రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, డిసెంబర్ 2017, శనివారం

టీనేజి నోయర్ స్క్రీన్ ప్లే సంగతులు -1


       నిర్మాణాత్మకంగా డార్క్ మూవీస్ తీయడమెలా అన్న శీర్షికన ఇంతకి ముందు ఈ జానర్ లో నియో నోయర్ మూవీగా 1984 లో విడుదలైన ‘బ్లడ్ సింపుల్’  గురించి కూలంకషంగా తెలుసుకున్నాం. అది ఆనాటి  అడల్ట్ క్రైం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈనాటి టీనేజీ క్రైంతో నియో నోయర్ ఎలా వుంటుందో పరిశీలిద్దాం. నోయర్ సినిమాలు ఇతర రెగ్యులర్ సినిమాలకంటే, ఆర్ట్ సినిమాలకంటే కూడా, వాటికంటూ ఏర్పాటైన కొన్ని ప్రత్యేక నియమాలకి లోబడి ఎంత కళాత్మకంగా వుంటాయో ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే కోవలో టీనేజీ నియో నోయర్ ‘బ్రిక్’  ని విశ్లేషించుకోవడం మొదలెడదాం. ఈ వ్యాసపరంపర ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఇప్పుడే చెప్పలేం. ‘బ్లడ్ సింపుల్’ కనీసం ఆరునెలలు కొనసాగింది.  2005 నాటి ‘బ్రిక్’ ఒక ఆశ్చర్యకర క్రియేషన్. అందుకే ఇది ఎన్నో అధ్యయనాలకి మూలమైంది ‘బ్లడ్ సింపుల్’ లాగే. దర్శకుడు రియాన్ జాన్సన్ ఒక షార్ట్ ఫిలిం తీశాక, 1997 లో ‘బ్రిక్’  స్క్రిప్టు రాశాడు. అప్పుడతడికి 24 ఏళ్ళే. ఈ వయసులోనే అతను జానర్ ని అధ్యయనం చేసి తొలిసినిమాతో అద్భుతాన్ని సాధించాడు.

          రియాన్ జాన్సన్ స్క్రిప్టు రాశాక ఆరేళ్ళు ప్రయత్నించాడు నిర్మాతల కోసం. స్క్రిప్టుని ముందు నవలగా రాశాడు. చాలా పూర్వం అంటే 1930 లలో బ్లాక్ అండ్ వైట్ లో ఫిలిం నోయర్ పేరుతో  ప్రారంభమైన ఈ జానర్  సినిమాలకి మూలాలు  ఆనాటి డెషెల్ హెమెట్ రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలల్లో వున్నాయన్న  సంగతి  తెలిసిందే. ‘బ్లడ్ సింపుల్’ కోసం కోయెన్ బ్రదర్స్ కూడా ఈ నవలల్లోనే జానర్ ని పట్టుకున్నారు. రియాన్ జాన్సన్ కూడా హెమెట్ నవలల్ని అధ్యయనం చేశాడు. హెమెట్ కల్పించిన  నోయర్ వాతావరణాన్ని, సంభాషణల్లో భాషనీ  స్క్రీన్ ప్లేలో పట్టుకోవాలంటే, ముందుగా హెమెట్ లాగా ‘బ్రిక్’ ని నవలగా రాసుకోవాలని నవల పూర్తిచేశాడు. ఆ నవలలోకి దింపిన నోయర్ వాతావరణాన్నిఆధారంగా చేసుకుని స్క్రీన్ ప్లే రాశాడు ( ఈ నవలా, స్క్రీన్ ప్లే రియాన్ జాన్సన్ వెబ్ సైట్లో పొందవచ్చు). 

       నిర్మాతలు ముందుకు రాకపోవడానికి, కొత్త కుర్రాడు ఇంత నియో నోయర్ భారాన్ని ఎత్తుకుంటున్నాడే అన్న భయమే కారణం. లాభం లేక మిత్రుల సహాయంతో ఐదులక్షల డాలర్ల అతి తక్కువ బడ్జెట్ తో,  2005 లో పూర్తి చేసి విడుదల చేస్తే, 39 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించి పెట్టింది. ఆధునిక నోయర్ సినిమాలకి ఒక గైడ్ లా మారింది. జాన్సన్ కనబర్చిన అనూహ్య సృజనాత్మక చమత్కారమేమిటంటే, ఇంకా హెమెట్ డిసైడ్ చేసిన జానర్ ని అడల్ట్ క్రైం నోయర్ గానే తీయనవసరం లేదు - హెమెట్ ని నేటి కాలపు ఆధునిక హైస్కూల్ నోయర్ రూపంలోకి,  యువతరపు థ్రిల్లర్ గానూ  అప్ డేట్ చేయ వచ్చనేది. కాబట్టి ‘బ్రిక్’ అప్డేట్ అయిన హెమెట్ అన్నమాట. 

          ‘బ్రిక్’ అంటే ఇటుక అని వేరే చెప్పనవసరం లేదు. ఈ మూవీలో ‘బ్రిక్’ కి అర్ధం ఏమిటంటే,  ఇటుకలాంటి ఘన రూపంలో వున్న హెరాయిన్ డ్రగ్ అన్నమాట. ‘బ్రిక్’ 11సార్లు వివిధ అవార్డుల్ని కూడా గెల్చుకుంది.  ఈ విజయం తర్వాత జాన్సన్ ది బ్రదర్స్ బ్లూ, లూపర్ తీశాడు. తాజాగా తీసిన ‘స్టార్ వార్స్ – ది లాస్ట్ జేడీ’ డిసెంబర్ ఎనిమిదిన విడుదలవుతోంది. ఇంతకీ ‘బ్రిక్’ కథేమిటి?  వచ్చే వ్యాసంలో చూద్దాం.

(సశేషం)

-సికిందర్  

1, డిసెంబర్ 2017, శుక్రవారం

557 : రివ్యూ!



రచన - దర్శత్వం: బి.వి.ఎస్‌. వి
తారాగణం : సాయిధమ్ తేజ్, మెహరీన్ పీర్జాదా, ప్రకాష్, కోట శ్రీనివాసరావు, నాగబాబుప్రన్న, సుబ్బరాజు, సత్యం రాజేష్, దితరులు
సంగీతం
: ఎస్‌.ఎస్‌.న్, ఛాయాగ్రహణం : కె.వి.గుహన్
బ్యానర్ : అరుణాచ
క్రియేషన్స్, నిర్మాత: కృష్ణ
విడుదల : డిసెంబర్ 1, 2017

***
     
తిక్క, విన్నర్, నక్షత్రం అనే మూడు వరస ఫ్లాపులతో అయోమయంలో పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్,  ఈసారి దర్శకుడిగా మారిన బివిఎస్ రవితో దేశభక్తిని ప్రయత్నించాడు. కాకతాళీయంగానే దేశభక్తి మీద వరసగా సినిమాలొస్తున్నాయి. సీజన్ బావుంది. ‘జవాన్ – ఇంటికొక్కడు’ కూడా సరైన సమయంలో వచ్చింది. అయితే ముందుగా దేశభక్తి ఎవరికుండాలి? దాంతో ఏం చేయాలి, ఏం చేయకూడదు?  దేశభక్తి పేరు చెప్పి ఏదైనా చేసుకుపోవచ్చా? ఇది కూడా భావస్వాతంత్ర్యంలో భాగమేనా? ఈ భావస్వాతంత్ర్యంతో దేశభక్తిని ఎలా చూపించారో చూద్దాం...

కథ 
        హైదరాబాద్ లోని డిఆర్ డిఓ లో ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నాల్లో వుంటాడు జై (తేజ్). అతడి కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నా వదినెలు, వాళ్ళ పిల్లలు వుంటారు. బయట భార్గవి (మెహరీన్) అనే వూరూపేరూ లేని అమ్మాయిని ప్రేమిస్తూంటాడు. డిఆర్ డిఓ ఒక ఆక్టోపస్ అనే క్షిపణి వ్యవస్థని  రూపొందిస్తుంది. దాన్ని కాజెయ్యాలని మాఫియాలు పథకమేస్తారు. ఇది జైకి తెలుస్తుంది. ఆక్టోపస్ ని  ఢిల్లీకి తరలిస్తున్నప్పుడు మాఫియాలు దాడి చేస్తారు. జై వాళ్ళని చంపి, ఆక్టోపస్ ని కాపాడి అందరి ప్రశంసలూ పొందుతాడు. కానీ మాఫియా కేశవ్ (ప్రసన్న) జై మీద పగబడ్తాడు. జై కుటుంబాన్ని నాశనం చేస్తానని సవాలు చేస్తాడు. ఇప్పుడు కుటుంబాన్ని కాపాడుకోవడానికి జై ఎలా సంఘర్షించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
      దేశభక్తి ఇవ్వాళ హాట్ ఎమోషనల్ టాపిక్ గా వుంది. ఎందుకోమరి. సరిహద్దులో యుద్ధం కూడా లేదు. దేశద్రోహం పురాతన విషయం. ఇప్పుడు దేశభక్తితోనే పరవశించాలిగానీ,  దేశద్రోహం మీద రగల కూడదనే ధోరణిలో ఈ కథకూడా వుంది. విద్రోహులు ఏ దేశ ద్రోహానికైనా పాల్పడనీ, అది పెద్దగా పట్టించుకోకుండా, హీరో గారి దేశభక్తిని మాత్రమే గొప్పగా చాటే  అవకాశం  ఇవాళ్టి దేశభక్తి సినిమాలు కల్పిస్తున్నాయి. అంతేగానీ,  ‘దిల్ దియా హై జాన్ భి దేంగే యే వతన్ తేరే లియే’ లాంటి దేశభక్తి పాట మోగిస్తూ టెర్రరిజం మీద సుభాష్ ఘాయ్ తీసిన పవర్ఫుల్  ‘కర్మ’ లాంటిది ఇవ్వాళ తెలుగులో ఆశించకూడదు. శాసించిందే చూడాలి. సరిహద్దులో పోరాడితే అది దేశభక్తి, దేశం లోపల పోరాడితే అది పౌరవిధి అనే నిర్వచనాన్ని మార్చి ఈ కథ కూడా చూపిస్తుంది. సైనికుడిగా ‘బొబ్బిలిపులి’లో ఎన్టీఆర్ దేశంలోకొచ్చి అన్యాయాల్ని ఎదుర్కోవడానికి,  ఎవరికీ పట్టని పౌర బాధ్యతే తోడ్పడింది. పౌరులు తీసుకోవాల్సిన బాధ్యతని సైనికుడు తీసుకుంటే అది దేశభక్తి అవదు. పౌరుల చెంపమీద కొట్టినట్టు, ఒక మనిషిగా  పౌర బాధ్యతని గుర్తుచేయడం.  కానీ నేటి దేశభక్తి సినిమాలు పౌర బాధ్యతల్ని చూపించకుండా, పాత్రలకి దేశభక్తిని పులిమి వదల
డంతో - మొత్తంగా అవెలా తయారవుతున్నాయంటే – తలా తోక లేని కథలై పోతున్నాయి. 

ఎవరెలా చేశారు 
        సాయి ధరమ్ తేజ్ చాలా చేయగలడు. చేయించుకోవడం లేదు. సీనియర్ స్టార్లు చేసేసిన అప్పటి కాలంలో పనికొచ్చిన తీరు తెన్నులతోనే టెంప్లెట్ పాత్రలు,  నటనలు చేస్తే ఇప్పటి యంగ్ స్టార్ల ప్రత్యేకత ఏముంటుంది. బాలీవుడ్ లో ఈ పరిస్థితి లేదు. కాలాన్ని బట్టి కొత్త స్టార్లు వుంటున్నారు. తేజ్ ఈ జవాను కాని జవాను పాత్రలో మూసలోనే కన్పిస్తాడు. ‘కంచె’ లో వరుణ్ తేజ్ ట్రెండ్ లో కన్పిస్తాడు. రోమాన్సు, డాన్సులు,  పోరాటాలు సరే, తేజ్ వీటిలో ఫస్టు. డైలాగ్ డెలివరీ కూడా ఓకే. ఈ కష్టాన్నంతా పోషిస్తున్న పాత్రలే మింగేస్తున్నాయి. యాక్షన్ సీన్లే పాత్రని నిలబెట్టలేవు. పాత్రలో విషయముంటేనే నిలబడతాయి. దేశభక్తితో గానీ, ఇంటి సెంటిమెంటుతో గానీ, పౌరబాధ్యతతో గానీ తనేం చేశాడో చూస్తే – అన్నీ కలగాపులగమై ఏవేవో సీన్లు నటించి ఎటూ కాకుండా పోయాడు. పౌరబాధ్యత ఒకటే తన పాత్రయి వుంటే - ఆ పాత్ర నడిపించే కథ కూడా దార్లో పడేది. కథకి అతీతంగా పాత్రని చూస్తే సమస్యలు తప్పవు. 

          హీరోయిన్ మెహరీన్ పాత్రేమిటో, ఏం చేస్తూంటుందో, ఎక్కడ వుంటుందో, ఈమె కసలు ఆధార్ కార్డుందా, రోహింగ్యా అక్రమ వలసదారా అన్నట్టు వుంటుంది. ఒక ప్రేమ సన్నివేశం, ఒక పాట సందర్భం వచ్చినప్పుడల్లా వచ్చేసి ఆ డ్యూటీ పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటుంది. చాలా పాత మోడల్ ఫార్ములా టెంప్లెట్ హీరోయిన్ పాత్ర ఈ కాలం లోకొచ్చిపడి వెంటాడుతోంది. ఈమెకి వీసా, పాస్ పోర్టు, ఈ సినిమా టికెట్ కూడా లేవు. సెకండాఫ్ కాసేపటికి తనకే బోరు కొట్టినట్టు-  నీకు నేను డిస్టర్బుడుగా వున్నాను - అని హీరోతో అనేస్తుంది. ఓ పాటేసుకుని ఇక సినిమా వదిలేసి వెళ్ళిపోతుంది. నిజమే,  కథకుడికి ఈమె చాలా డిస్టర్బింగ్ గానే వుంది. అనవసరంగా నిర్మాత మీద భారం మోపాడు.  

          విలన్ పాత్రధారి ప్రసన్న ఓ మోస్తరు. తమన్ ఇంటర్వెల్ ముందు ఓ పాట, ఇంటర్వెల్ తర్వాత ఇంకో పాటా బాగా ఇచ్చాడు. గుహన్ కెమెరా వర్క్ లో ప్రత్యేకతలేం లేవు. డిజిటల్ వచ్చాక ఛాయాగ్రాహకుల ముద్రలు డీఐ తో ఒకే నమూనా కింద మారిపోయాక. ప్రొడక్షన్ విలువలు బావున్నాయి. 

చివరి కేమిటి?
        భావస్వాతంత్ర్యమే! దేశభక్తి కథ దేశభక్తి కథలా తీయకూడదా? లేదు, భావస్వాతంత్ర్యమనే హక్కుందిగా  – దాంతో ఎలాగైనా తీసుకోవచ్చు. దేశభక్తి కథలో దేశభక్తితో సంబంధం లేని చైల్డ్ సెంటి మెంటు పెట్టే భావస్వాతంత్ర్యం, ఫ్యామిలీ సెంటిమెంటు పెట్టే భావస్వాతంత్ర్యం, ఫ్రెండ్ షిప్ ని పెట్టే భావస్వా
తంత్ర్యం, టెంప్లెట్ ప్రేమని పెట్టే భావస్వాతంత్ర్యం, టెంప్లెట్ పాటలు పెట్టుకునే భావస్వాతంత్ర్యం, కథనే టెంప్లెట్ లో పడేసే  భావస్వాతంత్ర్యం.... భావస్వాతంత్ర్యం, భావస్వాతంత్ర్యం,భావస్వాతంత్ర్యం! అన్ని భావస్వాతంత్ర్యాలూ వుంటాయ్ నేటి తెలుగు దేశభక్తి సినిమా అంటే. 

          బివిఎస్ రవి తను ఇన్ని భావస్వాతంత్ర్యాలూ ప్రకటించుకోకపోతే ఏమైపోతుందో ఏమోనని– ఫ్యామిలీ వుండాలి, చైల్డ్ వుండాలి, లవ్ వుండాలి, ఫ్రెండ్ షిప్ వుండాలి,  క్లాస్ వుండాలి,  మాస్ ఫోక్ సాంగ్ కూడా వుండాలని  కంగారు పడిపోయి అన్నీ పెట్టేస్తూ పోతే –దేశభక్తి  మీద సినిమా తీయడమెందుకు? 

          ఒక్క పౌర బాధ్యత అనే ఏకసూత్రతని పట్టుకుని వుంటే,  ఈ దేశభక్తి ఎక్కడో వుండేది. విజువల్ మీడియా అసలు కిటుకేమిటంటే,  గొంతు చించుకుని దేశభక్తిని తెర మీద పారించాల్సిన అవసరం లేదు. అది థర్డ్ క్లాస్ దేశభక్తి అన్పించుకుంటుంది. ఈ పాటికి థియేటర్లలో జనగణమణకి ప్రేక్షకులందరికీ దేశభక్తి జీర్ణమయ్యే వుంటుంది. కేంద్ర ప్రభుత్వం బివిఎస్ రవిని ఈ బాధ్యతనుంచి ఎప్పుడో తప్పించినట్టే. ఇక ఆయన చూసుకోవాల్సింది, ఉన్న కథ ప్రకారం పాత్ర పౌరబాధ్యతలు నిర్వర్తిస్తోందా లేదా అనేదే. అప్పుడు  అంతర్లీనంగా దానికదే  ఫస్ట్ క్లాస్ దేశభక్తి ప్రవహిస్తుంది. సరిహద్దులో  సైనిక పాత్రలు కాక,  ఏ పాత్ర పడితే ఆ పాత్ర, ఎక్కడబడితే అక్కడ  దేశభక్తి అంటూ చెలరేగే హక్కుంటుందా? రవి కథలో పాత్రకి పౌర బాధ్యత లేదని కాదు, అది కొనసాగలేదు. కొనసాగి వుంటే మొత్తం కథా కథనాలూ దారిలో పడేవి. 

          ఇదెలాగో చూద్దాం. ఆక్టోపస్ ని మాఫియాలు కాజేస్తున్నారని తెలుసుకున్న హీరో,  ఆ పథకాన్ని తన తెలివి తేటలతో చిత్తు చేస్తాడు. ఇది పౌరబాధ్యత. ఫస్టాఫ్ లో అప్పటికి అతను డిఆర్ డిఓ లో చేరలేదు. అయితే ఈ పౌరబాధ్యత నిర్వర్తించడానికి చిన్నప్పట్నుంచీ అతను దేశభక్తి పరాయణుడని చూపించుకు రానవసరం లేదు. ఒక సగటు యువకుడిగా ప్రాణాలకి తెగించి అతను ఆ పౌరబాధ్యత నిర్వర్తిస్తే ఎక్కువ ప్రభావశీలంగా వుంటాడు. లేకపోతే దేశభక్తి అనే బ్యాగేజీ పాత్రని చెడగొడుతుంది. చెడగొట్టింది కూడా. ఇప్పటికి ఈ దేశభక్తి బ్యాగేజితో తనేదో అందరి కంటే భిన్నమైన వాణ్ణనీ, తనకున్నట్టు కొన్ని హంగులుంటేనే దేశభక్తి గల వారవుతారన్నట్టూ  ఇచ్చుకున్న బిల్డప్పులతో – సరే – ఎలాగో ఒక పౌరబాధ్యతంటూ పూర్తి చేశాడు. 

          తర్వాతేం చేశాడూ, ఆ పౌరబాధ్యతే మర్చిపోయి బేలగా తయారయ్యాడు. నీకొంప కొల్లేరు చేస్తానని అదే మాఫియా ఎక్కడ్నించో బెదిరిస్తూంటే పౌరబాధ్యత గుర్తుకురాలేదు. ఫస్టాఫ్ లో తన పౌరబాధ్యతతో టెక్నాలజీనుపయోగించి కుట్ర రహస్యాలు తెలుసుకున్న తనే, ఇప్పుడు అదే మాఫియా బెదిరిస్తూంటే వెంటనే పట్టుకునే ప్రయత్నం చేయాలనుకోడు. పైపెచ్చు- రారా,  నేను నా ఇంటిని కాపాడుకుంటాను, ఎవరింటిని వాడు కాపాడుకున్నోడే నిజమైన  జవాను - లాంటి థర్డ్ క్లాస్ హీరో డైలాగులేవో చెప్తాడు. ఈ ప్లేటు ఫిరాయింపు తోనే  సెకండాఫ్ మొత్తం దెబ్బతినిపోయింది.

          ఈ కథ రూపకల్పనలో అసలు జరిగిందేమిటో మనం వూహించగలం. ఇన్ని తప్పులకి బీజం ఎక్కడ పడిందో చూడగలం. ఎప్పుడైనా కథనాన్ని దాని కథ నిర్ణయిస్తుందా,  లేక కథకుడు ముందే వూహించుకున్నచట్రం నిర్ణయిస్తుందా? ఈ రెండోది జరిగినందుకే ఇంత కలగాపులగపు కథ. ఈ దేశభక్తి కథని ‘హీరో ఇంట్లో విలన్ మకాం వేయుట’ అనే కాలం తీరిన చట్రంలో, హీరో విలన్ ఇద్దరూ ఫ్రెండ్స్ అయి వుండాలనే  సెటప్ తో ముందే ఫిక్స్ అయిపోయాడు కథకుడు. అక్కడ్నించీ కథనల్లడంమొదలెట్టాడు. అప్పుడేమైందంటే – హీరో విలన్ ఫ్రెండ్స్ అనడానికి చిన్నప్పట్నించీ వాళ్ళ కథ నెత్తుకున్నాడు (ఓరిబాబో! ఇంకెన్నాళ్ళూ  ఈ చిన్నప్పట్నించీ స్పూన్ ఫీడింగ్ చేసే ముసలి చాదస్తపు చైల్దిష్ కథలూ!). హీరో దేశభక్తి  కలవాడనీ, విలన్ వ్యతిరేకి అనీ చెప్పడానికి ఈ పదినిమిషాల చిన్నప్పటి దృశ్యాలు. అప్పుడు ఈ మాఫియా విలన్ ని హీరో ఇంట్లో ప్రవేశపెట్టి డ్రామా చేస్తే, ఇతను చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలియని హీరోతో అద్భుతమైన  కథవుతుందనుకున్నాడు కథకుడు. అలా ఇది ప్రాచీనకాలపు శ్రీనువైట్ల – కోన వెంకట్ బ్రాండ్ సింగిల్ విండో స్కీము అను ఏకగవాక్ష కుహరమైంది. ఏ హీరో అయినా- లేదా ఏ విలన్ అయినా, సెకండాఫ్ అనే సింగిల్ విండోలోంచి జారుకుంటూ వెళ్లి అవతల విలన్ ఇంట్లోనో, హీరో ఇంట్లోనో  ధబీమని పడే ఢమరుక నాదమేగా! 

          ఇలా హీరో విలన్ ఫ్రెండ్ షిప్, దానికి సింగిల్ విండో స్కీము అని ముందనుకుని, ఈ దేశభక్తి కథని అందులో నాగుల చవితి పాలులా పోశాడు కథకుడు. జానర్ మర్యాద లేదు, ఏమీ లేదు. ఇలా చేస్తేనే బాక్సాఫీసు మర్యాద వుంటుంది. అజిత్ నటించిన ‘వివేకం’ అనే టెర్రర్ వ్యతిరేక ఆపరేషన్ కథని ఇంటర్వెల్ తర్వాత హీరో,  అతడి ఫ్రెండ్ మధ్య మిత్రద్రోహ కథగా మార్చేస్తే ఏం జరిగింది? అదే ఇక్కడా జరిగింది. 

         ఇక జవాను కథ అనగానే వాడి కుటుంబానికి ముప్పు వచ్చే టెంప్లెట్ కూడా తప్పనిసరి కదా. నిన్నే  ఇది ‘ఆక్సిజన్’ లో చూశాం. మొన్నే"గరుడవేగ' లో చూసాం, అటు మొన్నే  ‘పటేల్ సర్’ లోనూ చూశాం.  కాబట్టి ఈ జవానుకీ ఓ కుటుంబం ఏర్పాటయ్యింది. టెంప్లెట్ ప్రకారం ఆ కుటుంబానికి మాఫియాతో ముప్పు అనే ఫార్ములా  ఒనగూడింది. ఇక విడిగా వేలాడే రోహింగ్యా హీరోయిన్ గ్లామర్ పోషణకి ఎలాగూ వుంటుంది. టెంప్లెట్  వరసలో ఏఏ పాట వుండాలో అవన్నీ వున్నాయి. చిన్నప్పటి హీరోతో చైల్డ్ సెంటిమెంటే గాక, ఇప్పుడున్న కుటుంబంలోనూ ఇద్దరు పిల్లలతో  ఆ సెంటిమెంటూ  భర్తీ అవుతోంది. ఈ విధంగా ఆక్టోపస్ అనే దేశరక్షణ మిసైల్ కథ సర్వాంగ సుందరంగా తయారయ్యింది - అది తప్ప, 

          ఆక్టోపస్ ని ఏదో దేశభక్తి అంటూ కరివేపాకులా వాడుకున్నారు. రక్షణ శాఖని హాస్యాస్పదంగా చూపించారు. ఇది కూడా దేశభక్తే నేమో. హీరోకి  సెకండాఫ్ లో డి ఆర్ డి ఓ లో జాబ్  వస్తుంది. వెళ్లి ఆక్టోపస్ చూసివచ్చేస్తాడు. మళ్ళీ జాబ్ కి వెళ్తున్నట్టే కన్పించడు. అసలు చెప్పుకుంటున్నట్టు సైంటిస్టు లానే వుండడు. 

          ఆక్టోపస్ ని ఢిల్లీ తీసుకు పోతూంటే మాఫియా దాడి చేస్తే, తిరిగి దాన్ని హైదరాబాద్ కే తెచ్చేశారా? ఎందుకు? రక్షణ శాఖ రూలు ప్రకారం దాన్ని విమానంలో తీసికెళ్ళక అంత దూరం రోడ్డు మార్గాన తీసుకెళ్లడం కథా  సౌలభ్యం కోసమేనా? 

          ఇప్పుడు కథ ప్రకారమే  కథనం చేస్తే ఎలా వుండచ్చో చూద్దాం – ఆక్టోపస్ కథే వుంటుంది. మరే కథా వుండదు. అవసరం లేదు, ఆ కథలు చూసుకోవడానికి వాటి జానర్స్ లో వేరే సినిమాలుంటాయి. ఇక్కడ అవ్వా కావాలీ బువ్వాకావాలీ అంటే కుదరదు.  ఏక సూత్రతతో ఒక క్లీన్ సింగిల్ యాక్షన్ లైన్ అవసరం -  హాలీవుడ్ హై కాన్సెప్ట్ ప్రకారం. మిగిలిన నకరాలన్నీ బంద్ చేసుకోవాలి. ఆక్టోపస్ కథ కేంద్రంగా పౌరబాధ్యత అనే యాక్షన్ లైన్ తో అంతర్లీనంగా దేశభక్తో మరోటో దానికదే విలీనమవుతుంది. 

          ఆక్టోపస్ అపహరణ ప్రయత్నం జరిగితే రక్షణ శాఖ చేతులు ముడుచుకు కూర్చోదు. ఆ దళాలన్నీ మాఫియాల్ని ఏరేయడానికి రంగంలోకి  దిగుతాయి. చీమల దండులా  పెరిగిపోతూ మాఫియాలూ వూరుకోరు. ఆక్టోపస్ చేజిక్కించుకోవడానికి దాడుల్ని ఉధృతం చేస్తాయి.  మొత్తంగా  స్పీల్ బెర్గ్ ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’ సినేరియా. అందులో దైవశక్తి పూనిన ఆర్క్ కోసం జరిగే పోరాటంలాగే అత్యంత మహత్తుగల ఆక్టోపస్ కోసం హోరాహోరీ. కేవలం అద్భుత రసప్రధానంగా ఏకసూత్రతతో యాక్షన్. ఇక ఫ్యామిలీస్ చూడాలంటారా- ఉన్న హీరోయిన్ని ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’ లోలాగా సరీగ్గా చూపిస్తే చాలు- ఇంకే కుటుంబాలూ పేరంటాలూ  అవసరం లేదు ఈ జానర్ కథలో.

-సికిందర్
https://www.cinemabazaar.in



30, నవంబర్ 2017, గురువారం

556 :రివ్యూ!

రచన –దర్శకత్వం : జి. శ్రీనివాసన్
తారాగ
ణం: విజయ్ ఆంథోనీ, డయానా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాధా రవి, కాళీవెంకట్ తదితరులు
మాటలు- పాటలు : భాష్యశ్రీ
సంగీతం : విజయ్ ఆంథోనీ, ఛాయాగ్రణం: కె.దిల్ రాజ్
బ్యానర్స్
: ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్, ఆర్‌.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్
నిర్మాతలు: రాధిక త్కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని, నీలం కృష్ణారెడ్డి
విడుదల : నవంబర్ 30, 2017
***
          టుడు - సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ ‘బిచ్చగాడు’ హిట్ తర్వాత చేసిన రెండూ - యమన్, బేతాళుడు – అనే సైకలాజికల్ లు వర్కౌట్ కాకపోవడంతో, తిరిగి ‘బిచ్చగాడు’ టైపు సెంటిమెంట్ల పంట వైపు యూ టర్న్ తీసుకుని ‘ఇంద్రసేనుడు’ నటించాడు. ‘బిచ్చగాడు’ మదర్ సెంటి మెంటయితే, ఇది ఫ్యామిలీ సెంటిమెంటు. పైగా ద్విపాత్రాభినయం. జి. శ్రీనివాసన్ అనే దర్శకుడు. తమిళంలో ‘అన్నదురై’ గా విడుదలైన ఇది ఏమాత్రం తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా వుందో చూద్దాం...

కథ 
      నూజివీడులో ఇంద్రసేన, రుద్రసేన కవల సోదరులు. ఇంద్రసేన  ప్రియురాలు చనిపోయిన బాధతో తాగుతూంటాడు. రుద్రసేన స్కూల్లో  పీఈటీగా పనిచేస్తూంటాడు. తండ్రికి బట్టల షాపు వుంటుంది. అతను స్థానిక వర్తక సంఘం అధ్యక్షుడు. తల్లి ఇంద్రసేనని పెళ్లి చేసుకోమని పోరుతూంటుంది. రుద్రసేన కి ఓ వ్యాపారి కూతురి సంబంధం వస్తుంది. ఇంద్రసేనకి కూడా సంబంధం చూడాలని తమ్ముడి కూతుర్ని అడిగి అవమాన పడుతుంది తల్లి. పెళ్లి ఇష్టం లేని ఇంద్రసేన తల్లి బాధ పట్టించుకోడు. వూళ్ళో అతడికి మంచి పేరుంటుంది. ఒక స్నేహితుడికి అప్పు కావాల్సి వస్తే హామీగా వుండి వడ్డీ వ్యాపారి దగ్గర  ఆరు లక్షలు ఇప్పిస్తాడు. తీరా తనే ఇరుక్కుంటాడు. ఓ రోజు తాగుడు మానేసి పెళ్లి చేసుకుంటానని తల్లికి మాటిచ్చి, చివరిసారిగా బార్ కి వెళ్తాడు. అక్కడ తాగిన మత్తులో ప్రమాదవశాత్తూ ఒకడు తన చేతిలో చనిపోతాడు. శిక్షపడి ఏడేళ్ళు జైలుకి పోతాడు. 

          విడుదలై వచ్చి చూస్తే, కుటుంబం చెల్లా చెదురై పోయి వుంటుంది. తండ్రి షాపు వడ్డీ వ్యాపారి లాగేసుకున్నాడు. తమ్ముడు రుద్రసేన చైర్మన్ కోటయ్య తరపున  హత్యలు చేసే గూండా లీడర్ గా కనిపిస్తాడు. తల్లిదండ్రులు తలెత్తుకోలేక బతుకుతూంటారు. దీనికంతటికీ కారకుడు తనే అని గ్రహిస్తాడు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పూనుకుంటాడు...

ఎలావుంది కథ 
      ఎక్కడా రాజీపడకుండా వాస్తవిక ధోరణిలో సాగే కథ. సరైన బాధ్యతతో ప్రవర్తించకపోతే,  ఒక్కడి వల్ల మొత్తం కుటుంబమెలా అధోగతి పాలవుతుందో తెలిపే కథ. ఇంట్లో మంచి – బయట మంచి రెండూ బ్యాలెన్స్ అవకపోతే బయటి మంచి కొంప ముంచేస్తుందని చెప్పే కథ. సొంత బాధ సాకు చూపి తనపట్ల తనకే బాధ్యత లేనట్టు తిరిగితే, అది మొత్తం కుటుంబానికే శని పట్టేలా చేస్తుంది. దీనికి ఎలాటి మూస ఫార్ములా చిత్రణల జోలికిపోకుండా, టౌను వాతావరణంలో కల్పించిన రాజకీయ, పోలీసు యంత్రాంగ వాస్తవిక నేపధ్యం బలమైన నిర్ణాయక శక్తిగా అమరింది. సొంత బాధ్యతలు మర్చిపోతే ఇతర శకట్లు నిర్ణయిస్తాయి జీవితాల్ని. 

ఎవరెలా చేశారు 
       అన్న దమ్ముల రెండు పాత్రల్లో విజయ్ ఆంథోనీ రూపంలో కాస్త మార్పు తప్ప, ఆలో చనల్లో తేడా తప్ప - మాట, చూపు, ముఖభావాలు ఒక్కటే. ఇదంతా సీరియెస్సే. అన్న అనుకోకుండా ఒకడి చావుకి కారణమై జైలుకి పోయాడు, దాని పరిణామాల్లో తమ్ముడు నేరస్థుడయ్యాడు. ఐతే ఈ పరిస్థితిని చక్క దిద్దే అన్న ప్రయత్నం ఏకపక్షమై పోయింది. దీంతో తమ్ముడికే సంబధం లేకుండా,  ఇద్దరి మధ్య వైరుధ్యాల సమరం లేక, అమితాబ్ బచ్చన్ – శశి కపూర్ ల మధ్య  వున్నట్టు  ఒక ‘దీవార్’  మూమెంట్ లాంటిది లేకుండా, చప్పగా సాగిపోతుంది.  తమ్ముడికి తెలియకుండా అతడి కోసం అన్న చేసి పోయే త్యాగంతో ఆ పాత్ర ముగుస్తుంది. పాత్ర చిత్రణ లెలా వున్నా, ఫార్ములా కమర్షియల్ పాత్రల్లాగా కృత్రిమ, పైపై భావోద్వేగాలతో కాకుండా, పాత్రల లోతుల్లోంచి  సహజ నటనతో,  బలమైన ముద్ర వేస్తాడు ఆంథోనీ. అతడి బలం ఇలాటి పాత్రలే, మూస కమర్షియల్ పాత్రలు కాదు. 


          హీరోయిన్లు వున్నారు గానీ బాగా లావై పోయారు. మళ్ళీ నమితని చూస్తున్నామా అన్నట్టున్నారు. విలన్ ఎమ్మెల్యేగా రాధారవి ఇలాటి రియలిస్టిక్ సినిమాలకి ఒక ఎసెట్  గా మారాడు. మిగిలిన అన్ని  పాత్రల్లో అందరూ మూస నటననల పాలవకుండా తమ ప్రతిభల్ని కాపాడుకున్నారు. ఇందులో రియలిస్టిక్ యాక్షన్ దృశ్యాలు అత్యంత బలంగా –షాకింగ్ గా వున్నాయి. పాటల్ని ఒక డ్రీం సాంగ్ కి, ఒక థీమ్ సాంగ్ కి పరిమితం చేశారు. కెమెరా వర్క్ డార్క్ షేడ్స్ తో డెప్త్ ని తీసుకొచ్చింది. 

చివరికేమిటి 
      రియలిస్టిక్ అంటే అన్నీ రియలిస్టిక్ గా వుండాలని కాదు. ఒక్క ఫైట్స్ లలో మాత్రమే పంచ్ వుండి,  ఇతర సన్నివేశాల్లో  పంచ్ మిస్ అయి, పాత ఆర్ట్ సినిమాల చిత్రీకరణలా  వుండాలని కాదు. కథ మాత్రమే పవర్ఫుల్ అన్పిస్తూ, కథనంలో సన్నివేశాలు పవర్ పంచ్ తో లేకపోతే  టీవీ సీరియల్ అవచ్చు. ఇదేమీ మతిమాలిన ‘లైటర్ వీన్’ ప్రేమకథ కాదు. బార్ లో హీరో చేతిలో ఒకడు అనుకోకుండా చనిపోయే దృశ్యం,  సరైన ఎఫెక్టివ్ షాట్స్ తో లేక – ఓ క్లోజప్ వేసి తీసేస్తే, పేలవంగా తయారయ్యింది. ఇంత ‘లైటర్ వీన్’ ప్లాట్ పాయింట్ వన్ తో  కథనానికి ఏం బలం వస్తుంది. సన్నివేశాల్లో పంచ్ లేకపోవడం వల్ల ఇంకో నష్టమేమిటంటే,  కథనం స్పీడు తగ్గి,  చాలా నిదానంగా ఒక్కో సన్నివేశం కదలడం. రియలిస్టిక్ కథకైనా స్పీడుగా సాగే డైనమిక్సే  అవసరం. 

          ఇది పూర్తిగా ఆలోచనాత్మక కథ, ఎలాటి వినోదాన్నీ ఆశించకూడదు. కుటుంబ దృశ్యాల్లో శోకమైనా, అందరి జీవితాల్లో విషాదమైనా యాక్షన్ అనే కమర్షియల్ ఎలిమెంట్ తోనే చూపించారు. ఈ మొత్తం వ్యవహారంలో అర్ధం లేని పాత్ర చిత్రణలు, కథనం లేవు. స్ట్రక్చర్ ని, జానర్ మర్యాదని గౌరవించారు. ముఖ్యంగా  ద్వితీయార్ధం కథ సాంద్రత పెరుగుతుంది. ముగింపూ గుర్తుండేలా వుంటుంది.

-సికిందర్
https://www.cinemabazaar.in









555 : రివ్యూ!


దర్శకత్వం : ఎం జ్యోతికృష్ణ.
తారాగణం :
గోపీచంద్, రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, ఆశీష్ విద్యార్థి, సాయాజీ షిండే, అభిమన్యు సింగ్, వెన్నెల కిషోర్, అలీ, బ్రహ్మాజీ తదితరులు
కథ : జ్యోతి కృష్ణ, స్క్రీన్ ప్లే : ఎం రత్నం, సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : ఛోటా కె నాయుడు, వెట్రి
బ్యానర్ : శ్రీ సాయి రాం క్రియేషన్స్
నిర్మాతలు :
ఎస్ ఐశ్వర్య, ఎం రత్నం
విడుదల : నవంబర్ 30, 2017
***
      ‘ఆక్సిజన్ గురించి దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ చెప్పింది చూస్తే  నిజంగానే ఇదేదో డిఫరెంట్ మూవీ అని సంబరపడతాం. తీరా డిఫరెంట్ కీ ఫార్ములాకీ తేడా  లేకపోవడమే తన దృష్టిలో డిఫరెంటేమో అని తెలిసి కంగుతింటాం. ప్రేక్షకులు ఫార్ములాతో విసిగిపోయి డిఫరెంట్ సినిమాలు కోరుకుంటున్నారని చెబుతూ, ‘ఆక్సిజన్’ అలాటి తేడాగల మర్చిపోలేని అనుభవాన్నిచ్చే కమర్షియల్ అని సెలవిచ్చాడు. ఫార్ములా మర్చిపోలేని అనుభవాన్నిస్తుందా?

         
పజయాలతో వూపిరి సలపని  గోపీచంద్ కాస్త ఆక్సిజన్ ని ఆశించడంలో తప్పులేదు. ఆ ఆక్సిజన్ ప్రేక్షకుల పాలిట కాలుష్యం ఆవకుండా తను చూసుకోవాలి. చాలాకాలం నిర్మాణంలో వుండి, విడుదల కూడా వాయిదా పడుతూ వచ్చి, ఇప్పుడు విడుదలైతే దానర్ధం సిగరెట్లకి ఎక్స్ పైరీ డేట్ వుండదనా? చూద్దాం ఈ ఆక్సిజన్ సంగతులేమిటో...

కథ 

      రాజమండ్రిలో రఘుపతి (జగపతి బాబు) కి ముగ్గురు తమ్ముళ్ళు (బ్రహ్మాజీ, శ్యామ్, ప్రద్యుమ్న సింగ్), వాళ్ళ కుటుంబాలు, తనకో కుమార్తె  శృతీ (రాశీ ఖన్నా) వుంటారు. ఈ కుటుంబం మీద వీరభద్రం (సాయాజీ షిండే) పాత కక్షలతో  చంపుతూంటాడు. రఘుపతి తమ్ముడు, అతగాడి కొడుకూ అలా బలై పోతారు. వీరభద్రం నుంచి కుటుంబానికి రక్షణ  లేదని రఘుపతి కూతురికి అమెరికా సంబంధం చేసి పంపించేయాలనుకుంటాడు. సంబంధం చూడ్డానికి అమెరికా నుంచి  కృష్ణ ప్రసాద్ (గోపీ చంద్) వస్తాడు. శృతికి అమెరికా వెళ్ళడం ఇష్టంలేక, కృష్ణప్రసాద్ కి రకరకాల పరీక్షలు పెడుతూంటుంది మేనమామ (అలీ) తో కలిసి. వీరభద్రం మరోసారి దాడి చేసేసరికి, కృష్ణప్రసాద్ వీరోచితంగా పోరాడి ఆమె మనసు గెల్చుకుంటాడు. గెల్చుకున్నాక, అసలు తను కృష్ణప్రసాద్ కాదని ఆమెకి షాకిస్తాడు. 

          కృష్ణప్రసాద్ ఎవరు? ఏ ఉద్దేశం పెట్టుకుని ఈ వూరొచ్చాడు? అతడి ప్రతీకారం ఎవరి మీద? ఎందుకు? ...ఇవన్నీ మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలావుంది కథ

   
       పాత మూస ఫార్ములా డ్రామా అని తెలిసిపోతూనే వుందిగా - ఇంకా డిఫరెంట్ ఏమిటి? డిఫరెంట్ ఏమిటంటే,  నకిలీ సిగరెట్ల వల్ల ప్రాణాలు పోతున్నాయనే విషయం ఈ పాత మూస ఫార్ములాలో కలిపి చెబుతున్నారు  కాబట్టి, ఇదే డిఫరెంట్ అనుకోవాలని ఉద్దేశం. రేపు అల్లూరి సీతారామరాజు కథ తీయాలన్నా దాన్నిలాగే పాత మూస ఫార్ములాలో బిగించి డిఫరెంట్ చేస్తారు. కాకపోతే ఇంటర్వెల్లో నేను క్లీన్ షేవ్డ్  రాజ్ కుమార్ని కాదు, అల్లూరి సీతా రామరాజునని బ్యాంగ్ ఇస్తాడు గడ్డం పెట్టుకుని. అప్పుడు బాషా లాగానో, ఫ్యాక్షన్ లాగానో ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొచ్చి, శత్రు సంహారం గావిస్తాడు. మహాత్మా గాంధీ కథ తీసినా ఇదే – తెలిసిన ఇదొక్కటే ఫార్ములా పంజరంలో వుంటుంది. ఇది మర్చిపోలేని అనుభవాన్నిస్తుంది. 



ఎవరెలా చేశారు 
        నిజానికి గోపీచంద్ పోషించింది ఆర్మీ మేజర్ టెంప్లెట్ పాత్ర. సైన్యంలో వుండే హీరో,  సెలవు మీద ఇంటికి వచ్చినప్పుడే సమాజంలో ఏదో చెడు తన కుటుంబాన్ని బలి తీసుకున్నప్పుడు,  తిరగబడే మూస ఫార్ములాలో వుండే పురాతన టెంప్లెట్ పాత్ర. సైనికుడు సరిహద్దులో వున్నప్పుడే  సమాజ సమస్యలకి స్పందించి సెలవు పెట్టి వచ్చి సంగతి చూసుకోకూడదా? అసలు సెలవు పెట్టి ఇంటికి రాకపోతేనే ఇల్లూ సమాజమూ బావుంటాయేమో?  కుటుంబానికి హాని జరిగినప్పుడే తిరగబడి – దానికి దేశం కోసమే చేస్తున్నట్టు రంగుపులిమి పాత్ర చిత్రణ చేయడం చాలా అన్యాయం. సైనికుడు కుటుంబం కోసం యుద్ధం చేయడు, దేశంకోసమే చేస్తాడు. 

          ఫస్టాఫ్ లో అమెరికా నుంచి వచ్చే గోపీచంద్ పాత్ర  సస్పెన్స్ లేని సాదా రొటీన్ మూస పాత్ర. ఇలాకాక, ఇంకో బాడీ లాంగ్వేజ్ కనబడుతూంటే,  పాత్ర సస్పన్స్ క్రియేట్ చేసి, మూస కథకి కూడా దానికదే  డెప్త్ వచ్చేది. అతను ఆర్మీ మేజర్ అయినప్పుడు ఆ రకమైన వైఖరి కూడా కన్పించదు. ఈ ఆర్మీ మేజర్ టెంప్లెట్ పాత్ర ఇంటర్వెల్ తర్వాత రివీలవుతుంది. సెలవు మీద ఇంటికి వస్తే,  వూరూ పేరూ లేని నకిలీ సిగరెట్లకి తమ్ముడు బలై, దీనివెనుక కుట్ర తెలిసి పోరాటం మొదలెడితే- కుటుంబం నశించి (డిటో ‘పటేల్ సర్’ ఫ్లాష్ బ్యాక్) – పోరాటాన్ని ఉధృతం చేయడం  ఈ పాత్రకిచ్చిన టాస్క్. ఇక్కడా విషాద మేమిటంటే- ఇప్పుడూ తను సైనికుడిలా వుండడు. సైనికుడి మైండ్ తో మాట్లాడడు. తనకి  దక్కిన గోల్డెన్ మూమెంట్స్ చివరి సన్నివేశంలోనే. ఇక్కడ మాత్రమే కదిలించే పాత్ర – మిగతా ఎక్కడా కాదు. రొటీన్ యాక్షన్ జానర్ లో వుండిపోతుంది. తన ఆపరేషన్ కి ‘ఆక్సిజన్’  అని పేరు పెట్టుకున్నప్పుడు- ఆ ఆపరేషన్ సైనికుడు చేసే ఆపరేషన్ కోవలో వుండక పోవడం విచారకరం. ఇలాగైనా డిఫరెంట్ అన్పించుకోలేదు. 

          రాశీ ఖన్నాదీ మూస ఫార్ములా హీరోయిన్ పాత్ర. పల్లెటూళ్ళో హీరోతో ఆమె పాల్పడే చేష్టలు చూసీ చూసీ అరిగిపోయినవి.  సెకండాఫ్ లో మెడికల్ రీసెర్చర్ గా వచ్చే సెకండ్ హీరోయిన్
అనూ ఇమ్మాన్యుయేల్ కాస్త బాధ్యతగల పాత్రగా వున్నా, ఫార్ములా ప్రకారం ఆ పాత్ర ముగిసిపోతుంది. జగపతిబాబు, విలన్లు గా నటించిన ఇతరులూ సైతం చాలా పాత మూస పాత్రలు పోషించారు. అలీకి సీన్లు ఎక్కువే వున్నా కామెడీలో కిక్కు పెద్దగా లేదు.  

          యువన్ శంకర్ రాజా సంగీతం, ఛోటా కె. నాయుడు – వెట్రిల ఛాయాగ్రహణం సాధారణం. పీటర్ హెయిన్స్  సమకూర్చిన యాక్షన్ దృశ్యాల్లో హీరోతో మిలిటరీ యుద్ధ కళలు కన్పించవు. ఫ్లాష్ బ్యాక్ లో ఆర్మీ మేజర్ గా సరిహద్దులో టెర్రర్ స్థావరం మీద హీరో జరిపే దాడి – బిన్ లాడెన్ మీద అమెరికన్ దాడిని జ్ఞప్తికి తెచ్చే టెక్నిక్ తో వుండాల్సింది. పోలికలు కన్పించినప్పుడే కొన్ని సీన్లు ‘మర్చిపోలేని అనుభవాన్ని’ (దర్శకుడి మాటల్లో) ఇచ్చేది.


చివరికేమిటి 
     ఇతర సిగరెట్లు మంచి వైనట్టు నకిలీ సిగరెట్ల మీద సినిమా తీశారు. మంచిదే, ఈ చలనచిత్రం చూసి జనం మంచి సిగరెట్లు అలవాటు చేసుకుంటే! కథా ప్రయోజనం నెరవేరుతుంది. అసలు ఈ సినిమా తీయడం వెనుక కార్పొరేట్ కంపెనీల హస్తాలున్నాయేమో తెలీదు – తమ సిగరెట్లు అమ్ముకోవడానికి. మంచి  సిగరెట్లు తాగమని అన్యాపదేశంగా చెప్పే సినిమా ఎంతైనా గొప్పది. ఈ మార్పు ఈ దర్శకుడి తోనే ప్రారంభం కావాలి. 

          సిగరెట్ల మీద సినిమాలు తీస్తే, సిగరెట్లు తాగాలన్పించేలా వుంటున్నాయి. అనురాగ్ కశ్యప్ తీసిన  ‘నో స్మోకింగ్’ చూస్తే వెంటనే బయటికెళ్ళి గుప్పుగుప్పుమని పది సిగరెట్లు  దమ్ముల్లాగి పడెయ్యాలన్పించింది అప్పట్లో!  సిగరెట్ సినిమాలు అంతటి మార్పుని తెస్తాయి. గోపీచంద్ ‘ఆక్సిజన్’ నకిలీ సిగరెట్లు మానేస్తే పర్యావరణమంతా స్వచ్ఛమైన ఆక్సిజన్ తో తులతూ
గుతుందని తలపోసింది. జరిగింది వేరు. చూపించిన సినిమాలో మూస ఫార్ములా పాత సీనుల కాలుష్యం. 

          సారా అయినా సిగరెట్ అయినా పాత సీసాలో వేస్తే కొత్తగా అన్పిస్తాయని కావొచ్చు ఇలాటి పనికి తెగబడ్డారు. మూస ఫార్ములా టెంప్లెట్ చట్రం, దాంట్లో ఫ్యామిలీల కోసమని ఫ్యామిలీ కథ- (ఎంతాశ, ధూమ పానం మూవీని  కూడా ఫ్యామిలీలకి చూపించాలని) – ఈ ఫ్యామిలీ కథ ఫస్టాఫ్ తో పరిసమాప్తమై, సెకండాఫ్ వేరే స్మోకింగ్ కథగా మారడం చూస్తే – ఫస్టాఫ్ ఫ్యామిలీలు చూసి వెళ్లి పోవచ్చు, అప్పుడు సెకండాఫ్ పొగనంతా స్మోకర్లు భరించగలరు. ఇకపైన మంచి సిగరెట్లు తాగాలని చూసి నేర్చుకోవచ్చు. మంచి సిగరెట్లని అలవాటు చేసిన మంచి సినిమాగా మర్చిపోలేని అనుభవాన్ని మిగుల్చుకోవచ్చు.


      Ps :టెర్రర్ శిబిరం మీద విజయవంతమైన దాడి తర్వాత మేజర్ అయిన హీరో, సహచరులు, ఆనందంగా ఒక పాత హిందీ పాట పల్లవి నందుకుంటారు – ‘హకీఖత్’ లోని – ‘కర్ చలే హమ్ ఫిదా జానో తన్ సాథియోఁ.... అని. ఇది విజయోత్సవ గీత మనుకున్నట్టంది. యుద్ధంలో అమరులైన జవాన్లని చూపిస్తూ వచ్చే విషాద  నేపధ్య గీతమిది. దీనర్ధం : నేస్తాల్లారా మన జీవితాలనీ శరీరాలనీ అర్పణ చేసి వెళ్లి పోతున్నామని...  అర్ధం తెలుసుకోకుండా పాట పెట్టేస్తే,  ఇప్పుడిదేమిటని అర్ధం గాక భేజా ఫ్రై అవడమే మన పని!


-సికిందర్ 
https://www.cinemabazaar.in/