల స్థంభంలో ఏఏ ఎలిమెంట్స్ వుండాలో అవి లేకపోతే  మిడిలూ వుండదు, ఎండ్ కూడా సరిగ్గా కుదరదు. కథే దారి తప్పి తిరుగుతూంటుంది. 

          ప్లాట్ పాయింట్ వన్ లో హరి, వైరముత్తుతో సమస్యలో పడ్డప్పుడు, హరికి గోల్ ఏర్పడాలి. గోల్ లో 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్ అనే నాల్గు ఎలిమెంట్స్ కనిపించాలి. 

          ఇక్కడ హరి కేశవ ఇల్లనుకుని వచ్చి, అనుకోకుండా  విలన్ వైరముత్తుతో ఇరుక్కున్నాడు. ఇప్పుడేం  చేయాలి? తప్పించుకుని పారిపోవాలా? పారిపోకూడదని స్ట్రక్చర్ చెప్తోంది. స్ట్రక్చర్ ఒక చట్టం. క్రియేటివిటీ ఉల్లంఘన. మొదటి మూలస్థంభం దాని ఎలిమెంట్స్ ని డిమాండ్ చేస్తోంటే ఎక్కడికి పారిపోతాడు హరి?  అప్పుడలా  అనూహ్యంగా వచ్చి ఇరుక్కున్నప్పటికీ,  హరి అప్పటికప్పుడు తన ప్రేమ ( సీన్లో చూపించినట్టుగా తన ప్రాణాలు కాదు) ప్రమాదంలో పడిందని సమయస్ఫూర్తిని  ప్రదర్శించ వచ్చు. ఇదే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హీరోయిజమంటే, కథ పెరుగుతున్న కొద్దీ క్యారక్టర్ ఎదుగుదల అంటే. 

          వైరముత్తు గ్యాంగ్ తో పద్మ వ్యూహంలో ఇరుక్కున్న హరి,   రెండూళ్ళలో  శత్రుత్వాలనే  ముసలి మూర్ఖపు కథకి, తనదైన యువ కథానిక సృష్టించ వచ్చు. యాక్షన్ లో రోమాంటిక్ ఫీల్ కోసం మిస్సవకుండా, హీరోయిన్ ని లాగెయ్య వచ్చు. ఒక్కడులో మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ మధ్య యాక్షన్ కథలో రోమాంటిక్ ఫ్లేవర్ తో భూమిక కూడా యాక్టివ్ పాత్రయి వుండకపోతే,   సినిమా ఎండిన ఎడారిలా వుండేది. హీరోయినెందుకని కథలో భూమికని పక్కన పెట్టి, హీరో విలన్లు కొట్టుకునే  ఉత్త యాక్షన్ కథగా లేదది. 

        అందుకని ఇక్కడ హీరోయిన్ కార్తీక ని సమస్యలోకి నిరభ్యంతరంగా లాగ వచ్చు హరి. అంటే సీన్లో చూపించినట్టు తనని తాను కాపాడుకుంటూ ఫ్రెండ్ ని ఇరికించి పారిపోయిన హరి కార్తీకని కూడా తీసుకుని పారిపోవచ్చు.  కార్తీకతో సన్నిహితంగా వున్న ఫోటోలేమైనా వుంటే వాటిని వైరముత్తు మొహాన ఫార్వర్డ్ కొట్టి పోవచ్చు. ముసలి వాళ్ళ కథకి జనరేషన్ గ్యాప్ ఫీలైన హరి,  తన యువకథానిక ఇలా ప్రారంభిస్తే - అప్పుడు డైనమిక్స్ కలిసి వచ్చి ప్లాట్ పాయింట్ వన్ కి థ్రిల్ వస్తుంది. ఆఫ్టరాల్  హీరో అంటే ఎవరు? అనుకోని సంఘటనలు సృష్టించి కలర్ఫుల్ క్యారెక్టర్ గా మెరిసిపోయే వాడేగా? - (“What is character but the determination of incident? And what is incident but the illumination of character?” – Henry James). పైగా What if? –  ప్రశ్నతో  హై పాయింటు సృష్టించిన వాడవుతాడు హరి. ఇరుక్కున్న పరిస్థతి లోంచి అన్నటికీ తెగించి,  హీరోయిన్ ని తీసుకుని పారిపోతే? అనేది What if? ప్రశ్న

            హీరో అంటే రిస్కు తీసుకునే వాడు కూడా కదా? ఇలా చేసి  హరి, కార్తీకతో  పారిపోయి తెలుగు వూళ్లోనే మకాం పెట్టేస్తే, అది ప్రిస్టేజిగా తీసుకుని తెలుగు ప్రజలు రక్షణ వలయమైపోతారు. రెండూళ్ళ మధ్య పాత ముసలి గొడవలు భగ్గు మంటాయి. కానీ తమిళ వైరముత్తు కూతురి కోసం తెలుగు వూరు మీద దాడి చేసే పరిస్థితి వుండదు. యాంటీగా హరి క్రియేట్ చేసిన యూత్ స్టోరీలో, వైరముత్తు  మోహన కొట్టి పోయిన కన్న కూతురి అపురూప ఛాయాచిత్రాలుంటాయి.  అవి బయటపడితే  రెండూళ్ళ లో అతడి పరువే పోతుంది. ఇప్పుడు  బ్యాక్ డ్రాప్ గా వున్నరెండూళ్ల కథతో, ఫోర్ గ్రౌండ్ లో వున్న  ప్రేమకథ కనెక్ట్ అయింది. ఇలా లేకనే కదా బాబీఫ్లాపయింది. 

          ఇలా చేయడం వల్ల హరికి 1. ప్రేమని సాధించుకోవాలన్నకోరికతిరుగులేకుండా బలీయమైంది, 2. కర్కోటకుడైన వైరముత్తుతో తన ప్రాణాలనే పణం’  గా పెట్టాడు, 3. రెండూళ్ళూ అగ్గిగుగ్గిల మవ్వచ్చన్న పరిణామాల హెచ్చరికనీ అనుభవిస్తున్నాడు, 4. వీటన్నిటితో తీవ్రమైన ఎమోషనల్ క్యారక్టర్ గా మారాడు.

          ఇదీ మొదటి మూలస్థంభం వుండాల్సిన స్థితి. ఇదంతా కథకి  ప్రధాన రసమైన హాస్యరస ప్రధానంగానే వుంటుంది ఎంటర్ టైన్మెంట్ కి.

కానీ ఏం జరిగింది? 

          ఉత్త చేతులతో పిరికిగా ( ఎందుకో కామెడీ అనుకోవాలని కథకుడి ఉద్దేశం)  పారిపోయి ఏం చేయాలో తెలీక మిడిల్ అంతా తిరిగాడు హరి. హాస్టల్ కి పారిపోయి వచ్చి కూడా కార్తీక గురించి ఫీలవ్వడు. మీల్స్ చేద్దామంటాడు  ఫ్రెండ్ తో. మళ్ళీ ఇంకో సీన్లో కూడా బిర్యానీ తిందామా అంటాడు ఫ్రెండ్ తో. ఫ్రెండ్ ని తీసుకుని కేశవ ఇంటికి పోతాడు- ఫస్టాఫ్ లో అతను భోజనానికి రమ్మన్న ఆహ్వానాన్ని పురస్కరించుకుని. ఇదిప్పుడు అవసరమా? ఫస్టాఫ్ లో కేశవ ఆహ్వానంతోనే  దారితప్పి వైరముత్తు ఇంటి కెళ్ళి- ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడ్డాక, దానికి దోహదం  చేసిన అయిపోయిన పాత సంగతికి మళ్ళీ వెళ్ళడం క్యారక్టర్ ని, కథనీ  ముందుకు దౌడు తీయించడానికి విధంగా సాన బట్టింది?

          ఇప్పుడు భోజనానికి వచ్చిన హరి ఇక్కడ కేశవ కూతుర్ని చూసి మొహం తిప్పుకోవడం, ఆశలు పెట్టుకున్న కేశవ మండి పడ్డం, హరి తను వైరముత్తు కూతుర్ని  ప్రేమిస్తున్నాననగానే కేశవ యూ టర్న్ తీసుకుని, అయితే దాన్ని పెళ్లి చేసుకో, వీరముత్తు పొగరు అణుగుతుంది, అదే నాక్కావాలని అందుకు సాయంగా వుంటాననడం జరుగుతాయి. 

          హరి ఏం చేయాలో తెలియని పాసివ్ పాత్రయిపోవడానికే సీను పనికొచ్చింది. పాసివ్ పాత్రయితే ఇలాగే ఇతర పాత్రలు కథని తమ చేతిలోకి తీసుకుని తామే నడిపిస్తాయి....ఇప్పుడు రోమాంటిక్ కామెడీ లక్షణాలు చెదిరి, రోమాంటిక్ డ్రామా రోగ లక్షణాలు కన్పిస్తున్నాయా? పెద్ద వయసు పాత్రలు  జొరబడుతున్నాయా? ఇంకా జొరబడతాయి.

          అసలు సీను ఆలోచనే ఎంత పెద్ద తప్పో ఇలా చెప్పవచ్చు ఇంటర్వెల్ సీను వరకూ హరి తను ప్రేమిస్తున్న కార్తీక కేశవ కూతురేనని నమ్మాడు. కేశవ భోజనానికి రమ్మనగానే, అతను తన  ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడనే ఆనందించి ఇతరులకి  చెప్పాడు హరి.  తీరా వెళ్ళింది వైరముత్తు ఇంటికనీ, వైరముత్తు కూతురే తను ప్రేమిస్తున్న కార్తీక అనీ తెలుసుకున్నాడు. 

           నేపధ్యంలో హరి ఆలోచనలు ఎలా వుంటాయి? అలా కేశవ ఇంటికి వెళ్ళకపోవడమే మంచిదయ్యింది, వెళ్లి వుంటే అతడి కూతురు తను ప్రేమిస్తున్న కార్తీక కాదని తెలిసేది, ఇది తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేశవ మెడ బట్టి బయటికి గెంటేసే వాడు అని కదా? అలాంటప్పుడు మళ్ళీ అతడి పాత ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఇప్పుడెలా వెళ్తాడు, తప్పించుకు తిరుగుతాడు గానీ? ఇదంతా మూలస్థంభం మర్చిపోయి దారితప్పిన క్రియేటివ్ ఆట! స్ట్రక్చర్ అవసరం లేదనుకుంటే ఏం జరుగుతుందో ఇంకా చెప్పాలా ఇలా తప్పుడు సీన్లు, తప్పుడు కథే! 

           సీన్లో యూ టర్న్ తీసుకుని హరికి అండగా  వుంటానన్న కేశవే వెంటనే తోక ముడుస్తాడు. వైరముత్తు కూతురి విషయంగా హరితో పంచాయితీ పెట్టిస్తాడు. పంచాయితీ పెద్ద ప్రాణాలు జాగ్రత్తని  హరిని హెచ్చరిస్తాడు. వైరముత్తు కూడా ఇక పంచాయితీ లుండవ్, పంచానామాలే అంటాడు. తను ఆడాలనుకుంటున్న గేమ్ కూడా బయటపడి  కేశవ తోక ముడుస్తాడు. కేశవ సెటప్ కి ఇలాటి పే ఆఫ్ తో ఇంకోటేం  జరిగిందంటే, ఇతడితో ముందు కెళ్ళే కథకూడా ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ కథనం బారిన పడి తెగిపోయింది. మళ్ళీ అతికించి కొనసాగించాలి. ఇది జరగదు. ఆటలోంచి ఇతను ఔటయ్యాడు. 

          పంచాయితీలో ఇన్ని బెదిరింపులొస్తున్నా హరి పల్లెత్తు మాటనడు. మనసులో ఏముందో అర్ధమవదు ప్రేక్షకులకి. ఏమైనా అనడానికి ఒక వ్యూహమంటూ వుంటే కదా? అది ప్రేక్షకులకి తెలిస్తే కదా? విలన్ బెదిరిస్తున్నా  నోర్మూసుకుని వుంటాడు.

          ఇలా ఒకదాని తర్వాత ఒకటి అర్ధం లేని సీన్లు. కార్తీకని కలుస్తాడు హరి. నువ్వు తమిళ్ కాదని కాదంటుంది కార్తీక. నువ్వు తెలుగే అనుకున్నానంటాడు హరి.  సరేనని, మళ్ళీ తండ్రి  వూరుకోడనీ, తనని మర్చిపొమ్మనీ అంటుంది. ఏమిటీమె సమస్య భాషా? తండ్రా? ప్రేమకి భాష అడ్డు కానప్పుడు నసే పెట్టకూడదు, నేరుగా పాయింటుకొచ్చి తండ్రితో వున్న భయం గురించే  చెప్పుకోవాలి. సీనైనా ఒక్క పాయింటు మీదే నడవాలి పాత్ర చిత్రణని కాపాడడం కోసం. 

          ఇక్కడొక ప్లేటు ఫిరాయింపు వుంది. దీనికి పూర్వం సీన్లో తండ్రి కాలేజీ మానెయ్యమని ఆర్డరేస్తే తెలివిగా,  చిలిపిగా,  కొంటెగా ఫస్టాఫ్ లోని రోమాంటిక్ కామెడీ హీరోయిన్ పాత్ర పోషణ చేస్తూ తండ్రిని న్యూట్రల్ చేసేస్తుంది. తన ప్రేమ కోసమే. కానీ ఇప్పుడొచ్చి హీరోతో తండ్రి భయం చెప్పి విడిపోదామంటుంది. ఇలా రోమాంటిక్ కామెడీ హీరోయిన్ కాస్తా రోమాంటిక్ డ్రామా ఏడ్పుల హీరోయిన్ గా మారిపోయి విడిపోతుంది. కథలో వుండక రోమాంటిక్ ప్లేవర్ వదులుకుని, మూల కూర్చుంటుంది. ఇలా కథలో (ప్లాట్ పాయింట్ వన్ లో) పుట్టని కృత్రిమ కథగా విషయం మారిపోతుంది. 

          ఇప్పుడు ప్రేమ కుదరాలంటే రెండూళ్ళని కలపాలని హరికి ఆలోచన వస్తుంది ఇంతాలస్యంగా. ఆలోచన ఇంటర్వెల్ ప్లాట్ పాయింట్ వన్ సీన్లోనే వచ్చి, అక్కడ వైరముత్తుకి దీటుగా గోల్ ఏర్పడాలి. ఎప్పుడో కార్తీక విడిపోయాక కాదు. ఇలావున్నాయి స్ట్రక్చర్  వదిలేసిన క్రియేటివిటీ సంగతులు. 

          అసలు హరికి ఎవరికీ లేని రెండూళ్ళని కలపాలన్న తపన ఎందుకు? ఏంటా చాదస్తపు సెంటిమెంటు? అవి తన వూళ్ళా?  ఏవో వూళ్ళు ఎలా తగలెడితే తనకెందుకు? కార్తీకని తీసుకుని పారిపో....ఊళ్ళని కలిపితే ఎక్కడైనా వైరముత్తు వచ్చి కళ్ళ కద్దుకుని కన్యాదానం చేసిపోతాడా? కృత్రిమ డ్రామాకి కృత్రిమ గోల్ ఇది.

          మళ్ళీ ఏమైందో, హరి ఫోన్ చేయగానే  కార్తీక వచ్చేసి డ్యూయెట్ పాడేసి వెళ్ళిపోతుంది. ఇక హరి ఫ్రెష్ గా ప్రిసిపాల్ కారు అడుక్కుని, రెండూళ్ళలో ముసలి వాళ్ళని కిడ్నాపులు చేయడం మొదలెడతాడు. అసలు గొడవలు ఎందుకు మొదలయ్యాయి చెప్పమంటాడు. 

          ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర విభజన నేపధ్యం చెప్పుకొచ్చి, రెండూళ్ళ జమీందార్లయిన ఇద్దరు ఒక గదిలోకి వెళ్లి,  కత్తిపోట్లతో వచ్చి పరస్పరం వ్యతిరేక ఆరోపణలు చేసుకుని,  రెండూళ్ళ ప్రజల్ని రెచ్చగొట్టి చచ్చిపోయారనీ, అసలు గదిలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదనీ,  అప్పట్నుంచీ రెండూళ్ళ మధ్య శత్రుత్వాలు నెలకొన్నాయనీ వివరిస్తారు.   రోజు గదిలో ఏం జరిగింది? ఇదీ హరి ముందున్న ప్రశ్న. 

          హరి ఇలా కిడ్నాపులు చేస్తూంటే, అటు వైరముత్తుకి, ఇటు కేశవకీ, పంచాయితీ పెద్దకీ తెలియదా? తెలిసీ వూరుకున్నారా అంత హెచ్చరిక చేసీ? ఇలా అర్ధం లేకుండా వున్నాయి స్ట్రక్చర్ పట్టని క్రియేటివిటీ పాలబడ్డ సీన్లు. 

          నిజానికి ఫ్లాష్ బ్యాక్ మంచిదే,  ఫన్నీగా కూడా వుంది. ఐతే ఇదంతా నిష్ప్రయోజన మైపోయింది. కథలో విలన్ ఎవరు? ప్లాట్ పాయింట్ వన్ తో వైరముత్తు విలన్ గా కన్పించాడు. అదే సమయంలో ఇంకో విలన్ గా కేశవ  కన్పించాల్సింది కన్పించలేదు. హరి తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని వైరముత్తు విలన్ అయ్యాడు ( కానీ అక్కడ్నించీ విలన్ లా ప్రవర్తించలేదనేది వేరే సంగతి). ఇక కేశవ విషయానికొస్తే, అతనూ విలనే. హరిని అల్లుణ్ణి చేసుకుందామని భోజనానికి పిలిస్తే,  రాకుండా శత్రువు వైరముత్తు ఇంటికెళ్ళి వాడి అమ్మాయి వల్లో పడ్డాడన్న కడుపుమంటతో రెండో విలన్ అవుతాడు. మొదట్లో చెప్పుకున్నట్టు, కథలో కనిపిస్తున్న బలాబలాల సమీకరణనే గుర్తించలేదు కథకుడు. హరికి ఆల్రెడీ ఇద్దరు విలన్లుంటారు. ఇప్పుడు అసలు విలన్ పంచాయితీ పెద్ద అవుతాడు. 

          ఎలాగంటే, హరి ముసలి వాళ్ళనేసుకుని ఫ్లాష్ బ్యాక్ తవ్వుతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ బయట పడితే పంచాయితీ పెద్ద అసలు విలన్ గా దొరికిపోతాడు. విధంగా రెండూళ్ళలో హింసని ప్రేరేపిస్తూ తన చెప్పు చేతల్లో వుంచుకున్నాడో బయట పడిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లో,   రోజు గదిలో ఏం జరిగింది? అన్న హరి ముందుకొచ్చిన ప్రశ్న కథకుడి కథలోనే పంచాయితీ  పెద్దతో ముడి పడి వుంది! 

          కనుక ఫ్లాష్ బ్యాక్ తవ్వుతూంటే పంచాయితీ పెద్ద ధూంధాం చేస్తూ హరి అంతు చూడమని విలన్లని ఆదేశించకుండా వుండలేడు. ఇలా అర్ధవంతమైన యాక్షన్ కి స్కోపుంటుంది. అసలు యాక్షన్ మిస్సయ్యే కదా కామెడీగా పేలవంగా తేలిపోయింది ముగింపు

          ఎప్పుడైతే ఇక్కడ పంచాయితీ పెద్ద అసలు విలన్ అని ఝలక్ ఇస్తాడో కథ మొనాటనీ వదిలించుకుని ఇంకో లెవెల్ కెళ్ళే అవకాశాముంటుంది.  కానీ ఇలా జరగ లేదు. హీరో సంచలనంగా ఫ్లాష్ బ్యాక్ తవ్వుతున్నా విలన్లు నిమ్మకు నీరెత్తినట్టు వుంటారు. తన కెదురైన ప్రశ్నతో ముందు కెళ్లకుండా హరి కూడా స్తబ్దుగా వుండిపోతాడు. డైనమిక్స్ ఇలా కిల్ అవుతూ చప్పబడి పోతోంది సెకండాఫ్. 

          అటు కార్తీక ని చూస్తే ఆమె తండ్రి వైరముత్తు సంబంధాలు చూడ్డం. పాత చింతకాయ టెంప్లెట్స్  సీన్లలో వెన్నెల కిషోర్ నేసుకుని సెకండాఫ్ ని కొంత భర్తీ చేయడం. హరి అటు డైవర్ట్ అవడం. ఇందులోకి ఇతడి పేరెంట్స్ కూడా  దూరి  రోమాంటిక్ డ్రామా రోగ లక్షణాల్ని పరిపూర్ణం చేయడమూనూ. 

          ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న తర్వాత, రోజు గదిలో ఏం జరిగిందన్న ప్రశ్నకి హరి- వూరి గొడవలు తనకేం అర్ధంగావడం లేదని కార్తీకతో అనేస్తాడు. ఆమెని తనతో వచ్చేయమంటాడు. మా ఫ్యామిలీ బాధపడతారని ఆమె అంటుంది. ఇద్దరికీ ఏం చేయాలో ర్ధంగాక ఒకటే ఏడ్పులు! ఇదీ వరస. పాసివ్ లో కూడా మరీ దివాలా తీసిన పాసివ్. ఇలా ఏడ్పిస్తే  ప్రేక్షకుల్లో సానుభూతి వచ్చేస్తుందని కాబోలు రోమాంటిక్ కామెడీని రోమాంటిక్ డ్రామాగా కిచిడీ చేసిన కథకుడి తప్పుడు భావోద్వేగాలే ఇవి. 

        ఈ ఏడ్పుల హరి ఇక తాగి బార్లో పాటేసుకుంటాడు. మధ్య హిందీలో వచ్చిన  పక్కా ఫన్నీ రోమాంటిక్ కామెడీ బరేలీకీ బర్ఫీలో ఉండుండి క్లయిమాక్స్ లో ఇలాటి పాట వేసే అంతవరకూ కాపాడుకొచ్చిన జానర్ మర్యాద చెడగొట్టారు. తన ప్రేమ పాడయ్యిందని ఆయుష్మాన్ ఖురానా భారీ సెట్టింగుతో ఏడ్పు పాట భీకరంగా  వేసుకుంటాడు. దీంతో కథ మూడ్ అంతా పాత గచ్చీ బౌలీ రోడ్డులా పిచ్చి పిచ్చిగా అయి పోతుంది. నిజానికిక్కడ క్లయిమాక్స్ ని లేపుతూ,  ఆయుష్మాన్ ఖురానా ప్రేమని చెడగొట్టిన రాజ్ కుమార్ రావ్ ఇరగదీసే పాట వుండాలి విజయంతో. అప్పుడే జానర్ మర్యాద సహా అన్నీ భద్రంగా వుంటాయి. 

          కథానాయకుడు హరి ఏడ్పు పాటతో సినిమాని పూర్తిగా దిగజార్చి, రోడ్డు పక్కన పాత దేవదాసులా కూర్చుంటే,  తండ్రి వచ్చి కాగితాలు చేతిలో పెడతాడు. అవి పాత భూ పత్రాలు. ఇద్దరు జమీందార్ల  ఆస్తులు సగం సగం మరొకరి పేర బదిలీ అయ్యాయని పుత్ర రత్నానికి జ్ఞానోదుం కల్గిస్తాడు.

          రోమాంటిక్ కామెడీ కాస్తా రోమాంటిక్ డ్రామా చర్మం కప్పుకున్నాక, ఇలాగే చేతకాక కూర్చున్న హీరో అనే వాడికి (కొడుక్కి) పేరెంట్సే  ఆదుకుని ఓదార్చి సమస్యలోంచి ఒడ్డున పడేస్తారు. ఇది మిడిల్ విభాగం ముగుస్తూ ప్లాట్ పాయింట్ టూ సన్నివేశం! ప్లాట్ పాయింట్ టూ అంటే ఏమిటి? ప్లాట్ పాయింట్ వన్ కి సమాధానం. సమాధానం బాగానే దొరికింది. సమాధానం ఎవరు స్వయంగా కనుక్కోవాలి? హీరో అంటే ఇక్కడ హరియే కనుక్కోవాలి. కానీ ఫ్లాష్ బ్యాక్ లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం కనుక్కునే ప్రయత్నమే చెయ్యకుండా, కార్తీకతో పాటు కలిసి ఏడ్చి, ఏడ్పు పాట వేసుకున్న హరి ఇంకేం కనుక్కుంటాడు. 

          ఇందువల్ల ప్లాట్ పాయింట్ టూ,  అంటే రెండవ మూలస్థంభం కూడా విఫల మయింది. ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూ రెండూ స్క్రీన్ ప్లే అనే మహా సౌధానికి రెండు మూల స్థంభాలు. మూల స్థంభాలు పుచ్చి పోయి వుంటే స్క్రీన్ ప్లే అనే మహా సౌధమే వుండదు. కుప్ప కూలుతుంది. ఇలా సినిమాలో స్క్రీన్ ప్లే అనేది లేదు. ఉన్నది ఏదో  మనసుకి తోచిన క్రియేటివిటీ మాత్రమే. 


        యథా ప్లాట్ పాయింట్ వన్ - తథా ప్లాట్ పాయింట్ టూ అన్నాడు. ఎవరో కాదు,  నాల్గు ఆస్కార్ల మహా దర్శకుడు బిల్లీ వైల్డర్. ప్లాట్ పాయింట్ వన్ ఎలా వస్తే ప్లాట్ పాయింట్ టూ కూడా అలాగే వస్తుందన్నాడు. ప్లాట్ పాయింట్ వన్ బలహీనంగా వుంటే, ప్లాట్ పాయింట్ టూ కూడా బలహీనంగానే వస్తుందన్నాడు. ముగింపుకి దారితీసే ప్లాట్ పాయింట్ టూతో ముగింపు సరిగ్గా కుదరకపోతే, వెనక్కి వెళ్లి ప్లాట్ పాయింట్ వన్ ని రిపేరు చేసుకోవాలన్నాడు. అదీ సంగతి!

          కథానాయకుడు ఇంటర్వెల్ దగ్గర,  ప్లాట్ పాయింట్ వన్ లో ఏమీ చేయలేక బలహీనం చేసి అలా పారిపోయాడు కాబట్టే, మిడిల్ అంతా ఏమీ చేయలేక, దొరికిన ప్రశ్నతో కూడా ఏం చేయాలో అర్ధంగాక, ఇప్పుడు ముగింపుకి వెళ్ళే  ప్లాట్ పాయింట్ టూని అంతే బలహీనంగా మారుస్తూ రోడ్డు పక్కన పాత దేవదాసులా కూర్చున్నాడు. అప్పుడు తండ్రి వచ్చి సాయం చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు  పెద్ద హీరో గారైపోయి, కాగితాలతో పంచాయితీ పెద్ద దగ్గరికెళ్లి పోయి,  ప్రశ్నకి సమాధానం తెలుసు కున్నాడు!

          సమాధానం తెలుసుకున్నాక, వైరముత్తు, కేశవలు తిరగబడితే పొడుచుకు చచ్చిన మీ తాతల బతుకుల గురించి నేను నోరువిప్పితే మీ పరువే పోతుంది కాబట్టి,  కలిసి వుంటే కలదు సుఖమని పంచాయితీ పెద్ద బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో రెండూళ్ళూ కలిసివుంటే కలదు సుఖమని నినాదాలు చేసుకుని కలిసిపోతాయి. ఇక హరి, కార్తీకల పెళ్లి  సీను మీద శుభం! ఏనాటి శుభాలివి!!

          ఉత్త డైలాగులతో నడిచే క్లయిమాక్స్ తో పాటు ముగింపూ చూస్తే చాలా పాత సినిమా చూస్తున్నట్టు వుంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు బలాబలాల సమీకరణ మర్చిపోవడంతో యాక్షన్ తో కలిపి క్లయిమాక్స్ చేసేందుకు లేకుండా పోయింది.  

          ఇంకా పంచానామా చేస్తే చాలా వుంది కానీ,  ఇంతచాలు. ఇలా సినిమాని విమర్శిస్తున్నామని కాదు స్ట్రక్చర్ నేర్చుకోవడానికి ఒక చక్కటి మోడల్ గా దృష్టికి తేవడమే ఉద్దేశం. టెంప్లెట్ సినిమాలతో ఇది వీలుపడదు.

సికిందర్