రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, ఆగస్టు 2017, బుధవారం

497 : సత్యచక్ర








ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యాఘటన పై అదే యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి, ‘కిట్టూయానిమేషన్ ఫిలింకి జాతీయ అవార్డు పొందిన సత్య చక్ర రూపొందించిన డాక్యుమెంటరీ  ట్రైలర్ విడుదలైంది.
2016 లోరోహిత్ వేముల ఉదంతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  నే కాదు,యావత్ భారతాన్ని కదిలించిందికులవివక్ష పై లోతైన చర్చకి దారితీసింది. ఉన్నత విద్యాల
యాలలో
,విశ్వవిద్యాలయాలలో అనాదిగా వున్న కులవివక్ష ముసుగుప్రజాస్వామ్యపు విలువలు ఒక్కసారిగా బహిర్గతమయ్యేందుకు దారి తీసిన డాక్యుమెంట్ –The Historical Documents – Rohith's Last Letters 

         
‘I loved Science, Stars, Nature, but then I loved people without knowing that people have long since divorced from nature. Our feelings are second handed. Our love is constructed. Our beliefs colored. Our originality valid through artificial art. It has become truly difficult to love without getting hurt - అని రోహిత్ వేముల రాశారు

 అతడి లేఖలోని ప్రతీ పదం సత్య చక్రని కదిలించింది. చదివినప్పుడల్లా దుఖం పొంగుకొచ్చేది. లేఖప్రపంచ మేధావులనే కదిలించింది. అతడి మరణానంతర పరిణామాలు  మత్తు  లో వున్న సమాజాన్ని  మేల్కొలిపాయి.ఈ మేల్కొల్పు కోసం అతడి ప్రాణ త్యగమనే అత్యంత దుఃఖభరితమైన సంఘటన జరగాల్సివచ్చిందిఅయితే  మనం చరిత్రని నిర్దేశించలేము.కానీ జరిగినదానిని రికార్డు చేసి మంచి చెడుల తూకం వేసి భవిష్యత్తుని నిర్దేశించడానికి ఉపయోగించగలం.ఇలాంటి ఆలోచనలకిప్రతిరూపమే  రోహిత్ వేముల పై డాక్యుమెంటరీ ఫిల్మ్ చేయడానికి పురికొల్పింది ఫిల్మ్ టైటిల్ “ A journey to The stars” 

 ఈ భావాలు యూనివర్సిటీ లో జరిగిన సంఘటనలలో చారిత్రక సత్యాన్ని గుర్తుచేయడమే కాదు, హెచ్చరించాయి . వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమగ్రమైన విచారణ తో ,పటిష్టమైన టెక్నిక్ నికలుపుకుని 100 నిమిషాలపూర్తిస్థాయి డాక్యుమెంటరీ ని “ కాలచక్ర ఫిల్మ్స్” బ్యానర్ లో నిర్మించారు.

    మరో రెండు నెలల్లో  పూర్తి ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని బయటకు వస్తుంది. రోహిత్ ఆలోచనలని ,పీడనాలు లేని భవిష్యత్తు కోసం పదిల పరుచుకునే  ప్రయత్నంలో   పూర్తి సహకారాన్ని ,భాగస్వామ్యాన్ని అందించిన కాకి మాధవరావు (రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి), ప్రొఫెసర్ కంచ ఐలయ్య (హెచ్ సీయూ ఫాకల్టీ) గార్లకు ధన్యవాదాలు.


-సత్యచక్ర (దర్శకుడు) 











ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి : 

https://www.youtube.com/watch?v=_9u9WXapDdY&feature=share

13, ఆగస్టు 2017, ఆదివారం

496 : రివ్యూ!

రచన – దర్శకత్వం : బోయపాటి శ్రీను
తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శరత్ కుమార్, సుమన్, జయప్రకాశ్, ఆకాష్ ఖురానా, తదితరులు
మాటలు : రత్నం, సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : రుషి పంజాబీ
బ్యానర్ :  ద్వారకా క్రియేషన్స్
నిర్మాత :  మిర్యాల రవీందర్ రెడ్డి
విడుదల : ఆగస్టు 11, 2017

***
          మొదటి సినిమా ‘అల్లుడు శీను’ కి ఫిలిం ఫేర్ ఉత్తమ నూతన నటుడి అవార్డు తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, తర్వాత ‘స్పీడున్నోడు’ నటించి దూసుకెళ్ళ లేకపోయాడు. ఇప్పుడు ఎలాగైనా దూసుకెళ్ళడానికి  యాక్షన్ స్పెషలిస్టు బోయపాటి శ్రీనుతో ‘ఆపరేషన్ దూసుకెళ్ళుడు’ కి సమకట్టాడు. తన యాక్షన్  ఫిరంగిలో బెల్లంకొండని మందు గుండులా దట్టించి బోయపాటి ఫైర్ చేస్తే, ఏ రేంజిలో దూసుకెళ్ళి బెల్లంకొండ టార్గెట్ ని ఢీకొట్టాడో ఓసారి పరిశీలిద్దాం...

కథ 
       చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ( శరత్ కుమార్ ) పుత్రరత్నం గగన్ ( బెల్లంకొండ). ఇతనూ తండ్రీ అన్నా కలిసి ఒక జట్టు. ఫ్రెండ్స్ లా వుంటారు. కలిసి మందు కొడతారు. కలిసి బయట  బజ్జీలు తింటారు. గగన్ కాలేజీ స్టూడెంట్ కూడా. కాలేజీలో ఓ మినిస్టర్ (సుమన్)  కొడుకు వల్ల ఇబ్బంది పడ్డ అమ్మాయికి మద్దతుగా గగన్ ఆ కొడుకు కీళ్ళు విరిచేస్తాడు. ఇది చూసిన స్వీటీ అలియాస్ జానకి ( రాకుల్) అనే మరో స్టూడెంట్ గగన్ ని ప్రేమించేస్తుంది. చొరవ తీసుకుని గగన్ ఇంట్లో వాళ్లకి మంచి అలవాట్లు నేర్పి దగ్గరవుతుంది. గగన్ అన్న ప్రేమించినమ్మాయితో పెళ్లి కూడా జరిగేలా  చూస్తుంది. దీంతో గగన్ కూడా ఆమెని ప్రేమించడం మొదలెడతాడు.

          స్వీటీ హైవేస్ అధారిటీ చైర్మన్ ( జయప్రకాష్ ) కూతురు కూడా. ఈ హైవే కాంట్రాక్టు పొందడానికి అశ్వత్ వర్మ ( జగపతిబాబు) ప్రయత్నిస్తే, లిక్కర్ కింగ్ ఆ కాంట్రాక్టు తను కొట్టేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ కుమ్ములాటల పర్యవసానంగా స్వీటీ తండ్రి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెకి వర్మ కొడుకుతో పెళ్లి జరిపించేస్తాడు. ఈ పెళ్లి మండపంలో లిక్కర్ కింగ్ పెళ్లి కొడుకుని చంపేస్తాడు. ఇలా అన్యాయమైపోయిన స్వీటీని గగన్ ఆదుకోవాల్సి వస్తుంది...ఇదీ కథ!

ఎలావుంది కథ 
      ఫ్యామిలీ డ్రామాలు సృష్టించి అందులోంచి భావోద్వేగాలతో కూడిన యాక్షన్ ని రగిలించడం మార్కు బోయపాటి కథలాగే వుంది. అయితే ఈ తరహా కథల్ని బాలకృష్ణతో  ‘సింహా’,  ‘లెజెండ్’ లుగా తీసినప్పుడు, బాలయ్య గ్లామర్ తో కుటుంబాలు కూడా కదిలివచ్చి పెద్ద హిట్స్  చేశారు. బెల్లంకొండకి కుటుంబ ప్రేక్షకుల్లో గ్లామర్ లేకపోవడంతో కేవలం బి, సి సెంటర్ల మాస్ కథ స్థాయికి చేరింది.  శంఖంలో పోస్తే గానీ తీర్ధం కాదన్నట్టు ఈ కథకి బోయపాటి రేంజి స్టార్ తోనే కళ వస్తుంది  తప్ప-  జ్యూనియర్ హీరోలతో కాదు. వైధవ్యం పొందిన హీరోయిన్ని హీరో చేపట్టడమనే పాయింటు బోయపాటి  ఫ్యామిలీ డ్రామాకి కొత్తదే అయినా, ఇది కూడా కుటుంబ ప్రేక్షకుల్ని నోచుకునే అవకాశం లేకుండా  పోయింది హీరో రేంజి వల్ల.

ఎవరెలా చేశారు 
      ‘ఇది తప్ప ఏదీ రాదా?’ అని బెల్లంకొండ ఎక్స్ ప్రెష న్స్ నుద్దేశించి రకుల్ డైలాగు. బోయపాటి కావాలనే ఈ డైలాగు పెట్టినట్టుంది. బెల్లంకొండ ఫిలిం ఫేర్ నిర్ణయించిన ఉత్తమ నూతన నటుడు. కానీ ఆ అవార్డుకి న్యాయం చేసే విషయం పక్కన పెట్టాడు. దేనికైనా బ్లాంక్ ఫేసే పెట్టడంతో ఇది కూడా కొంపదీసి భావప్రకటనేమో,  దీనిద్వారా ఏం  చెపుతున్నాడో నని మనం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి. కాలేజీలో అమ్మాయిలు సరదాగా తనతో మాట్లాడుతూంటే కూడా మాటలు కలపకుండా, చంద్రబాబు నాయుడు జగన్ ని చూసినట్టు చూపులు. ఒక చోట ఏకాంతంలో  రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమ సంభాషణ చేస్తూంటే, పక్కనే కూర్చుని కేసీఆర్ రేవంత్ ని చూసినట్టు చూపులు. డైలాగు పలికినా కూడా కష్టమే. అందుకే డైలాగులు తగ్గించి ‘చూపులు’ వరకే పరిమితం చేశారు నటనని. బెల్లంకొండ భారీ ఫైట్లు చేసుకుపోవడం, పాటల్లో స్పీడుగా డాన్సులు చేసుకుపోవడం  తప్ప పాత్రని నటించగల నటుడిగా నిరూపించుకోలేదు. ఎక్కడా నవ్వడు, కామెడీ చెయ్యడు . ఇలా బోయపాటితో బెల్లం కొండ రేంజి పెరగలేదు సరికదా, బోయపాటి వన్నె తగ్గిపోయింది. 

          హీరో సమవుజ్జీ కాలేక రకుల్ ప్రీత్ సింగ్ నటన కూడా అడవి కాచిన వెన్నెలయింది. ద్వితీయార్ధంలో పాత్ర పెరిగి ఆమె ఎంత నటించుకుంటే ఏం లాభం నటుడి నుంచి దీటుగా స్పందన లేకపోతే. కిక్ - 2 లో బీహార్ ఎపిసోడ్ లో ఇలాటిదే అన్యాయం జరిగిన అమ్మాయిగా రవితేజ ఆలంబనగా నటనని పండించుకుంది. 

          సెకండ్ హీరోయిన్ గా రఫ్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. కమెడియన్లు లేరు. విలన్లే వున్నారు. అయితే జగపతిబాబుతో బాటు, తరుణ్ అరోరా రొటీన్ గానే కనిపిస్తారు. ‘లెజెండ్’  తో బోయపాటి చేతిలో ఇటాలియన్ మాఫియాసో రూపురేఖల్లో విలన్ గా కొత్త అధ్యాయం తెరచిన జగపతిబాబు కీసారి అలాటి ప్రత్యేకతలేం లేవు.

          బోయపాటిలాగే దేవిశ్రీ కూడా బెల్లంకొండ కోసం కష్టపడ్డారు. కానీ పాటలతో కూడా ఉన్నత తరగతి ప్రేక్షకులకి సినిమా రీచ్ అయ్యే అవకాశంలేదు కన్పించడం లేదు. కెమెరా వర్క్ బోయపాటి స్థాయికి తగ్గట్టే వుంది. బోయపాటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఒక అన్యాయం లోంచి పుట్టుకొస్తూ భావోద్వేగాల్ని రగిలిస్తాయి. ప్రస్తుతం ఇదే జరిగినా, చివర హంసల దీవి యాక్షన్ ఎపిసోడ్ టాప్ గా నిలుస్తుంది. రత్నం రాసిన డైలాగుల్లో ‘రిచ్ నెస్ అంటే డబ్బుండడం కాదు, బుద్ధుండడం’ బాగా పేలింది. 

చివరికేమిటి 
       ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలు తీసే బోయపాటి వాటి స్క్రీన్ ప్లేల్లో ఎప్పటికప్పుడు తాజాదనం కోసం కృషి చేస్తే బావుంటుంది. ఇంకా పాత  సినిమాల ఫీల్ తో  ఓపెనింగ్ సీన్లు పెట్టాల్సిన అవసరం లేదు. మాస్ కూడా పాత కథలకి  కొత్త కథనాల్నే  కోరుకుంటారు. హీరో గురించి చెప్పడానికి కాలేజీ ప్రిసిపాల్ తో వేసిన ఇంటర్ కట్ సీన్స్ చాలా పూర్ గా గావున్నాయి. బోయపాటి తన సృజనాత్మకతని సానబట్టుకోవాల్సి వుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎప్పుడేది వేసి ప్రేక్షకుల్ని రెచ్చగొట్ట వచ్చో బాగా తెలిసిన తనకి వాటికి  తగ్గ కథానాయకుణ్ణి ఎంపిక చేసుకుంటేనే సార్ధకమవుతుంది. ‘సరైనోడు’ లాంటి యాక్షన్ మూవీ ఎవరితో తీసినా చెల్లిపోతుంది, కానీ భారీ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాల్ని కాదు. ఇలాటివి తీయాలంటే  ముందా హీరోకి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్నన వుండాలి.

          బెల్లంకొండ శ్రీనివాస్ నటనలో ఇలాగే కొనసాగితే కింది స్థాయిలోనే  వుండిపోతాడు. ఇంతింత భారీ బడ్జెట్స్ తో తీసి,  కేవలం డాన్సులు ఫైట్లు మాత్రమే ప్రదర్శించినంత మాత్రాన వొరిగేదేమీ లేదు. బడ్జెట్స్ తో ఇగోకి పోకుండా, ముందు నటన నేర్చుని  సాధారణ బడ్జెట్స్ కి ఒప్పుకుంటే అన్నీ చక్కబడతాయి. లేని నటుణ్ణి భారీ హంగులు  కవర్ చేయలేవు. 

           మొత్తానికి ఫిరంగిలో బోయపాటి పేల్చిన మందుగుండు మాస్ వరకే వెళ్లగలిగి అక్కడే సెటిలయింది.

-సికిందర్
http://www.cinemabazaar.in
         
         
           
 




          

12, ఆగస్టు 2017, శనివారం

495 : రివ్యూ!

రచన-  ర్శత్వం : హను రాఘపూడి
తారాగణం :  నితిన్, మేఘా ఆకాష్, అర్జున్, వికిషన్, నాజర్, శ్రీరామ్, సురేష్, అజయ్, పృథ్వీ, బ్రహ్మాజీ, ధుసూధన్, రాజీవ్కాల, పూర్ణిమ దితరులు
సంగీతం :  ణిశర్మ, ఛాయాగ్రణం : యువరాజ్
నిర్మాతలుః రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంక
విడుదల : ఆగస్టు 11, 2017

***
          1970 లలో జేమ్స్ బాండ్ స్ఫూర్తితో తెలుగులో ఒక ఊపు వూపిన స్పై  సినిమాలు ఆ తర్వాత ఐపు లేకుండా  పోయాయి. ఆ ట్రెండ్ లో ఆంధ్రా జేమ్స్ బాండ్ గా హీరో కృష్ణ పాపులారిటీ సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అప్పుడప్పుడే ప్రారంభమైన వ్యాపార యుగంలో జేమ్స్ బాండ్, కౌబాయ్ సహా వీలైనన్ని జానర్స్ లో  వెరైటీగా సినిమాలు తీస్తూపోయి వ్యాపార యుగాన్ని హిట్ చేశారు. శతాబ్దం మారేసరికల్లా  వ్యాపార యుగం కాస్తా ఫ్యాక్షన్ యాక్షన్లూ,   ప్రేమలూ దెయ్యాలూ అనే రెండో  మూడో  జానర్లకే కుదించుకు పోయింది. వీటితోనే అదే పనిగా ప్రేక్షకుల్ని బాదుతూ వ్యాపార యుగాన్ని ఫ్లాప్ చేశారు. ఇది సృజనాత్మక నియంతృత్వమని కాక  సృజనాత్మక అలసత్వం. దీనికి పరాకాష్ట  గత శుక్రవారం ‘నక్షత్రం’. వా రం తిరిగేసరికల్లా ఈ శుక్రవారం కనుమరుగైన  జానర్  ముందుకొచ్చింది. అదే ‘లై’ అనే సూపర్ స్పై  థ్రిల్లర్!  మాస్ యాక్షన్లూ, ప్రేమలూ దెయ్యాలూ కాసేపు పక్కన పెట్టి, ఒక ఒక స్పై సినిమా తీయాలన్న ఆలోచన రావడమే గొప్ప!

         
‘అందాల రాక్షసి’ అనే ప్రేమ సినిమాతో పరిచయమైన దర్శకుడు హను రాఘవపూడి  ఆ తర్వాత ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’  అనే జానర్ల కలగూర గంప తీసి ఇంకా  సినిమాకళ మీద పట్టు సాధించని దశలో,  ప్రస్తుత స్పై థ్రిల్లర్ ని జానర్  మీద పట్టున్న దర్శకుడిలా తీశాడు. 

          రోమాంటిక్ కామెడీలతో తిరిగి వెలుగులో కొచ్చిన హీరో నితిన్ కూడా ఈ స్పై థ్రిల్లర్ కి పూనుకుని టెంప్లెట్ సినిమాల నుంచి దూకి అవతల పడ్డాడు. ఇలాటి సినిమా తీయడానికి ముందుకొచ్చిన పాపులర్ నిర్మాతలు కూడా  సరైన నిర్ణయమే  తీసుకున్నారు.


          ఐతే ఇంత చేసీ ఇందులో పాత  మూస లేకపోలేదు- ఈ మూస ఏ తరగతి ప్రేక్షకులకైతే ఉద్దేశించారో వాళ్లకి కాసేపే ఊరట. మిగతా వ్యవహారమంతా మళ్ళీ వాళ్లకి మూస తప్పిన గోసే. ఇదేమిటో చూద్దాం...

కథ 
        చైత్ర (మేఘా ఆకాష్)  పుట్టింది. పుట్టగానే డబ్బు ని  ముట్టుకుంది. పిసినారిగా ఎదిగింది. పెళ్లి చేసుకుంటే హనీమూన్ కి ఫారిన్ తిరగొచ్చని ఎవరో అంటే పేరెంట్స్  ని బలవంత పెట్టి పెళ్ళికి తయారయ్యింది. హనీమూన్ టూరుకి ఏజెంట్ కి డబ్బు కట్టింది. ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఏజెంట్ డబ్బివ్వనన్నాడు.

          సత్యం ఆవారాగా తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకోరా అని తల్లి వేధిస్తోంది. వచ్చిన సంబంధాలు ఆవారాతనం చూసి కుదరడం లేదు. అమెరికా  వెళ్లి అక్కడ అమ్మాయిల్ని చూసుకుని పెళ్లి చేసుకుంటానంటాడు. 

          చైత్రకి ఏజెంట్ డబ్బు తిరిగివ్వకపోవడంతో ఆ డబ్బులకి ఫారిన్ తిరిగి రావడానికి  బయల్దేరుతుంది. అదే ఫ్లయిట్ సత్యం కూడా ఎక్కుతాడు. ఇద్దరూ అబద్ధాలతో బతికే వాళ్ళే.  ఆ అబద్ధాలతో కలిసి లాస్ వెగాస్ లో వుంటారు. 

          పద్మనాభం (అర్జున్) అనే ఒక ఘరానా క్రిమినల్ అమెరికాలో దాక్కున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రయత్నిస్తోంది. ఈ వేటలో ఓ సంఘటన జరిగి అందులో సత్యం ఇరుక్కుంటాడు. 

          సత్యం ఎందుకు ఇరుక్కున్నాడు, అతడికీ పద్మనాభానికీ ఏమైనా సంబంధముందా, పద్మనాభాన్ని పట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు...ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి సమాధానం మిగతా సినిమా. 

ఎలాఫుంది కథ 
       స్పై జానర్ తో రాజీ పడ్డట్టుంది ప్రారంభమంతా.  హీరోయిన్ పుట్టుక, పిసినారితనం, పెళ్లి ప్రయత్నం, హీరో ఆవారాతనం, పెళ్లి ప్రయత్నాలూ... ఇలా సృష్టి ప్రారంభంనుంచీ ఫలానా ఫలానా అని చూపిస్తూ చేసే రొటీన్ ఫార్ములా మూస చిత్రణలు ఈ  స్పై జానర్ లో కుదురుకునేవి కావు. ఏదో రొటీన్ గా హీరో హీరోయిన్ల ప్రేమకథ అన్నట్టు,  ఒక తరగతి ప్రేక్షకుల్ని బుజ్జగించడానికే అన్నట్టు వుంటాయి. సగం కథ నుంచి హీరో అసలెవరో తెలిశాకే  స్పై జానర్ ప్రారంభమవుతుంది. స్పై జానర్ మొదలయ్యాక, హీరో హీరోయిన్ల గురించి సృష్ట్యాది నుంచీ చూపించిందంతా పరమ చాదస్తం  అన్పిస్తుంది. ఇది దేశానికి సంబంధించి ఒక క్రిమినల్ ని పట్టుకునే గూఢచారుల కథ. ఇందులో హీరో హీరోయిన్ల పుట్టుపూర్వోత్తరాలకి, కుటుంబాల-  ప్రేమల కథలకి  స్థానం లేదు. ఇవి  స్పై కథకే మాత్రం ఉపయోగపడవు. అందుకే ఆ ప్రేమ తూతూ మంత్రంగా మారిపోయి స్పై కథకి అడ్డు పడుతూ వచ్చింది. స్పై జానర్ అందరూ చూడరని భావించడమే తప్పు. దాంతో జానరేతర  మసాలాలు దట్టించడం ఇంకా తప్పు. ప్రేక్షకులకి అలవాటు తప్పిన స్పై జానర్ కి పూనుకున్నాక, దానికి తిరిగి ప్రేక్షకుల్ని సంసిద్ధం చేయాలే గానీ, అవ్వాకావాలీ బువ్వా కావాలీ  అన్నట్టు జానర్ మర్యాద తప్పితే అసలుకే మోసం వస్తుంది. గత సంవత్సర కాలంగా జానర్ మర్యాద తప్పిన  సినిమాల్ని తిప్పి కొడుతున్నారు ప్రేక్షకులు. ప్రేక్షకులు మారుతున్నారు, ప్రొడక్షన్లు కూడా మారాలి. 

ఎవరెలా చేశారు 
       వెరైటీ కోసమో, కాస్త తేడాగా ప్రయత్నించి చూద్దామని మేకోవర్ అనుకునో గడ్డం మీసాలు పెంచి తిరుగుతూంటాడు నితిన్. ఇది పాత్రోచితమేనా? ఈ గెటప్ లో తెలిసిపోయేలా గూఢచారులు  షికార్లు కొడుతూంటారా? మారు వేషం వేసినప్పుడు ఇంకేవైనా పెంచుకోవచ్చు. గడ్డం వేసుకు తిరిగితే స్పై గా క్షణంలో సఫా అవుతాడు. ఆవారా లవర్ బాయ్ గా చూపించడానికి బావుందనుకున్న ఈ గెటప్పే,  తర్వాత పాత్ర షేడ్ కీ అచ్చోసి వదిలేశారు. ఇప్పుడైనా అర్ధమవుతోందా - ఒక తరగతి ప్రేక్షకులని బుజ్జగించబోతే ఏం జరుగుతుందో? 

           నితిన్ స్పై రోల్ ని పటిష్టంగా పోషించాడు. ఐతే గూఢరులకి కొన్ని అలవాట్లు వుంటాయి. ఆ సహజత్వంకోసం మాత్రం ప్రయత్నం చేయలేదు. మామూలు యాక్షన్ హీరోవేరు, స్పై వేరు- ఈ తేడా కన్పించదు నితిన్ కి సంబంధించి. పైగా పూర్తిగా సీరియస్  స్పై అయ్యాడు. దీంతో వినోదం కొరవడింది. చాలాకాలం తర్వాత తిరిగి స్పై మూవీని ప్రేక్షకుల ముందుకి తెస్తున్నప్పుడు,  పాత్రతో  సీరియస్ యాక్షన్ చేయించకుండా,  కలర్ఫుల్ గా యాక్షన్ తో చూపిస్తే  ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి వీలుంటుంది.  జేమ్స్ బాండ్ గా ఆరేడు సినిమాల్లో నటించిన రోజర్ మూర్  ఎంత హాస్యం పండిస్తూ కలర్ఫుల్ గా సాహసాలు చేసేవాడు? 

          హీరోయిన్ మేఘా ఆకాష్ ( ఆకాశంలో మేఘాలు) తారా చంద్రుల్ని కూడా  మెరిపించాలంటే చాలా మబ్బులు తొలగాలి. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాకి ఒక ఎసెట్. ఈ మొత్తం సినిమాలో మొత్తమంతా పాత్రలోకి దూరిపోయిన నటుడు ఈయనొక్కడే. క్లాసీ విలనీ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి,  పాత్రలాగే అన్పిస్తూ తనని మర్చిపోయేలా చేశాడు. ఈ సంవత్సరం తెలుగు సినిమాల్లో వైవిధ్యం కనబరచిన విలన్ తను.

          ఎన్ఐఎ చీఫ్ గా రవికిషన్ కి రెండో స్థానం. ఇతర సహాయనటులు తర్వాతి స్థానాలాక్రమిస్తారు.టెక్నికల్ గా అంతర్జాతీయ స్థాయిలో వుంది. కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్ కొత్త లోకాల్లోకి లాక్కెళతాయి.  యాక్షన్ సీన్స్ అత్యంత థ్రిల్లింగ్ గా వున్నాయి. మరొక ఎసెట్ మణిశర్మ పాటలు, నేపధ్య సంగీతం. ఇక నితిన్ మీద చివరి సోలో ఫోక్ పాట – దానికి సమకూర్చిన కోరియోగ్రఫీ చాలా క్రేజీగా వున్నాయి. ఇలాగే  అమితాబ్ బచ్చన్,  హేమమాలిని ని టీజ్ చేస్తూ,  ‘దేశ్ ప్రేమీ’ లో లుంగీ కట్టుకుని మారువేషంలో ‘తానే దిన్ తందానా’  సూపర్ క్రేజీ  మాస్ పాటా డాన్సూ  వేసుకుంటాడు. నితిన్ ఆ రేంజి కెళ్ళిపోయాడు. ఇంత టపోరీ సాంగ్ డాన్సూ ఈ మధ్య కాలంలో చూళ్ళేదు. 

చివరికేమిటి 
      స్పై తో రాజీ పడ్డా ఈ మాత్రమైనా ప్రయత్నం చేసినందుకు దర్శకుడికి మార్కులే. ఈ ప్రయత్నాన్ని అంతర్జాతీయ టేకింగ్ తో చేసినందుకు, నితిన్ తో రాజీపడ్డా ఇతర పాత్రల్ని అదే అంతర్జాతీయ స్థాయిలో ప్రెజెంట్ చేసినందుకూ మంచి మార్కులే. ప్లాట్ డివైస్ గా ఆసక్తి రేపుతూ ప్లే చేసిన విలన్ తాలూకు కోటు కథ క్లాస్ క్రియేషన్. విలన్ చేసిన నేరాలు చూపించకుండా, పట్టుబడకుండా ఇంకో నేరం చేసినట్టూ చూపించకుండా, కేవలం విలన్ ని పట్టుకునే దాగుడు మూతలాటకే  పరిమితం చేయడంతో, కొంత అసంతృప్తి వుంది. క్లయిమాక్స్ చప్పున తేలిపోవడానికీ  కథకి కేంద్రకంగా ఒక మహా కుట్ర లేకపోవడమే కారణం.  ఇవి సరిదిద్దుకుని వుంటే ఈ స్పై థ్రిల్లర్ ఇంకింత థ్రిల్లింగ్ గా వుండేది.

-సికిందర్
http://www.cinemabazaar.in


11, ఆగస్టు 2017, శుక్రవారం

494 : రివ్యూ!


 
రచన -  దర్శకత్వం : తేజ
తారాగణం : రానా, కాజల్
, కేథరిన్, పోసాని, తనికెళ్ళ, అజయ్, జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్ రావత్, సత్యప్రకాష్ తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : వెంకట్ సి.దిలీప్
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : డి సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
విడుదల: ఆగస్టు 11, 2017
***
         ర్శకుడు తేజా టీనేజీ ప్రేమ సినిమాలతో రానురాను ఆదరణ కోల్పోయి, కొంతకాలం తెర మరుగై  రాజకీయ సినిమాతో ఇప్పుడు దర్శనం చేసుకున్నారు. గతం లో తీసిన వాటిలో ఒక్క ‘నిజం’  అనే సామాజికం తప్ప మిగిలిన దాదాపు పదిహేనూ టీనేజీ  ప్రేమ సినిమాలే. ‘నిజం’ అనే సామాజికంతో వైఫల్యం తర్వాత ఇప్పుడు ‘నేనే రాజు నేనే మంత్రి’  అంటూ రాజకీయంతో రావడం ఒక విధంగా సాహసమే. ప్రేమల నుంచి రాజకీయాలకి తన స్టీరింగు తిప్పుకున్న తేజా ఎలా డ్రైవ్ చేశారన్నదానిపైనే ఆయన గమ్యం చేరడం ఆధారపడుంటుంది. 

          
రానా కూడా ‘ఘాజీ’, ‘బాహుబలి’ ల తర్వాత రాజకీయ పాత్ర పోషించేందుకు పూనుకోవడం, అందులోనూ అపజయాలతో వున్న తేజకి అవకాశమివ్వడం రెండూ ప్రయోగాలే. ఒకరి సాహసం, ఇంకొకరి ప్రయోగం కలిసి తయారైన ‘నేనే రాజు నేనే  మంత్రి’ గురించి ఇద్దరూ మళ్ళీ ఇది రాజకీయ సినిమా కాదన్నారు- పదిశాతం మాత్రమే రాజకీయం, మిగిలింది ప్రేమ కథ అన్నారు. ఇది వినడానికి విచిత్రంగా వున్నా, అసలేం చేశారో ఒకసారి చూద్దాం...

కథ 
   స్వల్ప వడ్డీకి రుణాలిచ్చే వడ్డీ వ్యాపారి జోగేంద్ర ( రానా) భార్య రాధ ( కాజల్) ని బాగా ప్రేమిస్తూంటాడు. పెళ్ళయిన  మూడేళ్ళకి తండ్రి కాబోతున్నాననే సంతోషంతో గుడికి తీసుకుపోతాడు. గుడి బయట  దీపం వెలిగిస్తూంటే సర్పంచ్ భార్య కోపంతో రాధని తోసేస్తుంది. దాంతో గర్భంపోయి ఇక పిల్లలు పుట్టని పరిస్థితి వస్తుంది. తాము సామాన్యులు కాబట్టేగా ఈ పరిస్థితి వచ్చింది, ఇక ముందు ఇలా జరక్కుండా వుండాలంటే సర్పంచ్ కుర్చీని కైవసం చేసుకోమని రాధ అంటుంది. దీంతో ఎన్నికలో నిలబడి సర్పంచ్ సుబ్బయ్య (ప్రదీప్ రావత్)ని ఓడించేస్తాడు జోగేంద్ర. దీన్ని జీర్ణించుకోలేని సుబ్బయ్య తనని చంపబోతే అతణ్ణి చంపేస్తాడు జోగేంద్ర. ఈ హత్య నుపయోగించుకుని  ఎమ్మెల్యే చౌడప్ప (సత్య ప్రకాష్) జోగేంద్రని ఇరకాటంలో పెట్టేస్తే  అతన్నీ చంపేస్తాడు. అతడికి సహకరించిన సీఐ (అజయ్) ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేస్తాడు. ఉపఎన్నికలో ఎమ్మెల్యే అయి మంత్రి కూడా అయిపోతాడు. ఇక్కడ హోంమంత్రి సుబ్బారెడ్డి (ఆశుతోష్) తో వైరుధ్యం వస్తుంది. 

          ఇలావుండగా ఓ ఛానెల్ బాస్ కూతురు దేవికారాణి (కేథరిన్) జోగేంద్రని  ప్రేమిస్తూ అతడి రాజకీయ చదరంగంలో సహకరిస్తూ వుంటుంది. దీన్ని రాధా సహించదు.  దీంతో ఈ ఇద్దరి  మధ్య నలిగిపోతూంటాడు. మరోవైపు ఎట్టిపరిస్థితిలోనూ సీఎం అవాలని ప్రయత్నాల్ని తీవ్రతరం చేస్తాడు.

          ఈ ప్రయత్నాల్లో అతడికెదురైన అడ్డంకులేమిటి, రాధ- దేవికలతో వచ్చిన చిక్కులేమిటి,  ఇవన్నీ ఏ మలుపులు తీసుకున్నాయన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ 
      ఇది పక్కా పొలిటికల్ థ్రిల్లర్ జానర్ కింది కొచ్చే కథ.  ఇందులో ఎలాటి సందేహమూలేదు. కానీ ఇందులో  పది శాతమే  రాజకీయ కథ అనడంలోనే  తికమక వుంది. ఆ తికమక కథని కూడా తిప్పలు పెట్టింది. రాజకీయ పరమ పద సోపాన పటంలో కథానాయకుడి ఆరోహణా క్రమం చకచకా సగం దాకా సాగి, అక్కడ్నించీ పతనావస్థకి చేరడం 90 శాతం ప్రేమ కథ కోసమే చేసి వుంటే అది జానర్ మర్యాదని గల్లంతు చేసే పనే. ఎప్పుడైతే జానర్ మర్యాద గల్లంతయ్యిందో విషయం రిస్కులో పడి యాంటీ క్లయిమాక్స్ కి దారి తీసింది. ఈ యాంటీ క్లయిమాక్స్ బాక్సాఫీసు అప్పీల్ తో విభేదిస్తోంది. యాంటీ క్లయిమాక్స్ తో మెప్పించేందుకు ‘మరో చరిత్ర’ లోలాగా స్టోరీ క్లయిమాక్స్ కాస్తా ప్లాట్ క్లయిమాక్స్ గా మార్పు చెందే జగ్రత్తలేవీ  తీసుకోలేదు. 

          కథ నడక, పాత్రల తీరుతెన్నులూ  వగైరా చూస్తే  కోడి రామకృష్ణ తీసిన రాజకీయ సినిమాల శైలి గుర్తుకొస్తుంది. అయితే సిద్ధహస్థుడైన కోడి రామకృష్ణ ప్రేమల్ని గానీ, కుటుంబ సమస్యల్ని గానీ జానర్ మర్యాదకి అడ్డురాకుండా రాజకీయ కథల్ని ఒక లాజికల్ ఎండ్ కి తీసికెళ్లారు. విశాల ప్రాతిపదికన ప్రజలకోసం పోరాడే కథానాయకుల్ని చూపించారు. ప్రస్తుత కథలో కథానాయకుడు తన వ్యక్తిగత స్వార్ధం కోసం మాత్రమే హీరోగా ఎస్టాబ్లిష్ అవాలని ప్రయత్నించాడు. చివరిదాకా తన కోసం పోరాడిన ప్రజానీకాన్ని వదిలేసి భార్యకోసం వెళ్ళిపోయాడు. 

ఎవరెలా చేశారు 
      రానా పోషించింది పవర్ఫుల్ పాత్ర ఫస్టాఫ్ లో. ఇంత యాక్టివ్ పాత్ర సెకండాఫ్ మొదలైన దగ్గర్నుంచీ పాసివ్ రియాక్టివ్ పాత్రగా బలహీనంగా మారిపో
తుంది- రాజకీయ కథలోనూ, దాని ఉపకథ అయిన ప్రేమ కథలోనూ. పవర్ఫుల్ పాత్రలో రానా ఆశ్చర్య జనకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్ధుల్ని మట్టు బెట్టడం మనల్ని కళ్ళప్ప గించి చూసేలా చేస్తుంది. అదే సెకండాఫ్ కొచ్చేసరికి,  ప్రధాన శత్రువు తీసుకునే పవర్ఫుల్ నిర్ణయాలకి గిలగిల లాడే రానాని  కళ్ళు తిప్పుకుని చూసేలా చేస్తుంది. ఇద్దరు అతివల మధ్య రానా నలిగే దృశ్యాలు సానుభూతిని రాబట్టుకోగల్గినా, ప్రధాన శత్రువుతో బలహీనంగా కన్పించడంతో, రెండిటా ఒకే రస పోషణ జరిగి పాత్ర ఫ్లాట్ గా మారింది. ఇలా కాకుండా అతివల విషయంలో  బలహీనంగానూ, శత్రువు విషయంలో బలంగానూ వుంటే డెప్త్ వచ్చేది. రానా తిరుగులేని పవర్ఫుల్ నటుడు- అయితే అతడి రాణింపుకి బాహుబలి, ఘాజీల్లోలాగా సమగ్ర పాత్ర చిత్రణలుండాల్సిన అవసరముంది.  

          సెంటిమెంట్ల కాజల్ పాత్ర మరీ సెంటి మెంట్లు ఎక్కువైపోయి సినిమాకి అడ్డదిడ్డంగా కాటుక (కాజల్) పూసేసింది. గ్లామర్ పోషణ బావుంది. పాటల్లో బాగానే కన్పిస్తుంది. ముక్కోణ ప్రేమలో త్యాగమనే భారం తనమీదేసుకుని చేసే పని చివరికి రానా చేసే పనిలాగే పిచ్చి పని. రానాని మోటివేట్ చేసే పాత్ర కాస్తా తనే తీవ్ర నిర్ణయం తీసుకోవడం విస్తుపోయేలా చేస్తుంది. పాత్ర చిత్రణలకి  సంబంధించి ఒక కొటేషన్ వుంది : పాత్రని పై దాకా చెట్టెక్కించాలి, ఆ తర్వాత రాళ్ళు తీసుకుని కొట్టాలి. అప్పుడా పాత్ర ఏం చేస్తుందో చూడాలని... అయితే రానా కాజల్ ల లాగా కూడబలుక్కుని చెట్టు దూకి పారిపోకూడదు!  జైసీ  కాజల్ వైసా రానా అయ్యారిక్కడ. 

          టీవీ జర్నలిస్టు పాత్రలో కేథరిన్ కి రానా తగిన బుద్ధి చెప్తూ, తనకి జరిగింది ఆమె చెప్పుకోలేని ‘టెక్నాలజీ’ నుపయోగించడం చాలా బావుంది. ఇలాటి ఆడవాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. అయితే ఒక జర్నలిస్టు కాపురాల్లో ది ఆదర్ వుమన్ గా చొరబడ్డం లాజికల్ గా ఏమీ వుండదు. ఈమె పాత్రకూడా సెకండాఫ్ లో ఇంకేం చెయ్యాలో తోచక మిస్ అయి, క్లయిమాక్స్ లో భారీ జనసందోహాన్నేసుకుని మళ్ళీ జర్నలిస్టు సోకు వెలగబెడుతుంది. ప్రేమాగీమా ఏమయ్యాయో తెలీదు. ప్రేమ కథకి కూడా న్యాయం జరగలేదు. 

          ‘నక్షత్రం’ లో రేజీనా తండ్రిగా గతవారమే హడలగొట్టిన  శివాజీ రాజా మళ్ళీ ఈసారి కాజల్  ఫాదర్ గా ప్రత్యక్షమయ్యారు. శివాజీ రాజా అప్పుడే పెద్ద పెద్ద హీరోయిన్లకి తండ్రి అయిపోవడం ఒక ఎట్రాక్షన్. ఇక విలన్ కి పక్కవాద్యం
పోసాని, సీఎంగా తనికెళ్ళ, సీఐగా అజయ్, జైలర్ గా జయప్రకాశ్ రెడ్డి, సర్పంచ్ గా ప్రదీప్ రావత్, ఎమ్మెల్యే గా సత్యప్రకాష్ అంతా రాజకీయ సన్నివేశాల్ని బాగా బాగా వేడెక్కించడానికి పనికొచ్చారు. 

          అనూప్ రూబెన్స్ ఈసారి లూప్ లో కొచ్చి సరైన బాణీల్ని అందించారు. సంగీతపరంగా సినిమాకివ్వాల్సిన సోల్ నంతా ఇచ్చారు. కాకపోతే కథాపరంగా ఆ సోల్ చెదిరిపోయింది. దిలీప్ కెమెరా వర్క్ కూడా ఉన్నతం. యాక్షన్, ఆర్ట్, ఎడిటింగ్ తదితర సాంకేతిక విభాగాలన్నీ ఉన్నతంగా  వున్నాయి.

          తేజా  దర్శకత్వంలో ఈసారి కొట్టొచ్చినట్టు కన్పించేదేమింటంటే,  ఎక్కడా ఇది తేజా సినిమా అన్పించక పోవడం. లేకపోతే ప్రేమ సినిమాల్లో అంతా ఆయనే కన్పించేవారు డామినేట్ చేస్తూ. ఈసారి అంత ఇగో లేదు. తను కాకుండా కథ మాత్రమే, పాత్రలు మాత్రమే  కన్పించేట్టు జాగ్రత్తలు తీసుకున్నట్టు కన్పిస్తుంది. 

          ఈ సినిమాకి మరో బలం సంభాషణలు. సంభాషణల రచయితకి సన్నివేశాలతో పనేగానీ,  ఆ సన్నివేశాల కూర్పు సరిగానే వుందా, ప్రధాన పాత్ర బలహీనంగా మారిపోయి,  ప్రధాన కథని ఉప కథ ఆక్రమిస్తూ,  ఉప కథే ప్రధాన కథగా ముగుస్తోందా అన్న బాదరబందీతో  పనుండదు. అవి దర్శకుడు చూసుకుంటాడు. అలాగే డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల సామెతలు దట్టించి మాటలు పేల్చుకుంటూ బిజీగా గడిపేశారు. తన పనిని తాను  కమర్షియల్ రైటర్ అన్పించుకుంటూ సమర్ధవంతంగా నిర్వహించారు. పరుచూరి బ్రదర్స్ కూడా రచనలో చేయి వేసి న్యాయం చేసేందుకు తమ వంతు కృషి చేశారు. ఎవరైనా కృషి మాత్రమే చేయగలరు. ఫలితం మాత్రం బాక్సాఫీసే చెప్తుంది. ఎలాటి కృషి చేశారనేది మాత్రం అర్ధం గాకుండా వుండిపోతుంది.

చివరికేమిటి
       ఫస్టాఫ్ రానా యాక్షన్ తో కళ్ళుతిప్పుకో నివ్వదు. రాజకీయ కథ కొత్త పుంతలు తొక్కుతుంది. సెకండాఫ్ లో కుటుంబ సెంటిమెంట్ల బారిన పడి ఎత్తుకున్న కథ యూత్ అప్పీల్ కి దూరమైపోతుంది. విషాద ముగింపు ఇంకో మైనస్ కాగా, దీనికికూడా అర్ధం కన్పించదు. ఇలాటి ముగింపు అవసరమే లేదు. ఫస్టాఫ్ లో పదవుల కోసం రానా చేసే హత్యాపరంపర – సెకండాఫ్ కొచ్చేసరికి కేవలం విలన్ చేసే అకృత్యాలని తిప్పి కొట్టే ప్రహసనంగా మారిపోతుంది. ఒక అకృత్యానికి కాజల్ గాయపడినప్పుడైనా విలన్ మీద వేటు వేసే ఆలోచన చేయకపోవడం సెకండాఫ్ సమస్యలన్నిటికీ మూలం. పోతే ఇది సీరియస్ సినిమా. ఇందులో వినోదం పాలు వెతుక్కోకూడదు.

-సికిందర్
http://www.cinemabazaar.in