రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

7, అక్టోబర్ 2017, శనివారం

527 : రివ్యూ!




రచన- దర్శకత్వం :  సి. సత్యం
తారాగణం : భరత్,  సృష్టి, నాగినీడు, తనికెళ్ల భరణి, రఘుబాబు, తులసి, ప్రగతి, ధనరాజ్సత్య, ‘తాగుబోతు' రమేష్ తదితరులు
సంగీతం: శేఖర్చంద్ర,  కెమెరా: సాయి శ్రీరామ్
బ్యానర్
: ఎస్‌.వి.కె. సినిమా
నిర్మాత
: వంశీకృష్ణ శ్రీనివాస్
విడుదల : అక్టోబర్ 6, 2017

***
      కొత్త దర్శకులు తమకి  తెలిసిన సినిమా రకాలు రెండే అన్నట్టు  వారం వారం విఫలమై   వెళ్ళిపోతున్న ప్రస్తుత కాలంలో, ఇంకో కొత్త దర్శకుడు ఆ రెండిట్లో ఒక రకాన్ని తనుకూడా ఫాలో అయిపోతూ విఫలమయ్యాడు. రోమ కామెడీ అనే ప్రేమడ్రామా, దెయ్యం కామెడీ అనే హార్రర్ ట్రామా. ఈ రెండు రకాలని పంచుకుని  రెండు బ్యాచులుగా తయారై  థియేటర్ల దగ్గర ప్రేక్షకులు కనపడకుండా కర్ఫ్యూ విధిస్తున్నారు.  షోలు క్యాన్సిల్ చేయించుకుంటున్నారు. రేయ్ నిన్నే- అని పిల్చినా కూడా తిరిగి చూడని ప్రేక్షకులని గంపగుత్తగా  పెంచుకుంటు న్నారు. ఒకనాడు శాటిలైట్ హక్కుల బూమ్ లో చిన్నా చితకా చిల్లర  సినిమాలన్నీ శాటిలైట్ హక్కుల కోసమే తీశారు తప్ప ప్రేక్షకుల కోసం కాదు. ఇప్పుడు శాటిలైట్ హక్కులుకూడా లేకపోయాక, ఇప్పుడైనా ప్రేక్షకులకోసం తీయకుండా ఓ సినిమాకి దర్శకుడు అన్పించుకోవడమే టార్గెట్ అన్నట్టు అవే ఫ్లాపయ్యే రోమ కామెడీ లు, అవే దెయ్యం కామెడీలు తీసుకుంటూ అభివృద్ధి అనే మాటకి రెండు దశాబ్దాల దూరంలో గడిపేస్తున్నారు. 

        రివాజుగా ప్రస్తుత దర్శకుడు కూడా అదే 2000 - 2005 మధ్య యూత్ సినిమాల పేరుతో వెల్లువెత్తిన ‘లైటర్ వీన్ లవ్ స్టోరీస్’ అపజయాల బూమ్ లోనే   వుండిపోయి వీణ వాయించాడు. నేటి నెట్ యుగపు యూత్ కి కావాల్సింది గిటార్ సినిమాలు. అందుకే ఈ వీణ సినిమాల ముఖం చూడకుండా  ‘గిటార్ లవ్స్’ రుచి చూపిస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులుగా మారిపోతున్నారు పొలోమని యూత్. కాస్త ఆ టాలీవుడ్ అనే హోదా నుంచి దిగివచ్చి, క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి చూసి,  ఇక నైనా  ఈ దుకాణాలు కట్టేస్తారా ?


తెలిసిన రకాలు రెండే. ఇంకాస్త విస్తరిస్తే పెద్ద స్టార్ల యాక్షన్ సినిమాలు. ఈ రెండు దశా బ్దాలుగా ఇవే  చూస్తూ పెరిగిన కొత్త దర్శకులు, రచయితలూ చాలా దురదృష్ట వంతులు. ఈ దురదృష్ట వంతుల్ని ఈ రెండు దశాబ్దాల ఈ రెండు మూడు రకాల సినిమాలే తయారు చేశాయి. కిందటి తరం దర్శకులు రచయితలూ చాలా అదృష్టవంతులు. వాళ్ళ కాలంలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, భక్తీ, పౌరాణిక, జానపద, క్రైం, గూఢచార, కౌబాయ్, విప్లవ, చారిత్రక, దేశభక్తీ  వగైరా వగైరా  లేనిదంటూ లేని రకాల సినిమాలూ చూస్తూ పెరిగారు – ఆల్ రౌండర్ దర్శకులుగా, రచయితలుగా  అయ్యారు. విభిన్న సినిమాలని ప్రేక్షకులకి పంచారు.

‘ఓయ్ నిన్నే’ ఏనాటిదో చిన్నప్పట్నుంచి కలిసి పెరిగే కయ్యాల బావామరదళ్ళ అదే పాత పల్లెటూరి కథ. తమ మధ్య వున్నది ప్రేమే అని తెలీక ఆడే  అదే పాత డ్రామా. ఈ డ్రామా కూడా ఎలా నడపాలో తెలియక సెకండాఫ్ సాంతం అర్ధరహితంగా మార్చేసిన వైనం. ఎందుకంటే, ఇలాంటి ప్రేమ డ్రామాల్లో  పాత్రల మధ్య సమస్యలకి 2000 – 2005 బాపతు యూత్ సినిమాల్లో కూడా పరిష్కారాలు గందరగోళమే. కాబట్టి అదే గందరగోళం వారసత్వంగా వచ్చిందిప్పుడు. 


          హీరో రైతు అవాలనుకుంటాడు. హెడ్ మాస్టారైన తండ్రి  ఇంకా బాగుపడే పనేదైనా  చూసుకోమంటాడు. దీంతో ఇద్దరికీ  విభేదం. హీరోకి  చిన్నతనం నుంచీ కలిసి పెరిగిన మరదలుగా హీరోయిన్. ఇద్దరి మధ్య ఎప్పుడూ కయ్యాలు. ఆవారా హీరోకి ఇంట్లో లభించని ఆదరణ హీరోయిన్ ఇంట్లో లభిస్తుంది. ఇటు  హీరో తండ్రి హీరోయిన్ ని  కన్నకూతురిలా ఆదరిస్తాడు. హీరోయిన్ పెళ్లి చేయాలనుకుంటాడు హీరోయిన్ తండ్రి. వేరే పెళ్లి కొడుకు వస్తాడు. ఇప్పుడు హీరో హీరోయిన్లకి ఆందోళన. హీరో మీద ప్రేమ వుందని హీరోయిన్ ఎలా చెప్పాలి? హీరోయిన్ మీద ప్రేమే వుందని  హీరో కూడా ఎలా చెప్పాలి? ఇదీ సమస్య. ఇదీ ఇక ముందు కథ. ఎన్ని సార్లు అదేపనిగా చూడాలి ఈ అరిగిపోయిన పాతచింతకాయ కథ. 

          కొత్త దర్శకుల రోమప్రేమ డ్రామాలు రెండు రకాలు :  ప్రేమల్ని వెల్లడించుకోలేక హీరోహీరోయిన్లు హీనంగా బతకడం, అపార్ధాలతో విడిపోయి హీనంగా ప్రేక్షకుల్ని బాధించడం ఈ మధ్యే  తమిళ టైటిల్ తో తెలుగు రోమడ్రామా  ‘కాదలి’ లో  ఇద్దరు హీరోలలో ఎవరికి  ప్రేమ చెప్పాలో తెలియక,  ముగ్గురు ప్రేక్షకులున్న థియేటర్లో కనికరం లేకుండా హింసించింది హీరోయిన్ సెకండాఫ్ అంతా.  సేమ్ సీన్ ఇప్పుడు, కాకపోతే హీరో హీరోయిన్లు ఇద్దరూ టార్చర్ పెట్టేస్తారు.

సినిమాలు తొలి స్వర్ణయుగం,  మలి స్వర్ణయుగం,  వ్యాపారయుగం కూడా ముగిసి పోయి,  ఫైనల్ గా దివాలాయుగం నడుస్తోంది మహర్దశగా. 

          షరా మామూలుగా కొత్త హీరో హీరోయిన్లు. హీరో ఇంకా  శిక్షణపొందాలి. హీరోయిన్ కి ఇలాటి సినిమాల బారి నుంచి కొంత  రక్షణ కల్పిస్తే  కాస్త ఎదిగే అవకాశాలున్నాయి. కమెడియన్ల  కామెడీకి  అర్ధంలేదు. నాగినీడు, తనికెళ్ళ, తులసిలవి పాత మూస పాత్రలు. కానీ ఆ కాలంలో ఇలాటి పాత్రలైనా వాస్తవిక దృక్పథంతో వుండేవి. కొడుకు రైతు అవుతానంటే ఉపాధ్యాయుడైన నాగినీడుకి ఏమిటి అభ్యంతరం – ఇప్పుడు ఉద్యోగాలు వదులుకుని వ్యవసాయాల్లో అద్భుతాలు చేస్తున్న ఇంజనీర్లు వుండగా?  వ్యవసాయ రంగంలో ఇలాటి వారు వస్తే భవిష్యత్తులో ఆత్మహత్యలు చేసుకునే రైతులు వుంటారా? అన్ని కాలాలకి కలిపి ఒకే పాత్రచిత్రణలు సరిపెట్టేయడం ఎందుకంటే,  2000 - 2005  మధ్య తమ టీనేజిలో చూసి మోహం పెచుకున్న యూత్ సినిమాల జ్ఞానం ఇదే కాబట్టి.

          ఈ వృధా ప్రయాసకి శేఖర్ చంద్ర సంగీతం,  కోనసీమ అందాలు చూపించిన  సాయి శ్రీరాం ప్రయత్నం వృధాపోయాయి. నాల్గు వారాలు తమ కళానైపుణ్యాల్ని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలంటే అసలంటూ సినిమాలో విషయముండాలిగా?  

          పెద్ద విడుదలలు లేక ఖాళీగా వున్న ఈ వారంలో విడుదలైన పాత దర్శకుడి  ‘లావణ్యా విత్ లవ్ బాయ్స్’, మరో కొత్త దర్శకుడి ‘నేను కిడ్నాప్ అయ్యాను’  కూడా  సొమ్ము చేసుకోలేకపోయాయి షరా మామూలుగా.


-సికిందర్
https://www.cinemabazaar.in
  



2, అక్టోబర్ 2017, సోమవారం

525 : ప్ర. జ.


Q : Dear sir,
            You always propagate the necessity of the three act structure in screenplays, but Torantino, Nolan, or Alejandro movies couldn't follow up the structure? Then their movies are considered classics? How can you explain this?

- Dileep Kumar, ifl univ.


A : Every movie will have a three act structure come what may - ie a beginning, a middle and an end, but not neccesarily in that order. What you see in those movies that of those directors you have mentioned is- jumbled order.

Q : Sir.
            The way you are analyzing Blood Simple story structure is most educating enterprise to me. These writings reveal so many tremendous truths to me about script writing. So please don’t discontinue writing on this subject. This is my humble request.

JD Swamy, co-director

A : Request taken, have no worry about it. 

Q: Sir,
            Regarding Happy Bhag Jayegi, is it possible the writer doesn’t have any idea of how the hero and the heroine should get married? So obviously the Bagga character will not marry her. Her  father’s character won’t agree as well.  So the writer has no option but to do the only thing with hero’s  character? So to convince the audiences, he  might have created that Madhubala  scene, in which the hero compares his own life with that of heroine’s? Am I  correct?

K. Vidheer, associate director

A : The story was conceived keeping in mind that it shouldn’t  end up stereo typing the lead characters. If the hero gets married to heroine, it will become another regular masala.  And will also turn up another Indian boy meets Pak girl kinda movie. It’s outright out of box creation, to which in Telugu our people still consider taboo…

***

1, అక్టోబర్ 2017, ఆదివారం

524 : స్క్రీన్ ప్లే టిప్




    ఈ వారం ‘స్పైడర్’,  ‘మహానుభావుడు’ రెండూ రెండు  నీతులు చెబుతూ వచ్చాయి. నీతి చెప్పాల్సిందే, లేకపోతే సమాజం చెడిపోతుందనికంగారుపుట్టినప్పుడు ఆ నీతిని ఎలా చెబితే ప్రభావశీలంగా వుంటుంది?  ఇదొకసారి పరిశీలిద్దాం. ‘మహానుభావుడు’ లో పరిసరాలపట్ల ఎలర్జీ వున్న హీరో తిరిగి ఆ పరిసరాల్లోనే - ప్రకృతిలోనే కలిసిపోయి పునీతుడవుతాడు. జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం హీరో పాత్ర ప్రయాణం కనువిప్పుతో మోక్షం పొందడం వైపే కొనసాగుతుంది. తప్పుని సరిదిద్దుకుని ఒప్పుని అంగీకరించే దిశకే వుంటుంది. ఈ రీత్యా ‘మహానుభావుడు’ హీరో అక్షరాలా మట్టిని మొహం మీద కొట్టుకుని తప్పుని ఒప్పుకున్నాడు. రోమాంటిక్ కామెడీని రోమాంటిక్ డ్రామాగా మార్చేశాక, ఇలా ఒక నీతిని చెప్పి పాతని రుచి చూపించినట్టయింది వేరే సంగతి.


          అయితే ఈ నీతి చెప్పడం పట్ల కూడా వున్న నిబద్ధత, చెప్పాలనుకుంటున్న పాయింటుని స్పష్టంగా, విజువల్ యాక్షన్ తో కలిపి చూపించిన పధ్ధతి ‘స్పైడర్’ లో లోపించడాన్ని గమనించవచ్చు.  ‘స్పైడర్’ లో మానవత్వం, సహాయగుణం తగ్గిపోవడం పట్ల అభ్యంతరం చెప్పారు.  ఐతే చిన్నప్పట్నుంచీ హత్యలు చేస్తున్న సైకోని పట్టుకోలేకపోవ డమనే అసమర్ధత ఇలా మెసేజి లివ్వడానికి అడ్డుపడలేదు కాబోలు. ఇదికూడా అలా  వుంచుదాం. అలా మానవత్వం, సహాయగుణం లేకుండా ప్రవర్తించే పాత్రల్ని చూపించకుండానే ఫిర్యాదులు  చేశారు. ఆఖరికి  హాస్పిటల్ కూలినా, బండ దొర్లి వస్తున్నా, సహాయానికి రాని మనుషులెవర్నీ చూపించకుండానే ఫిర్యాదులు, అభ్యంతరాలూ  వ్యక్తం చేశారు. మనుషులు మానవత్వంతో, సహాయ గుణంతో వుండాలని హీరో తనని తానే  చూపించుకుని చెప్పుకున్నాడు. మనుషుల్లో ఈ రెండు గుణాలు తగ్గిపోవడానికి ఆన్ లైన్లో రకరకాల స్క్రీన్ లకి అంకితమైపోవడం కారణమన్నాడు. ఇలా మాటలు చెప్పడం పాసివ్ ఉదాహరణల్ని ఉటంకించడమే. దీంతో సినిమాకి పెరిగే బలం ఏమీ లేదు. ప్రేక్షకులూ  స్పందించడానికి ఏమీ వుండదు. 

          ‘మహానుభావుడు’ లో చూపించింది ఎలర్జీ, దాంతో  విజువల్ గా యాక్టివ్ ఉదాహరణలు. చివరికి హీరో ప్రకృతిలో  కలవడం కూడా యాక్టివ్ గా వున్న విజువల్ ఎగ్జాంపులే. ఇలాగే ‘స్పైడర్’ లో ఇప్పుడున్న పోకడల్ని దృష్టిలో పెట్టుకుని - బండ దొర్లుతున్నప్పుడు, హాస్పిటల్ కూలుతున్నప్పుడూ మనుషులు ఎగబడి వీడియోలూ సెల్ఫీలూ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తునట్టు చూపించివుంటే, అది యాక్టివ్ విజువల్ ఎగ్జాంపుల్ అయ్యేది, చెప్పే నీతి బలంగా చొచ్చుకెళ్లేది. రోజూ ఎక్కడోచోట రోడ్డు ప్రమాదాలప్పుడు చూస్తూనే వుంటాం ఛానెళ్ళ ప్రసారాల్లో -  దారిన పోతున్న వాళ్ళు సాయపడకపోగా ఫోటోలూ  వీడియోలూ తీసుకుని వెళ్ళిపోవడం. అది గొప్పని ఫీలవడం. సోషల్ మీడియాలో లైకులకోసం, వైరల్ అవడం కోసం పోస్టులు  చేసుకోవడం. ఏనాడో ఐన్ స్టీన్ భయపడింది నిజం చేస్తున్నారు. టెక్నాలజీ మనుషుల మధ్య ముఖాముఖీ స్పర్శని డామినేట్ చేసినప్పుడు మనుషులు ఈడియెట్స్ లా తయారవుతారేమోనని తనకి భయంగా వుందన్నాడు ఐన్ స్టీన్!

          అసలు ఒక నీతికి సంబంధించి మనుషులు ఎప్పుడేం చేస్తున్నారో చూసి, దాన్ని డ్రమటైజ్ చేసినప్పుడు కదా నీతి బలంగా నాటుకునేది. మరొకటేమిటంటే, ఆ బండ దొర్లడానికీ, హాస్పిటల్ కుప్ప కూలడానికీ పూర్తిగా సైకోతో హీరో ఆశక్తతే  కారణం. ఇంకా చెప్పుకుంటే చాలా లోపాలున్నాయి మొత్తం సెటప్ లో. మెసేజి ఇవ్వడానికే ఇంత గందరగోళం వుంటే, మనుషులు సాయపడడానికీ ఇంకా గందరగోళానికి లోనైపోతారు. ఆ సినిమాలో చూపించినట్టు ఇది ఫలానా వాడి అశక్తతతకి ఎగ్జాంపులేమో,  మనం సాయపడకూడదేమో నని సెల్ఫీలు తీసుకుంటారు.

-సికిందర్ https://www.cinemabazaar.in
         





29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

523 : రివ్య్తూ!





రచనదర్శకత్వం : మారుతీ
తారాగణం: ర్వానంద్, మెహరీన్ పీర్జాదా, నాజర్, వెన్నెలకిషోర్, వేణు, ఘుబాబు దితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.న్, ఛాయాగ్రణం: నిజార్ ఫీ
బ్యానర్యువి క్రియేషన్స్
నిర్మాతలు  : ప్రమోద్, వంశీ
విడుదల : సెప్టెంబర్ 29, 2017
***
        
       దర్శకుడు మారుతీ  నానితో  ‘భలేభలే మగాడివోయ్’  సూపర్ హిట్ ఇచ్చాక పెద్ద రేంజికి  వెళ్లి పోవాలనుకున్నారు. దీంతో వెంకటేష్ తో ‘బాబు బంగారం’ తీశారు. చిన్న కథలతో తనకున్న టాలెంట్ ని  పాత మూస ఫార్ములాకి బలిపెట్టి ‘బాబుబంగారం’ తో కంగుతిన్నారు. పెద్ద స్టార్ మూవీస్ కి ఒక మూసలో వుండే అవే ఫార్ములా కథలు తన సెక్షన్ కాదని తేల్చుకుని, తిరిగి బయల్దేరిన చోటికి వచ్చారు. ఈసారి శర్వానంద్ తో  చేయి తిరిగిన తన కామెడీ ప్రతిభనే నమ్ముకుని ‘మహానుభావుడు’ తీశారు. నానికి మతిమరుపు పాత్రతో ‘భలేభలే మగాడివోయ్’ తీసినట్టే, మళ్ళీ శర్వానంద్  పాత్రకి ఇంకో వ్యాధిని కట్టబెట్టారు. ఇక ఇదేదో ఫార్ములా బాగానే  వర్కౌట్ అవుతోందని తలా ఓ వ్యాధి హీరోలకి తగిలిస్తూ కామెడీలు తీసే అబ్సెషన్ కి లోనవుతారా, వెంటనే దూరమవుతారా?
       
        శర్వానంద్ కూడా టాప్ స్టార్లు చేసే సినిమా ఒకటి తన ఖాతాలో వుండేందుకు  ‘రాధ’ తో ఓ పాత మూస ఫార్ములా చేసి దెబ్బతిని , మారుతితో చేయికలిపి  సౌభాతృత్వాన్ని చాటుకున్నారు. జ్ఞానోదయమైన ఈ సౌభాతృత్వం ఇప్పుడు ఇద్దరికీ మేలు చేసిందా? ఇద్దరూ కలిసి సృష్టించిన ఆ బాక్సాఫీసు వ్యాధి ఏమిటి? దానితో ఏ మేరకు మెప్పించ
గల్గారు?... ఓసారి చూద్దాం...

కథ 
     ఆనంద్ (శర్వానంద్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అతడికి అబ్సెసివ్  కంపల్సివ్ డిజార్డర్ (ఒసిడి) అనే మనోవ్యాధి వుంటుంది.  ప్రతీదీ పరిశుభ్రంగా వుండాలని కోరుకుంటాడు. పరిశుభ్రత లేకపోతే తట్టుకోలేడు. మనుషులతో ఆచితూచి కరచాలానం చేస్తాడు. అతడి ఈ అతిశుభ్రత ఆఫీసులో, ఇంట్లో అందరికీ సమస్యవుతుంది. తల్లికి జ్వరం వచ్చినా ముట్టుకోడు. ఇలాటి ఇతను మేఘన (మేహరీన్ పీర్జాదా) ని చూడగానే ప్రేమలో పడతాడు. ఆమెకూడా శుభ్రత  కోరుకునే మనిషి కావడంతో ప్రపోజ్ చేస్తాడు. ఆమె తండ్రి (నాజర్) ని అడగాలంటుంది. ఆ తండ్రి భోజనం చేసే విధానం నచ్చక డిస్టర్బ్ అయిపోతాడు ఆనంద్. ఇతడి పరిశుభ్రత పిచ్చిని  ఆ తండ్రి కూతురి కోసం ఓర్చుకుంటాడు. అయినా ఆ తండ్రి అస్వస్థత పాలై ఆస్పత్రికి తీసికెళ్ళాల్సి వస్తే జంప్ అయిపోతాడు ఆనంద్. దీంతో మేఘన అతణ్ణి కట్ చేసి పారేస్తుంది. ఆనంద్ ఇప్పుడేం చేశాడు? మేఘన కోసం పరిశుభ్రత పిచ్చిని కుదుర్చు కున్నాడా? ఎలా? ఇతడి పిచ్చి ఎలా కుదిరి పెళ్లి కుదిరింది? ఇందుకేమేం చేశాడు?... ఇవి తెలుసుకోవాలంటే వెండి తెరని ఆశ్రయించాల్సిందే.

ఎలావుంది కథ
      ‘భలేభలే మగాడివోయ్’ లో మతి మరుపు కథలాగే కొన్ని మార్పులతో ఈ అతిశుభ్రత అనే కామెడీ. కానీ ఇది ‘భలేభలే మగాడివోయ్’ లాగా పూర్తి స్థాయి రోమాంటిక్ కామెడీ కాలేదు. సగం కథ తర్వాత హీరోయిన్ వైపునుంచి కామెడీ వుండదు. ఆమె రోమాంటిక్ డ్రామా మూడ్ లో కెళ్ళి పోతుంది. ఇక ఒసిడి మీద ఈ కథ  అన్నారు. నిజానికిది ఒసిడి  కాదు. అపరిశుభ్రత పట్ల ఎలర్జీ మాత్రమే. అతిసున్నితత్వం మాత్రమే. అబ్సెసివ్  కంపల్సివ్ డిజార్డర్ పేరు చూస్తేనే తెలిసిపోతుంది. అబ్సెసివ్ అంటే మనసులో ఒకే ఆలోచన పదేపదే కలగడం. కంపల్సివ్ అంటే ఆ ఆలోచనతో పదేపదే అదే చర్యకి పాల్పడ్డం. అబ్సెసివ్ = పునరావృతమయ్యే ఆలోచన, కంపల్సివ్ = పునరావృతమయ్యే చర్య.  అంటే మనసులో అన్పించే ఒకే పనిని పదేపదే చేయడం : పదేపదే చేతులు కడుక్కోడడం, పదేపదే గ్లాసు కడగడం, పదేపదే టేబుల్ తుడవడం లాంటివి వుంటాయి. అలాగే  గడియారం ఆగిపోయిందని పదేపదే కీ ఇవ్వడం, లైటు ఆర్పామా లేదాని  పదేపదే వెళ్లి చూడ్డం లాంటివి కూడా వుంటాయి. దీన్నే ఒసిడి అంటారు. ఇది మనసులో పుడుతుంది. ఎలర్జీ అనేది చుట్టూ పరిసరాలని చూసి పుడుతుంది.  పరిసరాల పరిశుభ్రతతో ఒసిడికేం  సంబంధం లేదు. ఈ కథానాయకుడి సమస్య కూడా  చుట్టూ పరిసరాల, మనుషుల అపరిశుభ్రత తోనే. ఒకసారి శుభ్రం చేస్తే అతడి ఎలర్జీ తీరిపోతూంటుంది. చిన్నప్పుడు ప్రకృతితో కలిసిపోయి పెరక్కపోవడం వల్ల ఇలాటి ఎలర్జీ పుడుతుంది. మట్టిలో ఆడుకునే పిల్లలకి ఈ పరిస్థితి రాదు. ఇందుకే ఈ కథ ముగింపు కథానాయకుణ్ణి  మట్టితో – ప్రకృతితో – కలిపి సమస్య తీర్చింది. ఒసిడి కి ఇలాటి పరిష్కారం వుండదు, మానసిక చికిత్సే వుంటుంది. కాబట్టి ఒసిడి మీద సినిమా – ఒసిడి మీద సినిమా అనే మిస్ ఇన్ఫర్మేషన్ ఆపెయ్యాలి - సగటు ప్రేక్షకులకి తప్పుడు అవగాహన కలక్కుండా. 

ఎవరెలా చేశారు 
       శర్వానంద్ కామిక్ టైమింగ్ పాత్రని కలర్ఫుల్ గా మార్చింది. అయితే ఈ పెప్ ని ‘రన్ రాజా రన్’ స్థాయికి తీసికెళ్ళి వుండొచ్చు. ఇది జరగలేదు. పాత్రకి సంభాషణల బరువు తగ్గివుంటే కామిక్ యాక్షన్ మరింత థ్రిల్ చేసేది. అతి శుభ్రత పిచ్చిగల వాడి పాత్రలో మొదట్లో తను తాట తీయడం, తర్వాత తన తాట అందరూ తీయడంలాంటి హస్యప్రహసనాలతో మంచి వినోదాన్నేపంచాడు. ఐతే కొంత సేపయ్యాక దీనికీ మొనాటనీ రావడానికి కారణం తర్వాత చూద్దాం. సినిమా అంటేనే  2000 నుంచి  ఎంటర్ టైన్మెంట్ - ఎంటర్ టైన్మెంట్ - ఎంటర్ టైన్మెంట్ గా అర్ధం మారిపోయింది. తెలిసో తీలీకో ఈ పల్స్ ని పట్టుకున్నందుకే శర్వానంద్  యూత్ అప్పీల్ ని సరఫరా చేస్తూ దీంతో సక్సెస్ అయ్యాడు. 

          హీరోయిన్ పాత్రలో మెహరీన్ రోమాంటిక్ కామెడీగా సాగినంత వరకూ ఫర్వాలేదుగానీ, జానర్ ఫిరాయించి రోమాంటిక్ డ్రామాగా మారేక అంత ప్రభావం కనబరచలేదు. రోమాంటిక్ డ్రామాకి ఎక్కువ అనుభవమున్న నటి వుంటే బావుంటుంది. 

          మిగిలిన పాత్రల్లో నాజర్ దే కీలక పాత్ర. కానీ ఆయన గెటప్ పాత స్టయిల్ లో వుంది. హీరో పక్కన వెన్నెల కిషోర్, వేణుల కామెడీ ఫర్వాలేదు. ఈ సినిమాలో ఎక్కువగా టాయిలెట్ కామెడీయే వుంది –  ఎక్కడపడితే అక్కడ - మారుతి బూతుని ఇలా ఏమార్చారేమో తెలీదు. 

          తమన్ సంగీతంలో రెండు మెలోడీ పాటలు చూస్తున్నంత సేపూ ఫర్వాలేదు. నిమిషం తర్వాత గుర్తుండవు. ఈ పరిస్థితిని ఎన్నాళ్ళు కొనసాగిస్తారో సంగీత దర్శకులూ పాటల రచయితలూ. నిమిషంలో మర్చిపోయే పాటలెందుకు? పాడే వాళ్ళెవరో కూడా మనకి తెలీదు. మ్యూజిక్ ఇండస్ట్రీ చాలా ట్రాష్ ని ఉత్పత్తి చేస్తోంది. 

          కెమెరా వర్క్, ఎడిటింగ్, ఇతర సాంకేతికాలూ నిర్మాతల స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా వున్నాయి. మారుతీ దర్శకత్వం ప్రారంభ దృశ్యాల్లో అలసటని, బద్దకాన్ని వెల్లడిస్తాయి. ఈ దృశ్యాలు చివరి షెడ్యూల్లో చిత్రీకరించి వుంటే  హుషారుగా వచ్చేవేమో! 

చివరికేమిటి 
        కామెడీ కూడా నీతి చెప్పాల్సిన అవసరం లేదు. చెబితే పాత వాసనేస్తుంది. ‘భలేభలే మగాడివోయ్’ హిట్ కామెడీ నీతి చెప్పకుండా జాయ్ రైడ్ గా ఎప్పటికీ అలరిస్తుంది. ప్రస్తుతం మారుతి మనిషి ప్రకృతితో కలిసి వుండాలని ఓ పాత్రచేత కూడా చెప్పి ముగించారు. జడ్జి మెంటు ఇవ్వని కామెడీ స్వేచ్ఛగా వుంటుంది. కామెడీని స్వేచ్ఛగా కాసేపు నవ్వుకోవడానికి వదిలెయ్యాలి. ముగింపు ఇచ్చారంటే కూడా అది నవ్వొచ్చేలా వుంటే  ఎక్కువకాలం గుర్తుంటుంది. 

           మారుతి  ‘భభమ’ లాంటి ఫార్ములాని రిపీట్ చేశారు గానీ, అది అంతగా ఎలా వర్కౌట్ అయ్యిందో గమనించినట్టు లేదు. రెండు కథలూ ఒక చట్రంలోనే  వుంటాయి. ప్రేమికుడు- ప్రేమిక- ప్రేమిక తండ్రి అనే చట్రం. అయితే అక్కడ ముగ్గురి మధ్య పూర్తి స్థాయి రో మాంటిక్ కామెడీగా వుంది, ప్రస్తుత ప్రయత్నం డ్రామాగా మారింది. డ్రామాగా మారినప్పుడే నీతి  చెప్పాలనిపిస్తుంది. అందులో హీరోయే కథ, కథే హీరో. స్ట్రక్చర్ ని ఎగేసి పది నిమిషాలకో సారి కథలో నాని క్రేజీ పాత్ర బ్యాంగు లిస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. శర్వానంద్ తో ఇదే రిపీట్ చేసివుండాల్సింది. అయితే అప్పట్లో ‘భభమ’ రివ్యూలోనే రాశాం- మళ్ళీ మారుతి వల్లకూడా ఇది సాధ్యం కాకపోవచ్చని. 

          సినిమా ప్రారంభం ట్రెండ్ కి దూరంగా చాలా నిదానంగా పాత పద్దతిలో వుంటుంది. ఇక ప్రేక్షకులు ఇదివరకు చూడని కొత్త పాయింటుకి కనెక్ట్  చేయడానికి శర్వానంద్ తో అతిపరిశుభ్రత దృశ్యాలు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూపోయారు. దీనివల్ల ఒక  ప్రమాదం తప్పింది. హీరోకి ఈ సమస్య లేకపోతే ఈ కామెడీ సీన్లన్నీ హీరోయిన్ వెంట హీరోయిన్ ప్రేమ కోసంగా టెంప్లెట్ లో పడి తేలిపోయేవి. అపరిశుభ్రతతో హీరోకున్న ఎలర్జీయే ప్రేమలో సమస్య పుట్టిస్తుందని ఎవరైనా వూహిస్తారు. అయితే కేవలం ఈ ఎలర్జీకే హీరోయిన్ ఎదురుతిరిగితే కథ  బలంగా వుండదు. ఎలర్జీతో వచ్చే అరిష్టాలు చూపించినప్పుడే కథ  రసకందాయంలో పడుతుంది. అస్వస్థత పాలైన  హీరోయిన్ తండ్రిని వదిలి పారిపోయేంత రేంజిలో అతడి ఎలర్జీ వుంటే అది తిరుగులేని బ్యాంగే  కథకి. పైగా ఆ తండ్రి రక్తమంతా తన వొంటికి అంటుకోవడాన్ని మించిన పరాకాష్ఠ ఏముంటుంది ఎలర్జీకి? అదే సమయంలో అది అతడి మిర్రర్ ఇమేజి. ఎవరో అన్నాడు, ఇంటర్వెల్ కొచ్చేటప్పటికల్లా ప్రధాన పాత్రకి తన నమ్మకాలు వమ్ము అయ్యే వ్యతిరేక చిత్ర పటం కళ్ళెదుట కట్టాలని. దేన్నుంచైతే తప్పించుకుంటున్నాడో అదే తనలో కలుపుకుని దర్శన మివ్వాలని. అపరిశుభ్రతని ఎవగించుకునే శర్వానంద్ పాత్రకి ఎదుటి మనిషి రక్తమంతా ముంచెయ్యడం ఇలాంటి కనువిప్పే. 

          దీని  తర్వాత సెకండాఫ్ లో వాతావరణాన్ని మళ్ళీ తేలికబర్చి పల్లెటూరికి తీసికెళ్ళారు. అక్కడి మనుషులు, పద్ధతులు అతణ్ణి మరింత కంపరం పుట్టించే హాస్య దృశ్యాలతో నింపారు. ఇక్కడే మొనాటనీ ఏర్పడింది. సినిమా ప్రారంభం నుంచి చూస్తున్నవే ఇవన్నీ. కాకపోతే ప్రారంభంలో దేన్నైతే అస్యహించుకున్నాడో, ఇప్పుడు  అందులోనే మునిగి తేలడం- అతడి భాషలో అపరిశుభ్రతలో. కానీ ప్రకృతికి దగ్గరవుతున్నాడు, పాత్రకి కావాల్సిందిదే.  ఇది చెప్పడానికి ఏవైతే దృశ్యాలు వేస్తూపోయారో వాటిలో బాగా పేలిన చెరువు సీను, అన్నం సీను సరిపోతాయి. మిగిలినవి రిపీటిషన్ బారిన పడి- కథలో దమ్ము లేదన్నట్టుగా చేశాయి చాలా సేపు. ఒక చిన్న పాయింటుని రెండు గంటల పైగా సినిమాగా నిలబెట్టడమనే వ్యూహం చెల్లుబాటు కాలేదు.  క్లయిమాక్స్ కొచ్చాకే కుస్తీ పోటీల వల్ల ఆసక్తి ఏర్పడింది. అయితే కుస్తీ పోటీలూ, గెలిచిన వాళ్ళు సర్పంచ్ అవడం పాత  ఫార్ములా క్లయిమాక్సే. ఇందులో హీరో ఎమోషన్, మెలోడ్రామా కామెడీ జానర్ కి వ్యతిరేకమే. 

          ఎలర్జీని ఒసిడి అనడాన్ని, కామెడీని డ్రామా చేయడాన్ని, కామెడీతో నీతి చెప్పడాన్ని ఓర్చుకోగలిగితే  శర్వానంద్ – మారుతీలు మరీ బోరు కొట్టించరు ఈ  ‘మహానుభావుడు’ తో.

-సికిందర్ https://www.cinemabazaar.in
 


27, సెప్టెంబర్ 2017, బుధవారం

522 : రివ్యూ!




రచన దర్శకత్వం : ఆర్ మురుగ దాస్
తారాగణం :  మహేష్ బాబు, కుల్ ప్రీత్ సింగ్, ఎస్‌.జె. సూర్య, ప్రియదర్శి, త్ దితరులు
సంగీతం
: హేరిస్  జయరాజ్, ఛాయాగ్రహణం : సంతోష్ శివన్
బ్యానర్స్ : ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ఎంటర్టైన్మెంట్
నిర్మాతః ఎన్‌.వి. ప్రసాద్
విడుదల : సెప్టెంబర్ 27, 2017

***
          ‘1-నేనొక్కడినే’ తో పక్కకెళ్ళి ఇంకో జానర్ ని ప్రయత్నించిన మహేష్ బాబు, ‘గజినీ’ తో పక్కకెళ్ళి ఇంకో జానర్ ని ప్రయత్నించిన మురుగదాస్, ఇద్దరూ కలిసి పక్క కెళ్ళి ప్రయత్నించిన  అదే సైకలాజికల్ జానర్ తో వచ్చారు. ఇద్దరూ కలిస్తే ఏ అద్భుతం చేస్తారోనని ప్రేక్షకులు ఆశిస్తూ వచ్చారు. ఆశలు తీరడానికి పండగ సందర్భాన్ని మించిందేముంటుంది. ప్రమోషన్ లో భాగంగా స్పైడర్ బ్యాగులు, క్యాపులు, పెన్నులు, పెన్సిళ్ళు మొదలైన ఉత్పత్తులతో  మార్కెట్ లో ప్రభంజనం సృష్టించకపోయినా, నిత్యం ప్రజల నోళ్ళల్లో నానుతూ ఓ మేనియాని మాత్రం సృష్టించింది. మేనియాతోబాటు అనుమానాలు కూడా మొదలయ్యాయి. కానీ ‘బ్రహ్మోత్సవం’ తో అంత వెన్నుపోటు పొడిచిన మహేష్ బాబు ‘స్పైడర్’ తో మరిస్తారని, ఇక వెన్నుపోట్లు మర్చిపోయి హాయిగా పండగ కానుక ఎంజాయ్ చేయవచ్చని ప్రేక్షకులు సిద్ధమయ్యారు. మరి మహేష్ బాబు మురిపించారా మురుగదాస్ తో కలిసి? దసరాకి ఎలాగూ కోళ్ళు కోసుకుని తింటారు సరే, తనేం కోశారు సినిమాలో ఈసారి చూద్దాం...

కథ 
      ఇంటలిజెన్స్ విభాగంలో పని చేసే శివ (మహేష్ బాబు)  ఒక  సాఫ్ట్ వేర్ ని రూపొందిస్తాడు. ప్రజలు మాట్లాడుకునే ఫోన్ కాల్స్ లో కొన్ని పదాలకి అలర్ట్ వచ్చేలా సాఫ్ట్ వేర్ ని సిద్ధంచేసుకుని, ఆ అలర్ట్స్ తో వెళ్లి ఆపదలో వున్న వాళ్ళని కాపాడుతూంటాడు. నేరాలు జరక్కుండా చూస్తూంటాడు. అతడి టాపింగ్  లోకి మెడికల్ స్టూడెంట్ చార్లీ (ర కుల్ ప్రీత్ సింగ్) కూడా వచ్చేస్తుంది. ఆమె స్నేహితురాలితో మాట్లాడే మాటలు విని ప్రేమలో పడతాడు. ఆమె వెంట పడతాడు. ఇలావుండగా,  ఒకమ్మాయి ప్రమాదంలోవుందని అలర్ట్ రావడంతో ఆ ఏరియాలో వున్న లేడీ కానిస్టేబుల్ కి సమాచారమందిస్తాడు. ఆ అమ్మాయి తోబాటు లేడీ కానిస్టేబుల్ హత్యకి గురవుతారు. శరీరాలు ముక్కలు ముక్కలు చేసి పారిపోతాడు హంతకుడు. ఈ హంతకుడి అన్వేషణలో శివ కర్నూలు వెళ్లి వాడి పుట్టుపూర్వోత్తరాలు తవ్వితే, భైరవుడు (ఎస్ జే సూర్య ) అనేవాడు శాడిస్టు కిల్లర్ అనీ, మనుషులు ఏడుస్తూంటే చూసి  ఆనందిస్తాడనీ, తమ్ముడి (భరత్) తో కలిసి  చిన్నప్పటినుంచీ మనుషుల్ని చంపి, బంధువులు ఏడుస్తూంటే వెళ్లి  చూసి  ఆనందిస్తూంటాడనీ తెలుస్తుంది. దీంతో శివ వీళ్ళిద్దర్నీ ఎలా పట్టుకున్నాడు, భైరవుడి ఇంకొన్ని దుర్మార్గాల్ని ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా కథ. 

ఎలావుంది కథ  
      ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జానర్. దీనికి సాటి మనిషి ఆపదల్లో వుంటే ఆదుకునే మనుషులు కరువయ్యారనే కథా ప్రయోజనాన్ని ఆశించారు. అలా ఆదుకోని మనుషుల్ని చూపించ
కుండానే మెసేజి ఇవ్వాలని ప్రయత్నించారు. మనుషులు వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్స్  మీద గడుపుతూ బయటేం జరుగుతోందో తెలుసుకోవడంలేదని చెప్పారు. ఎన్నిరకాలుగా చెప్పినా అలాటి మనుషుల్ని చూపించకపోవడం ఒక వెలితి. ఆపదల్లో వున్న మనుషుల్ని ఆదుకునే గుణం నశించిందన్న ఫిర్యాదు ఇప్పటిది కాదు. ఇది పాతది. దర్శకుడే ఇప్పుడు బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడ్డం  లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగితే చుట్టూ చేరి బాధితుల్ని మొబైల్స్ లో చిత్రీకరించడం, సెల్ఫీలు తీసుకోవడం దాకా వెళ్ళింది సహాయ నిరాకరణ. ఇదీ మనుషులు బయట పెట్టుకుంటున్న శాడిజం. దర్శకుడు మామూలు మనుషుల్లో 4 శాతం శాడిజం, శాడిస్టులుగా నేరాలు చేసే వాళ్ళలో 15 శాతం శాడిజం వుంటుందన్నాడు. నిత్యవ్యవహారాల్లో ప్రతీ మనిషీ సైకోతనాన్ని ప్రదర్శిస్తాడని శతాబ్దం క్రితమే రష్యన్ రచయిత డాస్టోవిస్కీ చెప్పేశాడు. మురగదాస్ చెబుతున్న 4 శాతం శాడిజం అందరిలో వున్నా, అది తీర్చుకోవడానికి బాధితులతో పాల్పడుతున్న అనైతికాన్ని చూపించివుంటే,  ఈ కథ  సమకాలీనమయ్యేది. కాలీన స్పృహ ఈ కథలో కొట్టొచ్చినట్టు కన్పించే లోటు.

ఎవరెలా చేశారు 
     స్పైడర్ కథలో మహేష్ బాబు ‘స్పై’ పాత్ర పోషించారు. నిజానికి స్పైలు విదేశాల్లో కార్యకలాపాలు సాగిస్తారు. ఇంటలిజెన్స్ బ్యూరోలో కూడా స్పై లుండరు. కాబట్టి మహేష్ నటించిన శివ పోలీసు పాత్రే. ఈ పోలీసు పాత్రలో సీరియస్ మహేష్ ని మనం చూస్తాం - ఇటీవల ‘లై’ లో  సీరియస్ స్పై పాత్రలో నితిన్ ని చూసినట్టు. ఒక స్టార్ గా మహేష్ బాబు కమర్షియల్ హంగులేవీ పాత్రకి పెట్టుకోలేదు. చాలా అందంగా, కాస్ట్యూమ్ పరంగా చాలా టెర్రిఫిక్ గా మాత్రం కన్పిస్తారు. హీరోయిన్ తో రోమాన్స్ ని కూడా పాత్ర సీరియస్ అవుతున్నప్పుడు మాత్రమే గుర్తు తెచ్చుకుంటారు. ఆమెతో రెండు నిమిషాలు తెచ్చి పెట్టుకున్న రోమాన్స్ చేసి, ఓ పాట వేసుకుని మళ్ళీ సీరియస్ యాక్షన్ లోకి వెళ్ళిపోతారు. హీరోయిన్ తో రోమాన్స్ కి సమయం కాదనుకున్నప్పుడు, మదర్ క్యారక్టర్ తో మదర్ సెంటి మెంటు కోసం వెళ్ళిపోయి వస్తారు. ఒక సీరియస్ సీను మధ్యలో హీరోయిన్ చిలిపిగా ఫోన్ చేస్తే, ఆడియెన్స్ మూడ్ ని గమనించినట్టు – రోమాన్స్ కి నీకు సమయం సందర్భం లేదా అని ఆమెకి చీవాట్లు పెట్టి తప్పించుకుంటారు. సైకో కిల్లర్ బారినుంచి మదర్ ని కాపాడుకునే ఎపిసోడ్ లో, ఆతర్వాత ఆడవాళ్ళ చేత సైకో కిల్లర్ మీద ఆపరేషన్ చేయించే ఎపిసోడ్ లో మాత్రం ప్రేక్షకులనుంచి విపరీతం గా చప్పట్లు కొట్టించుకుంటారు. ఇక ముగిపులో రెండు క్లయిమాక్సులు రావడంతో  ప్రేక్షుకులకి అలసట వచ్చేసి ఆ  హీరోయిజమంతా వృధా చేసుకుంటారు. రెండు క్లయిమాక్సుల వల్ల ముగిపులో ఏం మెసేజి డైలాగు చెప్పినా అది మాస్టర్ స్ట్రోక్ కాలేకపోయింది- పైన చెప్పుకున్న కారణాలతో  ఆ మెసేజికి ప్రేక్షకులనుంచి స్పందనా కరువయ్యింది 

          రకుల్ ప్రీత్ సింగ్ అత్యంత పాత రొటీన్ మూస ఫార్ములా పాత్ర. కథలో ఏంతో జరుగుతున్నా, ఎన్నో ఉపద్రవాలు సంభవిస్తున్నా ఆమె ఎక్కడుంటుందో, రోమాంటిక్ మూడ్ తోనే వుంటుంది.  ఇంకొక్క పాత్ర,  సైకో విలన్ గా ఎస్ జే సూర్య. ‘డార్క్ నైట్’ జోకర్ పాత్రకి తను అనుసరణ. అయినా బాగానే చేశాడు. సైకో కిల్లర్ గా హావభావ ప్రదర్శనతో  గానీ, హల్చల్ తో గానీ పనెక్కువ వున్న పాత్ర తనదే. ఇంకో హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి కన్పిస్తాడు, కామెడీ చేయకుండా. మిగిలిన పాత్రల్లో నటులు తమిళులే, ఒకరిద్దరు హిందీ వాళ్ళు తప్ప. 

          దీన్ని తెలుగు – తమిళం  ద్విభాషా చిత్రంగా తీశారు. అయితే తమిళ తనమే ఎక్కువ కన్పిస్తుంది. విలన్ చిన్నపటి గ్రామీణ కథలో మరీ తమిళ నేటివిటీయే వుంటుంది. 

          సాంకేతికంగా సంతోష్ శివన్ ఛాయాగ్రహణం ఎప్పట్లాగానే చెప్పుకోదగ్గది. హేరీస్ జయరాజ్ సంగీతం లోని  పాటలు మాత్రం మహేష్ బాబు స్టార్ డమ్ కి తగ్గట్టులేవు. పీటర్ హేన్స్ యాక్షన్ కోరియోగ్రఫీ- ప్రధానంగా హాస్పిటల్ శిథిలాల్లో, రోలర్ కోస్టర్ యాక్షన్లో థ్రిల్లింగ్ గా వుంది. హాస్పిటల్ కూలిపోయే దృశ్యాల సీజీ వుంన్నంత బాగా , పెద్ద బండ దొర్లి వచ్చే ఎపిసోడ్ లో లేదు. 

చివరికేమిటి 
      సినిమాలో చాలా మరణాలు చూపించారు. కసకసా చంపడమే. మూకుమ్మడిగా వందలమందిని చంపడం కూడా. పండగకి ఇదేంటని ప్రేక్షకుల అసహనం. ఇవన్నీ విలన్ శాడిజాలే. ‘డార్క్ నైట్’ లోని  ఈ పాత్ర తీసుకుని, హాలీవుడ్ లో వుండే డిజాస్టర్ మూవీస్ అనే జానర్ ని కలిపి – ఒక కషాయం తయారు చేశారు. సైకో థ్రిల్లర్, డిజాస్టర్ యాక్షన్ సజాతి జానర్లు కావు. డిజాస్టర్ జానర్  హై - కాన్సెప్ట్ బ్లాక్ బస్టర్స్ కి చెందుతుంది. దీన్ని విడిగా తీయాలి- ఇలా సైకో థ్రిల్లర్ తో కలిపి కాదు. దర్శకుడు ఈ హై కాన్సెప్ట్ డిజాస్టర్ తో అత్యుత్సాహం ప్రదర్శించి, క్లయిమాక్స్ లో వెంటవెంటనే రెండు డిజాస్టర్స్ పెట్టేశాడు. నగర రోడ్లమీద బండ దొర్లి రావడం, హాస్పిటల్ కూలిపోవడం. దీంతో హాస్యాస్పదంగా తయారయ్యింది. వీటికోసం ముగిసిపోయిన కథని రెండు సార్లు పొడిగించాడు. మొదటిసారి రెండు గంటల్లో సైకో ని పట్టుకుంటాననే హీరో పట్టుకుంటాడు. పోలీసులు బంధిస్తారు. మళ్ళీ సైకో ఛాలెంజి చేస్తాడు. బండ దొర్లిపోయే ఏర్పాటు చేశానని. దీన్నాపడానికి  వెళ్ళే హీరో ఆపలేకపోతాడు. చాలామంది చనిపోతారు. దానికదే బండ  ఆగిపోతుంది. ఇంతలో సైకో మళ్ళీ తప్పించుకుంటాడు. మళ్ళీ గంటలో పట్టుకుంటానంటాడు హీరో. ఈ రెండోసారి సైకో వెళ్లి పోయి హాస్పిటల్ ని పేల్చేస్తాడు. చాలామంది చనిపోతారు, చివరి కెలాగో సైకోని చంపేస్తాడు హీరో. వీటికంటే ముందు సైకో ఎందర్నో చంపి కడుతున్న మెట్రో పిల్లర్స్ లో పడేశానంటాడు. 

          కథతో ఈ చాలా మిస్ మేనేజి మెంటు వల్ల చెప్పాలనుకున్న పాయింటు గల్లంతై పోగా, ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎమోషనల్ కనెక్ట్ లేదు. హీరోకి ఎక్కడా ఫీలవడానికి వ్యక్తిగత నష్టం జరగలేదు. ‘సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ లాంటి సైకో థ్రిల్లర్ చూసినా, ‘ఇండిపెండెన్స్ డే’ లాంటి హై కాన్సెప్ట్ డిజాస్టర్ మూవీ చూసినా బలమైన ఎమోషనల్ ట్రాక్ తో కట్టిపడేస్తాయి.

          మురుగదాస్ బలహీన కథ, బలహీన దర్శకత్వం చాలా ఆశ్చర్యపరుస్తాయి. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ కి ఒక సైకో కథ ఎలా సూటవుతుందనుకున్నాడో ఏమో - ఈ బలహీనతని కప్పిపుచ్చడానికి  చివర్లో  ‘డిజాస్టర్స్’ ని జోడించి రేంజి పెంచే ప్రయత్నం చేసినట్టుంది. దీనికి మహేష్ కూడా చేయి కలిపి లాగడంతో, మహేష్ తో బాటు మురుగ దాస్ కూడా వచ్చి తిరిగి  ‘బ్రహ్మోత్సవం’ లో పడ్డాడు. 


-సికిందర్