రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, ఏప్రిల్ 2017, శనివారం

నాటి సినిమా !







           2012  సృష్టి విలయ రహస్యాన్ని మోనాలిసా బొమ్మ ఇముడ్చుకుందన్న మాటే నిజమైతే, జానపద సినిమాల్నీ, సాహిత్యాన్నీ అటక మీదికి చేరుస్తున్న  మానవజాతి,  ముందే తన మానసిక వినాశాన్నీ  కొనిదెచ్చుకుంటున్న  మాటా అంతే  నిజమౌతుంది.

           స్పీడు యుగంలో యాంత్రికంగా బతకడం అలవాటు చేసుకున్నాడు మనిషి. తన నుంచి తానూ పూర్తిగా వేర్పడిపోతూ దిక్కు తోచని స్థితిలో పడుతున్నాడు. దారీ తెన్నూ తెలీక దొరికిన వ్యక్తిత్వ వికాస పుస్తకమల్లా చదవడం మొదలెట్టాడు. కానీ ఇవే విజయానికి సోపానాల గురించి  ఏనాడో పురాణాల్లోనే,  జానపద కథల్లోనే  రాసిపెట్టారన్న సంగతే గుర్తించ లేకపోయాడు. ఇదీ మనిషి మానసిక దివాళాకోరుతనం.  పురాణాలు ఆత్మని కడిగితే, జానపదాలు మేధస్సుని పెంచుతాయి. నిగూఢంగా వున్న  మానసిక శక్తుల్ని పైకి లాగి - పోరా ఆకాశమే నీ హద్దూ అనేసి బతకడాన్ని బ్యాలెన్సు చేస్తూ జీవిత ప్రాంగణంలోకి ముందుకు తోస్తాయి. 

          ఈ పని జానపద చలన చిత్రాల తిరుగులేని కథానాయకుడిగా టీఎల్ కాంతారావు కొన్ని వందలసార్లు చేసి వుంటారు. కాంతారావు చేసిన మేలు మనం అప్పుడు తెలుసుకోలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే  జానపద సినిమాలతో వ్యక్తిత్వ వికాసానికి బ్రాండ్ అంబాసిడర్ కి తక్కువకాని  హోదాని తనే ఆనాడే  పోషించారు!


          ఈ పని ‘సప్తస్వరాలు’ తో ఇంకా పరమ నిష్ఠగా చేశారు. ఈ సినిమా మొత్తంగా ఒక సైకలాజికల్ విహార యాత్ర. ఇందులోకి ప్రవేశిస్తే మనల్ని మనం తెలుసుకోగలం
. నిమిష నిమిషానికీ మన మనసు చేసే మాయ, చిత్ర విచిత్రాలూ- వీటన్నిటినీ ఒక దారిలో పెట్టి, లక్ష్యాన్ని సాధించేందుకు మనం చేసే విశ్వ ప్రయత్నాలూ- దీన్నొక కదిలే బొమ్మల పర్సనాలిటీ క్విజ్ గా నిలబెడతాయి.
     కృష్ణుడికి ఎన్టీఆర్ నీ, దేవదాసుకి ఏఎన్నార్ నీ పర్మనెంట్ సింబల్స్ గా ప్రేక్షకుల మనోఫలకాల మీద ముద్రించి వదిలిపెట్టిన సినిమాయే,  జానపద కథానాయకుడికి సింబల్ గా స్ఫురద్రూపియైన కాంతారావు  రూపాన్ని అచ్చు గుద్ది, పక్కనే నిలువెత్తు కత్తినీ గుచ్చి వదిలింది! తను పోతూ ఆ కత్తినీ పట్టుకుపోయారు కాంతారావు. కత్తి కూడా స్వరాలు పలికిస్తుందని ఆయన నిర్ధారణ. సప్తస్వరాల మాలిక సంగీతమైనట్టే, యుద్దాల్లో కత్తులూ ఏడు రకాల శబ్దాలు విన్పిస్తాయట! ఇదీ కాంతారావు ప్రకటన! యుద్ధాలూ,  సమురాయ్ కత్తుల విన్యాసాలూ గురించి కసక్ కసక్ మని రాసే పాల్ సియోలో కూడా ఈ సంగతి చెప్పలేదు మనకి! 

          అలాగని సప్తస్వరాలు ఏవో కత్తులు పాడుకునే సంగీత సమ్మేళన మనుకుంటే  కత్తుల మీద కాలేసినట్టే. సప్త స్వరాలు కేవలం మాధుర్యాన్ని చిలికే సరిగమలే కావనీ, సప్త సముద్రాలు, సప్త గిరులు, సప్తర్షులు, సూర్యుడి సప్తమాశ్వాలూ ... ఇవన్నీ మానవ కోటికి  మహత్తర వరాలనీ, సప్త సంఖ్యామయమైన ఈ జగత్తే మొత్తంగా ఈ సప్తస్వరాల్లో ఇమిడి వుందనీ, ఈ సప్త స్వరాలని జయించిన వాడే శారదా పీఠాన్ని అందుకోగల్గుతాడనీ ఈ సినిమా  కథలోని భావం. మెంటల్ పోస్ట్ మార్టం మేడీజీ అన్నమాట. 


          ఈ అంతరంగ ప్రయాణం ప్రారంభించే ముందు ఏడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. లేకపోతే
  అగాథంలోకి పతనం ఖాయం. దీంతో తొలిసారిగా సినిమా నిర్మాణానికి పూనుకున్న కాంతారావు, తన ఉత్తమాభిరుచులేమిటో అడుగడుగునా దృశ్యాల్లో ప్రతిఫలించేలా చేశారు. దీని ఆర్ధిక పరాజయానికి కొన్ని రాజకీయాలు కారణమై వుండొచ్చు, కానీ విషయపరంగా దీన్ని శాశ్వత తత్వానికి  ఎదురేదీ లేదు.

          దేవదాసు లాంటి భగ్న ప్రేమికుడి విషాదాంతంతో బాగా- బాగా-  ఏడ్పించేసి  వదిలిన వేదాంతం రాఘవయ్య కి,  ఈ ‘సప్తస్వరాలు’ గమ్మత్తుగా భగ్నప్రేమికుడి విజయగాథ! ఈ మహా దర్శకుడి చిత్రీకరణలో పాత్రల నిమ్నోత్తమాలు, వాటి తాలూకు భావోద్వేగాలు, అభినయ విలాసాలు, అన్నీ మహోన్నతంగా ఉట్టి పడతాయి.  కాంతారావు, నాగయ్య, రామకృష్ణ, ధూళిపాళ, సత్యనారాయణ, జగ్గయ్య, రాజబాబు, బాలకృష్ణ (అంజి గాడు), రాజశ్రీ, విజయలలిత, విజయనిర్మలల బారెడు తారాతోరణంతో  రాఘవయ్య దర్శకత్వ లాఘవం మనల్ని కదలకుండా కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి కాదు. అదే నీవంటివీ, కృష్ణయ్యా గడసరి కృష్ణయా... వంటి పాపులర్ గీతాలతో, నృత్యాలతో, సూటిపదాల సంభాషణలతో; రాజకోట, మాంత్రికుడి కళాత్మక సెట్స్ తో, సమ్మోహనకర ట్రిక్ ఫోటోగ్రఫీతో, కత్తి పోరాటాలతో... ఓ పరిపుష్ట పంచభక్ష్య పరమాన్న విందిది. నిర్మాణ వ్యయాన్ని  వేదాంతం ఆరు లక్షలకి  పైగా లాగేశారని కాంతారావు వాపోయినా, వేదాంతం ఇచ్చిన విందు ముందు కాంతారావు ఖేదం బేఖాతర్ మనకి!

       విచిత్రంగా జానపదంలో పౌరాణీకాన్ని కలుపుకున్న జానర్ ప్రయోగమిది. దీంతో ఇది ఆథ్యాత్మిక యానం కోసం చేసే మనోవైజ్ఞానిక విహార యాత్రవుతోంది. హాలీవుడ్ చలన చిత్ర రాజం  ‘రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్’  లో ఆథ్యాత్మిక శక్తులున్న ఆర్క్ కోసం జరిపే పోరాటం ద్వారా మహా దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఏం చెప్పాలనుకున్నాడో, సరీగ్గా ఆ లోక కల్యాణాన్నే ప్రబోధిస్తోంది ‘సప్త స్వరాలు’ కూడా!
          అనేక సమస్యలతో, అన్యాయాలూ అక్రమాలతో పుచ్చి పోయింది మానవ లోకం సమస్తం. అజ్ఞానమే దీనికంతటికీ మూలం.  దీంతో నారదుడు (రామకృష్ణ), గంధర్వుడు (కాంతారావు) లు కలిసి  వెళ్లి సరస్వతి (విజయనిర్మల) కి ఈ సంగతి మొరపెట్టుకుంటారు. అప్పుడామె ఓ శారదా పీఠాన్ని అందించి, దాంతో మనుషుల అజ్ఞానాన్ని తొలగించి మానవ కల్యాణాన్ని పునఃప్రతిష్ఠాపన చెయ్యమనీ ఉపదేశించి పంపుతుంది. ఈ శారదా పీఠాన్ని  వైజయంతి (విజయలలిత) వ్యామోహంలో పడిన గంధర్వుడు పోగొడతాడు. దీంతో – నువ్వెళ్ళి భూలోకంలో అలాగే బాధలనుభవించమని నారదుడు శపిస్తాడు.


          భూలోకంలో ఓ సంగీత కారుడు (నాగయ్య) కి  ముత్యపు చిప్పలో మగ శిశువు దొరుకుతాడు. వాడికి సారంగ అని పేరు పెట్టి పెంచుకుంటూ సంగీతం నేర్పుతూంటాడు. ఇంకో ముత్యపు చిప్పలో మహారాజు (ధూళిపాళ) కి ఆడ శిశువు దొరుకుతుంది. దానికి దేవ మనోహరి అని నామకరణం చేసి పెంచుకుంటూ, నాట్యం నేర్పిస్తూంటాడు. సంగీతం
నేర్చుకుని పెద్దవాడైన  సారంగ (కాంతారావు), జయంతి (రాజశ్రీ) తో ప్రేమ కలాపాలు సాగిస్తూంటాడు. ఇది తండ్రికి తెలిసి మందలిస్తాడు. ఎందుకంటే, సారంగాకి తను ఒక లక్ష్యంతో సంగీతం నేర్పుతున్నాడు. ఆ లక్ష్యం స్వర్గలోకం నుంచి భూమండలంలో పతనమైన శారదా పీఠాన్ని  సాధించడం. అది ప్రస్తుతం సోపాన మంటపం మీద ప్రత్యక్షమై వుంది.  దాన్ని సాధించే వాడు సంగీతంలో స్రష్ట అయి, మాతృగర్భంలో జన్మించని అయోనిజుడై వుండాలి. స్త్రీ స్పర్శ ఎరుగని బ్రహ్మచారియై కూడా వుండాలి. ఇది విన్న సారంగ  చకితుడవుతాడు. తను అయోనిజుడు సరే, బ్రహ్మచర్యమంటే ఎలా సాధ్యం? జయంతి  తన సర్వస్వం. ఎటూ తేల్చుకోలేక ఈ సంకటంలో వుండగా,  అప్పుడు వూడిపడతాడు అభేరి (సత్యనారాయణ)  అనే తాంత్రిక విద్యల తుచ్ఛుడు. వీడికి మానవ జాతి పచ్చగా వుంటే నచ్చదు. ఆ శారదా పీఠాన్ని చేజిక్కించుకుని, మానవ లోకాన్ని ముక్కలు చెక్కలు చెయ్యాలని చూస్తూంటాడు. 

        ఇక మొదలవుతుంది రసవత్తర క్రీడ. మామూలు ప్రేక్షకులకి మామూలు భాషలో సస్పెన్స్, థ్రిల్స్, టెంపో, యాక్షన్, అడ్వెంచర్ లాంటివి అన్నీ ఇందులో వుంటాయి. ఈ ఎలిమెంట్సే  రసజ్ఞులకి  ఒకొక్కటీ ఒక్కో  సైకలాజికల్ ట్రూత్ గా ఆశ్చర్య పరుస్తాయి. స్థాపించిన కథా ప్రపంచంలో పైకి కన్పించని ఈ హిడెన్ ట్రూత్  ఆసాంతం రసమయ సంగీతమనే రజాయిని వెచ్చ వెచ్చగా కప్పుకుని వుంటుంది.

          ప్రతీ పాత్రా,  ప్రతీ సన్నివేశమూ సంగీతాన్నే వొలికిస్తాయి. లక్ష్య సాధన కోసం కాంతారావుకే ద్రోహం చేసే నాగయ్య, ఆ ద్రోహంతో ప్రేమలో పిచ్చి వాడయ్యే కాంతారావు మీదికి విషకన్య విజయలలితని ప్రయోగించే సత్యనారాయణ విద్రోహం, మధ్యలో తిక్క వేషాల ధూళిపాళ చెత్త పనులు, మరోవైపు గడ్డీ గాదం మేసి దిట్టంగా సంగీతం నేర్చుకోవాలనుకునే రాజబాబు హాస్య ప్రహసనాలు, రాజశ్రీ సోయగాల కనువిందూ... కలిసి ఓ మహోజ్వల జానపద చలనచిత్ర రాజం!   
  
          వీటూరి కథా మాటలూ రాస్తే; పాటలు సినారె తో బాటు వీటూరి కూడా రాశారు. టీవీ రాజు సంగీతం సమకూరిస్తే, అన్నయ్య ఛాయాగ్రహణాన్నీ, ఎస్ ఎస్ లాల్  ట్రిక్ ఫోటోగ్రఫీనీ పోషించారు. నృత్యాలు వెంపటి సత్యం, కళా దర్శకత్వం బీఎన్ కృష్ణ వహించారు.

          హేమా ఫిలిమ్స్  సంస్థని స్థాపించిన టీఎల్ కాంతారావు, 1969 లో నిర్మించి నటించిన న ఈ కళాఖండాన్ని గురువు హెచ్ ఎం  రెడ్డికి అంకితమిచ్చారు.

చరిత్రలో ఒక పేజీ...
       అప్పటి సినిమాల్లో రాజనాల గొప్ప విలనే. అయితే ఈ విలన్ పాత్రని అప్పుడప్పుడూ నిజజీవితంలో కూడా పోషిస్తూ ఎలా అవమానపర్చే వాడో, ‘బందిపోటు’ షూటింగు సమయంలో ఇచ్చిన డైలాగులతో కావాలని పెట్టిన ముప్పు తిప్పలూ, అది దారి తీసిన పెద్ద గొడవా సీనియర్ రచయిత త్రిపురనేని మహారధి ఈ వ్యాసకర్తకి ఒకసారి వివరించారు.

           కాంతారావుకీ ఇలాటిదే జరిగిందన్నారు త్రిపురనేని. ఎక్కడో చదివిన కథని వీటూరి చేత ‘సప్త స్వరాలు’ స్క్రిప్టుగా రాయించుకుని, రాజనాల దగ్గరికి వెళ్తే, ఆయన  స్క్రిప్టుని సరీగ్గా పట్టుకోకుండా కావాలని కింద పడేసి, ‘ఇప్పుడు రాహుకాలం. నేను కథలు వినను, నీ సినిమాలో నటించను ఫో!’ అనేశారు. దెబ్బతిన్న కాంతారావు వెళ్లిపోయి వేదాంతం రాఘవయ్యకి చెప్పుకుంటే, ఆయన సత్యనారాయణని విలన్ గా తీసుకుందామని సలహా ఇచ్చారు. అలా నాల్గు వేలు పారితోషికంగా తీసుకుని సత్యనారాయణ విలన్ పాత్ర వేసి మెప్పించారు.

          సినిమా 1969 లో విడుదలయ్యింది. అప్పుడు రాజకీయాలు ఈ సినిమాని తినేశాయి. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కాలం. ‘ప్రేక్షకులారా మీరు తెలంగాణా వాడు తీసిన ఆ సినిమా చూస్తారో, ఆంధ్రా వాడు తీసిన ఈ సినిమా చూస్తారో తేల్చుకోండి!’ అని కృష్ణతో  ‘లవ్ ఇన్ ఆంధ్రా’  తీసిన భావనారాయణ ప్రచారం చేయడంతో కాంతారావు గుండె పగిలింది. అయితే ఆ ఉద్యమ ప్రభావానికి ‘సప్తస్వరాలు’ తో బాటు ‘లవ్ ఇన్ ఆంధ్రా’ కూడా మట్టి కర్చింది. 

డైలాగ్ డిష్ 
నాగయ్య :
           * నాకు స్వార్ధమా? భార్యలా బిడ్డలా సంసారమా...  ఏముందని, ఎవరున్నారని నాకు స్వార్ధం?
           ఎవరేం చేసినా చేయకపోయినా,  కళాకారుడు మాత్రం తన కళ ద్వారా దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలనుకుంటాడు.
 కాంతారావు :
           * ఆశా లేదు, నిరాశా లేదు. అనుకున్నదీ లేదు, అనుకోనిదీ లేదు. లేదనుకుంటే ఏదీ లేదు, అవునా?
           * నవ్వీ నవ్వీ నవ్వీ ...గుండె బండబారిపోయింది...
           * పాదాలు పట్టుకునే ఆడదాన్నీ, కన్నీళ్లు పెట్టుకునే మగవాణ్ణీ నమ్మ కూడదు.
 రాజబాబు :
           * చచ్చింది గొర్రె! నా నోట్లో నువ్వు గింజ కూడా నానదే!
           * ఇంత వరకూ భూమి కనిపించింది, ఇక ముందు చుక్కలు కనపడతాయి.


-సికిందర్ 
(సాక్షి- నవంబర్, 2009)
cinemabazaar.in


         





         
         
                   



రివ్యూ!






    

టెంప్లెట్ - దర్శకత్వం : పూరీ జగన్నాథ్.
తారాగణం: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా క్రిస్ లిన్ స్కీ,  తులసి, అనూప్సింగ్ఠాకూర్, సుబ్బరాజు, అలీ, అవినాష్, ఎజాజ్ ఖాన్
సంగీతం: సునీల్కాశ్యప్, ఛాయాగ్రహణం: ముకేష్ బ్యానర్‌: తన్వి ఫిలింస్
నిర్మాత: సి.ఆర్‌. మనోహర్, సి.ఆర్‌. గోపి
విడుదల : మార్చి 31, 2017
***

     ఒక దర్శకుడు ఎన్నేళ్ళు పోయినా అవే సినిమాలు అలాగే తీస్తూపోతున్నాడంటే ప్రేక్షకుల సహన శక్తి మీద అంత నమ్మకమన్న మాట. ప్రేక్షకులకి ఈ సహన శక్తి ఏ సినిమాకా సినిమా తను మార్చేసే స్టార్స్ ని చూసి వస్తూండవచ్చు. ఇది తన అదృష్టమే. చాలా కొద్ది మందికే ఇలా చెల్లిపోతుంది. వాళ్ళల్లో  పూరీ జగన్నాథ్ ఒకరు. తనని స్టార్స్ కరుణిస్తున్నంత కాలం శాశ్వత ప్రాతిపదికన, ఎక్కడో ఘనీభవించిన-  శిలాసదృశమైన  తన రాత- తీత పనికే ఢోకా వుండదు. తను రాసిందే కథ, తను తీసిందే సినిమాగా,  స్త్రీ ద్వేషమే  తన అమ్మకపు సరుకుగా కార్యకలాపాలు సాగించుకోవచ్చు. 

         
దృష్ట్యా పూరీ సినిమాలకి రివ్యూలే అవసరం లేదు. ఏముంటుంది రాయడానికి రాసిందే రాయడం తప్ప. అలాగే కొత్త తరం దర్శకులు నేర్చుకోవడానికి ఏముంటుంది పూరీ సినిమాల్లో, చూసిందే చూడడం తప్ప. అయితే ఎవరో పసిగట్టేసి అల్లరి చేస్తున్నారని కాబోలు, కాస్త మారినట్టూ కన్పించడమూ తనకే సాధ్యమైంది. కానీ మారినట్టు కన్పించినంత మాత్రాన  కొత్తగా తీసిన  ‘రోగ్’ కాస్తా రోగరహితమై పోతుందా? రోగాన్ని దాచుకుని పైపైన స్ప్రే కొట్టుకు తిరిగితే ఆ స్ప్రే మార్నింగ్ షో వరకే సరిపోతుంది. ఇక ప్రతీ షోకీ ప్రేక్షకులు స్ప్రే కొట్టుకుని చూడాల్సి వస్తే సహనశక్తి పూర్తిగా నశించిపోతుంది. 




          టెంప్లెట్ సినిమాలు తీసి తీసి, అల్లరయ్యాకా ఎందుకు ఫ్లాపవుతున్నాయో తెలుసుకుని, ‘రోగ్’ ని టెంప్లెట్ నుంచి కాస్తా తప్పించినట్టు కన్పించేలా చేద్దామనుకున్నట్టుంది. పూరీ మార్కు టెంప్లెట్ అంటే- తాజాగా గత వారం  వచ్చిన  ‘కాటమ రాయుడు' అనే అట్టర్ ఫ్లాపే. ఆ దర్శకుడు పూరీని ఆదర్శంగా తీసుకుని టెంప్లెట్ లో అన్నీ సర్దేశాడు. పూరీ టెంప్లెట్ ప్రకారం ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. ఇక సెకండాఫ్  లో హీరోయిన్ కట్ అయిపోయి విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపు.

          ఇదే టెంప్లెట్ ని ఇంకో విధంగా కూడా చూపించారు-
అదే కథ, అవే పాత్రలు, వాటికి  ఒక యాక్షన్ సీన్ ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాటమళ్ళీ ఒక యాక్షన్ సీన్- ఒక కామెడీ సీన్- ఒక లవ్ సీన్- ఒక పాట; మళ్ళీ ఒక...ఇలా ఇవే రౌండ్లేస్తూ  వుండడమన్నమాట.

          అవతల మూసని బ్రేక్ చేసే తెలుగు టాలెంట్స్  తో  ఒక ‘ఘాజీ’ రానీ, ఇంకో ‘గురు’ రానీ- ఈ టెంప్లెట్  ఏమాత్రం గిల్టీ  ఫీలవదు. టెంప్లెట్ కి కాలంతో పని లేదు, కాలమ్స్ కి సరిపడా పాత రేషన్ ని డంప్ చేయడమే దాని పని.

          ఇప్పుడు రూపం మార్చుకున్న టెంప్లెట్ లో ఈ కింది విధంగా ఏడు కాలమ్స్ వున్నాయి :

          ఇవే ఏడు కాలమ్స్ పాత టెంప్లెట్ లో ఇలా వుండేవి :

            ఫస్టాఫ్ ఇంటర్వెల్ దాకా హీరోయిన్ ని పడేసే హీరో కామెడీ ఇప్పుడు లేదు, మార్పు కోసం మిస్టర్  రోగ్ హీరోయిన్స్ ని సీరియస్ గా ద్వేషిస్తూంటాడు, అంతే. ఓపెనింగ్ లోనే పోలీస్ కమీషనర్  పాత్రనీ, అతడి చెల్లెలైన హీరోయిన్ పాత్రనీ రొటీన్ గా భూతకాలంలోంచి దిగుమతి చేసుకుంటాడు. హీరోయిన్ పెళ్లవుతూంటే వచ్చి అడ్డుపడతాడు. అందర్నీ కొడతాడు, ఒక పోలీసు కాళ్ళు  విరగ్గొడతాడు. హీరోయిన్ పెళ్లి మాత్రం జరిగిపోతుంది. దాంతో ఆమె  మోసానికి  స్త్రీ లందర్నీ ద్వేషించడం మొదలెడతాడు. హీరోయిన్ పేరు అంజలి అనే టెంప్లెట్ పేరు. దీంతో అంజలి పేరుతో  ఏ టెంప్లెట్  అమ్మాయి కన్పించినా  పట్టుకు కొట్టేస్తాడు. 

          ఈ రోగ్ కి  అసలే మైనారిటీ లో పడిపోతున్న మాస్ ప్రేక్షకులని బుజ్జగించడానికి  చంటి అనే ఇంకో టెంప్లెట్ పేరు. ఇక బుజ్జగింపు రాజకీయాలు మొదలు. పోలీసు కాళ్ళు విరగ్గొట్టినందుకు ఈ చంటి రోగ్ రెండేళ్ళు జైలుకి పోతాడు. ఈ జైలు సీన్లు మైనారిటీలో పడిపోతున్న మాస్ ప్రేక్షకుల్ని బుజ్జగించేందుకు ప్రత్యేకించినవి. జైలుకొచ్చి కలిసిన పెళ్ళయిన హీరోయిన్, అటు మొగుడితో కూడా ఎలా నాటకాలాడుతోందో ఎస్టాబ్లిష్ అవుతుంది. దీంతో అమ్మాయిలు మేథమెటిక్స్ అనీ  - అబ్బాయిలు పోయెట్రీ అని  డిసైడ్ చేసుకుంటాడు రోగ్. అబ్బాయిలే పవిత్రులూ, అమ్మాయిలు అపవిత్రులన్న డైలాగులు ఇక సాంతం రాజ్యమేలతాయి. ఇక ఏ ఆడ పాత్రకీ పూచిక పుల్ల విలువుండదు. వాళ్ళని ఎంత కించపరిస్తే అంత బాక్సాఫీస్ గలగలలు విన్పిస్తాయన్నట్టు. ఇదంతా అసలే మైనారిటీలో పడిపోతున్న –అదికూడా పూరీ సినిమాలకి కొందరు అబ్బాయిలకే పరిమితమైపోయిన యువ ప్రేక్షకుల చేత కేరింతలు కొట్టించడానికే. నీట్లో తడిసిన హీరోయిన్- ‘పంది కూడా తడిస్తే అందంగా వుంటుంది’ అన్నదాకా ఈ డైలాగుల పంద్యారం సాగుతుంది.

         ఇంతకీ రోగ్ ఇవన్నీ చేసేది కోల్ కత మహా నగరంలోనే. జైలునుంచి విడుదలై  టెంప్లెట్ ప్రకారం ఇంటికి పోతే టెంప్లెట్ ప్రకారమే తండ్రి వెళ్ళ గొడతాడు. కాళ్ళు విరగ్గొట్టిన పోలీసు కుటుంబాన్ని ఆదుకుందామని పోతాడు. వాళ్ళు ఛీ కొట్టినా ఇంటి ముందే వుంటున్న బెగ్గర్స్ గుంపుతో  మకాం వేస్తాడు. ఆ కానిస్టేబుల్ చెల్లెలు ఇంకో హేరోయిన్. ఈమె కోల్ కత నైట్ క్లబ్ లో టెంప్లెట్ ప్రకారం తెలుగు పాటలు పాడుతూ అన్న కుటుంబాన్ని పోషించుకునే త్యాగమయి- ఈమె కూడా ‘బజారుమయి’ అయిపోతుంది. సౌజన్యం : రోగ్ గారి స్త్రీ ద్వేషం. పైగా ఈమె పేరూ అంజలి. రోగ్ గారు కర్ర తీసుకుని చావబాదుతూ బిర్యానీలు కూడా తినిపిస్తాడు ఈమె ఇంటిల్లిపాదినీ.

          టెంప్లెట్ ప్రకారమె ఒక వడ్డీల వ్యాపారికి వసూళ్ళ ఏజెంటుగా కుదిరి, ఆ వచ్చిన కమిషన్ తో  కానిస్టేబుల్ అప్పులు తీర్చడం మొదలెడతాడు రోగ్. కానిస్టేబుల్ కి ప్రభుత్వం నష్టపరిహారం అదీ బాగానే ఇచ్చే వుండాలి, చెల్లెలికి ప్రభుత్వోద్యోగం కూడా ఇచ్చే వుండాలి. అయినా రోగ్ ఆదుకుంటానని వేధిస్తూంటాడు. ఇంకా చాలా చేస్తూంటాడు. పెళ్ళయిన హీరోయిన్ ఇంటికి కూడా వెళ్లి భర్తకి, పోలీస్ కమీషనర్ అయిన ఆమె అన్నకీ ఆమె మీద గాసిప్స్ చెప్పి చెడగొట్టాలని చూస్తూంటాడు. టెంప్లెట్ ప్రకారం ఇంటర్వెల్ కి  ముందు విలన్ వచ్చే దాకా ఈ రోగ్ స్త్రీ ద్వేషిగా టైం పాస్ చేయాలి కాబట్టి- కామెడీ చేయరాక అరుస్తూ వుండాలి కాబట్టి, అడ్డొచ్చిన వాళ్ళని కొడుతూ వుండాలి కాబట్టి- ఇవన్నీ చేస్తూండగా, ఇక టైము చూసుకుని వచ్చేస్తాడు టెంప్లెట్ విలన్. 


         వీడు సైకో. హీరో రోగ్ అయితే, విలన్ సైకో. ఈ సైకోకి ఇంకా హీరోయిన్ కన్పించాలి కాబట్టి అప్పటి దాకా రోగ్ తో దోస్తానా చేస్తూంటాడు. హీరోయిన్ కన్పించగానే  టెంప్లెట్ ప్రకారం కామెడీగా వెంటపడతాడు. ఈ కామెడీ సైకోతో ఆమెకి కథ వుంది. క్లాస్ రూమ్ లో వీడు ఒకమ్మాయిని కాల్చి చంపాడు. అప్పుడు పెట్రోలు పోసుకుని వున్న వీణ్ణి లైటర్ తో అంటించేసి చంపాలనుకుంటుంది హీరోయిన్. కానీ చేతిలో ఆ లైటర్ వెల్గించి పట్టుకుని ఆ పనే చెయ్యదు. ఫ్రెండ్ చస్తే చచ్చింది, నేనెందుకు వీణ్ణి చంపి జైలుకి పోవాలనుకుందో ఏమో- అలాగే ముందు ముందుకు వెళ్తూంటుంది లైటర్ తో. వాడి మీదికి విసిరేస్తే వాడే భస్మీ పటలమైపోతాడు. కానీ ఆ పనే చెయ్యదు. సైకో కూడా గట్టిగా వూదితే ఆరిపోయే లైటర్ కి భయపడతాడే గానీ, వూదేసి పారిపోవాలనుకోడు. పోలీసులు వచ్చే దాకా లైటర్ ని చూస్తూ భయపడుతూ స్టూడెంట్స్ చేత తన్నులు తిని, పోలీసులకి దొరికిపోతాడు. ఇప్పుడు జైలు నుంచి తప్పించు కొచ్చి హీరోయిన్ పని బడుతున్నాడన్న మాట. 

        ఇదీ విషయం. ఇక వీణ్ణి ఎదుర్కొని హీరోయిన్ని కాపాడుకోవాలి రోగ్. ఈ రీసైక్లింగ్ కథ కాదుగానీ, దీంతో పూరీ పడ్డ పాట్ల గురించే చెప్పుకోవాలి. ఎలాగైనా దీన్ని నిలబెట్టాలన్న ఆదుర్దా, ఆందోళనలే ప్రతీ చోటా కన్పిస్తాయి. ఏం చేస్తున్నాడో తనకే తెలీనట్టు ఎడాపెడా అర్ధం లేని సీన్లు వచ్చిపడుతూంటాయి. సెకండాఫ్ లో ఇదెక్కువై పోతుంది. అప్పటికప్పుడు సెట్లో సీన్లు రాసుకున్నారన్నట్టు తయారవుతుంది. పోనూ పోనూ పూర్తిగా అదుపుతప్పి పోతుంది. తనకి హీరోయిన్ దక్కకుండా చేస్తున్నారని ఊళ్ళో ఆడవాళ్ళందర్నీ సైకో కిడ్నాప్ చేయడం, కానిస్టేబుల్ కి కాళ్ళు తెప్పించే  ఆపరేషన్ కోసం రోగ్ కి పది లక్షలు కావాల్సి వచ్చి సైకో సాయమే తీసుకోవడం, ఆ సైకో ఏకంగా దోపిడీలే చేయడం....ఏమిటో,  కథంటే ఎలా అంటే అలా నరుక్కు పోతూంటే ఎక్కడో దార్లో పడకపోతుందా అన్నట్టు- సిల్వర్ స్క్రీన్ మీదే సినిమా చూపిస్తూ పూరీ రఫ్ కాపీ రాసుకుంటున్నట్టు వుంటుంది... ఈ ‘రోగ్’ రఫ్ కాపీయే. దీన్ని చక్కదిద్ది ఫైనల్ కాపీ ఎప్పుడు చూపిస్తారో. ఫైనల్ కాపీయే  ఇంకో కథగా, ఇంకో టెంప్లెట్ గా వచ్చినా ఆశ్చర్యం లేదు. 

          ఇలా తను టెంప్లెట్ నుంచి బయటపడ్డానని అన్పించుకోవడానికి, టెంప్లెట్ కే కొత్త రూపం తొడిగి మభ్యపెట్టబోతే ఫలితాలు డిటో గానే వచ్చాయి. టెంప్లెట్స్ రాయకుండా పూరీ స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకున్నప్పుడు ఫలితాలు వేరేగా వుంటాయి. అన్నట్టు పూరీ స్క్రీన్ ప్లే ఎప్పుడు రాసినట్టు? అసలు ఒక్క స్క్రీన్ ప్లే రాయకుండా రెండు దశాబ్దాలు చెలామణీ అవడం రికార్డే. 

         ఐతే ఈసారి టెంప్లెట్ కి స్టార్ ఎట్రాక్షన్ లేకుండా పోయింది. కన్నడ వ్యక్తిని హీరోగా పరిచయం చేస్తూ  స్టార్ ఎట్రాక్షన్ లేని లోపంతో సతమతమవాల్సి వచ్చింది. కొత్త హీరో ఇషాన్ ఫైట్లు డాన్సులు బాగా చేయడం గొప్పేం కాదు. ఈ రోజుల్లో అవి లేకుండా తెరంగేట్రం చేయలేరు. నటన ఎంతన్నదే పాయింటు. తనలో గనుక నటుడే వుంటే, నటనకి ఏమాత్రం అవకాశమివ్వని ఈ ‘రోగ్’ బ్యాడ్ ఆప్షనే తనకి. నటనంటే అరుపులు అరవడమే, లంగ్ పవర్ చూపడమే అని పూరీ అనుకుంటే, తన ద్వారా పరిచయమయ్యే హీరోల కెరీరే ప్రారంభం కాదు. 

          హీరోయిన్లు ఏంజెలా
క్రిస్ లిన్ స్కీ , మన్నారా చోప్రా లు ఎందుకున్నారో వున్నారు. అలీ, అతడి గ్రూపు బెగ్గర్ కామెడీ నీరసంగా వుంది. సైకో అనూప్ సింగ్ హీరో కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ,  రూపాయికి రూపాయిన్నర శ్రమని అమ్ముకున్నాడు. చాలా రోజులకి కన్పించిన సుబ్బరాజు ఎన్ కౌంటర్ స్పెషలిస్టు టెంప్లెట్ పాత్రలో ఏమీ చేయకుండానే వుం డిపోయాడు. రోగ్ గారి మాతృమూర్తిగా తులసిది అయోమయం పాత్ర. 

          పూరీ చేతిలో మంచి స్క్రిప్టు లేకపోయినా ముఖేష్ జి రూపంలో మంచి కెమెరా మాన్ దొరకడం అదృష్టం. స్క్రిప్టు విషయంలో తను అవుట్ డేటెడ్ గా వుంటే,  ఆ కెమెరా మాన్ కి అన్యాయం చేయడమే అవుతుంది. చిరిగిన చొక్కా మీద కోటేసుకున్న చందాన తను టెక్నీషియన్ లని వాడుకోవడం ఇకనైనా మానుకుంటే మంచిది. అలాగే సునీల్ కాశ్యప్ సంగీతాన్ని ఆస్వాదించాలంటే సినిమాకో అర్ధంపర్ధం కూడా వుండాలిగా.

          పూరీ జగన్నాథ్ స్క్రీన్ ప్లే రాయడం ప్రారంభించిన రోజున ప్రేక్షకులు తిరిగి రావడం ప్రారంభిస్తారు తన సినిమాలకి. ఈ సంవత్సరం ఈ మూడు నెలల్లో ‘రోగ్’ తో కలిపి ‘కాటమ రాయుడు’, ‘విన్నర్’, ‘మా అబ్బాయి’, ‘నేనోరకం’, ‘గుంటూరోడు’ అనే ఆరు  టెంప్లెట్ సినిమాలు వస్తే  అరింటినీ నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టారు క్లాస్ మాస్ ప్రేక్షకులందరూ. ఇప్పటికైనా టెంప్లెట్ ని మూసిపెట్టుకుంటారా? ఇలాగే  కోటాను కోట్లు పోగొట్టుకుంటూ వుంటారా? 

-సికిందర్
cinemabazaar.in









31, మార్చి 2017, శుక్రవారం






రచన- దర్శకత్వం : సుధా కొంగర
తారాగణం : వెంకటేష్‌., రుతికా సింగ్‌, ముంతాజ్సర్కార్, నాజర్‌., జాకీర్ హుస్సేన్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి తదితరులు
మాటలు : హర్షవర్ధన్, సంగీతం: సంతోష్నారాయణన్ , ఛాయాగ్రహణం: శక్తివేల్
బ్యానర్ :  వై నాట్స్టూడియోస్
నిర్మాత: ఎస్‌.శశికాంత్
విడుదల : మార్చి 31, 2017
          ***
   
త రెండు నెలలుగా విడుదల వాయిదా పడుతూ పడుతూ మొత్తం మీద ఈ మండుటెండల్లో ప్రేక్షకుల తలుపు తడుతున్న  వెంకటేష్ ‘గురు’, బాక్సాఫీసు క్రీడకి  గెలుపు పాయింట్లు ముందే స్కోరు చేసేసుకుంది. దీని తమిళ- హిందీ మాతృకలే  దీని స్కోరేమిటో ముందే చెప్పేశాయి. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమిటి రిజల్టు, ఏమిటి టాక్ అని ఎంక్వైరీ చేసుకోనవసరం లేదు- ది బిగ్ ‘వీ’ ఈజ్ ఆల్రెడీ రిటెన్ ఆన్ ది ఎంటైర్ వాల్!

          ‘దృశ్యం’, ‘గోపాలా గోపాలా’ లాంటి విజయాల్లో వయసుకి తగ్గ పాత్రలు వేసిన వెంకటేష్, ఆ తర్వాత  ‘బాబు బంగారం’ లో కుర్ర పాత్రతో కుదేలయ్యాక, తిరిగి ఇప్పుడు వయసుని గౌరవించుకుంటూ గురువు పాత్ర పోషించారు. గౌరవనీయ పాత్రలు రీమేకులతోనే సాధ్యపడుతున్నాయి తనకి. 

          మణిరత్నం సహాయకురాలు, విశాఖపట్నం వాసి  సుధా కొంగర ఈ రీమేక్ చేస్తూ తెలుగులో అన్ని ఫార్ములా వెటకారాల్నీ పటాపంచలు చేశారు. క్లాస్- మాస్ ప్రేక్షకులతో భారీ ఓపెనింగ్స్ ని సాధించుకుంటూ – ఏదో రొటీన్ నే వూహించుకుంటూవచ్చిన ప్రేక్షకుల్ని అనూహ్యంగా ఈ సీరియస్ స్పోర్ట్స్ డ్రామాతో కట్టి పడేశారు – ఇటీవలే ఇలాటిదే  ‘దంగల్’ ని తెలుగులో కూడా చూసివున్న  ప్రేక్షకుల్ని నోరెత్తకుండా చేశారు. 

          ‘గురు’ - ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా- జీవితంలో ఓ దిశా దిక్కూ లేకుండా కాలం  గడిపేసే స్లమ్ డాగ్స్ కి, అండర్ డాగ్స్ కీ ఒక ధృవ నక్షత్రం. కాకపోతే  ఈ జీవులకి చేయూత నిచ్చే వ్యక్తులు, వ్యవస్థా ఎవరా అని ఎదురు చూడాల్సిందే. సినిమాల్లో తప్ప అలాటి గురువెవరో  ‘మొండెదవ’ గా ఎప్పుడో గానీ రాడు. ఇప్పుడొచ్చిన  ‘మొండెదవ’ మామూలు ‘మొండెదవా’ కాదు. వీడి కథేమిటో ఒకసారి తెలుసుకుందాం...

కథ 
      తన పొగరురుతో, మొండితనంతో బాక్సర్ గా ఎదగలేకపోయిన ఆదిత్య (వెంకటేష్),  విమెన్స్ బాక్సింగ్ ఫెడరేషన్ లోనూ అదే ప్రవర్తనతో ట్రైనర్స్ ని  ముప్పు తిప్పలు పెడుతూంటాడు. ఇది తట్టుకోలేక అమ్మాయిలు లైంగిక హింస కంప్లెయింట్ పెడతారు.  ఫెడరేషన్ బాస్ దేవ్ ఖత్రీ  (జాకీర్ హుస్సేన్) ఇదే ఛాన్సు అనుకుని ఆదిత్యని వైజాగ్ కి ట్రాన్స్ ఫర్ చేసి పారేస్తాడు. దేవ్ తో ఆదిత్యకి పాత పగలు చాలానే  వుంటాయి.

          వైజాగ్ వచ్చిన ఆదిత్య,  మార్కెట్లో కూరగాయలమ్మే రఫ్ అండ్ టఫ్ కూలీ పిల్ల రామేశ్వరి అలియాస్ రాముడు (రుతికా సింగ్) లో వీధి పోరాటాల, సిగపట్ల మాస్ టాలెంట్ చాలా వుందని పసిగట్టి, తనే రోజుకి ఐదొందలు ఎదురిచ్చుకుంటూ బలవంతంగా ట్రైనింగ్ ఇప్పిస్తూంటాడు. తను మొండి అయితే ఆమె జగమొండి. ఏ మాత్రం మంచీ మర్యాదా వుండదు. పరువు  తీసి మాటాడినా దులుపుకుంటాడు. 


        ఈమెకి తల్లిదండ్రులు (రఘుబాబు, అనితాచౌదరి) లతో బాటు, ఓ ఆక్క లక్ష్మి (ముంతాజ్ సర్కార్- విఖ్యాత దివంగత మ్యాజిషియన్ పీసీ సర్కార్ కుమార్తె) వుంటుంది. బాక్సింగ్ లో ఈమెకి ప్రవేశమున్నా ఆదిత్య  రాముడునే ప్రోత్సహిస్తాడు. రాముడు ఇక అదిత్యని వదిలించుకుందామని అనుకున్నప్పుడు- తనకోసం రాముడు చేసిన ఒక త్యాగం తెలుసుకుని మనసు మార్చుకుంటుంది- ఆ మార్చుకున్న మనసు ఇంకెటో  వెళ్ళిపోయి మ్యాచ్ ఒడి- ఆదిత్య  ఆగ్రహానికీ  వెలివేతకీ గురవుతుంది.
  

        మళ్ళీ ఇద్దరి మధ్య ఎలా సఖ్యత కుదిరిందీ,  ఆమెని వరల్డ్ ఛాంపియన్ గా చేయడానికి ఆదిత్య ఎలా సంఘర్షించాడూ, మధ్యలో దేవ్ ఆడిన గేమ్ ఏమిటీ...మొదలైనవి మిగతా కథలో తెలిసే అంశాలు. 

ఎలా వుంది కథ  |

       
        స్పోర్ట్స్ జానర్ కూడా ఓ టెంప్లెట్ లోనే వుంటుంది. ఓ క్రీడలో శిక్షణ ఇప్పియ్యడం, క్రీడా రాజకీయాలతో సంఘర్షించడం, చివరికి స్టేడియంలో ఛాంపియన్ గా గెలవడం. ఇదీ ఈ చట్రంలో వున్న కథే. కాకపోతే కమర్షియల్ ఫార్ములాలకి దూరంగా రియలిస్టిక్ గా చూపించారు. ఇదే దర్శకురాలి తమిళ ‘ఇరుధి సుత్రు’ (ఫైనల్ రౌండ్), హిందీ ‘సాలా ఖదూస్’ (మొండెదవ) లకి తెలుగు రీమేక్ అయిన ఈ కథ ఇంకో దర్శకుడి చేతిలో పడితే ఏమయ్యేదో గానీ- ఒరిజినల్ దర్శకురాలి ఒరిజినాలిటీ అంతా యీ రిమేక్ కి చాలా కలిసివచ్చింది. క్రీడ అంటే క్రికెట్టే అన్నట్టు తయారైన పరిస్థితుల్లో ఇలాటి సినిమాలే ఇతర క్రీడలని జనాలకి పరిచయం చేస్తూ వాటి ప్రశస్తిని చాటుతున్నాయి. 




ఎవరెలా చేశారు 
          మొండోడుగా వెంకటేష్  చాలా ప్రభావశీలంగా నటించిన పాత్ర ఇది. దర్శకుడి/ దర్శకురాలి విజన్ ని మన్నిస్తే  సీనియర్ స్టార్స్ తామూహించని ఎత్తులకి ఎదుగుతారని నిరూపించిన నటన ఇది.  క్రీడా జీవితంలో ఓడిపోయాడు, పెళ్ళాం లేచిపోయింది, అధికారులతో తగాదాలు పెట్టుకుంటాడు, ట్రైనర్స్ ని తన్నితగిలేసి  ట్రైనింగ్ ఇప్పిస్తాడు, తాగుతాడు, ఛీ కొట్టించుకునేలా వుంటాడు- ఇదంతా అర్ధం జేసుకుంటే-  ‘ఆమెకి గోల్డ్ మెడల్ సాధించి పెట్టడం కోసం నూట ఇరవై కోట్ల మంది జనం కాళ్ళు నాకమన్నా నాకే’ పని రాక్షసుడు అతడిలో కన్పిస్తాడు,  అర్ధం జేసుకోకపోతే  మొండెదవలా కన్పిస్తాడు. 

          రెండోదేమిటంటే, హీరోయిజమంతా తన పాత్రకే వుండాలన్న నియమం పెట్టుకోకుండా, హీరోయిన్ కి కావాల్సినంత రంగస్థలాన్ని వదలడం. అభిమానుల్లో తన ఇమేజికి దెబ్బ తగులుతుందనే అనుమానాలేవీ పెట్టుకోకుండా, ఆమె బూతుమాటలన్నీ పడడం. తెలుగు ప్రేక్షకులకి తొలిసారిగా ఒక సీనియర్ స్టార్ ఇంత పచ్చి పాత్రలో కన్పించడం, కదలకుండా కూర్చోబెట్టేయడం. దీంతో వెంకటేశ్ ఇప్పుడే నిజానికి విక్టరీ వెంకటేష్ అయినట్టు. 

          తమిళ హిందీల్లో నటించిన రుతికా సింగే హీరోయిన్ గా నటించింది. ఆమె మాట, చేత, తాటతీత మాస్ క్యారక్టర్ ని  ప్రేక్షకులు వూహించని స్థాయికి తీసికెళ్ళి పోయాయి - మూస ఫార్ములా కృత్రిమత్వం లేకుండా. ఇవన్నీ చేస్తూనే జీవంతో గుండెలు బరువెక్కిం చనూ గలదు తను.

          అక్కపాత్రలో ముంతాజ్,  చెల్లెలి మీద ఈర్శ్యాసూయల్ని పతాకస్థాయికి తీసికెళ్ళే సన్నివేశం మరపురానిది. ఇప్పుడొస్తున్న యువ హీరోయిన్లలో  కూడా చాలా  ప్రతిభ వుంటోంది. నూటికి తొంభై తొమ్మిది శాతం సినిమాల్లో వీళ్ళకి కరివేకు పాత్రలిచ్చి ఇంటికి పంపేస్తున్నారు. ఇక ప్రతినాయక దేవ్ ఖత్రీ పాత్రలో జాకీర్ హుస్సేన్ మెత్తగా పిండాలు పెడుతూంటాడు. జ్యూనియర్ కోచ్ గా నాజర్ ది కామెడీ పాత్ర.

          సాంకేతికంగా ఉన్నత స్థాయిలో వుంది- ఈ రియలిస్టిక్ జానర్ కి తగ్గ విజువల్స్ తో,  మ్యూజిక్ తో – కంటెంట్ ని సానబడుతూ కత్తిలా తయారుచేసిన సాంకేతిక ఔన్నత్యమిది...

 చివరికేమిటి 
       దర్శకురాలు సుధా కొంగర ఒకే కథతో మూడు సినిమాలు చేయడం – అందులో మొదటి రెండిట్లో దొర్లిన చిన్న చిన్న లోపాలు దీంట్లో సవరించుకోవడమూ ఒక ఎడ్యుకేషన్ లాగే ఉపయోగ పడిందామెకి. దృశ్యమాధ్యమాన్ని ఎలా వాడుకోవాలో ఎనలేని అవగాహన వుందామెకి. పఫర్ఫుల్ సినిమా ఎలా తీయాలో కూడా తెలుసామెకి. జానర్ మర్యాదని జానర్ మర్యాదతోనే  వుంచడమూ బాగా తెలుసామెకి. అయితే ప్లాట్ పాయింట్  వన్ దగ్గర హీరోయిన్ కి గురు మీద ప్రేమ కలగడమనే జానర్ మర్యాద తప్పిన  ఫార్ములా మూస వాసనే మింగుడు పడనిది. దీన్ని ఇంకో పావుగంట ఇంటర్వెల్ వరకూ భరించక తప్పదు మనకి. అప్పుడు ఆమెకి గురు క్లాసు పీకడంతో  ఈ మూస రొమాంటిక్ యాంగిల్ బాధ తొలగిపోతుంది. గురువు మీద అమ్మాయిలకి ఆకర్షణ పుట్టొచ్చు. అందులోనూ అక్షరం ముక్కరాని స్లమ్ డాగ్ పిల్లకి. కానీ గురువు గురువే. ఇందువల్ల మళ్ళీ జానర్ మర్యాద పట్టా లెక్కుతుంది. ప్లాట్ పాయింట్ టూ రాగానే, మళ్ళీ హీరోయిన్- నువ్వు రిజైన్ చేశావంటే ప్రేమే కదా అంటుంది- ఇక్కడ చాలా బ్యాడ్ గా కన్పిస్తుంది ఈ మాటనేసిన తను. ఇంతే కాదు- క్లయిమాక్స్ లో సదరు  ‘గురు’ గ్లామరస్ గా తయారై  కూడా వచ్చేస్తాడు!  ముగిస్తూ వీళ్ళు లవర్స్ అనే అర్థాన్నే ఇచ్చారు. ఈ రియలిస్టిక్ కథలో సినిమాటిక్ ట్విస్టులు ప్రేక్షకులు డిమాండ్ చేయలేదే- ఎందుకు తొందరపడాలి. స్పోర్ట్స్ లో సెక్సువల్ హెరాస్ మెంట్ అంటూ చెప్పారు బాగానే వుంది. కానీ ముగింపు చూస్తే  కోచ్ లతో ఎఫైర్సే క్రీడాకారిణులకిశ్రీరామ రక్ష అన్నట్టుగా,  లొంగిపోయినట్టు వుంది...

-సికిందర్ 


28, మార్చి 2017, మంగళవారం




        ఎన్ని ఉగాదులు వచ్చినా తెలుగు సాంప్రదాయంలో రీమేక్ ఒకటే వుంటుంది,  హాలీవుడ్ సాంప్రదాయంలో రీబూట్ కూడా వుంటుంది. పాత  తెలుగుని రీమేక్ చేయడం తెలుగులో ఎప్పుడోగానీ జరిగే పనికాదు. హాలీవుడ్ లో హాలీవుడ్ సినిమాలనే రీమేక్ చేయడమో, లేదా రీబూట్ చేయడమో తరచూ జరిగేపని. ప్రస్తుతం హాలీవుడ్ నుంచి హాలీవుడ్ రీమేకులు గానీ, రీబూట్స్  గానీ 36 జరుగుతున్నాయి! తెలుగులో తమిళం నుంచి ఎక్కువగా రీమేకులు జరుగుతూంటాయి. కానీ రీబూట్ ఒక్కటీ జరగదు. రీమేకింగ్ నే తెలుగు నేటివిటీకి, స్టార్ కనెక్టివిటీకీ ఉపరితలంలో  కొన్ని మార్పు చేర్పులు చేసి పూర్తిచేస్తున్నారు. రీమేక్ తప్ప రీబూట్ లేకపోవడంతో  రీమేక్ కి పనికి రాని సినిమాలని కూడా  ఉపరితలంలో తాపీ పనిచేసి  రీమేక్ చేసేస్తున్నారు. నిజానికి ఇలాటి రీమేక్ కి పనికి రాని సినిమాలని రీబూట్ చేయాలి. కానీ రీమేక్ చేయాలంటేనే ఎన్నో సందేహాలతో వుండే ‘రీమేకిష్టులు’, మూలంలో ఒరిజినల్ స్వరూప స్వభావాల్ని మార్చివేసే రీబూటింగ్ ని అస్సలూహించలేరు. రీమేక్ తో  వర్కౌట్ కాని  సినిమాలని కూడా రీమేకే చేసేసి చేతులు కాల్చుకోవడం అలవాటుగా చేసుకున్నారు. హాలీవుడ్ లో కొన్ని సినిమాలని రీమేక్  చేస్తే సరిపోయినా కూడా, రీబూట్ చేసి మరీ ఇంకింత సక్సెస్ ని సాధిస్తున్నారు. 

         
పరభాషల నుంచి రీమేకులే గాకుండా, పాత తెలుగు సినిమా కథల్నేఅటు ఇటు మార్చి రీసైక్లింగ్ చేస్తూంటారు. కనీసం ఈ సందర్భంలోనైనా రీబూట్ గురించి ఆలోచించడం లేదు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ పాత రీసైక్లింగ్ కథ అని తెలిసిందే. అందులో కొత్తగా గుర్రాల్ని పెట్టి జాక్ పాట్  కొట్టవచ్చనుకున్నారు. కానీ అదే కథని రీబూట్ చేసివుంటే (ఎలా చేయవచ్చో ఇదే బ్లాగులో ఫిబ్రవరి 26 నాటి ‘విన్నర్’ కి సంబంధించిన ఆర్టికల్ లో సందేహిస్తూనే  రాశాం- ఎందుకంటే,  రీబూటింగ్ అనే ప్రక్రియ ఒకటుందని తెలీకపోతే, ఇదేదో వ్యాసకర్త పెడుతున్న నస అనుకునే అవకాశముంది) బాక్సాఫీసు హిట్ కొట్టే వాళ్ళేమో.  

          కానీ పవన్ కల్యాణ్  సహా మెగా హీరోలు  రీబూట్ కి ఒప్పుకునే స్టార్స్  కారు. తమతమ సినిమాలు  ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని అవే  రొటీన్ మసాలాగా,  అవే జడప్రాయమైన పరిధుల్లో వుండాలని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు అలాటి ఒక రొటీన్,  జడప్రాయమైన మసాలాగా,  రీమేక్ చేసిన పవన్ కల్యాణ్  నటించిన ‘కాటమరాయుడు’ గురించి చెప్పుకోవాల్సి వస్తే,   రీబూట్  గురించే చాలా చెప్పుకోవాలి. 

       కానీ రీబూట్ కి  అంగీకరించని హీరోల సినిమాల్ని ఆ దృష్ట్యా స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకుని లాభంలేదు. కాబట్టి  ‘కాటమరాయుడు’ రీబూట్ సంగతి పక్కన పెడదాం; అయినా దీన్నొక రీమేక్ గానే స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడానికి కూడా ఏమీ కన్పించడం లేదు. ఎందుకంటే ఇది టెంప్లెట్ రూపంలో వున్న రీమేక్. టెంప్లెట్ సినిమాల్లో స్క్రీన్ ప్లే పరంగా చెప్పుకునేది ఏమీ వుండదని,  వాటి గురించి రాయడం కూడా ఈ మధ్య మానుకున్నాం. టెంప్లెట్ సినిమాల అందాల్ని కనిపెట్టి బి, సి సెంటర్ల ప్రేక్షకులే తిప్పి కొట్టగల సినిమా అక్షరాస్య సమర్ధులుగా ఎదుగుతున్నాక, ఈ మూడు నెలల్లోనే వరసగా విన్నర్, గుంటూరోడు, నేనోరకం, మా అబ్బాయి- అనే నాల్గుకి నాల్గూ టెంప్లెట్ సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాయి. తాజాగా వీటి సరసన ‘కాటమ రాయడు’ చేరింది. సామాన్యుడు కూడా నేటి డిజిటల్ ప్రపంచానికి అలవాటై ముందుకు పోతూంటే, సినిమాలు సామాన్యుడికి వెనకబడే వుంటున్నాయి. 

          బోరు కొడుతున్న టెంప్లెట్ సినిమాలంటే-
ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీ, గ్రూప్ సాంగ్, హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్, టీజింగ్ సాంగ్, హీరోయిన్ లవ్ లో పడ్డాక డ్యూయెట్, విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. ఇక సెకండాఫ్  లో హీరోయిన్ కట్ అయిపోయి విలన్ తో కథ మొదలు, అప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్, హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్, విలన్ తో క్లయిమాక్స్, ముగింపు. తనతో ఈ పరిహాసం సామాన్యుడు భరించే పరిస్థితుల్లో లేకనే తిప్పి కొడుతున్నాడు. అయినా సామాన్యుడి బాధ పట్టించుకోకుండా దుందుడుకుగా ‘కాటమ రాయుడు’ కూడా ఇలాటి టెంప్లెట్ సినిమాగానే  వచ్చింది. 

         ఇప్పుడు ప్రస్తావన వచ్చింది గాబట్టి రీబూట్ గురించి క్లుప్తంగా చెప్పుకుంటే-   రీబూట్ అంటే  ఓ సినిమాలోని పాయింటు మాత్రమే తీసుకుని, ఆ బీజ స్థాయి నుంచీ మొత్తమంతా కొత్తగా నిర్మించుకు రావడం. రీసైక్లింగ్ ‘విన్నర్’ నే తీసుకుంటే- చిన్నప్పుడు తండ్రీ తాతల వివక్షకి గురై పారిపోయిన హీరో- ఇంకోవైపు వ్యాపారంలో కోట్లకి పడగెత్తిన తాతా తండ్రులు – ఈ పాత పాయింటునే  ఈ కాలానికి తగిన కథనంతో కొత్తగా చెబితే రీబూట్ చేసినట్టు. 1954 నాటి ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్  Rear Window ని  2007 లో Disturbia గా రీబూట్ చేస్తే హిట్టయ్యింది. బ్యాట్ మాన్ బిగిన్స్, స్టార్ ట్రెక్, కేసినో రాయల్, అమేజింగ్ స్పైడర్ మాన్, రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ దిఏప్స్...ఇవన్నీ రీబూట్ చేసిన అనేక హిట్స్ లో కొన్ని. 

          అదే రీమేక్ అంటే,  ఆ మాతృకలో వున్న  పాయింటు సహా మొత్తమంతా యథాతథంగా వుంచడం. పైపైన కొన్ని మార్పు చేర్పులు చేస్తే చేయొచ్చు, బేసిక్ పాయింటు జోలికి పోవడం వుండదు. ఇప్పుడు ‘కాటమ రాయుడు’ రీమేక్ కోసం తీసుకున్న తమిళ  ‘వీరమ్’ సంగతి. 2014 లో ఇది అక్కడ మంచి ఫాలోయింగ్ వున్న సీనియర్ స్టార్ అజిత్ తో హిట్టయ్యింది. నెరిసిన జుట్టుతో, కొన్ని పాటల్లో తప్ప - సాంతం తమిళ సాంప్రదాయపు పంచకట్టుతో అతను పాత్ర పోషించాడు.  ఇదీ అతను ఈ సినిమాకి తన వంతుగా కంట్రిబ్యూట్ చేసిన తనదైన  యూనిక్ సెల్లింగ్ పాయింట్ (యూఎస్పీ). ఇంకా తమన్నా అనే ఒక హాట్ స్టార్, అప్పటి మార్కెట్ పరిస్థితులూ ఇవీ దాని విజయానికి తోడ్పడి ఉండొచ్చు. కథగా ఇందులో కొత్త ఏమీ లేదు. పైగా ఇది స్క్రీన్ ప్లే కూడా కాదు. తమిళంలో హిట్టయింది కాబట్టి తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఓ ఛానెల్లో కూడా ప్రసారమయ్యింది. అయినా పవన్ తో దీన్ని రీమేక్ చేయడానికి పూనుకున్నారు- డబ్బింగూ, ఛానెల్లో ప్రసారమూ ఇవన్నీ పవన్ స్టార్ డమ్ ధాటికి నిలబడవనే అనుకుందాం;  కథో పాత్రో తన స్టార్ డమ్ తో అద్భుతాలు చేస్తాయనే నమ్మకంతో రీమేక్ కి పూనుకున్నారనే అనుకుందాం – అయితే పాత్ర ని అజిత్ తన యూఎస్పీ గా మార్చేసినట్టు- పవన్ అలాటి దేమీ చేయలేదు.  అజిత్ ఆ గెటప్ లో బాగా వయసుపై బడిన వాడిలా వుంటాడు- అతడిలో  హీరోయిన్ తండ్రి అల్లుణ్ణి చూడడం ఎబ్బెట్టుగానే వుంటుంది. ఈ ముసలివాడితో హీరోయిన్ రోమాన్స్ ఎలా చేస్తోందని కూడా అన్పిస్తుంది. కానీ అతడిది అంత పెద్ద వయసు కాదనీ, చిన్న వయసులోనే ఆహారపుటలవాట్ల వల్ల జుట్టు తెల్లబడిందనీ చెప్పి ఈ యూఎస్పీ ని జస్టిఫై చేసుకుంటారు. 

     'సోగ్గాడే చిన్ని నాయనా’ లో హుషారైన పెద్ద నాగార్జున సాంప్రదాయ ఆహార్యం, మీసకట్టూ ఒక యూఎస్పీ. మామూలుగా వుండే చిన్న నాగార్జున సేఫ్టీ. అలాగే పవన్ కాటమ రాయుడుగా వయసుకు తగ్గ గెటప్ తో ఒక యూఎస్పీ ని సృష్టించుకుని, సేఫ్టీకోసం అతి చిన్న ముద్దుల, అల్లరి  తమ్ముడుగా ఇంకో పాత్రలో తనే నటించి వుంటే –అనూహ్యంగా వుండేది వ్యవహారం. కానీ ఇది రీబూట్. రీబూట్ జోలికి మనం వెళ్ళడం లేదు.

          ఇక కథలో వున్నదేమిటి? ఈ కథ పాయింటేమిటి?  ఇది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, తొలి సీనుతో  ఫ్రెష్ గా విలన్ తో బాటు, ముందునుంచే రగిలిపోతున్న పక్క విలన్ కూడా కాటమ రాయుడు అంతు చూడాలనుకుంటారు, ఆ తర్వాత  మొదటి పది నిమిషాల్లోనే కథ మలుపు తీసుకుంటూ పెళ్లి ఇష్టం లేని కాటమ రాయుడు  మీదికి తమ్ముళ్ళు హీరోయిన్ని ప్రయోగించాలనుకుంటారు, దీని తర్వాత ఇంటర్వెల్లో విలన్ ముఠాతో కాటమ రాయుడు  పాల్పడే హింస చూసి ప్రేమలో వున్న హీరోయిన్ బ్రేకప్ చెప్పేస్తుంది, ఆతర్వాత సెకండాఫ్ లో హీరోయిన్ కుటుంబ శత్రువులతో కాటమ రాయుడు తలపడి అంతు చూస్తాడు. ఇలా ఒకదాని తర్వాత ఇంకోటి పాయింట్లు దాడి చేస్తూంటాయి.  ఈ కథ ఏ పాయింటు మీద నడిచిందీ అంటే చెప్పలేని పరిస్థితి. ఒక పాయింటు ఆధారంగా కథ నడిచిందని చెప్పబోతే, మిగిలిన  పాయింట్లు ఎందుకున్నాయన్న ప్రశ్న తగుల్తుంది. కొన్ని సినిమాల్లో కథనం ఎపిసోడ్ల మయంగా వుంటూ –ఎక్కడికక్కడ ముగిసిపోతూ, స్టాప్ అండ్ స్టార్ట్ డాక్యుమెంటరీ బాపతు ఫ్లాప్ సినిమాలుగా తయారైన విచిత్రాలు చూశాం.  ‘వీరమ్’ ఇంకా తేడా. ఇందులో కథనం కాదు- స్టాప్ అండ్ స్టార్ట్ డాక్యుమెంటరీ టెక్నిక్ తో మల్టిపుల్ స్టోరీ పాయింట్లే  వచ్చి పడ్డాయి! ఇది కొత్త రికార్డు. 

         ‘వీరమ్’ మార్కెట్ యాస్పెక్ట్ కోసం యూఎస్పీ తో ఎలాగో తంటాలు పడ్డా, క్రియేటివ్ యాస్పెక్ట్ దగ్గర దొరికిపోయారు. క్రియేటివ్ యాస్పెక్ట్ పరంగా ఆర్గ్యుమెంట్ గానీ, స్ట్రక్చర్ గానీ, లాగ్ లైన్ గానీ కన్పించవు. లాగ్ లైన్ చూద్దామంటే అనేక స్టోరీ పాయింట్లు అడ్డుపడతాయి. స్ట్రక్చర్ చూద్దామన్నా అనేక స్టోరీ పాయింట్లే అడ్డుపడతాయి, ఆర్గ్యుమెంట్ చూద్దామన్నా మల్టిపుల్ స్టోరీ పాయింట్లే అడ్డుపడతాయి.

          కాబట్టి ఈ కథకి ఒక పాయింటు లేదు, పాయింటు లేక ఆర్గ్యుమెంట్ లేదు, ఆర్గ్యుమెంట్ లేక పాత్ర లేదు, పాత్ర లేక స్ట్రక్చర్ లేదు, స్ట్రక్చర్ లేక లాగ్ లైనూ లేదు. దీంతో ఇదొక సినిమాగా తీయాల్సిన కథే కాదు.  సినిమా కథలో ప్రశ్నించే ఒకే పాయింటు వున్నప్పుడే అన్నీ దారిలో పడతాయి. ప్రశ్నించనప్పుడు చూస్తున్నది సొదలాగే వుంటుంది ప్రేక్షకులకి. సినిమా కెళ్ళే ప్రేక్షకులు హీరోని పరీక్షకెళ్ళే – ప్రశ్నలకి జవాబులిచ్చే - విద్యార్థిగా చూడాలనుకుంటారు గానీ, పరీక్ష తీసుకునే మాస్టారుగా చూడాలనుకోరు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి ఆసక్తి కల్గించే యాక్టివ్ పాత్ర, మాస్టారు కూర్చుని వుండే పాసివ్  పాత్ర. 

          కనుక ఈ ‘కథ’ రీబూట్ కి తప్ప ని రీమేక్  పనికి రాదని తెలిసిపోతోంది. రీమేక్ కోసం చేసిన ఉపరితల మార్పు చేర్పులేమిటంటే, అసలే పనిలేకుండా వున్న మొదటి విలన్ కి పక్క విలన్ గా బిల్డప్ ఇచ్చి  ఇంకో పాత్ర సృష్టించడం, అలాగే తమన్నా శిల్పి పాత్రని శృతీ హాసన్ గాయని పాత్రగా మార్చడం. ‘వీరమ్’ లో ఇదే మొదటి విలన్ అయిన ప్రదీప్ రావత్ స్థానిక మార్కెట్ యార్డ్ ని శాసించే వ్యాపారిగా, కథలో తక్కువ ప్రాధాన్యం కలిగి వుంటాడు. రీమేక్ లో ఈ పాత్రని రావురమేష్ కిచ్చి, పక్క విలన్ గా కొత్త పాత్రని సృష్టించారు. ప్రదీప్ రావత్ నేమో మొదటి విలన్ ని చేసి,  బిగ్ షాట్ గా అట్టహాసంగా కథకి ఇతనే ప్రత్యర్ధి అన్నట్టు చూపారు. ఇంటర్వెల్ తర్వాత ఇంత కష్టపడి క్రియేట్ చేసిన ఈ విలన్ నే వదిలేశారు.  

          తమిళంలో అంతగా ప్రాధాన్యం లేకుండా వున్న ఫస్టాఫ్ విలన్ ని, ఏ దృష్టితో ఇంత బిల్డప్ తో తెలుగులో అర్ధం లేకుండా మార్చారు? ఉపరితల మార్పులు అసలుకే ఎసరు
.  కథకి ఇద్దరు విడివిడి విలన్లుండడం బాక్సాఫీసుకి క్షేమం కాదనేది ఎలా మర్చిపోయారు. ఏ కథకైనా విలన్ ఒకడే వుంటాడు. ఎందుకంటే సమస్య- సంఘర్షణ-  పరిష్కారమనే యూనివర్సల్  స్క్రీన్ ప్లే ఒక విలన్ వుంటేనే ఏర్పడుతుంది. ఎలా పడితే అలా చేసేవి కమర్షియల్ సినిమా స్క్రీన్ ప్లేలు కావు, ఆర్ట్ సినిమా లేదా ఇండీ ఫిలిమ్స్ స్క్రీన్ ప్లేలు. ఇందుకే మన సినిమాలు కమర్షియల్ సినిమా ముసుగేసుకున్న ఉత్త ఆర్ట్ సినిమాలవుతున్నాయి.

      ఇక శృతీహాసన్ ఉపరితల మార్పుపాత్ర అయితే, కథని రెండుముక్కలు చేస్తూ - విన్నర్, నేనులోకల్, గుంటూరోడు టైపు అరిగిపోయిన ఇంటర్వెల్ సీనిచ్చింది. సెకండాఫ్ పట్ల ఏ మాత్రం ఆసక్తి కల్గించని, ఇక సెకండాఫ్ లో ఏం జరుగుతుందో తెలిసిపోయే, సెకండాఫ్ ని ఇక చూడనవసరం లేదని తేల్చేసే  ఇంటర్వెల్ మలుపు ఇది. ‘వీరమ్’ లో ఇలా లేదు!

          ‘వీరమ్’  ఇంటర్వెల్ కి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు దర్శకుడు మహానుభావుడు. అతుకులబొంత కథకి  కూడా ఇంటర్వెల్లో తెలిసో తెలీకో మెరుపులు మెరిపించాడు తమన్నా పాత్రతో. కనీసం ఈ మెరుపుల వల్ల ఇంటర్వెల్ దగ్గరే కథ తెగిపోయి, సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడలేదు సినిమా. 

          రైలు ప్రయాణంలో అజిత్ విలన్ ముఠాతో పాల్పడే హింసని చూసి కళ్ళు తిరిగి అలా.....పడిపోవడం మాత్రమే చేస్తుంది తమన్నా. అజిత్ ఆగిపోయి చూస్తూంటాడు. అలా చూస్తూంటే సింపుల్ గా విశ్రాంతి పడుతుంది. 

          ఇంటర్వెల్లో పెద్ద బ్యాంగే  ఇవ్వనవసరం లేదనీ, సన్నివేశం చేసే డిమాండ్ ని బట్టి సింపుల్ గానూ వుండొచ్చనీ సిడ్ ఫీల్డ్ అంటాడు –
the function of the mid- point is to keep the story moving  forward, it is a link in the chain of the dramatic action connecting the First Half of Act -2, with the Second Half of Act -2  అనీ,  it can either be a quiet moment అనీ అంటాడు.కమర్షియల్ సినిమాల గురించే అన్నాడు, కళాత్మక సినిమాల గురించి ఎప్పుడూ అనలేదు.

         
‘వీరమ్’ ఇంటర్వెల్లో  వున్నది ఈ  quiet moment- నిశ్శబ్ద క్షణాలే. పైన చెపినట్టు అజిత్ హింసని చూసి తమన్నా కళ్ళు తిరిగి పడిపోతుంది. అతనామెనే  కళ్ళప్పగించి చూస్తూంటే విశ్రాంతి పడుతుంది.  దీంతో దానికదే కథ సెకండాఫ్ లోకి స్మూత్ గా ఫ్లో అయ్యింది, ఫస్టాఫ్- సెకండాఫ్ రెంటినీ కనెక్ట్ చేస్తూ. అంటే కథ ముందుకు సాగిందే తప్ప తెగిపోలేదు. అతడి హింసని ఆమె చూసి కళ్ళు తిరిగిపడిపోయింది – ఇప్పుడేమిటి?-  అన్న ప్రశ్న ఏర్పడింది. ఇప్పుడేం జరుగుతుంది?- అన్న సస్పెన్స్ ని కూడా సెకండాఫ్ పట్ల కల్గించింది. ఇక్కడితో ఆసక్తి చచ్చిపోకుండా కాపాడింది. ఏదైతే పరిస్థితిని మాత్రమే చూపిస్తే బలంగా వుంటుందో, దాన్ని మాటలతో  చెప్పిస్తే తేలిపోతుంది! ఇక్కడ తమన్నా గానీ, అజిత్ గాననీ ఒక్క డైలాగు పలికినా మొత్తం నాశనమయ్యేది   సెకండాఫ్ సహా.  అంటే ఈ సీన్ ని  డైలాగుల జోలికి పోకుండా,  సబ్ టెక్స్ట్ తో నిర్వహించి పైకెత్తారన్న మాట. 

         ‘కాటమ రాయుడు’ లో డైలాగులు పెట్టేశారు శృతీహసన్ కి. కాటమ రాయుడి హింసని వ్యతిరేకించి, ప్రేమని తెంచుకుని వెళ్ళిపోయే ఎమోషనల్ డైలాగులు! దీంతో మొత్తం చెడిపోయింది. కథ ఇక్కడ తెగిపోయింది. కథ తెగిపోవడంతో సస్పెన్స్ లేకుండా పోయింది.. సెకండాఫ్ ఏం జరుగుతుందో తెలిసిపోయింది. సినిమా ఇక్కడే ఫ్లాప్ అయ్యింది. టెంప్లెట్ సినిమాల్లో ఇంతే- ఇంకా ఇలాటి ఛాలెంజిలతోనే ఇవే   కాలం  చెల్లిన  ఇంటర్వెల్స్. 

          టెంప్లెట్ ఇంటర్వెల్స్  ఈ మూడు నెలల కాలంలోనే మచ్చుకి కొన్ని- ‘గుంటూరోడు’లో  హీరోయిన్ తో పెళ్లి గురించి ఆమె అన్నతో హీరో ఛాలెంజ్!  
 ‘నేను లోకల్ లో హీరోయిన్ పెళ్లి సీనులో హీరోతో ఆమె తండ్రి ఛాలెంజ్!  విన్నర్ లో పెళ్ళి సీనులో హీరోకి కన్నతండ్రి ఛాలెంజ్!  ‘కాటమ రాయుడు’ ప్రేమ గురించి హీరోకి హీరోయిన్ ఛాలెంజ్!   

          ఇంటర్వెల్ ఛాలెంజ్! ఛాలెంజ్!! ఛాలెంజ్!!! తొడగొట్టి మీసం తిప్పి మరీ బాక్సాఫీసుతో ఛాలెంజ్!!!!   

          ఎప్పటికప్పుడు మారిపోయే బాక్సాఫీసు హుండీల్లో చెల్లని టెంప్లెట్ నాణేలు...
  
ఎక్కడి కథలివి...ఎప్పటి ఇంటర్వెల్స్ ఇవి...ఏం ప్రేమలివి...ఏం పెళ్ళిళ్ళు ఇవి... ఎప్పటి
ఛాలెంజులివి... ఏం మనుషులు వీళ్ళు... ఏ జమానాలో జీవిస్తున్నారింకా... తిప్పి తిప్పి కొడుకుతున్నారు సామాన్య ప్రేక్షకులు కూడా ఇందుకే. మన కళ్ళముందు కూరగాయలమ్మే ముసలమ్మ,  సెల్ ఫోన్లో మాటాడుతూ  ‘స్ట్రెయిట్ గా పో’ అని చెప్పగల్గి  డెవలప్ అవుతున్న డిజిటల్ ప్రపంచంలో,   ఇంకా టెంప్లెట్ ఆమ్లెట్స్  అమ్ముకుంటూ గడపడం జాతీయ స్థూల ఉత్పత్తికి ఏ మాత్రం దోహదం చెయ్యని నేరపూరిత నిర్లక్ష్య కార్యమే.

       ఇంటర్వెల్ తర్వాత మొదటి సీను నుంచే ‘కాటమ రాయుడు’ నీరసపడిపోవడాన్ని స్పష్టంగా ఫీలవ్వొచ్చు. కానీ ఇక్కడ్నించీ ‘వీరమ్’ దర్శకుడు అజిత్ తో కాస్తయినా పాత్రని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అర్ధోక్తిలో ఆపేసిన ఇంటర్వెల్ తర్వాత నుంచి సెకండాఫ్ లో ఏంజరగబోతుందీ  అని ఆసక్తితో చూస్తూంటే, అజిత్ తమన్నా  వున్న హస్పిటల్ బయట వుంటాడు. తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నాక ఆమె ఇంటికే వెళ్తాడు. జరిగిందానికి  సారీ చెప్తాడు. ఆమె కోరుకున్నట్టే మారడానికి ప్రయత్నిస్తానంటాడు. అప్పటికి కూడా ఆమె పల్లెత్తు మాటనదు. మనకి  అర్ధమైపోతున్నప్పుడు  వేరే అనాల్సిన అవసరం లేదు. ఇదంతా సెన్సిబుల్ గా, సస్పెన్స్ ఫుల్ గా  వుంటుంది-  అజిత్ పాత్రని నిలబెడుతూ.

          ఇలా కాకుండా కాటమ రాయుడు  తమ్ముళ్ళు విసిరే సవాలుకి తనని ఛీకొట్టిన హీరోయిన్ గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ పడిగాపులు గాస్తూ డౌన్ అయిపోతాడు. ఆమె ఇంట్లో ఎలా తిష్ట వేయలా అని కామెడీగా ప్రయత్నాలు చేస్తాడు. ఇలా రాంగ్ ఇంటర్వెల్ సీను బాధితుడుగా మారిపోయి హీరోయిన్ కి సారీ కూడా చెప్పడు. ఆమె వూళ్ళో ఆమె దగ్గరికి అజిత్ వెళ్ళడానికి గల నేపధ్యం అర్ధవంతంగా వుంటే, పవన్ వెళ్ళడంలో అర్ధమే లేకుండా వుంది - ఇంటర్వెల్ సీను పుణ్యమాని.

          ఇంటర్వెల్లో తమన్నా ఛాలెంజి చేయకపోవడంతో, తర్వాత అజిత్ సారీ చెబితే వ్యతిరేకించకుండానూ వుండడంతో, ప్రేమలో సంఘర్షణ అనే పాయింటు తొలగిపోయి- ఆమె కుటుంబ శత్రువు మీదికి మళ్ళింది స్టోరీ పాయింటు- అదే వేరే విషయం. కానీ కాటమ రాయుడులో ఇంటర్వెల్ లో హీరోయిన్ ఛాలెంజింగ్ గా మాటాడి పాయింటు ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ఇంటర్వెల్ తర్వాత ఆమెతో దీనిమీదే కథ వుండదు.  సింపుల్ గా ఆమె కథలోంచి అదృశ్య మైపోతుంది. ఆమె కుటుంబ శత్రువుని కాటమ రాయుడు అంతం చేశాక వచ్చేసి ప్రేమకి ఓకే అనేస్తుంది.

          కథని ‘జెనిటికల్’ గా రీబూట్ చేయకుండా ఈ పైపైన ఉపరితల మార్పులు చేసి సాధించిందేమిటి?  తమిళంలో ఉన్నది ఉన్నట్టు తీసినా  ఉట్టి కొట్టేవాడేమో కాటమ రాయుడు- ఇవ్వాళ ఉగాది పచ్చడి కూడా ఎంజాయ్ చేస్తూ!



-సికిందర్ 
cinemab
azaar.in